-
నేడు విజయవాడకు అన్ని శాఖల అధికారులు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు ఒకేసారి విజయవాడకు రానున్నారు. గురువారం నగరంలోని గేట్వే హోటల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తరలివస్తున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు 20 మంది మంత్రులు పాల్గొనే ఈ సదస్సును విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ రఘునందన్రావు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ఆయా శాఖల ముఖ్య అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరవుతారు. జిల్లాల వారీగా సీఎం సమీక్షలు జరుపుతారు. శాఖల వారీగా సమీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు తిరిగి సదస్సు నిర్వహిస్తారు. ఈ సదస్సులో ఏడు ప్రాధాన్యతా రంగాలను గుర్తించి వాటికి అనుగుణంగా మిషన్లు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి ఏడు మిషన్లకు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ సదస్సు నేపథ్యంలో బుధవారం నుంచే విజయవాడలో సందడి నెలకొంది. మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, అడిషినల్ డీజీ ఎన్వీ సురేంద్రబాబు తదితరలు గేట్వే హోటల్కు చేరుకున్నారు. డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయశాఖా మంత్రి పి.పుల్లారావు, రాత్రికి నగరానికి చేరకున్నారు. నగరంలోనూ, గన్నవరం ఎయిర్పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టు నుంచి విజయవాడ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. -
ధనం కన్నా విద్య మిన్న
కలెక్టర్ ఎం.రఘునందన్రావు కురుమద్దాలి(పామర్రు) : అడ్మిషన్ రిజిష్టర్లో విద్యార్థి పేరుమాత్రమే న మోదు చేస్తే చదువు వచ్చినట్లు కాదని, అతని చదువు విషయమై అధికారులు ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకున్నప్పుడే విద్యావంతులవుతారని కలెక్టర్ ఎం.రఘునందన్రావు చెప్పారు. శనివారం మండల పరిధిలోని కురుమద్దాలి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది‘ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు బడి ఉత్సవమ్ నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గతంలో ధనం అధికంగా ఉన్న కుటుంబాలను గౌరవించేవారని ప్రస్తుతం విద్యావంతులను అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి తల్లితండ్రులకు వివరించాలన్నారు. పెరుగుతున్న విద్యాప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలలో విద్యాబోధన జరపాలన్నారు. గ్రామస్థాయిలోని అధికారులు, రాజకీయవేత్తలు పాఠశాలలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మురళీ మాట్లాడుతూ ఇంగ్లిష్ మోజులో తల్లితండ్రులు తమ చిన్నారులను కాన్వెంట్లకు పంపాలని చూస్తున్నారని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాల ల్లోనూ 1 వ తరగతి నుంచి ఇంగ్లిష్ బోధించే విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పక్కా భవనాల్లో నిర్వహిస్తూ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం తదితరాలను ఉచితంగా అందజేస్తున్నామిన తెలిపారు. అలాగే నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నామని చెప్పారు. పాఠశాల పరిధిలోని ఇద్దరు డ్రాప్ అవుట్ విద్యార్థులు సాదాపు భవాని, బెజవాడ గోపాలకృష్ణను గుర్తించి పాఠశాలలో చేర్పించారు. తల్లితండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మూలంగా 8 వ తరగతిలో పాఠ్యాంశాలు సక్రమంగా జరగడంలేదని, అదే విధంగా పాఠశాలలో తాగునీటి వసతి సక్రమంగా లేదని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయమై చర్యలు తీసుకుంటానని తెలిపారు. డీవైఈవో వెంకటేశ్వరరావు, గ్రామసర్పంచి కొసరాజు స్వప్న, జెడ్పీటీసీ పొట్లూరి శశి, ఎంపీపీ దగ్గుపాటి ఉష, ఎంపీటీసీ కొలుసు ఆదిలక్ష్మీ, తహసీల్దార్ మూర్తి, ఎంఈవో భవిరి శంకర్నాథ్, ఎంపీడీవో జె.రామనాథం, పాఠశాల హెచ్ఎం అంబటి ఉషాకుమారి, ఏఎంసీ చైర్మన్ లక్ష్ష్మణరావు, సీఆర్పీలు పాల్గొన్నారు. -
రుణాలన్నీ రద్దు చేయండి
చిలకలపూడి (మచిలీపట్నం) : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా రైతులు, డ్వాక్రా సభ్యుల రుణాలన్నీ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్లీడర్ తాతినేని పద్మావతి కలెక్టర్ రఘునందన్రావును కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సోమవారం జెడ్పీ సీఈవో సుదర్శనం, కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించడం లేదని, వారంతా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఉన్న మండలాల్లో ప్రొటోకాల్ను పాటించడంలేదని పద్మావతి వివరించారు. మండలంలో అధికారిక కార్యక్రమాలపై సమాచారం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రొటోకాల్ విషయంపై ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కలెక్టర్, జెడ్పీ సీఈవోను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు (నూజివీడు), మీగడ ప్రతాప్కుమార్ (నందివాడ), డీఎన్ఎన్ శ్రీనుబాబు (పెడన), మూల్పూరి హరీష (పెదపారుపూడి), చిమటా విజయశాంతి (మొవ్వ), ఆ పార్టీ నాయకులు రాజులపాటి మురళీ, తాతా శేషుబాబు, మూల్పూరి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ సరికాదు రైతు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని, అది కూడా రూ.1.50లక్షలలోపు మాత్రమే అని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం దారుణమని తాతినేని పద్మావతి విమర్శంచారు. కలెక్టర్ జెడ్పీ సీఈవోను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం.. ఇప్పుడు డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ప్రస్తావించిన కొన్ని సమస్యలు తోట్లవల్లూరులోని జెడ్పీ హైస్కూల్లో తాగునీటి సదుపాయం కల్పించాలి. నందివాడ మండలం కోలుకొండ గ్రామంలో 165 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని చేపల చెరువుల మట్టిని సరఫరా చేయాలి. వీరులపాడు మండలం జుజ్జూరులో బీసీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేలా చొరవచూపాలని, వెల్లంకి గ్రామంలో వైరా, కట్టలేరుల్లో ఇసుక ర్యాంపులను ప్రారంభించాలని జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ ఆహనాజ్బేగం కోరారు. పెదపారుపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూర్చునేందుకు బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కోసం వంట షెడ్డు నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. జెడ్పీటీసీ సభ్యులు వివరించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
నెలాఖరు వరకు గడువు కలెక్టర్ రఘునందన్రావు తిరువూరు : సామాజిక పెన్షనుదారులు, ఉపాధిహామీపథకం జాబ్కార్డుదారులు నెలాఖరులోగా ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ రఘునందన్రావు సూచించారు. శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన తహ సీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలు పథకాల్లో ఆధార్నంబరును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో ఆధార్కార్డుల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మీసేవా కేంద్రాల్లో కూడా శాశ్వత ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నందున పెన్షన్లు, ఎన్ఆర్ఈజీఎస్, పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్కార్డుదారులు విధిగా తమ డేటా ఎంట్రీ చేయించుకుని కార్డులు పొందాలని కోరారు. ఈ నెలాఖరులోపు వివరాలు నమోదు చేయని పెన్షనర్లు, ఉపాధిహామీపథకం కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు 36శాతం, రేషన్కార్డులు 56శాతం, ఉపాధిహామీ పథకం జాబ్కార్డులు 76శాతం, పెన్షన్లు 50శాతం మాత్రమే ఆధార్కు అనుసంధానం చేశారని, మిగిలినవి త్వరలో అనుసంధానిస్తామని తెలిపారు. ఇసుక తవ్వకాల నిరోధానికి టాస్క్ఫోర్స్... జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇసుక తవ్వకాలపై తమకు సమాచారం ఇస్తే టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరపడం నేరమని తెలిపారు. అధికారులతో సమావేశం... పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్స్ ఆన్లైన్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ని పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్లైన్ చేశారు, ఆధార్ నంబర్ల నమోదు తదితర వివరాలను వీఆర్వోలనడిగి తెలుసుకున్నారు. మల్లేల, రామన్నపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన అసైన్డ్భూములు, అటవీ, రెవెన్యూ భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. నూజివీడు సబ్కలెక్టర్ చక్రథర్బాబు, ఎంపీడీవో సుమమాలిని, సీడీపీవో అంకమాంబ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షకీల్అహ్మద్ పాల్గొన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు గ్రామసభలు విస్సన్నపేట : కౌలురైతులను గురిచేందుకు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ రఘునందన్రావు అన్నారు. తహసీత్దారు కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరైన వారి దరఖాస్తులను పరిశీలించి మరళా రెన్యూవల్ చేయ్యాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు.డీఎస్సీ ద్వారా త్వరలోనే అవసరమైన చోట ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు. తహసీల్దార్ సాయిగోపాల్,ఎంపీడీవో జాన్సీరాణి,ఎంఈవో రేణుకానందరావు పాల్గొన్నారు. -
తాగునీటి చెరువులు పూర్తిగా నిండవు
సాక్షితో కలెక్టర్ రఘునందన్రావు సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి వారం రోజుల పాటు నీరు వదిలినా చెరువులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం లేదని కలెక్టర్ రఘునందన్రావు తెలిపారు. బుధవారం ఆయనను కలిసిన ‘సాక్షి ప్రతినిధి’తో పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం చెరువులు నింపే కార్యక్రమం కొనసాగుతుందని, వారం రోజుల్లో అన్ని చెరువులకు తాగునీరు పూర్తిగా అందే అవకాశం మాత్రం లేదని కలెక్టర్ చెప్పారు. తాగునీటిని ఇతర అవసరాలకు ఎవరు ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైనదన్నారు. వర్షాలు వచ్చి నీటిమట్టం పెరిగితే తాగునీటి కొరత పూర్తిస్థాయిలో తీరుతుందన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాల్సిన విషయాన్ని ప్రస్తావించగా ప్రభుత్వం ఈ విషయంలో కసరత్తు చేస్తున్న విషయం గురించి చెప్పారు. సీఎం బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించినందున త్వరలోనే వారి నుంచి గైడ్లైన్స్ వస్తాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వర్షాలు బాగా పడితే కృష్ణానదిలో పూర్తిస్థాయిలో నీరు వస్తే ఎటువంటి ఇబ్బందులుండవని, వ్యవసాయానికీ పూర్తిస్థాయిలో నీళ్లు అందుతాయన్నారు. వర్ష సూచన ఉన్నందున నదుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. రాజధాని విషయం ప్రభుత్వానిదే... రాజధాని విజయవాడలోనే ఉంటుందనే ప్రచారం గురించి ప్రస్తావించగా అదంతా ప్రభుత్వం చూసుకునే వ్యవహారమన్నారు. ఏదైనా ఆగస్టు తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే రాజధాని ఎక్కడైతే బాగుంటుందనే అంశంపై తగిన నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆగస్టులో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు వేసి చూడాల్సిందేనన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంత మొత్తం ఉన్నాయి. అదే విధంగా ప్రైవేట్ భూముల వివరాలూ సేకరించినట్లు చెప్పారు. ఈ వివరాలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. భూ సేకరణ కొత్త చట్టం ప్రకారం జరుగుతుందని గత సంవత్సరం రూపొందించిన చట్టంలో పేర్కొన గైడ్లైన్స్ ప్రకారం పరిహారం ఉంటుందన్నారు. జిల్లాలో కొత్తగా 11 ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు అవసరమైన భూమి వివరాలు ప్రభుత్వం అడిగి తీసుకుందని చెప్పారు. ‘మెట్రో’ అవకాశం ఉంది... ఇక మెట్రోరైల్ విషయం ప్రస్తావించగా ఉన్నత స్థాయి కమిటీ వచ్చి పరిశీలించి వెళ్లినందున తప్పకుండా ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరు నెలల్లో ఫీజుబులిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉందన్నారు. మెట్రోరైల్ రావడం వల్ల నగరంలో రవాణా సులువవుతుందని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ తప్పకుండా కృష్ణా జిల్లాలోనే ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించగా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినందున ప్రయారిటీలు అనేవి పాలకులు నిర్ణయించేవే తప్ప తమ వద్ద ఏమి ఉండదన్నారు. వారు చెప్పినవి అమలు చేసేందుకు మాత్రమే తాము పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement