-
సాయాజి షిండే హెల్త్ అప్డేట్ ప్రకటించిన వైద్యులు
ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు. సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Sayaji Shinde (@sayaji_shinde) -
ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు సాయాజి షిండే ఆస్పత్రిపాలయ్యాడు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్ మాట్లాడుతూ.. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు. ఆంజియోప్లాస్టీ దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ చేయాల్సిందేనని చెప్పాం. రెండుమూడు రోజుల క్రితం తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం అని వెల్లడించాడు. బహుభాషానటుడు కాగా సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ సీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి 'యాత్ర 2' -
నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!
షాయాజీ షిండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు పోకిరీ సినిమాలో ఆయన యాక్టింగ్కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పోలీసు ఆఫీసర్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. 'తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు' అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. (ఇది చదవండి: షారుక్ ఖాన్కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ఈ చిత్రంలో పోలీసు అధికారిగా షాయాజీ షిండే చాలా వ్యంగ్యంగా మాట్లాడే సీన్ అప్పట్లో అభిమానులను అలరించింది. ఆ తర్వాత అరుంధతి చిత్రంలో విభిన్నమైన పాత్రలో మెప్పించారు. మహారాష్ట్రకు చెందిన షాయాజీ షిండే తెలుగులో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాయాజీ తెలుగులో నటించండపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షాయాజీ షిండే మాట్లాడుతూ..' నాకు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు. పూరి జగన్నాధ్ నా కెరీర్ను పూర్తిగా మార్చేశారు. పోకిరీ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. పోకిరీ తర్వాతే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. కానీ హిందీలో తెరకెక్కించిన పోకిరీ చిత్రంలో నటించలేకపోయాను. అప్పుడు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి చాలా బాగా మాట్లాడుతారు. మొదటి సారి ఆయన చిత్రంలో నటించేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పండి. మనందరం ఆర్టిస్టులం. మనది ఒకటే ఫ్యామిలీ అని చెప్పేవారు. నన్ను తన కుటుంబ సభ్యునిలాగా చూసుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్రేట్ స్టార్స్గా ఉంటారు.' అని అన్నారు. కాగా.. ఈ ఏడాదిలో ఘర్ బంధుక్ బిర్యానీ చిత్రంలో కనిపించారు. (ఇది చదవండి: మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !) -
ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నిర్మాత సంచలన ఆరోపణలు
ప్రముఖ నటుడు షాయాజీ షిండే టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో ఆ డైలాగ్ ఆయనకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. టాలీవుడ్లో సోలో, సీమ టపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడుతో సహా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయనపై మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అసలేం జరిగిందంటే..: అయితే మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తెరకెక్కిస్తున్న గిన్నాద్ మూవీలో నటించేందుకు రూ.5 లక్షలకు షాయాజి షిండే సంతకం చేశారు. నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నవంబర్ 25, 26 తేదీల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. షాయాజి షిండే అందుబాటులో లేరని నిర్మాత అన్నారు. ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత వెల్లడించారు. నిర్మాత అందుకు ఒప్పుకోకపోవడంతోఆగ్రహించిన షాయాజి సినిమా నుంచి తప్పుకున్నారు. షూటింగ్ ఆగిపోవడంతో చిత్రనిర్మాత సచిన్ తన ఫీజును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినందుకు పారితోషికం రూ. 5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షలు చెల్లించాలని నిర్మాత కోరారు. -
షూటింగ్లో నటిని ఆవహించిన స్వామి
తమిళసినిమా: చిత్ర షూటింగ్లో నటిని ఆవహించిన స్వామి. ఆశ్చర్యానికి గురైన చిత్ర యూనిట్. నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పాండిముని. ఇంతకు ముందు ధనుష్ నటించిన తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్, యారడీ నీ మోహిని వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్కే.ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని. జాకీష్రాప్ అఘోరిగా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో కొత్త నటుడు ఆశీప్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో మేఘలి, జ్యోతి, వైష్టవి, యాషిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో షియాజీ షిండే నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది భయంకరమైన హర్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 70 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని అని చెప్పారు. చిత్ర షూటింగ్ కొత్తగిరిలో నిర్వహిస్తుండగా ఒక ఆశ్చర్య సంఘటన జరిగిందన్నారు. మణకుడిసోలై అ ప్రాంతంలో కుట్టాంసామి అనే గుడి ఉందన్నారు.ఆ ప్రాంత ప్రజలు ఇష్టదైవంగా కొలుసుకుంటారని చెప్పారు. ఆ ఆలయానికి 700 వందల చరిత్ర ఉందని కొందరు, వెయ్యి సంవత్సరాల చరిత్ర అని చెబుతుంటారన్నారు. ఆ ఆలయానికి పాండవులు వచ్చి వెళ్లినట్టు చెబుతారన్నారు. ఒక గృహలాంటి ఆ గుడి వద్ద తాము పాండిముని చిత్ర షూటింగ్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ గుడికి స్త్రీలకు అనుమతిలేదు, కాళ్లకు చెప్పులు వేసుకుని రాకూడదన్న ఆచారాలు ఉన్నట్లు ఆ ప్రాంత నివాసులు తెలిపారన్నారు. దీంతో తాము క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశామని చెప్పారు. మరుసటి రోజు ఆ పరిసర ప్రాంతాల్లో ౖౖషూటింగ్కు రాగా నటి మేఘలికి స్వామి ఆవిహించి ఆడగడం మొదలెట్టిందన్నారు. దీంతో యూనిట్ వర్గాలు దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. వెంటనే ఆ ప్రాంత ప్రజలు వచ్చి పరిహార పూజలు నిర్వహించడంతో నటి మేఘలి నుంచి స్వామి వెళ్లిపోయాడని తెలిపారు. అదే మాదిరి మరో ఆశ్చర్యమైన సంఘటన ఏమిటంటే పనకుడిసోలైలోని కుట్టంసామి ఆలయంపై భాగంలో హెలికాప్టర్ ఎగరలేదన్నారు. ఆలయం చుట్టూ తిరిగిన హెలీకాప్టర్ ఆలయంపై భాగంలో తిరిగకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచిన అంశం అన్నారు. ఆ ప్రాంతంలో ఆశీప్,మేఘలి,జ్యోతి,వైష్ణవి,యాషికలకు సంబంధించిన సన్నివేశాలను, మూడు పాటలను చిత్రీకరించినట్లు తెలిపారు. మొత్తం 25 రోజుల పాటు ఆ ప్రాంతంలో షూటింగ్ను నిర్వహించినట్లు చెప్పారు. తదుపరి షెడ్యూల్లో జాకీష్రాప్ నటిస్తున్న అఘోరి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాత కస్తూరిరాజా తెలిపారు. దీనికి ఛాయాగ్రహణం మధుఅంజట్, సంగీతాన్ని శ్రీకాంత్ దేవా అందిçస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement