-
ఆర్డీటీ అకాడమీ జట్ల విజయ పరంపర
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ కప్లో ఆర్డీటీ అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు విజయ పరంపర కొనసాగించాయి. రెండురోజులుగా జరిగిన టోర్నిలో అండర్–12, 14 విభాగాల్లో రెండేసి మ్యాచులు జరుగగా వాటని్నంటిలో విజేతగా నిలిచి అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు తన సత్తా చాటాయి. ప్రధాన మైదానంలో అండర్–14 విభాగంలో జరిగిన మ్యాచ్లో జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 90 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ బౌలర్లలో అనూష స్వింగ్ బౌలింగ్తో 3 వికెట్లు తీసింది. విఘ్నేష్ దినకర్ 3 వికెట్లు తీశాడు. అనంతరం అకాడమీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో మణికంఠ 23, ప్రశాంత్ 17 పరుగులు చేశారు. బీ మైదానంలో జరిగిన రెండవ మ్యాచ్లో అండర్–12 విభాగంలో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 20 ఓవర్లలో 128 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయారు. జట్టులో మణిదీప్ 42, నిక్షిప్త్ మనోహర్ 30 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అనంతరం బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతపురం బౌలర్లలో కరీమ్బాబా 2, సునీల్ 1 వికెట్ తీశారు. బుధవారం వరకు టోర్నీ మ్యాచులు సాగుతాయని కోచ్ యుగంధర్రెడ్డి తెలిపారు. -
మరిగడి–చౌడారం ఎంపీటీసీగా సిద్ధయ్య విజయం
ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజు మూడో స్థానంలో సీపీఎం అభ్యర్థి.. టీడీపీ అభ్యర్థికి దక్కని డిపాజిట్ జనగామ : జనగామ మండలంలోని మరిగడి–చౌడారం ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి దూడల సిద్ధయ్య 253 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈనెల 8న ఎన్నికలు నిర్వహించగా పోలైన ఓట్లను శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో లెక్కించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హసీమ్ నేతత్వంలో ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించగా 25 నిమిషాల్లో ఫలితం వెల్లడైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దూడల సిద్ధయ్య, టీఆర్ఎస్ నుంచి మేకల కళింగరాజు, సీపీఎం నుంచి బాల్నె వెంకట్రాజు, టీడీపీ నుంచి సల్లూరి అశోక్ బరిలో నిలిచిన విషయం విదితమే. ఈ మేరకు మరిగడి పోలింగ్ కేంద్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 287, కాంగ్రెస్ 181, సీపీఎం 211, టీడీపీ 75 ఓట్లు, రెండో రౌండ్లో టీఆర్ఎస్ 147, కాంగ్రెస్ 253, సీపీఎం 265, టీడీపీ అభ్యర్థికి 50 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్లో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రెండో రౌండ్కు వచ్చే సరికి 106 ఓట్ల ఆధిక్యానికి వచ్చారు. ఇక చౌడారం పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను మూడో రౌండ్గా లెక్కించగా టీఆర్ఎస్కు 276, కాంగ్రెస్ 529, సీపీఎం 36, టీడీపీ 41 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు 963 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి దూడల సిద్ధయ్య 253 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించిన అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజు రెండో స్థానంలో, సీపీఎం అభ్యర్థి వెంకట్రాజు మూడో స్థానంలో నిలవగా టీడీపీ అభ్యర్థి అశోక్ డిపాజిట్ కోల్పోయారు. నోటాకు సైతం 28 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు అధికార పార్టీ అభ్య ర్థి ఓటమి పాలు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి విజయంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. దాసరి రవి మృతితో ఉప ఎన్నిక మరిగడి–చౌడారం ఎంపీటీసీగా ఉన్న దాసరి రవి మృతి చెందగా ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇండిపెండెంట్గా నిలిచి విజయం సాధించిన రవి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఆయన గుండెపోటుతో మరణించగా ఏడాది తర్వాత ఉప ఎన్నిక నిర్వహించగా ఆ స్థానం కాంగ్రెస్కు దక్కింది. నారాయణపురంలో సీపీఎం అభ్యర్థి విజయం బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎండీ.మహబూబ్ విజయం సాధించా రు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదానందం, ఎంపీడీవో రమేష్ నేతృత్వంలో శనివారం ఈవీఎంలను తెరిచి ఓట్లను లెక్కించారు. నారాయణపురంలో రెండు, నక్కవానిగూడేనికి సంబంధించి ఒక్క ఈవీఎంల్లో నమోదైన ఓట్లను లెక్కించిన అధికారులు మొత్తం 1,178 ఓట్లు నమోదైనట్లు వెల్లడించారు. ఇందులో సీపీఎం అభ్యర్థి మహబూబ్కు 633 ఓట్లు, స్వతంత్రlఅభ్యర్థి పరిదె అయిలమ్మకు 519 ఓట్లు, 26 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఈ మేరకు మహబూబ్ 114 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు వెల్లడించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
కేంద్ర విజయాలపై విస్తృత ప్రచారం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నిర్ణయం హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ నిర్ణయించింది. పార్టీ పదాధికారులు, మీడియా నిర్వహణ, అధికార ప్రతినిధుల సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, నల్లగొండ జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని వివరించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ విదేశి పర్యటనల ద్వారా దేశ ప్రతిష్టను మరింతగా పెంచుతున్నారని జాతీయ అధికార ప్రతినిధి విజయ్ సోన్కర్సింగ్ అన్నారు. విదేశాల్లో లీగల్సెల్ ప్రతినిధి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు. సమావేశంలో బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
Advertisement