-
కావూరి చూపు.. టీడీపీ వైపు
ఏలూరు, న్యూస్లైన్: మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయూనికి వచ్చిన ఆయన ఆది వారం వట్లూరు సమీపంలోని సీతారామ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నా యకులతో బయటపెట్టించారు. ఇదే సం దర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియో జకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపిం చారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయా లి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ ేయూలని సూచించారు. చివరకు ఎక్కు వ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు పేర్కొన్నారు. ఇంట్లో సమాలోచనలు.. సభలో హైడ్రామా అభిప్రాయ సేకరణకు ముందే కావూరి ఏలూరులోని తన క్యాంపు కార్యాల యంలో అనుయూయులతో మంతనాలు సాగించారు. సభలో ఎవరు, ఏం మాట్లాడాలనే విషయమై దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణరుుంచిన ప్రకారం వేదికపైకి సామాజిక వర్గాల వారీగా నాయకుల్ని పిలిచి మాట్లాడిం చారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ట్రస్టు ద్వారా లబ్ధి పొం దినవారే ఊకదంపుడు ప్రసంగాలు చేయ టం విమర్శలకు తావిచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, చావా రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గారపాటి రామసీత, తూతా లక్ష్మణరావు, ముసునూరి నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన కోసం కావూరి పనిచేశారని, ఆయన ఏ పార్టీవైపు నడిస్తే అటువైపు సాగుతామని కొందరు, ఏ పార్టీలో చేరినా మీ వెంట సాగుతామని ఇంకొందరు పేర్కొన్నారు. త్వరలోనే నిర్ణయం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కావూరి కాంగ్రెస్ పెద్దల అసమర్ధత కారణంగానే రాష్ట్రం విడిపోయిం దన్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రి పద వి ఇచ్చే విషయమై రాజీవ్గాంధీ నిర్ణయానికి కొందరు అడ్డుపడ్డారని ఆవేదన వ్య క్తం చేశారు. 2004లో మంత్రి పదవి రాలేదని బాధపడ్డానని, 2009లో మనోవేదనకు గురయ్యానని చెప్పారు. పార్టీ సిద్ధాం తాలకు అనుగుణంగా పనిచేసినా గౌరవం దక్కలేదని వాపోయూరు. త్వరలో అందరికీ సంతృప్తినిచ్చే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సమావేశంలో మాగం టి వీరేంద్రప్రసాద్ (బబ్బు), కలిపిండి అప్పారావు, పెరికే వరప్రసాదరావు, కొత్త సాంబశివరావు, బొమ్మి ప్రభాకర్, సైదు సత్యనారాయణ, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, పులి శ్రీరాములు, కారే బాబూరావు, కత్తి రాములు పాల్గొన్నారు. మాగంటి అనుచరుల ఆరా ఇదిలావుండగా, టీడీపీలోకి కావూరి రాకను వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అనుచరులు ఈ సభపై కన్నేసి ఉంచారు. సమావేశంలో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారనే విషయూలపై ఆరా తీశారు. -
సమైక్యతాశక్తి జగన్
=సమైక్యాంధ్ర బహిరంగ సభలో కొణతాల =వైఎస్ లేకనే ఆంధ్రకు ఈ అన్యాయం =జగన్కు భయపడి కేంద్రం విభజన కుట్ర =జననేతకు అండగా నిలవాలని పిలుపు అరకు/అరకు రూరల్, న్యూస్లైన్: ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏకైక వ్యక్తి, శక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. ఇక్కడి గిరిజన మ్యూజియం ముఖద్వారం ఎదురుగా అరకు నియోజకవర్గ సమన్వయకర్తలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి దొన్నుదొరల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సమైక్యాంధ్ర బహిరంగ సభ మంగళవారం నిర్వహించారు. సభలో కొణతాల మాట్లాడుతూ, మహానేత వైఎస్ అనంతర పరిస్థితులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని చెప్పారు. ఆయన లేకపోవడంతోనే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజన సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభంజనానికి భయపడే విభజనకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన బెటాలియన్ ఏర్పాటుకు వైఎస్ సుముఖత వ్యక్తం చేసి 300 మందికి ఉద్యోగాలు ఇప్పించారని చెప్పారు. జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు. కాఫీ సాగు చేస్తున్న గిరిరైతులు బాగుపడడంలేదు కానీ దాని వల్ల కేంద్ర మంత్రి జైరాం రమేష్ లబ్ధిపొందుతున్నారని చెప్పారు. మరో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విశాఖ రాజధాని చేయాలని చెబుతున్నారని, ప్రజలకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే వైఎస్సార్ విధానాలు అమలవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఉంటే, ఏపీలో మాత్రం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని చెప్పారు. పెందుర్తి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు. అంతకు ముందు ఎన్టీఆర్ గ్రౌండ్నుండి భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హుకుంపేట మండలం శోభకోట సర్పంచ్ ప్రధాని కనకాలతో పాటు నలుగురు వార్డు సభ్యులు పార్టీలో చేరారు. కొణతాల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ నాయకుడు పీవీజీ కుమార్, యువజన విభాగం కన్వీనర్అదీప్రాజు, ఆరు మండలాల నుంచి పలువురు సర్పంచ్లు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. -
నేటి నుంచి 8 గంటల విద్యుత్ కోత!
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యోగులు, సిబ్బంది సమ్మె ఫలితంగా ఎన్టీటీపీఎస్లో 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రాయలసీమ థర్మల్ పవర్, సీలేరు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి స్తంభిం చింది. విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. సబ్స్టేషన్లకు వస్తున్న విద్యుత్ను నిలిపివేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విద్యుత్ కోత వేళలు ఇవీ... జిల్లా వ్యాప్తంగా మంగళవారం 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధించాలని విద్యుత్ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని గ్రామాలు, పట్టణాలతోపాటు విజయవాడలోనూ కోత అమలులో ఉంటుంది. ఈ కోతలను నిరవధిక సమ్మె ఆపే వరకు కొనసాగిం చాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. విజయవాడలో సోమవారం ఆరు గంటల కోత విధించడంతో రిజర్వాయర్లకు నీరు అందక మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ జి.పండాదాస్ దృష్టికి విద్యుత్ కోతలు తొలగేవరకూ సాయంత్రం నీటి సరఫరా నిలిపివేయాలని అధికాలను ఆదేశించారు. విద్యుత్కోతల వల్ల నగరంలోని చిన్న ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవడంలేదని తెలిసింది. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు జనరేటర్ల సంఖ్యను పెంచుకున్నారు. కోతల కారణంగా ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడిందని వైద్యులు తెలిపారు. వేసవిలో విద్యుత్ కోతలతో తీవ్ర నష్టాలను చవిచూసిన పరిశ్రమలు తిరిగి సంక్షోభంలోకి చేరుతున్నాయి. ఆటోనగర్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉండదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 5 వేల పరిశ్రమలు పడే అవకాశం ఉంది. 65 రోజులుగా బంద్లతో అంతంత మాత్రంగా సాగుతున్న వ్యాపారాలపైనా విద్యుత్కోతల ప్రభావం పడనుంది. కోతలు కారణంగా ఏటీఎంలు, బ్యాంకులు సరిగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అనేక ఏటీఎంల వద్ద ‘అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ తగి నంత అందుబాటులో లేకపోవడంతో డీజిల్ ఇంజిన్లతో రైళ్లను నడుపుతున్నారు. దీంతో మూడు నాలుగు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ప్రశాంతి, రత్నాచల్, తిరుపతి తదితర రైళ్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం కూడా అనేక రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. దుర్గగుడి, ప్రభుత్వాస్పత్రికి విద్యుత్ కోతల నుంచి మినహాయింపు దసరా ఉత్సవాలు జరుగుతున్నందున దుర్గగుడికి, అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రి, హెడ్వాటర్ వర్క్స్, మిల్క్ప్రాజెక్టు తదితర సంస్థలకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలో విద్యుత్శాఖలో 2000 మంది కాంట్రాక్టు సిబ్బంది పని చేస్తున్నారు. వీరంతా సబ్స్టేషన్లు వద్ద ఆపరేటర్లుగా, కంప్యూటర్ విభాగం, సాఫ్ట్ బిల్లింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వీరు కూడా సమ్మె బాట పట్టడంతో ఇబ్బందులు మరింత పెరిగాయని అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో చీకట్లు
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె ప్రభావం తీవ్ర రూపం దాల్చబోతోంది. ఫలితంగా అటు పరిశ్రమకు, ఇటు గృహ, వాణిజ్యావసరాలకు కూడా విద్యుత్ కష్టాలు మొదలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేసే పరిస్థితి లేదు. ఆరు నూరైనా సమ్మె విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ ఉద్యోగులు తేల్చి చెప్పడంతో అధికార యంత్రాంగం దేవుడి మీదే భారం వేసింది. ఉద్యమం వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో దూర ప్రయాణాల కోసం రైళ్లను నమ్ముకున్న జనానికి అవి ఎక్కడికక్కడ ఆగిపోవడం, అనేకం రద్దు కావడంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఈపీడీసీఎల్ అధికారులు తమ పరిధిలోని జిల్లాల్లో అనధికారిక విద్యుత్ కోతలకు తెర లేపారు. విశాఖ స్టీల్ ప్లాంటుకూ సమైక్య సెగ తగలనుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు. కరెంటు లోటు ఈపీడీసీఎల్ పరిధిలో రోజుకు 1500 నుంచి 1700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఇప్పుడు రోజుకు 1215 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. బంద్ కారణంగా డిమాండ్ కొద్దిగా తగ్గినప్పటికీ ఆదివారం నుంచి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అనధికారిక కోతలకు తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 4 గంటలు, పట్టణ ప్రాంతాల్లో సైతం గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె తీవ్ర రూపం దాల్చి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే ఈ ప్రభావం తమ మీద కూడా ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 5వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఆదివారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో 7,500 మంది సమ్మెలోకి వెళ్లనుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేదని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉక్కుకు సమ్మె ముప్పు విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నప్పటికి ట్రాన్స్కో నుంచి రోజుకు 50 నుంచి 60 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. దీనికి తోడు ఆదివారం ప్లాంట్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్లాంట్లో జీరో యూనిట్ సమస్య ఏర్పడి ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో రెండు రోజుల పాటు స్టీల్ ప్లాంటుకు రోజుకు 160 నుంచి 180 మెగావాట్ల విద్యుత్ను ట్రాన్స్కో అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది సమ్మె కారణంగా విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో ఇంత మోతాదులో విద్యుత్ సరఫరా చేయలేమని ట్రాన్స్కో అధికారులు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. దీంతో స్టీల్ ప్లాంట్ అధికారులు ఉత్పత్తి సామర్థ్యం తగ్గించుకునే ఆలోచనలో పడ్డారు. నేటి నుంచి ఆర్ఈసీఎస్ సమ్మెబాట కశింకోట : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ట్రాన్స్కో సిబ్బంది చేపట్టిన సమ్మెకు మద్దతుగా సోమవారం నుంచి ఆర్ఈసీఎస్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఆర్ఈసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కోశాధికారి దొడ్డి ఈశ్వరరావు ఈ విషయాన్ని తెలిపారు. సమ్మెవల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సమ్మెకు సహకరించాలని కోరారు. సీలేరులో సమ్మె సైరన్ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం ఉద యం 6 గంటల నుంచి ఇంజినీర్లు, నాన్ఇంజినీరింగ్ విభాగాల్లోని 250మంది ఉద్యోగులు విధులను బహిష్కరించనున్నారు. దీంతో సీలేరులో నాలుగు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోనుంది. పరవాడ ఎన్టీపీసీ పూర్తి సామర్థ్యం రెండు వేల మెగావాట్లు కాగా, బొగ్గు సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పుడు మొదటి యూనిట్లో 379, రెం డో యూనిట్లో 382, మూడో యూనిట్లో 374, నాలుగో యూ నిట్లో 378 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఒడిశాలోని మహానది బొగ్గు గనుల నుంచి 28వేల మెట్రిక్టన్నుల బొగ్గు సరఫరా కావా ల్సి ఉండగా 22 నుంచి 24వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తోం ది. సోమవారం ఇందులో కూడా కోతపడే ప్రమాదం కనిపిస్తుండడంతో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 1500 మెగావాట్లలో కూడా ఒక యూనిట్ను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. -
20 ఏళ్ల తర్వాత జిల్లాలో కర్ఫ్యూ
విజయనగరం కలెక్టరేట్/ కంటోన్మెంట్, న్యూస్లైన్ : జిల్లాలో 20 ఏళ్ల తరువాత మళ్లీ కర్ఫ్యూ అమలవుతోంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లిమర్ల జూట్మిల్లు వద్ద 1993లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీనిలో భాగంగా కాల్పులు జరగడంతో పోలీసు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత కాలంలో అటువంటి పరిస్థితులు జిల్లాలో తలెత్తలేదు. మళ్లీ 20 ఏళ్ల అనంతరం విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ ప్రకటించారు. బొత్స పుణ్యమా అంటూ జిల్లాలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. తమ స్వార్థకోసం ప్రజలను సమిధలుగా చేసి... తన వాఖ్యలతో సమైక్య మంటలు రేపిన బొత్స పరోక్షంగా ప్రజావినాశనానికి తెరలేపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సమైక్య నినాదం వినిపిస్తున్నా.. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, అతని సతీమణి ఎంపీ ఝాన్సీలు సమైక్యవాదాన్ని వినిపించకపోగా అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీనికి తోడు రెండు రోజులుగా బొత్స చేస్తున్న వ్యాఖ్యలతో పాటు అతని మేనల్లుడు చిన్నశ్రీను.. గుండాలతో సమైక్య ఉద్యమకారులపై దాడులు చేయించడంతో జిల్లాలో పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఉద్యమకారులు విధ్వంసాలు సృష్టిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం జరిగిన సమైక్య ఉద్యమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అర్ధరాత్రి వరకూ ఆందోళనలు చల్లారలేదు. పరిస్థితి పోలీసుల చేయిదాటిపోయింది. రాత్రి గడుస్తున్న కొద్దీ విధ్వంసాలు.. మరో వైపు పోలీసుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతున్న విషయాన్ని గమనించిన ఐజీ ద్వారకాతిరుమలరావు... కర్ఫ్యూను ప్రకటించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఉద్యమ వేడిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలెవ్వరూ రహదారులపై సంచరించవద్దంటూ సూచించారు. ఎవరైనా ఆందోళనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న ప్రాంతాలను పోలీసులు ఆ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడతాయి. నిత్యావసర సరుకులు సైతం దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే రెండు రోజులుగా జిల్లా బంద్ నేపథ్యంలో ఇక్కట్లు పడుతున్న జిల్లా వాసులకు కర్ఫ్యూ ప్రకటన గోరు చుట్టుపై రోకటి పోటు అన్న చందంగా మారింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
సీఎస్కే బౌలర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్గా
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement