-
రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి దక్కింది. శాఖకు సంబంధించిన నిర్వహణ, వనరుల వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. దీన్ని అత్యంత శక్తిమంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన సీఈఓ స్థాయి పోస్టుగా పరిగణిస్తుంటారు. 54 ఏళ్ల వర్మ నియామకాన్ని సెనేట్ 67–26 ఓట్లతో ఆమోదించింది. మాజీ దౌత్యవేత్త అయిన వర్మ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ (న్యాయ వ్యవహారాలు)గా కూడా పని చేశారు. 2015 నుంచి రెండేళ్లపాటు భారత్లో అమెరికా రాయబారిగా ఉన్నారు. వర్మ 1968లో అమెరికాలోని భారతీయ కుటుంబంలో జన్మించారు. అమెరికా వైమానిక దళ స్కాలర్షిప్తో కాలేజీ చదువు పూర్తి చేశారు. లాహిగ్ వర్సిటీ నుంచి బీఎస్, జార్జ్టౌన్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేశారు. అనంతరం యూఎస్ ఎయిర్ఫోర్స్లో జడ్జ్ అడ్వొకేట్గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశాధ్యక్షుని నిఘా సలహా బోర్డులో, సామూహిక జనహనన ఆయుధాలు, ఉగ్రవాద కమిషన్ సభ్యునిగా చేశారు. ప్రస్తుతం మాస్టర్కార్డ్ చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్గా ఉన్నారు. ఫోర్డ్ ఫౌండేషన్తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బోర్డుల్లో సభ్యునిగా, ట్రస్టీగా కొనసాగుతున్నారు. విదేశాంగ శాఖ నుంచి అత్యుత్తమ సేవా మెడల్, వైమానిక దళం నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్, కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలోషిప్ తదితరాలు దక్కించుకున్నారు. -
భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్, రీసోర్సెస్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్ ఆమోదం తెలిపితే విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్ వర్మ అవుతారు. ఆయన 2015–17 మధ్య భారత్లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్గా, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్గా పని చేస్తున్నారు. -
ఎన్ఎస్జీలో చేరే అర్హత భారత్ కు ఉంది: అమెరికా
న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం దక్కకపోవడంతో అమెరికా నిరాశపడిందని భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. కొద్ది నెలల్లోనే సభ్యత్వం దక్కుతుందని, ఆ అర్హత భారత్కు ఉందని అన్నారు. ఇందుకోసం ఎన్ఎస్జీ 48 సభ్యదేశాలతో చర్చలు కొనసాగిస్తామన్నారు. భారత్ పట్ల సానుకూలత వచ్చేటట్లు చేస్తామన్నారు. పలు సభ్య దేశాలు నాన్-ఎన్పీటీ దేశాల చేరికపై అభ్యంతరాలు చెప్పడం వల్లే భారత్కు సభ్యత్వం రాలేదని చైనా పేర్కొంది. మా వ్యూహంతో అడ్డుకట్ట: పాక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 17 దేశాలకు రాసిన లేఖలతో పాటు పకడ్బందీగా చేసిన వ్యూహాత్మక సంప్రదింపులు భారత్కు ఎన్ఎస్జీ సభ్యత్వం రాకుండా అడ్డుకోగలిగాయని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ చెప్పారు. -
ఎఫ్16ల కొనుగోలులో భారత్ అభ్యంతరంపై పాక్ విస్మయం
ఇస్లామాబాద్/ముంబై: అమెరికా తమకు ఎఫ్16 యుద్ధ విమానాలను అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగించిందని పాకిస్తాన్ పేర్కొంది. భారత్ ఒకవైపు పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ మరో వైపు తమ విషయంలో ఇలా స్పందించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. భారత్ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రి ఉందని తెలిపింది. ఎఫ్16లతో ఉగ్రవాదంపై పోరులో పాక్ సామర్థ్యం పెరుగుతుందని అమెరికా సర్కారు చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాక్కు విమానాలను విక్రయించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సమర్థించుకున్నారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల కొనసాగింపులో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని ముంబైలో తెలిపారు. పాత ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. -
పాక్కు అమెరికా ఎఫ్-16ల అమ్మకం
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు అణుసామర్థ్యం గల 8 ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఒప్పందం విలువ రూ.4670 కోట్లపైనే. ఈ ఒప్పందాన్ని రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా ఒబామా ప్రభుత్వ వెనకడుగు వేయడం లేదు. భారత్ తీవ్ర అసంతృప్తి.. పాక్కు ఎఫ్-16 విమానాలు అమ్మాలన్న అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. చాలా నిరుత్సాహానికి గురయ్యామని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ చెప్పారు. రిచర్డ్ను తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. ఈ చర్యను భారత్ వ్యతిరేక కార్యక్రమంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సైనిక సాయం పాక్కు మరింత ధైర్యాన్ని ఇస్తుందంటూ ఘాటుగా మాట్లాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement