-
నంజుండన్ అనుమానాస్పద మృతి
బెంగళూర్ : ప్రముఖ అనువాదకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జీ నంజుండన్ బెంగళూర్లోని తన నివాసంలో శనివారం విగతజీవిగా కనిపించారు. 58 ఏళ్ల నంజుండన్ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నాగదేవనహల్లిలోని నివాసంలో కుళ్లిన స్ధితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించామని వెల్లడించారు. బెంగళూరు యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్గా పనిచేసే నంజుండన్ కొద్దిరోజులుగా విధులకు గైర్హాజరయ్యారని, ఆయనను చూసేందుకు అసిస్టెంట్ వచ్చిన క్రమంలో ఈ ఘటన వెలుగుచూసిందని చెప్పారు. ఆ సమయంలో చెన్నైలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా భార్య, కుమారుడు హుటాహుటిన బెంగళూర్కు చేరుకున్నారని తెలిపారు. కాగా, ఆయన దాదాపు 12 పుస్తకాలను కన్నడ నుంచి తమిళంలోకి అనువదించి విశేష ప్రాచుర్యం పొందారు. పలు కన్నడ మహిళా రచయితల కథలను అకా పేరుతో ఆయన తమిళంలోకి అనువదించినందుకు నంజుండన్కు 2012లో సాహిత్య అకాడమి బహుమతి లభించింది. -
ఏదీ నన్ను చూడనీ...
పెద్ద స్థానాల్లో ఉన్నవారు మంచి చదువరులు అయితే ఎలా ఉంటుంది? ఇది 1958 నాటి సంగతి. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సాహిత్య అకాడమీకి కూడా ఆయన ఉపాధ్యక్షుడు(జవాహర్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని, అకాడమీ అధ్యక్షుడు). అడవి బాపిరాజు సుప్రసిద్ధ నవల ‘నారాయణరావు’ను సాహిత్య అకాడమీ తరఫున అన్ని భాషల్లోకీ అనువదించాల్సిన పుస్తకంగా నిర్ణయించారు. అయితే– ఈ నవలలో ప్రధాన పాత్రధారి నారాయణరావు దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలు, వారి ఆహారపుటలవాట్లు, వారి సంస్కృతుల మీద తన గమనింపుల్ని ప్రకటిస్తాడు. వీటిల్లో ఒరియా ప్రజల మీద చేసిన వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయనీ, కాబట్టి అనువాద కార్యక్రమం నుంచి ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్లు వచ్చాయి. అప్పుడు రాధాకృష్ణన్ స్వయంగా ఆ పుస్తకం చదివి, ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిన పనిలేదని తేల్చి అనువాదం అయ్యేలా చూశారు. (అయితే, 1972లో బెంగాలీ పాఠకుల నుంచి ఇదే రకమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు అప్పటి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సునితి కుమార్ ఛటర్జీ నిరసనకారులకు తలొగ్గి ఆ వ్యాఖ్యలు తొలగింపజేశారు.) ఇక, 1958లోనే నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ పుస్తకంపైనా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అందులోని కొన్ని పరిశీలనలు జైనుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయన్న అభిప్రాయం వెల్లడైనప్పుడు, రాధాకృష్ణన్ ఆ నవల చదివి ఆ అభ్యంతరాలను కొట్టిపారేశారు. (ఇన్పుట్: డాక్టర్ డి.ఎస్.రావు) -
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా సిధారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం - తెలంగాణ కోసం ‘అక్షర పోరు’ సాగించిన రచయిత - ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగేటి సాల్లల్లో.. వంటివెన్నో రచనలు సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సుపరిచుతులైన సిధారెడ్డి ఎన్నో పుస్తకాల ను వెలువరించారు. కేసీఆర్కు బాల్య మిత్రు డు కూడా. సిద్దిపేట సమీపంలోని బందారం గ్రామానికి చెందిన సిధారెడ్డి 2012లో తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు. తర్వాత నిరంతరం సాహిత్య సేద్యంలో తలమునకలై ఇప్పటికీ పుస్తక రచనలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైన తెలంగాణ సాహిత్య అకాడమీని ప్రారంభించి, దానికి సిధారెడ్డిని చైర్మన్గా నిర్ణయించారు. మిగతా రెండు అకాడమీలు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయి. విద్యార్థి దశ నుంచే సాహితీ సేద్యం.. 1955లో జన్మించిన సిధారెడ్డి తన విద్యాభ్యాసాన్ని బందారం, వెల్కటూరు, సిద్దిపేటలో కొనసాగించారు. ఆయన తండ్రి బాల సిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదివిన సిధారెడ్డి.. ఆధునిక తెలుగు కవిత్వం లో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్ చేశారు. ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధివా స్తవికతపై పరిశోధన చేసి 1986లో పీహెచ్డీ çఅందుకున్నారు. ఉమ్మడి మెదక్లో కొంతకాలం పనిచేసిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే కథలు, కవిత్వం రాయడం అలవాటున్న సిధారెడ్డి.. ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగే టి సాల్లల్ల, ఇక్కడి చెట్లగాలి, ఒక బాధ కాదు తదితర రచనలు అందించారు. నవ సాహితి, మెదక్ స్టడీ సర్కిల్ సంస్థలను నిర్వహించారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మంజీరా బులెటిన్కు సంపాదకత్వం వహించి 7 కవితా సంకలనాలను వెలువరించారు. సోయి అనే పత్రికకూ సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిం చారు. 1997 ఆగస్టులో గంట వ్యవధిలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతపై సిధారెడ్డి రచించిన ‘నాగేటి సాల్లల్ల..’కవిత ప్రసిద్ధి చెందింది. ఇదే కవిత ఆధారంగా ‘పోరు తెలంగాణ’ సినిమాలో పాటగా చిత్రీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నందిని సిధారెడ్డికి నంది అవార్డును ప్రకటిం చింది. తనను రాష్ట్ర సాహిత్య అకాడమీకి చైర్మన్గా నియమించిన కేసీఆర్, చొరవచూపిన హరీశ్రావుకు సిధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్య రుణం తీర్చుకుంటా: సిధారెడ్డి ‘‘సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా సాహిత్య సేవ చేసే అవకాశాన్ని నాకు అందించారు. ఈ పదవి కంటే అకాడమీ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరినందుకు సంతో షంగా ఉంది’’అని నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించింది. ‘‘తెలంగాణ వచ్చినా సాహిత్య అకాడమీ లేదన్న బాధ ఇన్ని రోజుల పాటు ఉండేది. అకాడమీని ఏర్పాటు చేస్తే న్యాయం జరిగేదన్న నా అకాంక్షను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. బాధ్యత అప్పగించారు. సీఎం ఇచ్చిన ఈ అవకాశంతో తెలంగాణ సాహిత్య రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా’’అని సిధారెడ్డి పేర్కొన్నారు. -
'వెనక్కి ఇవ్వడం అగౌరవపర్చడమే!'
తిరువనంతపురం: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ ప్రముఖ రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భిన్నంగా స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అండగా నిలబడే హక్కు రచయితలకు ఉందంటూనే.. వారు అవార్డులు వాపస్ ఇవ్వడం ఖండించారు. పురస్కారాలను వెనక్కి ఇవ్వడమంటే.. ఆ గుర్తింపును అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. 'పలువురు రచయితలు అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడంపట్ల వ్యక్తిగతంగా నేను చింతిస్తున్నాను. మేధస్సు,సాహిత్యం, సృజనాత్మకత, విద్య పాండిత్యానికి గుర్తింపు ఈ పురస్కారం. ఇది రాజకీయ చర్య కాదు' అని ఆయన గురువారం మిక్కడ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. 'సాహిత్య అకాడమీ ఒక స్వతంత్ర సంస్థ. మనకున్న ఆందోళన రాజకీయపరమైనది. రచయితలు ఈ రెండింటి మధ్య గందరగోళపడొద్దు. ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పాటుపడాల్సిందే. అంతేకానీ.. పురస్కారాలను అగౌరవపరచవద్దు' అని ఆయన పేర్కొన్నారు. -
సాహిత్య అకాడమీకి గుడ్ బై!
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న అసహనం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తుండటంపై మరో రచయిత్రి నిరసనబాటపట్టారు. దేశంలోని ఈ అశాంతిపూరితమైన వాతావరణాన్ని నిరసిస్తూ ప్రముఖ నవలా రచయిత్రి శశి దేశ్పాండే కేంద్ర సాహిత్య అకాడమీ జరనల్ కౌన్సిల్కు రాజీనామా చేశారు. ఇదేకారణంతో ఇప్పటికే ప్రముఖ రచయితలు నయనతార, కవి అశోక్ వాజపేయి తమకు లభించిన సాహిత్య పురస్కారాలను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. దేశంలో సృజనాత్మక స్వేచ్ఛకు గడ్డుకాలం దాపురించడం, కళాకారులపై దాడులు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఉర్దూ నవలా రచయిత రెహమాన్ అబ్బాస్ కూడా తనకు ప్రదానం చేసిన మహారాష్ట్ర ఉర్దూ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వాపస్ ఇస్తానని ప్రకటించారు. సమాజంలో చుట్టూ జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హేతువాద రచయిత ఎంఎం కల్బుర్గి హత్యపై సాహిత్య అకాడమీ మౌనం వహించడం తనను తీవ్రంగా కలిచివేసిందని అకాడమీ చైర్మన్కు రాసిన లేఖలో శశి దేశ్పాండే ఆవేదన వ్యక్తం చేశారు. 'రాజీనామా చేసినందుకు బాధగానే ఉంది. అయినా కేవలం కార్యక్రమాలు నిర్వహించడం, పురస్కారాలు ఇవ్వడే మాత్రమే కాకుండా భారతీయ రచయితలకు వాక్, రచన స్వేచ్ఛకు సంబంధించి కూడా సాహిత్య అకాడమీ కృషి చేస్తుందనే ఆశతో ఈ పనిచేశాను' అని ఆమె తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement