-
ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు
తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల విషయమై హైకోర్టులో విచారణ ముగిసింది. ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరు వారాల్లోగా సమకూర్చుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు సూచించింది. అలా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రతినిధితో పాటు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించి, సదుపాయాలు పరిశీలించాలని స్పష్టం చేసింది. ఆ పరిశీలనలో ప్రమాణాలు లేవని తేలితే అడ్మిషన్లు రద్దు చేయాలని కూడా హైకోర్టు తన ఆదేశాలలో తెలిపింది. -
ఏపీ, తెలంగాణ మధ్య జేఎన్ఏఎఫ్ఏయూ వివాదం
* తెలంగాణ కాలేజీలకే గుర్తింపునిచ్చిన వర్సిటీ * ఏపీ కళాశాలలతో సంబంధం లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తలెత్తుతోంది. అంబేడ్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల మాదిరిగానే తాజాగా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) కూడా అదే జాబితాలో చేరింది. పదో షెడ్యూల్లో ఉన్న ఈ యూనివర్సిటీ కేవలం తెలంగాణకు మాత్రమే సేవలందిస్తామని, ఏపీతో తమకు సంబంధం లేదని పేర్కొంటోంది. పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ తమవేనని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం, ఇటీవల ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, ఆయా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో వర్సిటీ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్కిటెక్ట్, ఫైన్ ఆర్ట్స్ కోర్సులతో జేఎన్ఏఎఫ్ఏయూను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ వర్సిటీ పనిచేస్తుండగా తెలంగాణ, ఏపీలో పది ప్రైవేట్ కాలేజీల్లో కోర్సులు కొనసాగుతున్నాయి. సదరు కళాశాలలకు అఫిలియేషన్తో సహా పరీక్షల నిర్వహణ వంటి కార్యకలాపాలన్నీ వర్సిటీయే చూస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జేఎన్ఏఎఫ్ఏయూ తెలంగాణలోని ఏడు కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఏపీలోని మూడు కాలేజీలకు నిలిపి వేసింది. ఏపీలో ప్రస్తుతమున్న మూడు కాలేజీలతో పాటు కొత్తగా మరో మూడు కాలేజీలు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, వర్సిటీ మాత్రం పాత కాలేజీలతో పాటు కొత్తగా ఏర్పాటు కావాల్సిన మూడు కాలేజీలకు అనుమతుల బాధ్యత నుంచి తప్పుకొంది. ఏపీ కళాశాలతో తమకు సంబంధం లేదని వర్సిటీ అధికారులు పేర్కొంటుండడం వివాదాస్పదంగా మారుతోంది. వర్సిటీ సీట్లలోనూ వాటా లేనట్లేనా? ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకత కలిగిన జేఎన్ఏఎఫ్ఏయూలో సీట్లను గతంలో మూడు ప్రాంతాల విద్యార్థులకు న్యాయం జరిగేలా కోటాను నిర్దేశించారు. దాని ప్రకారం 42 శాతం ఏపీకి, 22 శాతం రాయలసీమకు, 36 శాతం తెలంగాణకు దక్కుతుండేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశాలు జరిగితే అందుకు అవకాశముండేది. కానీ ఇప్పుడు ఏపీతో తమకు సంబంధం లేదన్నట్లుగా వర్సిటీ నిర్ణయాలు ఉండడంతో సీట్లలో కోటా అమలు ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్లోనే ఈ వర్సిటీ ఉండడం, ఇందులోని ప్రత్యేక కోర్సులేవీ ఏపీలో లేకపోవడంతో అక్కడి విద్యార్థులకు నష్టం వాటిల్లనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement