-
ప్రతిభ..: జయం మనదే!
అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది... ఒక పదం స్పెల్లింగ్ పలకడమే కాదు, దాని అర్థం కూడా చెప్పాలని ఈసారి కొత్త నిబంధన చేర్చారు. ఈ ప్రభావంతో చాలామంది ఫైనల్ వరకు చేరుకోలేకపోయారు. విక్రమ్రాజు, సహన శ్రీకాంత్, అభిలాష పటేల్, శివకుమార్... మొదలైన వారితోపాటు ఫైనల్లో పోటీ పడింది హరిణి. ఒక పదానికి హరిణి ఇచ్చిన నిర్వచనం తప్పేమీ కాదని న్యాయనిర్ణేతలు ప్రకటించడం ద్వారా ‘ఎలిమినేట్’ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. 90 సెకండ్ల లైటినింగ్ రౌండ్ గతంలో లేనిది. ఈ రౌండ్లో 90 సెకన్లలో హరిణి 26 పదాలకు 21 పదాల స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన టై బ్రేకర్లో విజయం సాధించింది. విక్టరీ ట్రోఫీని అందుకొని 50 వేల డాలర్ల ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. ‘కల నిజం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ గెలుపు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు ముందుకు వెళ్లడానికి శక్తిని ఇచ్చింది’ అంటుంది టెక్సాస్లోని సాన్ ఆంటోనియోకు చెందిన హరిణి. అయితే ఆమె సంతోషం వెనుక ఎంతో కష్టం ఉంది. ‘స్పెల్లింగ్ బీ’ బరిలోకి దిగే క్రమంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిదిగంటల పాటు కష్టపడేది. ‘పోటీ సంగతి ఎలా ఉన్నా, ప్రిపేర్ అవుతున్న క్రమంలో రకరకాల కొత్త పదాలు, వాటిద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను’ అంటుంది హరిణి. గత విజేతల విజయాలు హరిణిలో స్ఫూర్తి నింపాయి. ‘ఈసారి విన్నర్ ట్రోఫీని నేను అందుకోవాల్సిందే’ అనే పట్టుదల పెంచాయి. పోటీదారుల ఒత్తిడి ఎలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం ఫుట్బాల్ టోర్నమెంట్ను చూసినంత ఉత్కంఠగా స్పెల్లింగ్ బీ పోటీని చూశారు. కోవిడ్ పుణ్యమా అని గత రెండు సంవత్సరాలు ఈ ఉత్సాహం మిస్ అయింది. ‘తాను ఎంతో కష్టపడింది అని ఆమె విజయం చెప్పకనే చెప్పింది’ అంటూ హరిణిని ప్రశంసిస్తున్నారు ‘వర్డ్ బై వర్డ్: ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ డిక్షనరీస్’ రచయిత కొరి స్టాంపర్. హరిణికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పుస్తకం రాసే ప్రయత్నం చేసింది. విజయం కోసం తాను పడిన కష్టాన్నే అక్షరీకరిస్తే ఎంతోమందికి అది స్ఫూర్తి ఇచ్చే పుస్తకం అవుతుంది కదా! -
తెలివిటీగలు..ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు..!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ప్రతిష్టాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేధా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం. మొదటి విన్నర్ ఫ్రాంక్ స్పెల్లింగ్ బీ అనే పదం 1875లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం అయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ‘ద కొరియర్ జర్నల్’ అనే వార్తా పత్రిక 1925లో ‘యునైటెడ్ స్టేట్స్ స్పెల్లింగ్ బీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్ నౌహసర్ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్ (లాటిన్లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్ తదనంతర కాలంలో అమెరికన్ పేటెంట్ లాయర్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు. ‘స్పెల్బౌండ్’ డాక్యుమెంటరీ 1941లో ‘స్క్రిప్స్ హవార్డ్ న్యూస్ సర్వీస్’.. స్పెల్లింగ్ బీ స్పాన్సర్షిప్ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలుస్తుండడం విశేషం. అయితే భారతీయులకు స్పెల్లింగ్ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం ‘స్పెల్బౌండ్’ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. లక్షా ఇరవై వేల పదాలు టెక్సాస్కు చెందిన విజయ్ రెడ్డి అందరిలాగే తన కొడుకు చేతన్ను స్పెల్ బీ చాంపియన్గా చూడాలనుకున్నారు. ఎన్నో ఆశలతో పోటీలో అడుగుపెట్టిన చేతన్.. ఏడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కొడుకును తీర్చిదిద్దే క్రమంలో ప్రతిష్టాత్మక చాంపియన్షిప్పై ఆసక్తి పెంచుకున్న విజయ్ స్వయంగా ఓ కోచింగ్ సెంటర్ను నెలకొల్పారు. దానికి ‘జియోస్పెల్’ అని నామకరణం చేసి ఇప్పటి వరకు ముగ్గురు భారత సంతతి విద్యార్థులను చాంపియన్లుగా నిలబెట్టారు. సులభ పద్ధతిలో బోధనకై దాదాపు లక్షా ఇరవై వేల పదాలను ప్రత్యేక సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేశారు. అదే విధంగా తరచుగా పరీక్షలు నిర్వహించడం ద్వారా.. తన అకాడమీ విద్యార్థులకు పోటీ నేషనల్స్కు సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్రెడ్డి పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్న కార్తిక్ నెమ్మాని గతేడాది స్పెల్ బీ చాంపియన్ ట్రోఫీ అందుకోగా.. ఈ ఏడాది అభిజయ్ కొడాలి ఆ ఘనత సాధించాడు. కొడుకు కోసం స్పెల్ బీపై మక్కువ పెంచుకున్న విజయ్రెడ్డి ప్రస్తుతం దానిని పూర్తిస్థాయి బిజినెస్గా మలచుకుని.. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. తనయుడు చేతన్తో విజయ్ ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ (13), మేరీల్యాండ్కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్ (14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. భారతీయుల్లో పోటీ తత్త్వం : షాలినీ శంకర్, ఆంత్రోపాలజిస్టు వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ -
మాకివే ఒలింపిక్స్; కచ్చితంగా గెలవాలి!!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఎన్నారైలు తమ పిల్లలను కూడా అగ్రపథంలో నిలపడంలో విజయం సాధిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేథా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం. మొదటి విన్నర్ ఫ్రాంక్.. స్పెల్లింగ్ బీ అనే పదం 1875లో మొదటిసారిగా అచ్చయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ద కొరియర్ జర్నల్ అనే వార్తా పత్రిక 1925లో యునైటెడ్ స్టేట్స్ స్పెల్లింగ్ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్ నౌహసర్ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్(లాటిన్లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్ తదనంతర కాలంలో అమెరికన్ పేటెంట్ లాయర్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు. ఆ డాక్యుమెంటరీ స్ఫూర్తిగా.. 1941లో స్క్రిప్స్ హవార్డ్ న్యూస్ సర్వీస్ స్పెల్లింగ్ బీ స్పాన్సర్షిప్ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలవడం విశేషం. ఇండియానాకు చెందిన సమీర్ మిశ్రా స్పెల్లింగ్ బీ-2008 ట్రోఫీ సాధించాడు. అయితే భారతీయులకు స్పెల్లింగ్ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం స్పెల్బౌండ్ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. 1999 నేషనల్ బీ పోటీలో గెలుపొందిన నుపుర్ లాలా విజయగాథ ఇండో అమెరికన్లకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొంటున్నారు. సమీర్ మిశ్రా భారతీయుల్లో పోటీ తత్త్వం మెండు.. ‘ వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ సహకారంతో.. నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ 1993 నుంచి భారత సంతతి విద్యార్థులకు.. స్పెల్లింగ్, వొకాబులరీ, భూగోళశాస్త్రం, గణితం తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. దాదాపు 92 దేశాలకు చెందిన పదాలు, వాటి చరిత్రకు సంబంధించిన వివరాలు సహా ఇందులో భాగంగా ఉంటాయి. వివిధ దేశాలకు చెందిన సుమారు 16 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలో ఇండో అమెరికన్లే ఛాంపియన్లుగా నిలవడంలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఎటువంటి లాభాపేక్ష, పబ్లిసిటీ లేకుండా విద్యార్థులకు తన వంతు సహాయం చేస్తోంది. వారి పాత్ర అభినందనీయం అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్పెల్లింగ్ పోటీలో భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడంలో వారి తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా కోచ్లను నియమించడం, వారే స్వయంగా పిల్లల కోసం సమయం కేటాయించడం ద్వారా పదేళ్లుగా ఈ విన్నింగ్ రికార్డును కొనసాగించడం సాధ్యమవుతోంది. ఇండో అమెరికన్ల పోటీతత్త్వం, వారి విజయం వెనుక రహస్యాల గురించిన పలు విషయాల గురించి బ్రేకింగ్ ద బీ అనే డాక్యుమెంటరీలో తల్లిందండ్రుల పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు.. స్పెల్లింగ్ బీ పోటీలో దాదాపు శౌరవ్ దాసరి అనే ఇండో అమెరికన్ గత పదేళ్లుగా విసుగు చెందక పాల్గొంటూనే ఉన్నాడు. శౌరవ్తో పాటు అతడి సోదరిని కూడా ఈ పోటీలో భాగస్వామ్యం చేయడం గురించి వారి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. ‘ విద్య ప్రాధాన్యత తెలిసిన తల్లిదండ్రుల నుంచే పిల్లలు స్ఫూర్తి పొందుతారు. నేను, నా భార్య ఉష సాంకేతిక రంగంలో పట్టా పొందిన మేము నిపుణుల కోటా కింద వీసా సంపాదించి ఇక్కడకు వచ్చాం. 2017లో మా పిల్లలకు స్పెల్ బీ వయోపరిమితి ముగిసింది. ఆ తర్వాత స్పెల్పండిట్ అనే కోచింగ్ కంపెనీ ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. నుపుర్ లాలా 2025 నాటికే మనదే హవా ఇక డల్లాస్కు చెందిన విజయ్ రెడ్డి తన కొడుకును చాంపియన్గా తీర్చిదిద్దేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య కూడా తన వంతు సహాయం చేస్తున్నారు. అయితే వారి కుమారుడు చేతన్ ఏడోస్థానంలోనే నిలిచినప్పటికీ అతడిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది మాకు ఒలంపిక్స్ వంటిది. తను కచ్చితంగా గెలవాలని మా ఆశ అని చెప్పే విజయ్రెడ్డి ప్రతీ అంశాన్ని చాలెంజింగ్గా తీసుకుంటారు. అందుకే స్పెల్బీ విద్యార్థుల కోసం జియోస్పెల్ అనే కోచింగ్ సెంటర్ను ప్రారంభించి మెరికల్లా వారిని తీర్చిదిద్దుతున్నారు’ అని ఆంత్రపాలజిస్ట్ షాలినీ శంకర్ పేర్కొన్నారు. 2025 నాటికి స్పెల్లింగ్ బీలో పూర్తి స్థాయిలో భారతీయుల హవానే కొనసాగడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ(13), మేరీల్యాండ్కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. -
స్పెల్బీలో భారత సంతతి విద్యార్థుల ఘనత
వాషింగ్టన్: ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బహుమతిని పొందిన 8 మంది విద్యార్థుల్లో ఏకంగా ఆరుగురు భారత సంతతి విద్యార్థులే ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్బీ చరిత్రలో ఇదే తొలిసారి. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ(13), మేరీల్యాండ్కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. -
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
హ్యూస్టన్: అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారత సంతతికి చెందిన కార్తీక్ నెమ్మాని(14) విజేతగా నిలిచాడు. టెక్సాస్లోని మెక్కిన్నీకి చెందిన కార్తీక్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి కృష్ణ నెమ్మాని హైదరాబాద్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. కార్తీక్ తుది పోరులో భారత సంతతికే చెందిన నయాసా మోదీ అనే బాలికతో పోటీపడి విజయం సాధించాడు. తుదిపోరులో 'koinonia' అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి కార్తీక్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలిచిన కార్తీక్కు 40 వేల డాలర్లు, ట్రోఫీని ఇస్తారు. కార్తీక్కు మరియం–వెబ్స్టర్ నుంచి 2,500 డాలర్లు, న్యూయార్క్, హాలీవుడ్లలో ఉచితంగా పర్యటించే చాన్స్ ఇస్తారు. ఈ సారి పోటీలో మొత్తం 516 మంది విద్యార్థులు పోటీపడగా, ఫైనల్కు 16 మంది చేరుకున్నారు. వీరిలో 9 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. గత 11 ఏళ్లుగా భారత సంతతి విద్యార్థులే ఈ పోటీల్లో గెలుస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement