-
ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ
సాక్షి, ముంబై : ఫేస్బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అతిపెద్ద డీల్ గా నిలిచిన రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను ఫేస్బుక్ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారంనాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (అమెజాన్, ఫ్లిప్కార్ట్కు షాకివ్వనున్న జియో మార్ట్) రిలయన్స్ అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి ముందు, 2020 లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. ఇది ఆసియాలో ఎవరికైనా డాలర్ పరంగా అతిపెద్ద పతనం. దీన్ని బట్టే ఫేస్బుక్, జియో డీల్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ మంగళవారం నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది. 29 సంవత్సరాలలో చమురు అతిపెద్ద పతనాన్ని నమోదు చేయడంతో మార్చి ప్రారంభంలో, జాక్ మా, అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ అనువర్తనాల డిమాండ్ తగ్గడంతో అలీబాబా హోల్డింగ్స్ నష్టాలను చవి చూస్తోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది -
పాలియస్టర్ ప్రిన్స్
మన దిగ్గజాలు దేశం కాని దేశంలో పెట్రోల్ బంకులో కార్మికుడిగా పనిచేశాడు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే సరికి ఆయన వద్దనున్నవి ఐదువందల రూపాయలు మాత్రమే. అదే ఆయన పెట్టుబడి. కేవలం ఆ చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేసి సరిపెట్టుకుంటే, ఇంత చరిత్ర ఉండేదే కాదు. పెట్టుబడికి పట్టుదల తోడైంది. ఆ పట్టుదలే ధీరూభాయ్ అంబానీని పారిశ్రామిక రంగంలో ‘పాలియస్టర్ ప్రిన్స్’గా నిలిపింది. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా పట్టం కట్టింది. బడిపంతులు కొడుకు... ధీరూభాయ్ అసలు పేరు ధీరజ్లాల్ హీరాచాంద్ అంబానీ. గుజరాత్లోని జునాగఢ్ జిల్లా చోర్వాడ్ పట్టణంలో 1932 డిసెంబర్ 28న పుట్టారు. తండ్రి బడిపంతులు. ఆయన సంతానంలో మూడోవాడు ధీరూభాయ్. తండ్రి బడిపంతులే అయినా, ధీరూభాయ్కి పెద్దగా చదువు అబ్బలేదు. ఎలాగోలా హైస్కూల్ వరకు పూర్తి చేశాక, తర్వాత చదువు మానేశారు. సంపాదన కోసం చిన్నా చితకా పనులు చేస్తూ వచ్చారు. ఈలోగా అవకాశం కలిసి రావడంతో యెమెన్లో పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్లారు. ఎంత కష్టపడి పనిచేసినా, పెద్దగా మిగిలేదేమీ ఉండేది కాదు. ఇలా లాభం లేదనుకుని 1957లో ముంబైకి వచ్చేశారు. ముంబై చేరుకునే నాటికి ఆయన చేతిలో ఉన్నవి ఐదువందల రూపాయలు మాత్రమే. ఆ స్వల్ప మొత్తమే పెట్టుబడిగా దగ్గరి బంధువైన చంపక్లాల్ దామానీతో కలిసి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించారు. విదేశాల నుంచి పాలియస్టర్ దారం దిగుమతి, విదేశాలకు సుగంధద్రవ్యాల ఎగుమతి చేసేవారు. ముంబైలోని మస్జిద్ బందర్ ప్రాంతంలో చిన్న గదిలో కార్యాలయం పెట్టుకున్నారు. కార్యాలయంలో మూడు కుర్చీలు, ఒక టేబుల్, ఒక టెలిఫోన్ మాత్రమే ఉండేవి. మొదట్లో ఇద్దరు అసిస్టెంట్లను నియమించుకున్నారు. వ్యాపారం త్వరగానే వేగం పుంజుకుంది. సొంతంగానే ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్న అంబానీ 1965లో దామానీతో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేశారు. ఓన్లీ విమల్... రిస్కు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడని నైజం అంబానీది. దామానీతో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా పాలియస్టర్ దారం దిగుమతులను కొనసాగిస్తూ, 1966లో రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. గుజరాత్లోని నరోదాలో సింథటిక్ వస్త్రాల మిల్లును నెలకొల్పారు. 1975లో ‘విమల్’ చీరలు, సూటింగ్స్, షర్టింగ్స్ ఉత్పత్తి ప్రారంభించారు. ‘ఓన్లీ విమల్’ నినాదంతో సాగించిన ప్రచారం దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ ఊపుతో 1977లో పబ్లిక్ ఇష్యూకి వెళితే భారీ స్పందన వచ్చింది. రిలయన్స్ విజయానికి ఇది తొలిమెట్టు. వడి వడిగా విస్తరణ... ‘విమల్’బ్రాండ్ విజయంతో ధీరూభాయ్ విస్తరణ వైపు దృష్టి సారించారు. ‘రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ను 1985లో ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’గా మార్చారు. ఐదేళ్లు గడిచే సరికి పెట్రోలియం రంగంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లకే టెలికం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రిలయన్స్ గ్యాస్’ ప్రారంభించారు. అదేకాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా గుజరాత్లోని జామ్నగర్లో ఇంటిగ్రేటెడ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను నిర్మించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు రెండూ 2001 నాటికి భారత్లోనే అగ్రగామి కంపెనీలుగా నిలదొక్కుకున్నాయి. ‘రిలయన్స్’ విస్తరణ వేగం పుంజుకుంటున్న దశలోనే 1986లో ధీరూభాయ్ తొలిసారిగా బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. దాంతో చాలావరకు బాధ్యతలను కొడుకులు ముకేశ్, అనిల్లకు అప్పగించారు. ‘రిలయన్స్’ ఘన విజయాలు సాధిస్తున్న దశలోనే 2002లో ధీరూభాయ్ మరోసారి బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2002 జూలై 6న తుదిశ్వాస విడిచారు. ధీరూభాయ్ మరణం తర్వాత ముకేశ్, అనిల్ల మధ్య పొరపొచ్చాలు తలెత్తడంతో ‘రిలయన్స్’ సామ్రాజ్యం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ ముకేశ్ అంబానీ అధీనంలోను, ‘రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ (ఏడీఏ) గ్రూప్’ అనిల్ అంబానీ నేతృత్వంలోను నడుస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement