-
రామ్కుమార్ పోస్ట్మార్టంపై నేడు నిర్ణయం
సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్కుమార్ మృతి కేసు న్యాయమూర్తులను సైతం సంకటంలో పడేస్తున్నది. ఈ కేసు విచారణలో ఇద్దరు న్యాయమూర్తులు మారారు. ముచ్చటగా మూడో న్యాయమూర్తిగా కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించి నిర్ణయం తీసుకోనున్నది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ అతడి కుటుంబీకులు ఆరోపించే పనిలో పడ్డారు. దీంతో తిరువళ్లూరు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నేతృత్వంలో విచారణ సాగుతున్నది. అదే సమయంలో పోస్టుమార్టం విషయంగా ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదని, తమకు చెందిన ప్రైవే టు వైద్యులను నియమించేందుకు తగ్గ అనుమతి ఇవ్వాలని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ రామ్కుమార్ తండ్రి పరమశివం, అతడి తరఫు న్యాయవాది రామరాజ్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణ గందరగోళానికి దారి తీశాయని చెప్పవచ్చు. దీంతో పోస్టుమార్టం నిలుపుదల చేశారు. మృతదేహం రాయపేట మార్చురీ వద్ద గట్టి భద్రత నడుమ ఉంచారు. ఈ పిటిషన్లను తొలుత వైద్యనాథన్ న్యాయమూర్తి, తదుపరి మరో న్యాయమూర్తిగా రమేష్ విచారించడం, ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండడంతో కేసు విచారణ న్యాయ వర్గాలకు సంకటంగా మారాయి. మంగళవారం విచారణ సాగాల్సి ఉన్నా, కేసు మరో బెంచ్కు మార్చడంతో ఆటంకం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ముందు రామ్కుమార్ తండ్రి పరమశివం తరఫున న్యాయవాది శంకర్ సుబ్బు హాజరై మరో బెంచ్కు న్యాయమూర్తి నియామకం గురించి వివరించారు. ఇందుకు స్పందించిన బెంచ్ మూడో న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్కు కేసును అప్పగించారు. ఈ బెంచ్ గురువారం విచారణ చేపట్టి, పోస్టుమార్టం విషయంలో ప్రైవేటు వైద్యుడి నియామకానికి సంబంధించి నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా గురువారం మధ్యాహ్నం తర్వాత రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగవచ్చు. -
పోలీసు మెడకు రామ్కుమార్ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జూన్ 24వ తేదీన నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణహత్య, తిరునెల్వేలీలో నిందితుడు రామ్కుమార్ అరెస్ట్, అతను అసలైన నిందితుడు కాదనే వాదనలు ఇలా ఈ కేసులో ప్రతి అడుగు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. క్రైం సినిమాను తలపించే రీతిలో మూడు నెలలుగా సాగుతున్న ఈ కేసు నిందితుడు రామ్కుమార్ ఆత్మహత్యతో సరికొత్త మలుపు తిరిగింది. జైలులోని కరెంటు వైరును నోటితో కొరికి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసు వర్గాల కథనం. వేలాది మంది ఖైదీలు, వందలాది మంది జైలు సిబ్బంది గస్తీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక ఖైదీ అంత సులువుగా కరెంటువైరు కొరికి ఉంటాడని, ఒక ఖైదీ ఇంత దారుణానికి పాల్పడుతుంటే సిబ్బంది ఏమి చేస్తున్నట్లు అనే అనుమానాలు తలెత్తాయి. రామ్కుమార్ది ఆత్మహత్య కాదు, హత్య అని అతని తండ్రి పరమశివం తదితరులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని పథకం ప్రకారం హతమార్చారని పరమశివం ఆరోపిస్తున్నారు. రామ్కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని ఆయన అన్నారు. రామ్కుమార్ నిందితుడే కాదని మరో ప్రచారం సాగుతున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో అతను అంతం కావడంతో స్వాతి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రామ్కుమార్ మరణంపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసు శాఖ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోస్టుమార్టంపై హైకోర్టు స్టే రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. రామ్కుమార్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రమే చేర్చినా హై కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రాయపేట ఆసుపత్రి చుట్టూ పెద్ద ఎత్తున ఆదివారం అర్ధరాత్రి వరకు రామ్కుమార్ బంధువులు, సానుభూతిపరులు చుట్టుముట్టి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు పెట్టారు. రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ప్రత్యేకంగా వైద్యబృందాన్ని నియమించారు. ఈ బృందం సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా రామ్కుమార్ న్యాయవాదులు రామ్రాజ్, విజయేంద్రన్ హైకోర్టును ఆశ్రయించారు. రామ్కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నందున పోస్టుమార్టంపై నిషేధం విధించాలని, ఈ కేసును అత్యవసర కేసుగా స్వీకరించాలని కోరారు. అయితే అత్యవసర కేసుగా తీసుకోవడం కుదరదని న్యాయమూర్తులు నిరాకరించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తయ్యేవరకు పోస్టుమార్టంను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తులు... రామ్కుమార్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసేవరకు పోస్టుమార్టంపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాల భగ్గు స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోమవారం డిమాండ్ చేశారు. ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత తదితరులు ఈ అంశంపై గళమెత్తారు. రామ్కుమార్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు డిమాండ్ చేశారు. పుళల్ జైలు వద్ద సోమవారం విపక్ష పార్టీలు ఆందోళన, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి నిరసన ప్రకటించాయి. అలాగే రామ్కుమార్ సొంతూరు సెంగోట్టై సమీపం మీనాక్షిపురంలో అతని బంధుమిత్రులు సోమవారం ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా మూడు ప్రభుత్వ బస్సులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. న్యాయవిచారణ ప్రారంభం రామ్కుమార్ది సహజమరణం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ కారణంగా ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి తమిళ్సెల్వి సోమవారం ఉదయం 9.20 గంటలకు రాయపేట ఆసుపత్రికి వచ్చారు. రామ్కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంపై ఉన్న గాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స చేసిన డాక్టర్లను విచారించి అక్కడి నుంచి పుళల్ జైలుకు చేరుకున్నారు. రామ్కుమార్ ఉన్న గది, కరెంటువైరు కొరికిన ప్రాంతాన్ని పరిశీలించి జైలు అధికారులను విచారించారు. -
రామ్కుమార్ శవపరీక్షకు స్పెషల్ టీమ్
చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్కుమార్ మరణంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. డాక్టర్లు, నిపుణులతో నలుగురు సభ్యుల టీమ్ను ఏర్పాటుచేసి రామ్కుమార్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్కుమార్ పుళల్ జైళ్లో ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇది కచ్చితంగా హత్యేనని, కేసును ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రామ్కుమార్ మరణంపై ఆయన సోదరుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విద్యుత్ వైర్ను కొరికి పట్టుకోవడంతో రామ్కుమార్ షాక్కు గురై చనిపోయినట్టు జైళ్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే జైళ్ల శాఖ వర్గాల వాదనలు పలు అనుమానాలు దారితీస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ఈ జైళ్లులో రామ్కుమార్ ఈ ప్రయత్నం ఎలా చేశాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైంది. సీసీటీవీ పుటేజీ ఆధారితంగా రామ్కుమార్ను జూలైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రామ్కుమార్ ఆత్మహత్య
ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్కుమార్ ఆదివా రం ఆత్మహత్య చేసుకున్నాడు. రిమాండ్ ఖైదీగా పుళల్ జైల్లో ఉన్న రామ్కుమార్ విద్యుత్ వైరును కొరికి మరీ బలవన్మరణానికి పాల్పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని, కేసు ను ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీ కులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్వాతి హత్య కేసు విచారణ ఇక ముగిసినట్టే అన్నది స్పష్టం అవుతోంది. సాక్షి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును చేదించేందుకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టారు. చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురంలో నక్కి ఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు. తాము పట్టుకునే క్రమంలో నిందితుడు రామ్కుమార్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెర మీదకు తెచ్చిన వాదనను అతడి కుటుంబీకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు. పోలీసులే బలవంతంగా గొంతు కోసి, తమ వాడ్ని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించే పనిలో పడ్డారు. అలాగే, కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో స్వాతి హత్య కేసుకు సంబంధించిన చార్జ్ షీట్ను కోర్టులో పోలీసులు దాఖలు చేయాల్సి ఉంది. అదే సమయంలో రామ్కుమార్ నిందితుడు అన్నది నిరూపించేందుకు తగ్గ ఆధారాల సేకరణ పోలీసులకు తలకు మించిన భారంగా మారిందన్న సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, అతడు ఆత్మహత్య చేసుకోలేదని, హతమార్చబడ్డాడన్న అనుమానాలతో ఆరోపణలు గుప్పించే వాళ్లు ఉండడం గమనార్హం. రామ్కుమార్ ఆత్మహత్య : పుళల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్కుమార్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మరణించాడు. అయితే, రామ్కుమార్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలు తొలుత బయటకు రాలేదు. మీడియాల్లో రామ్కుమార్ ఆత్మహత్య వార్త హల్చల్ సృష్టించడంతో జైళ్ల శాఖ వర్గాలు స్పందించాయి. సాయంత్రం 4.45 గంటల సమయంలో టీ తాగినానంతరం నీళ్లు కోసం వెళ్లిన రామ్కుమార్ వంట గది వద్ద ఉన్న స్విచ్ బోర్డుకు వెళ్తున్న విద్యుత్ వైర్ను కొరికి తెంచినట్టు వివరించారు. ఆ వైర్ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైనట్టు ప్రకటించారు. హుటాహుటిన తాము ఆసుపత్రికి తరలించామని వివరించారు. అయితే, జైళ్ల శాఖ వర్గాల వాదనలు అనుమానాలకు దారి తీసి ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుళల్లో రామ్కుమార్ ఎలా ఈ ప్రయత్నం చేసి ఉంటాడని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. ఇక, రామ్కుమార్ మృతదేహాన్ని రాయపేట మార్చురీకి తరలించిన సమాచారంతో అతడి న్యాయవాది రామ్రాజ్ పరుగులు తీశారు. శనివారం రామ్కుమార్ను తాను కలిసినట్టు, ఆరోగ్యంగా అతడు ఉన్నట్టు, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాని వ్యక్తిగానే కన్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునేంత మానసిక స్థితిలో అతడు లేదు అని ఆయన వాదిస్తుండడం అనుమానాలకు బలం చేకూరి ఉన్నాయి. అతడు మరణించిన సమాచారం కనీసం తనకు కూడా పోలీసులు చెప్పలేదని పేర్కొన్నారు. రామ్కుమార్ బంధువు సెల్వం మాట్లాడుతూ తమ వాడి మృత దేహాన్ని చూడడానికి కూడా తనను పోలీసులు అనుమతించడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. హత్యగా ఆరోపణ: రామ్కుమార్ మరణించిన సమాచారం తమకు అధికారికంగా అందలేదని, మీడియాల్లో వచ్చిన వార్తల ద్వారానే తెలిసిందని అతడి తండ్రి పరమ శివం ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాడు ఈ కేసులో నిర్దోషి అని, అతడ్ని అన్యాయంగా ఇరికించడమే కాకుండా, ఆధారాలు లభించక ఇప్పుడు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. రామ్కుమార్ మరణ సమాచారంతో మీనాక్షిపురంలో ఉద్రిక్తత నెల కొంది. మీనాక్షిపురం, పన్పోలి, సెంగోటైై్ట్టవడకరై పరిసరాల్లో రామ్కుమార్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణను సీబీఐకి అప్పగించినప్పుడే, స్వాతి హత్యకేసుతో పాటు రామ్కుమార్ కేసులోనూ దోషులు బయట పడతారని వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. రామ్కుమార్ మరణంతో ఇక స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. -
స్వాతి హత్య కేసును సీబీఐ విచారించాలి
హైకోర్టులో రామ్కుమార్ తల్లి పిటిషన్ కేకే.నగర్: చెన్నై, నుంగంబాక్కంకు చెందిన ఇన్పోసిస్ ఉద్యోగి స్వాతి గత జూన్ నెల నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తిరునెల్వేలి జిల్లా సెంగోడుకు చెందిన రామ్కుమార్ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచి జైల్లో నిర్భంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిజమైన నిందితుడిని రక్షించి అమాయకుడు అయిన తన కుమారుడిని అరెస్టు చేసినట్లు అందువలన ఈ హత్య కేసు సీబీఐ విచారణకు మార్చాలని మద్రాసు హైకోర్టులో రామ్కుమార్ తల్లి పుష్పం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో పిటిషన్దారులు పుష్పం తరఫున న్యాయవాది హాజరై ఈ హత్య కేసుపై నుంగంబాక్కం పోలీసులు సరిగ్గా విచారణ జరపలేదని, ఇంకనూ ఈ హత్య కేసులో ముత్తుకుమార్, ఇస్మాయిల్లకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిని పోలీసులు విచారణ జరపలేదని వాదించారు. స్వాతి శరీరంపై గల కత్తిపోట్లను చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసేందుకు అవకాశం లేదన్నారు. ఇంకనూ ఈ హత్య కేసులో తమను పోలీసులు విచారించరాదని ముఖ్యమంత్రి విభాగానికి పిటిషన్దారులు లేఖ రాశారని అన్నారు. అయినా ఈ కేసులో సంబంధం గల వారిని విచారించకుండా నిజమైన నిందితులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నందున ఈ కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాలని వాదించారు. పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ గాని, నివేదికను కాని దాఖలు చేయడానికి తాము ఇష్టపడలేదన్నారు. అందుకు బదులుగా స్వాతి హత్య కేసులో పోలీసులు జరిగిన సమగ్ర విచారణ వివరాలను కోర్టులో దాఖలు చేస్తామన్నారు. ఆ తరువాత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు తీర్పును వాయిదా వేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement