-
ఎవ్వరినీ వదలను
కోల్కతా/ఛురబంధర్/రాయ్పూర్: శారదా చిట్ఫంట్ కుంభకోణంలో దోషులకు బెంగాల్ సీఎం మమత అండగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నేరస్తులతో పాటు వారికి అండగా నిలిచేవారిని విడిచిపెట్టబోమన్నారు. మా–మాటి–మనుష్(కన్నతల్లి–మాతృభూమి–సామాన్యుడు) నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్.. కమ్యూనిస్టుల నుంచి హింసను, వేధింపులను అందిపుచ్చుకుందని విమర్శించారు. బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీతో పాటు విపక్షాలతీరును మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. కమ్యూనిస్ట్ పార్ట్–2గా మారిపోయారు.. ‘మహాకూటమి పేరుతో ఏకమవుతున్న రాజకీయ పార్టీలకు సిద్ధాంతపరమైన ఏకాభిప్రాయం, దేశ భవిష్యత్ గురించి దార్శనికత లేదు. ఇది మహాకూటమి కాదు.. మహా కల్తీ కూటమి. అవినీతిపరులను కాపాడేందుకు సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి(మమతా బెనర్జీ) ధర్నాకు కూర్చోవడాన్ని దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. శారదా చిట్ఫండ్ కుంభకోణం విచారణలో నిర్లక్ష్యం వహించినవారికి మద్దతుగా మమత ఎందుకు ధర్నాకు దిగారో పేదప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ కుంభకోణంలో నేరస్తులు కావొచ్చు.. లేదా వారిని కాపాడుతున్నవారు కావొచ్చు.. ఈ కాపలాదారు(చౌకీదార్) ఎవ్వరినీ విడిచిపెట్టడు’ అని స్పష్టం చేశారు. వామపక్ష పార్టీల హింసను అందిపుచ్చుకున్న తృణమూల్ ప్రభుత్వం ‘కమ్యూనిస్ట్ పార్ట్–2’గా మారిపోయిందని దుయ్యబట్టారు. చొరబాటుదారులైనా ఓకే ‘బెంగాల్ ప్రభుత్వం బీజేపీ నేతల ర్యాలీలను, హెలికాప్టర్ల ల్యాండింగ్ను సైతం అడ్డుకుంటోంది. ఇక్కడి ప్రభుత్వం విదేశీ చొరబాటుదారుల్ని అయినా స్వాగతిస్తుందేమో కానీ, స్వామి వివేకానంద సిద్ధాంతాలను అనుసరించే బీజేపీ నేతల ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పరిస్థితేంటి? ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లా కొడతరయ్లో మరో సభలో ప్రసంగిస్తూ..‘రుణమాఫీ విషయంలో ఛత్తీస్ రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ సర్కారు కేవలం గ్రామీణ, సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలనే మాఫీ చేసింది. జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ను ఏటీఎంలా వాడుకోవాలని అనుకుంటున్నారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకుందని విమర్శించారు. శుక్రవారం అస్సాంలోని గువాహటికి చేరుకున్న మోదీకి నిరసనల సెగ ఎదురైంది. కేంద్రం తెస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు నల్ల జెండాలతో మోదీకి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్, పౌరసత్వ బిల్లును రద్దుచేయండి, అస్సాం వర్ధిల్లాలి అని నినాదాలతో హోరెత్తించారు. మిస్టర్ మ్యాడీ..! బెంగాల్ పర్యటనలో భాగంగా మోదీ కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ను జల్పాయ్గురిలో ఆవిష్కరించారు. కేంద్రం 13–14 ఏళ్ల క్రితమే అనుమతులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూట్ బెంచ్ను ఏర్పాటు చేయలేదని మోదీ విమర్శించారు. ఈ బెంచ్వల్ల డార్జిలింగ్, కలింగ్పొంగ్, జల్పాయ్గురి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందనీ, వీరందరికీ 100 కి.మీ పరిధిలోనే హైకోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాగా, సర్క్యూట్ బెంచ్ ప్రారంభోత్సవం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు కేంద్రం సమాచారం ఇవ్వలేదని బెంగాల్ సీఎం మమత మండిపడ్డారు. ఇందుకోసం స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వమనీ, బెంచ్ కలకత్తా హైకోర్టుకు సంబంధించినదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మోదీని మిస్టర్ మ్యాడీ(పిచ్చివాడి)గా అభివర్ణించారు. ప్రధాని వ్యవహారశైలి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకపోయినప్పటికీ బ్యాండ్ మేళంవాడు తొందరపడి వచ్చినట్లు ఉంద న్నారు. తమకు ప్రధాని కుర్చీపై గౌరవం ఉందనీ, ఈ వ్యక్తి(మోదీ)పై మాత్రం లేదన్నారు. కోల్కతా ధర్నాలో తనతో కలిసి పాల్గొన్న సీనియర్ పోలీస్ అధికారుల మెడల్స్ను కేంద్రం వెనక్కు తీసుకుంటే.. ఆ అధికారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘బంగ బిభూషణ్’ అందజేస్తానని చెప్పారు. -
‘శారదా’కు ఉగ్ర లింకు లేదు
బీజేపీ చీఫ్ అమిత్ షా వాదనతో విభేదించిన కేంద్రం న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ సొమ్ము బంగ్లాదేశ్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారన్న విషయంలో ప్రభుత్వం, బీజేపీ మధ్య భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్మును బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పగా.. ఓ కేంద్ర మంత్రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలకు శారదా చిట్ ఫండ్ సొమ్ము ఉపయోగించినట్లు ఇంతవరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు’’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆదివారం కోల్కతాలోని ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2న బర్ద్వాన్లో జరిగిన పేలుడుకు శారదా కుంభకోణం సొమ్మే ఉపయోగించారు. అయితే దాన్ని దర్యాప్తు చేయకుండా ఎన్ఐఏను కొందరు అడ్డుకుంటున్నారు. ఆ పేలుడుతో సంబంధమున్న కొందరు టీఎంసీ నాయకులును కాపాడేందుకే ఇలా చేస్తున్నారు’’ అని ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు శారదా స్కాం అంశంపై జితేంద్రసింగ్ ప్రకటనను మీడియా వక్రీకరించిందని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. శారద స్కాం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, బంగ్లాదేశ్లో ఉగ్ర కార్యకలాపాలకు ఆ సొమ్ము వాడినట్లు ఇప్పటివరకూ ఏమీ బయటపడలేదనే మంత్రి పేర్కొన్నట్లు వివరించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement