-
ప్రేమ పేరుతో మోసం..
పెద్దపల్లిరూరల్: మరదలు వరసయ్యే యువతితో నాలుగైదేళ్లుగా ప్రేమాయణం సాగించి తీరా పెళ్లి సమయానికి మోసం చేసిన ప్రియుడి ఉదంతం వెలుగుచూసింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు నరేశ్ ఇదే గ్రామానికి చెందిన దుబ్బాసి దివ్యను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి చెట్టా పట్టాలేసుకొని తిరిగాడు. బీటెక్ పూర్తి చేసిన దివ్య హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, నరేశ్ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని దివ్య కోరడంతో నరేశ్ ముఖం చాటేశాడు. చావే శరణ్యమంటూ ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని గెంటివేయడంతో ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. అయినా నరేశ్ వివాహం చేసుకునేందుకు ససేమిరా నిరాకరించడంతో దివ్య, ఆమె తల్లిదండ్రులు ఈ విషయం బసంత్నగర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నరేశ్ గురించి ఆరా తీస్తున్నట్టు గ్రహించిన కుటుంబీకులు ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి కుమారుడిని ఆశ్రయించారు. దీంతో ఆయన సూచనమేరకు బసంత్నగర్ ఎస్సై విజయేందర్ జాప్యం చేయడంతో గ్రామానికి చెందిన నాయకులు గంట రమేశ్, కలవేన రవీందర్తోపాటు ఇతర పెద్దలు ఎస్సైతో వాగ్వాదానికి దిగి దివ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పంటలు ఎండి.. అప్పులు తీరక...
– రంగాపూర్లో రైతు ఆత్మహత్య – మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు అచ్చంపేట రూరల్ : ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం.. ఆ రైతు తమకున్న పొలంలో పంటలు వేసినా వర్షాభావంతో ఎండిపోయాయి.. దీంతో వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక అతను ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలంలోని రంగాపూర్కు చెందిన కేతావత్ టీక్యా (35) కు శివారులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో ఈసారి ఖరీఫ్ సీజన్లో పత్తి, మిరప వేశాడు. వీటికోసం సుమారు మూడు లక్షలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెచ్చాడు. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో పంటలు ఎండిపోతుండటం, చేసిన అప్పులు తీర్చడం ఎలాగని మనోవేదనకు గురైన అతను శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మతి చెందాడు. ఈయనకు భార్య బుజ్జితోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ ఖాద్రీ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
చంపేసి.. ఆపై కాల్చేసి
పరిగి: ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని రంగాపూర్లో బుధవారం వెలుగుచూసింది. హతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని సిరిగాయపల్లికి చెందిన సుర్క వెంకటయ్య(42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన మంగళవారం పరిగి బ్యాంకులో పని ఉందని కుటుంబీకులకు చెప్పి ఇంట్లోంచి వె ళ్లాడు. రాత్రి ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించసాగారు. కాగా సిరిగాయపల్లి సమీపంలోని రంగాపూర్ వ్యవసాయ పొలాలకు వెళ్లే పానాదిలో ఓ వ్యక్తి మృతదేహంగా పడి ఉన్నాడు. మృతదేహం కాలిపోయి ఉంది. బుధవారం ఉదయం రంగాపూర్ రైతులు విషయం గమనించారు. పరిగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ప్రసాద్, ఎస్ఐ కృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడి వివరాల గురించి స్థానికులను ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో తన తండ్రి కనిపించకపోవటంతో వెంకటయ్య కుమారుడు సుర్క విఠల్(23) అక్కడికి చేరుకున్నాడు. హతుడి దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా తన తండ్రేనని అతడు గుర్తించాడు. తమ గ్రామానికి చెందిన కొందరితో తమకు గొడవలు ఉన్నాయని, వారే తన తండ్రిని హత్య చేసి ఉండొచ్చని విఠల్ పోలీసులకు చెప్పాడు. కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement