-
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
మందిరం దళితులది కాదా?
సందర్భం కాలగమనంలో మన ధర్మంలో ఏర్పడిన అనేక దురాచారాలను నేడు ఆచరించడం మానేశాం కానీ దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో నేటికీ వ్యతిరేకత ఉండటం విచారకరం. కాశీలో, శ్రీశైలంలో ఏ కులస్తుడైనా స్వయంగా శివలింగానికి అభి షేకం చేయవచ్చును. తిరుపతిలో, అన్నవరంలో, సింహాచలంలో... ఇలా అన్ని ప్రముఖ దేవాలయాలలో అన్ని కులాల వారికి, షెడ్యూలు కులాల వారికి దేవాలయ ప్రవేశం ఉంది. అయినప్పటికీ దేశంలోని కొన్ని గ్రామాల్లో నేటికీ దేవాలయంలోకి అందరికీ ప్రవేశం లేదు. ఇది హిందూ ధర్మం కాదు. ఇది దురాచారం. గతంలో చేసిన పొరపా టును అర్థం చేసుకుని అన్నికులాల వారికి సమాన గౌరవాన్ని కల్పిస్తూ దేవాలయ ప్రవేశం కల్పిద్దాం అనే సంకల్పంతో సామాజిక సమరసతా వేదిక తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తయింది. విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో 2014 మే 3న పునర్నిర్మితమైన శ్రీరామ మందిరంలోకి దళితులను రానివ్వలేదు. దీనిపై సామాజిక సమర సతా వేదిక నిజ నిర్ధారణ కమిటీ 29 మే 2014న గ్రామాన్ని దర్శించి నివేదికను ప్రభుత్వ అధికారులకు అందజేసింది. దళితులకు మద్దతుగా జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు 23 జూన్ 2014న ధర్నాను నిర్వహించింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం నుంచి అందవలసిన సహా యక చర్యల విషయంలో కృషి చేసి బాధితులకు అండగా నిలిచింది. ఈ స్ఫూర్తితోటే సమరసతా వేదిక బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ లకు చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వా నిస్తూ గ్రామస్తులందరి సహకారంతో గ్రామ దళితుల దేవాలయ ప్రవేశాన్ని దిగ్వి జయంగా పూర్తి చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల సమరసతా సమ్మేళనాన్ని 2016 ఆగస్టు 20న ఘనంగా నిర్వహించింది. ప్రముఖ పండితుడు, సామాజిక సమానతకై ఉద్యమించిన కావ్య కంఠ వాశిష్ట గణపతిముని సందేశ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని సామాజిక సమరసతా వేదిక విజయనగరం జిల్లా శాఖ నిర్వహించింది. శ్రీనివాసానంద స్వామీజీ (అధ్యక్షులు, ఉత్తరాంధ్ర సాధు పరిషత్, ఆనందా శ్రమము, శ్రీకాకుళం జిల్లా) వారి నేతృత్వంలో జక్కువ గ్రామంలోని దళితులు, సభకు ఇతర గ్రామాల నుంచి వచ్చినవారు ఆగస్టు 20న శ్రీరామ మందిరంలో ప్రవేశించి ఎంతో ఆనం దంగా ‘జైశ్రీరాం’ నినాదాలతో శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. సామాజిక సమానతకై కృషి చేసిన గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందులు, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ అంబేడ్కర్ల విగ్రహాలను కె. శ్యామ్ ప్రసాద్ (సమరసతా వేదిక, క్షేత్ర కన్వీనర్), శ్రీనివాసానంద స్వామి, దూసి రామకృష్ణ (ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర కార్య దర్శి), సోము వీర్రాజు (ఎమ్మెల్సీ) ఆవిష్కరించారు. విగ్రహాల నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన సుబ్బా రావు, జగన్మోహనరెడ్డి, విగ్రహాల నిర్మాత హరేంద్రనాథ్ ఉడయార్లను వేదిక సన్మానించింది. చుట్టు ప్రక్కల ఎనిమిది గ్రామాలకు చెందిన 75 మంది వివిధ కులాలకు చెందినవారు సభకు తరలివచ్చారు. సభానంతరం స్వామీజీతో సహా, ఇతర నాయకులు ఎస్సీ కాలనీలోని కుటుం బాలతో కలసి భోజనం చేశారు. మన ధర్మంలో వర్ణాలలో కాని, కులాలలోకాని హెచ్చు తగ్గులు లేవు. అస్పృశ్యత లేదు. మధ్యకాలంలో కొద్దిమంది స్వార్థ శక్తుల ప్రయత్నాలవల్ల కులాల పేరుతో అసమానతలు, అంటరానితనం ఏర్పడ్డాయి. ఇవి దురాచారాలు. వీటిని తొల గించుకుని బంధు భావంతో ఐకమత్యంగా ఉండాలని సమావేశంలో వక్తలు ప్రసంగించారు. నాసిక్ కాలారామ్ దేవాలయంలో దళితుల ప్రవేశం కోసం 1927లో డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వంలో సత్యాగ్రహం జరిగింది. నాటి దేవాలయ పూజారి దళితుల ప్రవేశాన్ని అంగీ కరించలేదు. ఆ పూజారి మనుమడు సుధీర్ మహారాజ్ నాశిక్ కాలారామ్ 1992లో అదే దేవా లయంలో జరిగిన సభలో పాల్గొంటూ, ‘ఆనాడు మా తాత గారు దేవాలయంలోకి ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వ్యవహరించారు. వారు చేసిన పొరపాటుకు నేను సభాముఖంగా క్షమాపణలు కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ లక్ష్యంతోటే సమరసతా వేదిక రాజకీయాలకు అతీ తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. వివిధ గ్రామాలలో సామాజిక సమానతను నిర్మించటమే ఈ సభా, విగ్రహాల ఆవిష్కరణ ముఖ్య లక్ష్యం, మన జీవితాలకు పరమార్థం. కె. శ్యామ్ప్రసాద్ వ్యాసకర్త కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement