-
క్రీడారంగం అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక చొరవ: బైరెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్: చదువులకు పిల్లలు దూరమవుతారనే దురభిప్రాయంతో క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం లేదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడలతో జీవితాలు బాగుపడుతాయనే విషయంపై సమాజంలో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంత క్రీడా మైదానంలో జిల్లాలోని 36 సాఫ్ట్బాల్ క్లబ్బులకు సోమవారం క్రీడా సామగ్రిని ఆయన అందజేసి, మాట్లాడారు. క్రీడలకు సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో రాష్ట్రంలో క్రీడారంగం వెనుకబడిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అనంతరం సీనియర్ ఫుట్బాల్ కోచ్ విజయభాస్కర్ రచించిన ‘ఫుట్బాల్ క్రీడా ప్రాథమిక భావన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్ సాయికృష్ణ, సాఫ్ట్బాల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, చీఫ్ కోచ్ జగన్నాథరెడ్డి, కేశవమూర్తి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బైరెడ్డితో పీఈటీ అసోసియేషన్ భేటీ.. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డిని జిల్లా స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ అసోసియేషన్ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాలలకు క్రీడా సామగ్రిని అందించాలని కోరారు. బైరెడ్డిని కలిసిన వారిలో నరసింహారెడ్డి, రాజశేఖర్, లక్ష్మీనారాయణ, కాశీవిశ్వనాథరెడ్డి ఉన్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు అనంతపురం సెంట్రల్: పార్టీ అభ్యున్నతికి శ్రమించే కార్యకర్తలకు వైఎస్సార్సీపీలో తగిన గుర్తింపు ఉంటుందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. సోమవారం అనంతపురానికి విచ్చేసిన ఆయన అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 శాతం నామినేటెడ్ పదవులు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్నారని, మహిళలకూ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయంలోనే సంక్షేమ ఫలాలను అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. -
ప్రతి జిల్లాలో టోర్నమెంట్ లు నిర్వహిస్తా : బైరెడ్డి
-
సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతా: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. సిద్దార్ద్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతాను. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తాను. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. సిద్ధార్థరెడ్డికి నామినేటెడ్ పోస్టు.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ పదవిని ఇచ్చి హామీ నిలబెట్టుకున్నారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి(శాప్)ని బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని సిద్ధార్థ్రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. చదవండి: AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన కాగా పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సయమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: AP Nominated Posts List 2021: ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే.. ప్రస్తుతం నందికొట్కూరు నియోజవకర్గ ఇంచార్జ్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు శాప్ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కడపలోని ఆయన నివాసంలో సిద్ధార్థ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. -
దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలు : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నరసరావుపేట: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ప్రధాన ప్రతిపక్షాలు దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని క్రీడల స్టేడియంలో నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వేలాది మంది రైతన్నలను ఉద్దేశించి సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. కరోనా కారణంగా ప్రాణహాని ఉందని ఉద్యోగులు అందరూ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు తప్పితే తాము కాదన్నారు. తమకు ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నారు. ఎన్నికలను రద్దుచేయాలని కోరుకోవట్లేదని కేవలం వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తాము ఎన్నికలకు భయపడుతున్నామంటూ కొన్ని పక్షాల నాయకులు చేస్తున్న ప్రచారం ఏమాత్రం వాస్తవంకాదన్నారు. భయమనే పదమే వైఎస్.జగన్కు తెలియదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ పౌరుషం, మాట నిలబెట్టుకోవటం, అభిమానం చూపించటంలో పలనాడు, రాయలసీమకు పోలిక ఉందన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన సిద్ధార్థరెడ్డిపై చూపిస్తున్న అభిమానం అలాంటిదన్నారు. కులాలు, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారంటే ఆ పారీ్టకి ప్రజల్లో అభిమానం లేకపోవటమే కారణం అన్నారు. టీడీపీకి మనుగడలేదనే భావనతో దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు తెరతీశారన్నారు. సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శాలువా కప్పి సత్కరించారు. మార్కెట్యార్డు చైర్మన్ ఎస్.ఏ.హనీఫ్, నాయకులు మిట్టపల్లి రమే‹Ù, కపలవాయి విజయకుమార్, వ్యవసాయ బోర్డు మెంబరు చల్లా నారపరెడ్డి, ఇప్పల దానారెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, కనక పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement