-
ఫండ్స్ అమ్మకాలకు ఊతమిచ్చేలా కొత్త నిబంధనలు
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటి పథకాల అమ్మకాలకు మరింతగా ఊతమిచ్చే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. ఈ-కామర్స్ సైట్లలో కూడా ఫండ్స్ అమ్మకాలకు వెసులుబాటు కల్పించడంతో పాటు పలు చర్యలు తీసుకోనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సెబీ చైర్మన్ యూకే సిన్హా ఈ విషయాలు చెప్పారు. ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసేందుకు కస్టమర్ల వివరాలు ఆన్లైన్లోనే సమర్పించడం, ధృవీకరించడం మొదలైన ప్రక్రియలు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలను సూచిం చేందుకు నందన్ నీలేకని సారథ్యంలో ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ సంస్థలు దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే అసెట్స్ను నిర్వహిస్తున్నాయి. -
పుత్తడి కన్నా షేర్లు మిన్న!
- ఆకర్షణీయమైన పెట్టుబడిగా ఈక్విటీలు - సెబీ చైర్మన్ యూకే సిన్హా... ముంబై: పుత్తడితో పోల్చుకుంటే షేర్లే అధిక రాబడులనిచ్చాయని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. 15-20 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పుత్తడిలో పెట్టుబడులు 5-6 శాతం వార్షిక వృద్ధినే ఇచ్చాయని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. షేర్లలో పెట్టుబడులు 15 శాతం వార్షిక వృద్ధిని ఇచ్చాయని వివరించారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భారత వృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని వివరించారు. షేర్లలో పెట్టిన పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. పుత్తడి ధరల్లో పతనం, దీర్ఘకాలం పాటు రియల్టీ మార్కెట్ ఎదుగూ బొదుగూ లేకపోవడం వల్ల షేర్లు ఆకర్షణీయంగా మారాయని, కుటుంబాల పొదుపుల్లో అధిక భాగం ఈక్విటీ మార్కెట్లోకి రావడం మొదలైందని వివరించారు. ప్రస్తుతానికి పుత్తడి ధరలు ఆశావహంగా లేవని, అందుకని ప్రజలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని, దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్టాక్ మార్కెట్ మంచి రాబడులనిచ్చిందని, ఇదే ఈ మార్కెట్ అందమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయని, భారత్లో నాలుగేళ్ల కనిష్టానికి, అంతర్జాతీయ మార్కెట్లో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయని చెప్పారు. స్టాక్ మార్కెట్ ఏడాది కాలంలో 2,000పాయింట్లు పెరిగిందని తెలిపారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఆరు నెలల్లో మాత్రం స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైందని వివరించారు. గత ఏడాది స్టాక్ మార్కెట్ 30 శాతం రాబడులిచ్చిందని వివరించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement