-
నాయకుడంటే జగన్లా ఉండాలి..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించి ప్రజలకు మంచి పాలన ఇచ్చే సత్తా ఒక్క జగన్కే ఉంది. యువశక్తికి ప్రతినిధి జగన్. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదాకైనా పోరాడతారు. ఎవరి మద్దతున్నా, లేకున్నా అనుకున్నది సాధించేవరకు విశ్రమిం చరు. సమైక్యరాష్ట్రం కోసం చివరిక్షణం వరకు పోరాడింది జగనే. నాయకుడంటే అలా ఉండాలి. ఇంకో ముఖ్య విషయం... ఐ హేట్ కాంగ్రెస్. రాష్ట్రాన్ని, దేశాన్ని అధోగతి పాల్జేసిన కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రజలకు మంచి జీవితం కావాలంటే మంచి నేతను ఎన్నుకోవాలి. జగన్లాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం. -
ఆగని పోరు
సాక్షి, కడప : స్వాతంత్య్ర దినోత్సవం రోజున భరతమాతకు జనమంతా జేజేలు పలుకుతూనే రాష్ట్ర విభజన చిచ్చుపై జిల్లాలో విభిన్న రీతిలో ఆందోళనలు చేశారు. తెలుగుజాతిని విడదీయొద్దంటూ రోడ్డెక్కి నినదించారు. సమైక్య ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రజలు విశ్రమించడం లేదు. దీనికితోడు ఉద్యోగులు సమ్మె అస్త్రం సంధించడంతో పోరాటం పతాక స్థాయికి చేరింది. మరోవైపు విద్యార్థి లోకం వ్యాపార, వాణిజ్య వర్గాలు,వివిధ వివిధ సంఘాలు సమక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా గర్జిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆపబోమని హెచ్చరిస్తున్నారు. కడపలో నగర పాలకసంస్థ ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి, సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్బాబు నల్ల బ్యాడ్జీలతో గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాతోపాటు సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి దీక్షలు గురువారంతో నాల్గవ రోజు పూర్తయ్యాయి. వీరికి సంఘీభావంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు, మహిళలుతరలి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం మార్మోగిపోయింది. వైఎస్సార్సీపీ సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆటాపాటా సమైక్య వాదులను ఆకట్టుకుంది. దీక్షలకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, సురేష్బాబు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. రిమ్స్ వైద్యులు సురేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉపాధ్యాయ దీక్షా శిబిరాల వద్ద వరలక్ష్మీవ్రతాలు చేపట్టాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జమ్మలమడుగులో వర్షంలోనే పాఠశాలల విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ వినూత్న రీతిలో తమ నిరనన తెలియజేశారు. మోరగుడిలో వంటా వార్పు చేపట్టారు. మాలమహానాడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఎర్రగుంట్లలో 10వరోజు రిలే దీక్షలు టైలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్టీపీపీ ఎస్ఈ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు కడపలో దీక్షలు చేస్తున్న వారికి తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రొద్దుటూరులోశాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్లో రోడ్డుపైనే కుండలు తయారు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తహశీల్దార్లు డప్పుకొట్టి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, స్వర్ణకారుల సంఘం, శారద జూనియర్ కళాశాల సిబ్బంది వేర్వేరు చోట్ల రిలే దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రికల్ వ్యాపారులు 67 అడుగుల జాతీయ జెండాను తయారు చేసి పట్టణంలో ఊరేగించారు. వైఎస్సార్సీపీ నేత రాచమల్లు ప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద సమైక్య జెండాలను ఎగురవేశారు. పులివెందులలో వడ్డెర సంఘం, టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యాధరి, అస్లం టెక్నో స్కూలు విద్యార్థులు రోడ్డుపైనే కరాటే, సాంసృ్కతిక కార్యక్రమాలు చేపట్టారు. పూల అంగళ్ల సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వేంపల్లెలో పోలీసు సంఘం ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్గేట్ సర్కిల్లో గురువారం ఆమరణ దీక్షకు చేపట్టారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పంజం సుకుమార్రెడ్డితోపాటు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లతోపాటు పెద్ద ఎత్తున ప్రజలు దీక్షకు సంఘీభావం తెలియజేశారు. జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ దీక్షల్లో పాల్గొని మాట్లాడారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఉదయం మన్నూరు ఎల్లమ్మ గుడి నుంచి పాత బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్, దిగ్విజయ్ల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి తగులబెట్టారు. కళాకారులు జాతీయ నాయకుల వేషధారణతో ఆకట్టుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి దీక్షలకు తమ మద్దతు తెలిపారు. చంద్రబాబు తెలంగాణకు మద్దతుగా ఇచ్చిన లేఖను రఘురామిరెడ్డి విడుదల చేశారు. బద్వేలులో జేఏసీ ఆద్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. మెప్మా, మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విత్తన వ్యాపారుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగాయి. కమలాపురం పంచాయతీ కార్యాలయంలో గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైదుకూరులో న్యాయవాదులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. విద్యార్థులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలో పలువురు ఆకర్షించారు. రాయచోటిలో ఆర్టీసీ కార్మికుల, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
నేటి నుంచి ఆకేపాటి, కొరముట్ల ఆమరణ దీక్ష
రాజంపేట/ రైల్వేకోడూరు రూరల్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం గురువారం నుంచి ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆకేపాటి రాజంపేటలోఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే సమైక్య రాష్ట్రం కోసం ఆకేపాటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర విషయంలో యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలనే సంకల్పంతోనే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఉదయం పది గంటల నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్ష ప్రారంభం కానుంది. తొలుత రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే ఆమరణ దీక్షకు కూర్చోనున్నారు. అలాగే సమైక్యాంధ్రకోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. స్థానిక వైఎస్ఆర్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. రైల్వేకోడూరులోని వైఎస్ఆర్ సర్కిల్ టోల్గేట్ వద్ద ఉదయం 10 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభమవుతుందన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణను ప్రకటించడం వలన రాష్ట్రం రావణకాష్టంలా తయారైందన్నారు. ఈ రావణ కాష్టంలో రాష్ట్ర విభజనకు పాల్పడినవారు కాలిపోక తప్పదన్నారు. అధికారపార్టీ దిగివచ్చి నిర్ణయం మార్చుకునేంతవరకు ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లోన గుబులు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
బైక్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్
పెంచలకోన ఆలయానికి భారీ ఆదాయం
సేవాతత్పరుడు జేఎస్ రెడ్డి
భార్య లేదన్న మనస్తాపంతో..
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
తప్పక చదవండి
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- ‘వర్జిన్ ఓటర్’గా మిగలకండి!
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- ‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
- గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
- మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement