-
ఇండో పసిఫిక్తో వాణిజ్య బంధం బలపడాలి
ప్యాంగ్టెక్ (దక్షిణ కొరియా): ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఆసియా పర్యటన ప్రారంభించారు. దక్షిణ కొరియా, జపాన్లలో వారం రోజులు పర్యటించనున్న ఆయన తొలుత దక్షిణ కొరియాకు వచ్చారు. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శామ్సంగ్ కంప్యూటర్ చిప్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్లో 1500 కోట్ల అమెరికా డాలర్ల వ్యయంతో ఒక సెమి కండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వేధిస్తున్న కంప్యూటర్ చిప్ల కొరతను అధిగమించడం కోసమే బైడెన్ తన పర్యటనలో శామ్సంగ్ కంపెనీ సందర్శనకు పెద్దపీట వేశారు. ఈ చిన్ని చిప్ల్లోనే ప్రపంచ సాంకేతిక పురోగతి దాగి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. సాంకేతికంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం కోసమే ఆయన కొరియా, జపాన్లలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కి బైడెన్ తన అభినందనలు తెలియజేశారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలోనే ప్రపంచ భవిష్యత్ ఉందని బైడెన్ పేర్కొన్నారు. ఇండోç పసిఫిక్ ప్రాంతంతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకొని ఇరు ప్రాంతాల ప్రజలు మరింత సన్నిహితంగా మెలిగేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ అన్నారు. -
కోవిడ్ ఎఫెక్ట్... శాంసంగ్ దూకుడు!
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా) వైరస్ చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలను కలవరపెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ ఈ వైరస్ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ సంస్థల ప్రణాళికలపై కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. యాపిల్తోపాటు చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదల ప్రణాళికల ను సమీక్షించుకుంటున్నాయి. కానీ, శాంసంగ్ మాత్రం తన ప్రణాళికలను వాయిదా వేసుకోకుండా మరింత దూకుడుగా ఉత్పత్తులను విడుదల చేసే కార్యక్రమంలో ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గణాంకాల ప్రకారం.. శాంసంగ్ ఇండియా 2020 ప్రారంభంలోనే 9 నూతన మొబైల్ ఫోన్లకు సంబంధించి బీఐఎస్ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఇదే సమయంలో షావోమీకి చెందిన రెడ్మీ, దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్జీ రెండేసి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ కోరడం చూస్తుంటే.. శాంసంగ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాలంలో మోటరోలా, కూల్ప్యాడ్ సంస్థలు ఒక్కొక్క ఉత్పత్తి రిజిస్ట్రేషన్కు దరఖాస్తు పెట్టుకున్నాయి. దేశీయ కంపెనీలదీ దూకుడే..: ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విడుదలలో వేగాన్ని పెంచడాన్ని పరిశీలించాలి. ఢిల్లీకి చెందిన సెల్కార్ జనవరి 1 నుంచి ఇప్పటికే 15 మోడళ్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తీసుకుని చార్ట్లో అగ్రస్థానంలో ఉంది. మరో స్థానిక బ్రాండ్ హైటెక్ కూడా మూడు మోడళ్లకు ఈ కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. ‘‘పెద్ద తయారీ సంస్థలు (ఓఈఎంలు) తమ ఉత్పత్తుల విడుదలను జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా బీఐఎస్ రిజిస్ట్రేషన్ తర్వాత ఉత్పత్తుల విడుదలకు 4–6 వారాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి శాంసంగ్కు అనుకూలం. ఎందుకంటే ప్రముఖ తయారీ కంపెనీగా కొరియా, ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను సమీకరించుకుంటుంది. దీంతో కంపెనీ సరఫరా వ్యవస్థపై వైరస్ ప్రభావం ఉండదు’’ అని టెక్ఆర్క్కు చెందిన ముఖ్య అనలిస్ట్ ఫైసల్కవూసా తెలిపారు. చైనా కంపెనీలకు ఇబ్బందులు.. చైనాలో కోవిడ్ వైరస్ తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించనుంది. దీని తాలూకూ వేడి భారత్లో కార్యకలాపాలు కలిగి ఉన్న చైనా కంపెనీలకు ఇప్పటికే తాకింది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలకు భారత్లో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ.. విడి భాగాల కోసం అవి మాతృదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ, వైరస్ ప్రభావం శాంసంగ్పై తక్కువే ఉండనుంది. ఎందుకంటే అధిక శాతం మొబైల్ ఫోన్లను ఈ సంస్థ నోయిడాలోని కేంద్రంలోనే తయారు చేస్తోంది. పైగా 2018లో తయారీ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68 మిలియన్ యూనిట్లుగా ఉంటే, 120 మిలియన్ యూనిట్లకు విస్తరించింది. ఇక విడిభాగాలను కూడా స్థానికంగానే సమీకరించుకుంటోంది. అలాగే, వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా కలిగి ఉంది. ‘‘చైనా సంస్థలతో పోలిస్తే శాంసంగ్ కార్యకలాపాలు ఎన్నో ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. కనుక అతిపెద్ద నిల్వలను కలిగి ఉంటుంది. చైనా నుంచి సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు మొదటి త్రైమాసికంలో శాంసంగ్కు కలసి రానున్నాయి’’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ డైరెక్టర్ నవకేందర్సింగ్ తెలిపారు. పెద్దగా ప్రభావం ఉండదు.. ‘‘చాలా వరకు విడిభాగాలను భారత్లోనే తయారు చేస్తున్నాం. అంతేకాదు వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా ఉంది. కరోనా వైరస్ సంక్షోభ ప్రభావం మా కార్యకలాపాలపై పెద్దగా ఉండదు’’ అని శాంసంగ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఫ్లాగ్షిప్ మోడళ్లు అయిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్, ఎస్20 ప్లస్ మోడళ్లను మార్చి నాటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో టాప్లో ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడో స్థానానికి పడిపోయింది. షావోమీ, వివో తొలి రెండు స్థానాలను ఆక్రమించేశాయి. 2019 జూన్ క్వార్టర్ నాటికి శాంసంగ్కు 25.3% మార్కెట్ వాటా కలిగి ఉండగా, డిసెంబర్ నాటికి అది 15.5%కి తగ్గింది. భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ ధర రూ.1.10 లక్షలు న్యూఢిల్లీ: శాంసంగ్.. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతవారంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఆల్ట్రా–ప్రీమియం స్మార్ట్ఫోన్ను ప్రదర్శించిన కంపెనీ.. ఇక్కడ మార్కెట్లో దీన్ని గురువారం విడుదలచేసింది. ధర రూ. 1.10 లక్షలు కాగా, రెండు యాప్లను ఒకేసారి తెరవగలిగే సౌలభ్యం ఇందులో ఉందని, సాంకేతిక ఆవిష్కరణలో మైలురాయిగా నిలిచిపోయే హ్యాండ్సెట్గా జెడ్ ఫ్లిప్ నిలిచిపోనుందని ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్(మొబైల్) ఆదిత్య బబ్బర్ వ్యాఖ్యానించారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి. -
52 కంపెనీలకు డేటా లీక్
వాషింగ్టన్: తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో పంచుకున్నామని, వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది. సెల్ఫోన్ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్కు శుక్రవారం ఆ కంపెనీ యాజమాన్యం వివరణిచ్చింది. ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్ ప్రతినిధుల సభకు చెందిన హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫేస్బుక్ సమర్పించింది. యాపిల్, అమెజాన్, బ్లాక్బెర్రీ, శాంసంగ్, అలీబాబా, క్వాల్కాం, పాన్టెక్ మొదలైన వాటితో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా ఆ దేశ నిఘా విభాగం పేర్కొన్న నాలుగు చైనా కంపెనీలు హ్యువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్లు కూడా ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, అలాగే ఆయా కంపెనీ ఉత్పత్తులతో ఫేస్బుక్ యాప్ అనుంధానం కోసం వివరాలు అందచేశామని ఫేస్బుక్ తెలిపింది.మొత్తం 52 కంపెనీల్లో 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని, జూలైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని ఫేస్బుక్ తెలిపింది. తాజా వివరాలపై ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ సభ్యుడు ఫ్రాంక్ పల్లోనే స్పందిస్తూ.. ‘ఫేస్బుక్ స్పందన సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది’ అని పేర్కొన్నారు. -
మైక్రోమాక్స్ పెద్ద టార్గెటే పెట్టుకుంది!
న్యూఢిల్లీ: దేశీయ ముబైల్ హ్యాండ్సెట్ మేకర్ మైక్రోమాక్స్ అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని భావిస్తోంది. మద్యప్రాచ్యం, ఆఫ్రికా, కామన్వెల్త్ దేశాల మార్కెట్లలోకి ప్రవేశించి.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా ఐదు అగ్రశేణి ముబైల్ ఫోన్ సంస్థల్లో ఒకటిగా నిలువాలని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా టార్గెట్ పెట్టుకుంది. గార్ట్నెర్ సంస్థ ప్రకారం 2015 జూన్తో ముగిసే త్రైమాసికానికి మైక్రోమాక్స్ సంస్థ అంతర్జాతీయంగా పదోస్థానంలో నిలిచింది. ఇప్పటికే తమకు రష్యా, బంగ్లాదేశ్, నేపాల్లో బలమైన మార్కెట్ ఉందని, ఇకముందు మరింత విస్తరిస్తామని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది. 'నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మార్కెట్లలో కొన్ని సంవత్సరాల కిందటే మా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించాం. ఇతర మార్కెట్లలోనూ మేం బాగా వృద్ధి చెందాం. రష్యా మార్కెట్లో మాకు ఐదుశాతం వాటా ఉంది' అని మైక్రోమాక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బిజినెస్) అమిత్ మథూర్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా టాప్ 5లో ఒకరిగా ఉండటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్లో మైక్రోమాక్స్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మేకర్గా ఉంది. దేశంలో మొబైల్ అమ్మకాల్లో శామ్సంగ్ తర్వాత రెండోస్థానంలో మైక్రోమాక్స్ ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement