-
నిద్రలేమితో కోట్ల రూపాయల నష్టం!
సరిపడా నిద్రలేకపోతే ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు వస్తాయంటారా! అయితే నిద్రలేమి కేవలం వ్యక్తుల ఆరోగ్యాలకే కాదు.. ఆర్థిక నష్టాలకూ కారణమవుతోందట! నిద్రలేమికి, ఆర్థిక నష్టానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా... అయితే ఈ స్టోరీ చదవండి... సరైన నిద్రలేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. ఆరోగ్యంగా లేకపోతే సరిగా పనిచేయలేడు. ఇప్పుడిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీలకు నష్టంగా మారుతోంది. నిద్రలేమి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్లు తాజా సర్వేలో తేలింది. రాండ్ అనే ఓ సంస్థ 34 ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) దేశాల్లో సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉద్యోగులు తమ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నారు. అక్కడా పని చేస్తున్నారు. దీనివల్ల రాత్రి సరిగా నిద్రపోవడం లేదు. సరిపడా విశ్రాంతి లేకుండానే మళ్లీ ఆఫీసులకు వస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఇలా భారీ నష్టాలు కంపెనీల కొంప ముంచుతున్నాయి. మొదటి స్థానంలో అమెరికా... అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ముందుండే అమెరికా నిద్రలేమి కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల్లోనూ ముందువరుసలో ఉండడం గమనార్హం. నిద్రలేమి కారణంగా ఈ దేశం ఏటా 41,100 కోట్ల డాలర్లు నష్టపోతున్నట్లు తేలింది. ఇక 13,800 కోట్ల డాలర్ల నష్టంతో జపాన్ రెండో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే, కెనడా ఉన్నాయి. ఇక ఎక్కువ ఉద్యోగులుండే భారత్, చైనాలో నిద్రలేమితో జరుగుతోన్న నష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ లెక్కించలేదు. నిద్రలేమితో కలుగుతోన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి జపాన్లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు కాసేపు కునుకు తీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. -
నరకదారులు !
-
జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు
నోయిడా: ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్ విద్యార్థులు ఈడ్చిఈడ్చి కొట్టారు. ఇనుప రాడ్లతో మోదారు. ఈ ఘటనలో 18మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ అగర్వాల్, యాశ్ ప్రతాప్ సింగ్ అనే విద్యార్థులు హాస్టల్లో డిన్నర్ పూర్తి చేసుకొని టీవీ హాల్ కు తిరిగొచ్చారు. వారు అలా రాగానే.. పెద్ద మొత్తంలో సీనియర్ విద్యార్థులు తలుపులు వేసి వారిని లోపల పడేసి బాగా కొట్టారు. గంటపాటు అలా ఇష్టమొచ్చినట్లు కొట్టిన తర్వాత వారి బట్టలు విప్పేయండంటూ బలవంత పెట్టారు. సీనియర్లతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో వాళ్లు మాకు చూపించాలని అనుకున్నారు. వాళ్లు ప్రతి రోజు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. తినే వద్ద కూడా వదిలిపెట్టడం లేదు. కవర్లలో ఆహారం దాచేసి అందులో ఏముందని అడుగుతూ అలా చెప్పకుంటే ముఖంపై విసిరేసి అవమానిస్తారు. ఇలా రోజు జరుగుతుంది' అని గాయాలపాలయిన విద్యార్థుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో సంఘటనలు జరుగుతున్నా తమకు కనీస సమాచారం అందించడం లేదంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement