-
భారత్తో రాస్నెఫ్ట్ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రాస్నెఫ్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మాజీ డైరెక్టర్ జీకే సతీష్ (62)ను బోర్డులో నియమించింది. రాస్నెఫ్ట్ బోర్డులో ఒక భారతీయుని నియా మకం ఇదే తొలిసారి. భారత్తో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని సంస్థ భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఓసీలో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్గా 2021లో జీకే సతీష్ పదవీ విరమణ చేశారు. 11 మంది డైరెక్టర్ల బోర్డులో నియమితులైన ముగ్గురు కొత్తవారిలో జీకే సతీష్ ఒకరని రష్యన్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రష్యాలోని చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి రాస్నెఫ్ట్కు సతీష్ గతంలో పనిచేసిన ఐఓసీతో భాగస్వామ్యం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర సంస్థలకు రాస్నెఫ్ట్ క్రూడ్ ఆయిల్నూ విక్రయించింది. ఇటీవలి కాలంలో సంస్థ గుజరాత్ రిఫైనరీలకు నాఫ్తా విక్రయాలనూ ప్రారంభించింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అమ్మకంసహా భారత్ సంస్థలతో భాగస్వామ్యం విస్తృతం చేసుకోడానికి రాస్నెఫ్ట్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. -
రాస్నెఫ్ట్తో ఐవోసీ ఒప్పందం
న్యూఢిల్లీ: రష్యాకి చెందిన రాస్నెఫ్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో మరింత చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలన్నది ఐవోసీ ప్రయత్నం. చమురు దిగుమతులు గణనీయంగా పెంచుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరిస్తుందని ఐవోసీ ప్రకటించింది. రాస్నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ భారత్ పర్యటనలో భాగంగా ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. -
బీపీసీఎల్ కొనుగోలు రేసులో దిగ్గజాలు
న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) కొనుగోలుకి విదేశీ చమురు కంపెనీలు జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వేదాంతా గ్రూప్, అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ బిడ్స్ను దాఖలు చేశాయి. బీపీసీఎల్ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) సంస్థలతో ఇతర కంపెనీలు సైతం జత కలిసే వీలున్నట్లు ఒక డాక్యుమెంట్ పేర్కొంది. తద్వారా కన్సార్షియంగా ఏర్పాటుకావచ్చని తెలుస్తోంది. 2020 నవంబర్ 16న బిడ్డింగ్కు గడువు ముగిసింది. బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి గల 52.98% వాటా విక్రయానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్, అదానీతోపాటు.. రాయల్ డచ్ షెల్, బీపీ, ఎగ్జాన్ బిడ్డింగ్కు దూరంగా ఉండిపోయాయి. అయితే రష్యన్ సంస్థ రాస్నెఫ్ట్, మధ్యప్రాచ్యానికి చెందిన పలు చమురు దిగ్గజాలు బీపీసీఎల్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా బిడ్స్ దాఖలు చేసిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలతో జత కలవనున్నట్లు తెలుస్తోంది. కన్సార్షియంగా ఏర్పాటయ్యాక బిడ్స్కు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బీపీసీఎల్ కొనుగోలు చేసే సంస్థకు దేశీ చమురు శుద్ధి సామర్థ్యంలో 14% వాటా లభించనుంది. అంతేకాకుండా 23% ఇంధన మార్కెట్ వాటానూ దక్కించుకునే వీలుంది. -
ఎస్సార్ ఆయిల్ షేరుకు అదనంగా రూ.75.48
మాజీ మైనారిటీ వాటాదారులకు శుభవార్త న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ మాజీ మైనారిటీ వాటాదారులకు ఎస్సార్ గ్రూపు తీపి కబురు అందించింది. ఒక్కో షేరుకు రూ.75.48 చొప్పున అదనంగా చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఎస్సార్ ఆయిల్ను రష్యాకు చెందిన రాస్నెఫ్ట్, ఇతర ఇన్వెస్టర్ల కూటమి 12.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విక్రయానికి ముందే 2015లో ఎస్సార్ ఆయిల్ను స్టాక్ ఎక్సే్ఛంజ్ల నుంచి ఎస్సార్ గ్రూపు డీలిస్ట్ చేసింది. ఆ సమయంలో బైబ్యాక్లో పాల్గొన్న ఇన్వెస్టర్లకు వారి దగ్గరున్న ఒక్కో షేరుకు రూ.262.80 చొప్పున చెల్లించింది. తాజాగా ఎస్సార్ ఆయిల్ను రాస్నెఫ్ట్కు విక్రయించగా, ఒక్కో షేరుకు రూ.338.28 చొప్పున తమకు చెల్లింపులు జరిగాయని, ఈ నేపథ్యంలో ఒకనాటి మైనారిటీ వాటాదారులకు గతంలో చెల్లించిన రూ.262.80కు అదనంగా ఇప్పుడు ఒక్కో షేరుకు రూ.75.48 చొప్పున చెల్లించనున్నట్టు ఎస్సార్ గ్రూపు తెలిపింది. -
రాస్నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్...
♦ 13 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న రష్యా కంపెనీ ♦ విక్రయ లావాదేవీ పూర్తి ♦ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐ డీల్ ♦ దేశీయ బ్యాంకులకు ఊరట ముంబై: రుణభారంతో సతమతం అవుతున్న ఎస్సార్ గ్రూపు తన పరిధిలోని ఎస్సార్ ఆయిల్ను రష్యాకు చెందిన రాస్నెఫ్ట్కు విక్రయించింది. ఎస్సార్ ఆయిల్, దాని పరిధిలోని పోర్టు, విద్యుత్తు, రిటైల్ ఆస్తులను రాస్నెఫ్ట్తోపాటు ఇతర ఇన్వెస్టర్ల కన్సార్టియం 12.9 బిలియన్ డాలర్లు (రూ.82,500 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. వాస్తవానికి ఈ డీల్ గతేడాది అక్టోబర్ 15న గోవా బ్రిక్స్ సదస్సు సందర్భంగా సాకారం కాగా అదిప్పుడు పూర్తయింది. రాస్నెఫ్ట్ రష్యా ప్రభుత్వ సంస్థ. ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద చమురు, సహజవాయువు సంస్థగా ఉంది. ఎస్సార్ ఆయిల్కు చెందిన గుజరాత్లోని 20 మిలియన్ టన్నుల వాదినార్ రిఫైనరీ, 58 మిలియన్ టన్నుల క్యాప్టివ్ పోర్ట్, 1,010 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, 3,500 పెట్రోల్ బంక్లు రాస్నెఫ్ట్, దాని కూటమికి చెందుతాయి. మొత్తం మీద ఈ ఆస్తుల్లో రాస్నెఫ్ట్ ఒక్కటే 49.13 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 49 శాతం వాటా నెదర్లాండ్స్కు చెందిన ట్రాఫిగురా గ్రూపు, రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యునైటెడ్ క్యాపిటల్ పార్ట్నర్స్ (యూసీపీ) దక్కించుకున్నాయి. ఎస్సార్ ఆయిల్లో డీల్కు ముందు ఎస్సార్ ఎనర్జీ హోల్డింగ్స్కు 98.26 శాతం, బిడ్కో మారిషస్కు మిగిలిన వాటా ఉంది. తాజా డీల్తో రుయాలు పూర్తిగా కంపెనీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కంపెనీలో రాస్నెఫ్ట్, ట్రాఫిగురా–యూసీపీ కన్సార్టియం కాకుండా మైనారిటీ వాటాదారుల చేతిలో ఇంకా 1.75 శాతం వాటా ఉంటుంది. ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్కు ముందు తమ షేర్లను విక్రయించని వారు వీరు. వీరి దగ్గరున్న వాటాలకు సెబీ బైబ్యాక్ నిబంధనల మేరకు చెల్లింపులు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక, ఎస్సార్ ఆయిల్ను విక్రయించిన తర్వాత కూడా చమురు రంగంలో రుయాల ప్రస్థానం కొనసాగనుంది. బ్రిటిష్ ఆస్తులు, ఓ ఆయిల్ రిఫైనరీ, కోల్బెడ్ మీథేన్ బ్లాక్లు వారి పరిధిలోనే ఉంటాయి. బ్యాంకులకు దక్కేది రూ.4,000 కోట్లే ఎస్సార్ ఆయిల్కు చెందిన 5 బిలియన్ డాలర్ల (రూ.35,000 కోట్లు) విలువైన రుణభారాన్ని సైతం ఒప్పందంలో భాగంగా రాస్నెఫ్ట్తోపాటు కొత్త యజమానులు స్వీకరించారు. రుణాలిచ్చిన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు ఇతర రుణదాతలు తమ సమ్మతి తెలిపారు. దీంతో ఈ సంస్థలకు ప్రస్తుతానికి రూ.4,000 కోట్ల మేరే ఎస్సార్ గ్రూపు నుంచి చెల్లింపులు జరగనున్నాయి. రుణదాతలు కొత్త యజమానిగా రాస్నెఫ్ట్ను అంగీకరించడంతో మిగిలిన రుణానికి రష్యా కంపెనీ బాధ్యత వహిస్తుంది. రుణదాతలకు తక్షణం రూ. 4,000 కోట్లు చెల్లిస్తాం: ప్రశాంత్ రుయా ఎస్సార్ గ్రూపు మొత్తం రుణ భారం రూ.1.35 లక్షల కోట్లు కాగా, ఎస్సార్ విక్రయం నేపథ్యంలో రూ.70,400 కోట్ల మేర రుణ భారం తమ గ్రూప్ నుంచి తగ్గుతుందని ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా తెలిపారు. రుయాల మొత్తం రుణంలో ఇది 60 శాతం. ‘‘ఈ డీల్కు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్డీఐ. దేశ చరిత్రలో భారీ స్థాయిలో రుణాలను తీర్చివేస్తున్న డీల్. మూడోది రష్యా నుంచి ఓ దేశానికి భారీ స్థాయిలో నిధులు వెళుతున్న సందర్భం కూడా ఇదే’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. విక్రయ ఒప్పందం పూర్తయినట్టు సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ బ్యాలన్స్ షీట్లలో గణనీయమైన రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. రాస్నెఫ్ట్ డీల్ తర్వాత భారత్లోని రుణదాతలకు రూ. 4000 కోట్ల మేర నేరుగా చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అందులో ఎల్ఐసీకి రూ. 800 కోట్లవరకూ చెల్లిస్తామని అన్నారు. మిగిలిన మొత్తాన్ని ఏ బ్యాంకుకు లేదా బీమా కంపెనీకి ఎంతెంత చెల్లించేదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. రూ.1.2 లక్షల కోట్ల మూలధన విస్తరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విస్తృతమైన తమ పోర్ట్ఫోలియో వృద్ధి అవశాలను ఇకపై చూడనున్నట్టు ప్రకటించారు. ‘‘ఈ డీల్ తర్వాత కూడా ఎస్సార్ గ్రూపు ఆస్తుల విలువ 17 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 15 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల ఎబిటా కూడా ఉండనుంది. చమురు రంగంలో మాకున్న ఏకైక 9 మిలియన్ టన్నుల రిఫైనరీ ద్వారా పెట్టుబడులు కొనసాగుతాయి’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక లావాదేవీతో ఎస్సార్ గ్రూపు వృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయని సంస్థ వ్యవస్థాపకుడు శశిరుయా కూడా ప్రకటించారు. ఎస్సార్ స్టీల్ రుణాలు ఎగవేతే! ఎస్సార్ గ్రూపు పరిధిలోని ఎస్సార్ స్టీల్ రూ.44,000 కోట్ల మేర బ్యాంకుల రుణాలను ఎగవేయగా, ఈ కేసు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఎస్సార్ గ్రూపు భారీ స్థాయిలో రుణాలను తిరిగి చెల్లించే కార్యక్రమం చేపట్టినప్పటికీ... ఎస్సార్స్టీల్ రుణాలను మాత్రం తిరిగి చెల్లించడం లేదు. ఇదే విషయాన్ని రుయాను ప్రస్తావించగా, ‘ఎస్సార్ ఆయిల్, ఎస్సార్ స్టీల్ రెండు వేర్వేరు సంస్థలు, వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నయి. ఒక కంపెనీ ఖాతా నుంచి మరో కంపెనీ ఖాతాలోకి నిధుల మళ్లింపునకు చట్టం ఒప్పుకోదు’ అని స్పష్టం చేశారు. రాస్నెఫ్ట్కు స్వాగతం: ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఒప్పందాన్ని పూర్తి చేసిన ఎస్సార్ గ్రూపును పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న రాస్నెఫ్ట్, ట్రాఫిగురా యూసీపీ కన్సార్టియానికి స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించారు. సగం రుణభారం తీరిపోతుంది: కొచర్ ఎస్సార్ గ్రూపు రుణాలను తిరిగి తీర్చివేసే కార్యక్రమంతో ఆ గ్రూపునకు ఇచ్చిన రుణాలు సగం మేర తగ్గిపోనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందాకొచర్ తెలిపారు. ఎస్సార్ ఆయిల్ అభివృద్ధికి కృషి: సెచిన్ కొత్త భాగస్వాములతో కలసి ఎస్సార్ ఆయిల్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, ఆస్తుల అభివృద్ధికి తగిన వ్యూహాన్ని అమల్లో పెడతామని రాస్నెఫ్ట్ అధినేత ఇగార్ సెచిన్ పేర్కొన్నారు. కాగా, మీడియా సమావేశంలో ఆయన పాల్గొనలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement