-
రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాల తీరుపై శివసేన అసహనం
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో శివసేన పార్టీ.. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికలను ఇకనైనా సీరియస్గా తీసుకోవాలంటూ సూచించింది. బలమైన రాష్ట్రపతినే ఎంపిక చేయడంలో తడబడితే.. రాబోయే రోజుల్లో ప్రధానికి సమర్థవంతమైన అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారంటూ విపక్షాలకు శివసేన సూటి ప్రశ్న సంధించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. పవార్ కాకపోతే.. ఇంకెవరు?. అభ్యర్థి విషయంలో కనీసం ఆరు నెలల ముందు నుంచైనా మంతనాలు జరపాల్సింది. ఇప్పుడు చర్చించడం వల్ల ఈ ఎన్నికలను తేలికగా తీసుకున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించినట్లయ్యింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇంత చర్చలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని అభ్యర్థిగా.. అది సమర్థుడిని ఎలా నిలబెడతారు? అని ప్రజలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. గోపాకృష్ణగాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా.. ఇలా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎప్పటిలా వినిపించే పేర్లే ఈసారి వినిపిస్తున్నాయి. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరూ కనిపించడం లేదా అని విపక్షాలను పశ్నించింది శివసేన. అదే సమయంలో బలమైన అభ్యర్థి కోసం కేంద్రం కూడా పెద్దగా ఆలోచన చేయడం లేదని అనిపిస్తోంది. ఐదేళ్ల కిందట.. రామ్నాథ్ కోవింద్ పేరును ఇద్దరు ముగ్గురు మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని విపక్షాలకు సూచించింది శివసేన. -
Sivasena: శభాష్ చౌహన్జీ.. దేశానికి మార్గం చూపారు
ముంబై: ప్రస్తుత కరోనా సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్ర సేవలను ప్రశంసించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు అభినందనలు తెలిపింది. ఒక బీజేపీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు పింఛన్ రూపేణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై తాజాగా శివసేన స్పందించింది. ఆ పార్టీ గొంతుకగా భావించే ‘సామ్నా’ పత్రికలో మధ్యప్రదేశ్ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ సంపాదకీయం ప్రచురించింది. ఈ పిల్లల బాధ్యత చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలపడం అభినందనీయమని శివసేన కొనియాడింది. ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామనడంపై అభినందించింది. (‘సామ్నా’ సంపాదకీయం చదవండి) ‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో శివసేన పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్ప్రభుత్వం ఒక మార్గం చూపిందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా’ ప్రాజెక్ట్ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అవనసరంగా శివసేన ‘సామ్నా’లో స్పష్టం చేసింది. -
గెలిపిస్తే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు..
సాక్షి, ముంబై: అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై శివసేన తమ సామ్నా పత్రికలో స్పందించింది. ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే అది ఇష్టారీతిన వ్యవహరించడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించింది. పటేల్ పేరును చరిత్ర నుంచి తొలగించడానికి గాంధీ–నెహ్రూ కుటుంబాలు కుట్రలు చేస్తున్నాయని గత ఐదేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయని, కానీ వాస్తవంగా ఆ కుట్రలు ఎవరు చేస్తున్నారో స్టేడియం పేరు మార్పుతో ఇప్పుడు స్పష్టమైందని మండిపడింది. ఈ మేరకు శివసేనకు చెందిన పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. పెద్దవన్నీ గుజరాత్లోనే ఉండాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోందని పేర్కొంది. అందులో తప్పు లేనప్పటికీ తాము దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని చురకలంటించింది. ఇన్నాళ్లూ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉండేదని, ఇప్పుడు అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం పేరును మోదీ పేరుతో మార్చాక నరేంద్ర మోదీ స్టేడియమే ప్రపంచంలో పెద్దదని తెలిపింది. మోదీ గొప్ప నాయకుడే.. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని, కానీ మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీల కంటే గొప్ప నాయకుడని అంధ అనుచరులు భావిస్తే అది మరో స్థాయి గుడ్డి నమ్మకం అవుతుందని పేర్కొంది. మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారని అభిప్రాయం వ్యక్తం చేసింది. మోదీ చాలా ప్రజాదరణ గల నాయకుడని, ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతుందని రాసుకొచ్చింది. పటేల్, నెహ్రూలకు కూడా జనాల నుంచి మంచి మద్దతు లభించిందని, దాంతో వారు దేశాభివృద్ధికి పునాది వేశారని వివరించింది. ఐఐటీలు, బార్క్, భాక్రానంగల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను నెహ్రూ జాతికి అంకితం చేశారని, కానీ మోదీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించింది. సర్దార్ పటేల్ పేరిట ఉన్న స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరు మీదకు మార్చుకున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పుడు పటేల్.. రేపు నేతాజీ.. నిన్న మొన్నటి వరకు పటేల్ను ప్రశంసించినవారు ఇప్పుడు స్టేడియం పేరు మార్పు విషయానికి వచ్చేసరికి వ్యతిరేకిస్తున్నారని సామ్నా పత్రిక తమ సంపాదకీయంలో దుయ్యబట్టింది. నేటి రాజకీయాల్లో పటేల్ ప్రాముఖ్యతను ఎలా తగ్గించారో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్కు కూడా ఇలానే చేస్తారని మండిపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ పేరును కూడా వాడుకున్నారని గుర్తుచేసింది. సర్దార్ పటేల్ తీసుకొచ్చిన ఏ పాలసీలను ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందో చెప్పాలని ప్రశ్నించింది. రైతుల హక్కుల కోసం పటేల్ బార్దోలి సత్యాగ్రహం ముందుండి నడిపించారని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని అడిగింది. బార్దోలి సత్యాగ్రహం ముగిసిన రెండేళ్ల తర్వాత కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ తాను రైతునని ప్రకటించుకున్నారని తెలిపింది. బహుశా అందుకేనేమో.. గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు సర్దార్ పటేల్ను ప్రశంసిస్తున్నారని పేర్కొంది. బహుశా అందుకే మొతేరా క్రికెట్ స్టేడియం పేరును మార్చి పటేల్ పేరును తుడిచేద్దామని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ ప్రజలు కోరుకున్నది ఇదేనని, గుజరాత్ పౌరులు ఈ మార్పును అంగీకరించారని వ్యాఖ్యానించింది. గుజరాత్ ప్రజలకు వల్లభ్భాయ్ పటేల్ పట్ల గౌరవం లేకపోతే, ఈ నిర్ణయాన్ని విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు కూడా లేదని అభిప్రాయపడింది. -
‘బీజేపీ ప్లాన్ ప్రకారమే దారి మళ్లించింది’
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత రైతు సంఘాల మధ్య చీలికలు ఏర్పడి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓ పథకం ప్రకారమే రైతుల ఉద్యమం హింసాయుతంగా మారేలా చేశాయని శివసేన ఆరోపించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో కేంద్రం తీరును ఎండగడుతూ పలు విమర్శలు చేసింది. ‘‘కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమంలో ఎలాంటి చీలికలు రాలేదు.. వారు సహనం కోల్పోలేదు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం.. విదేశాల్లో సైతం మోదీ ప్రభుత్వం పట్ల విమర్శలు రావడంతో కేంద్రం ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసింది. దాంతో ఉద్యమంలో హింస చేలరేగేలా చేసి దారి మళ్లేలా చూసింది’’ అంటూ శివసేన ఆరోపించింది. ‘‘కర్రలతో ఉన్న రైతులను మోదీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంది.. మరి ‘‘గోలీ మారో’’, ‘‘ఖతం కరో’’ అని నినాదాలు చేసిన వ్యక్తులు మాత్రం ఇంకా మోదీ క్యాబినేట్లోనే ఉన్నారు.. వారి సంగతి ఏంటి’’ అని ప్రశ్నించింది. (చదవండి: నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం) ఇక ‘‘గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింసలో బీజేపీ పాత్ర ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ రైతులు ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి.. దారి మళ్లించింది. ఉగ్రవాదులు ఆందోళన చేపట్టారు. ఇక ఎర్రకోట వద్ద హింస చేలరేగడానికి ప్రధాన కారకుడు దీప్ సిధు. అతడికి బీజేపీతో సంబంధం ఉంది. పంజాబ్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్కి, దీప్ సిధుకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సిధు గత రెండు నెలలుగా రైతులను రెచ్చగొడుతున్నాడని.. కానీ వారు సమన్వయం కోల్పోలేదని రైతుల సంఘాల నాయకులు పలువురు వెల్లడించారు’’ అంటూ శివసేన సామ్నాలో రాసుకొచ్చింది. ఇక ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు కేవలం రైతుల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరైంది కాదని శివసేన అభిప్రాయ పడింది. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో అదే చేసి చూపింది. ఫలితంగా రైతులు, పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా హింసను ప్రోత్సాహించలేము అని తెలిపింది. -
స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్ తన చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల ఆశ్వీరాదాలు తమ ప్రభుత్వానికి ఉన్నాయని, ఇక ఈడీ, సీబీఐలతో భయమెందుకని? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. 2019 నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహావికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం కొలువుదీరి నేటితో ఏడాది పూర్తయిన నేపథ్యంలో శివసేన ముఖపత్రిక ‘సామ్నా’కు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సామ్నా సంపాదకుడైన శివసేన నేత సంజయ్ రౌత్ తీసుకున్న ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై సీఎం ఉద్ధవ్ మాట్లాడారు. ముఖ్యంగా ఈడీ, సీబీఐ దాడులు, ప్రతిపక్షాల ఆందోళనలపై తనదైన శైలిలో అందరికి వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఘాటైన సమాధానాలిచ్చారు. మహావికాస్ అఘాడి కూటమి గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ‘ఇప్పుడు పడిపోతుంది.. అప్పుడు పడిపోతుంది’అంటూ తరచూ కలలు కంటున్నాయన్నారు. కానీ వారం రోజుల్లో పడిపోతుందని, తాము ప్రభుత్వాన్ని కూలుస్తామని పేర్కొన్న ప్రతిపక్షాలు చూస్తుండగానే తమ ప్రభుత్వం విజయవంతంగా మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోందని ఉద్దవ్ పేర్కొన్నారు. ఈడీ, ఇతర కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ తమపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కుటుంబం, పిల్లల వెంటపడి పైశాచికానందం పొందే వాళ్లకు తమకు కూడా పిల్లలు, కుటుంబం ఉందన్న సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. కానీ తమకు సంస్కారం ఉందని, అందుకే తాము శాంతంగా, సహనంతో ఉన్నామన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇలా అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో సీఎం ఉద్ధవ్ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. (రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి) పవార్ తమకు మార్గదర్శి... ‘ముఖ్యమంత్రి అయినప్పటికీ నా కాళ్లు భూమి మీదనే ఉన్నాయి. అదేవిధంగా బండికి క్లచ్, బ్రేక్లు, ఎక్సిలేటర్తో పాటు స్టీరింగ్ కూడా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బండికి కూడా అన్ని ఉన్నాయి, దాని స్టీరింగ్ కూడా నా వద్దే ఉంది’అంటూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఉద్ధవ్ ఠాక్రే సమాధానమిచ్చారు. శరద్ పవార్ తమకు మార్గదర్శకులని, రిమోట్ కంట్రోలర్ కాదని కూడా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది జరగని పని అని ముందు అంతా భావించారు, కానీ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలోని అనుభవమున్న నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కలిసి పనిచేయగలరా అని అనేక ప్రశ్నలు అందరి మదిలోనా మెదిలాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రితో భేటీ కంటే ముందు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో భేటీ అవుతారని, ఆయనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారా..? తదితర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు..? ఉద్ధవ్ ఠాక్రేనా..? లేక అజిత్ పవారా? అంటూ బహుజన్ అఘాడీ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఇటీవలే ప్రశ్నిస్తూ ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో తనదైన శైలిలో ఈ ప్రశ్నలన్నింటికీ ఉద్ధవ్ సమాధానం ఇచ్చారు. అందరి సహకారంతో తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అందరి సహకారంతో నడుస్తున్నప్పటికీ, ప్రభుత్వ స్టీరింగ్ మాత్రం తన చేతిలోనే అంటే తన నేతృత్వంలోనే నడుస్తుందన్నది అందరికీ తెలిసేలా చెప్పారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం.. రాష్ట్రంలో అందరి సహకారంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కరోనా మహమ్మారి వచ్చిందని, అయితే గత సంవత్సరం కాలంలో మిత్ర పక్షాలు, ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించారని ఉద్ధవ్ చెప్పారు. ఇందుకు ఆయన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మా మిత్ర పక్షాల నేతలతో పాటు ఇతర సహకార పార్టీలు కూడా తమ వంతు సహకరించాయన్నారు. (ప్రమాదకరంగా సెకండ్ వేవ్) ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేది.. తమ నానమ్మ (శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ ఠాక్రే తల్లి) తన పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేదని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. అయితే ఆమె పిల్లలు రాష్ట్రంలో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారని, మనుమలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. హిందుత్వమంటే ఆలయంలో గంట కొట్టడం కాదు హిందుత్వం అంటే ఆలయాల్లో గంట కొట్టడం కాదని, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించేలా చేయడమని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలోని మట్టికి హిందుత్వాన్ని ఎవరూ నేర్పించవద్దు. ఎందుకంటే కాషాయ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించారు. నేను శివసేన అధినేత, మా తాతల హిందుత్వ సిద్ధాంతాలను నమ్ముతాను. వారు మనకు ఆలయాల్లో గంట కొట్టేవారు కాదు, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించే హిందువులు కావాలి అనేవారు. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్ర మట్టికి మీరు హిందుత్వం గురించి నేర్పించాల్సిన అవసరం లేదు’అని ఘాటు సమాధానమిచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement