-
ఫైనల్లీ.. మార్స్ మాతో మాట్లాడుతోంది!
అనంత విశ్వంలో మానవాళి మనుగడకు అనుకూలమైన ఏకైక గ్రహం భూమి మాత్రమేనని మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒకవేళ భూ గ్రహం అంతమయ్యే పరిస్థితులు తలెత్తితే.. మానవజాతి అంతం కావాల్సిందేనా? భూమి కాకుండా మనుషులు నివసించేందుకు మరే ఇతర గ్రహం అనుకూలం కాదా? అనే ప్రశ్నలకు బదులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు.. అంగారకుడి(మార్స్) మీద ప్రయోగాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా పరిశోధన సంస్థ నాసా ఇన్సైట్ ల్యాండర్ అనే స్పేస్క్రాఫ్ట్ను మార్స్పైకి పంపింది. అయితే ఇప్పటిదాకా అరుణగ్రహ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, గాలి శబ్దాలను మాత్రమే ఇన్సైట్ రికార్డు చేసింది. తాజాగా ఇన్సైట్లో రికార్డైన శబ్దాలు శాస్త్రవేత్తలకు అంతులేని ఆనందాన్ని ఇస్తున్నాయి. మార్స్ ఉపరితలం, అంతర్గత వాతావరణం, కంపనాలు(భూకంపం వంటిది), వాటి ద్వారా ఏర్పడే ధ్వనులను రికార్డు చేయడమే ప్రధాన లక్ష్యంగా అక్కడ దిగిన ఇన్సైట్ త్వరలోనే తన టార్గెట్ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్స్పై ఇన్నాళ్లు నిశ్చలంగా ఉన్న ఇన్సైట్ తొలిసారి కుదుపులకు లోనైందని, కంపనాలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసిందని జెట్ ప్రపల్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి విమానం ఎగురుతున్నపుడు వచ్చే శబ్దాలను పోలి ఉన్నాయని తెలిపారు. ఫైనల్లీ మార్స్ మాతో మాట్లాడుతోంది.. ఈ విషయం గురించి మార్స్ మిషన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బెనెర్డ్ మాట్లాడుతూ... ‘ మార్స్పై విజయవంతంగా ప్రయోగాలు చేయగలుతామా అనే సందేహాలు నేటితో కాస్త తీరాయి. అక్కడ కంపన తరంగాలు యాక్టివ్గా ఉన్నట్లు కనుగొన్నాం. అవును మార్స్ ఇప్పుడు మాతో మాట్లాడుతోంది. తొలిసారి కంపించింది. కంపన తీవ్రత 2 నుంచి 2.5 యూనిట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. భూమి కాకుండా తొలిసారి మరో గ్రహంపై సిస్మాలజీ గురించి అధ్యయనానికి ముందడుగు పడింది. అయితే ఇంకాస్త ఓపికగా ఎదురుచూడాలి. వాటిని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి కంపనాలు తరచుగా నమోదు అయినపుడే ఈ విషయంపై పూర్తి అవగాహన వస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 6న నాసా విడుదల చేసిన తాజా శబ్దాలు నిజంగా కంపనాలకు సంబంధించినవేనా అనే విషయంపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది. -
నేపాల్లో భూకంపం
ఖాట్మాండు: నేపాల్లో మరోసారి స్వల్ఫ భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి నేపాల్ రాజధాని ఖాట్మాండులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఒక్కసారిగా తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఖాట్మాండుకు సమీపంలో ఉన్న లలిత్పూర్లోని భైన్సేపతిలో భూకంప కేంద్రాన్ని నేషనల్ సెస్మలాజికల్ సెంటర్ గుర్తించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement