-
ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ కుప్పకూలి నలుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం జరిగింది. అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు మత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. రాణిపేట జిల్లా నెమిలిలోని కిలివీడి గ్రామంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. మాండియమ్మన్ దేవాలయంలో గత రాత్రి ద్రౌపది అమ్మన్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. నెమిలికి చెందిన 50 మంది పోలీసులు మోహరించారు. సాధారణంగా సంక్రాంతి(పొంగల్) తరువాత ఈ పండుగను జరుపుకుంటారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మైలేరు ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రామానికి చెందిన వారు క్రేన్పై దేవతా విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అందిస్తున్న పూలమాలలను అమ్మవారికి అలంకరించేందుకు 25 అడుగుల ఎత్తైన క్రేన్పై ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అయితే క్రేన్పై బరువు ఎక్కువవడటంతో ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది. క్రేన్పై నున్న ముగ్గురు వ్యక్తులు కిందపడి అక్కడిక్కడే మరణించారు. అనూహ్య ఘటనతో ప్రజలు భయాందోళనలతో పరుగలు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలికతో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరక్కోణంలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి, పొన్నైలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు అక్కడ ఓ వ్యక్తి తీసిన ఫోన్లో రికార్డయ్యాయి. ఇందులో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన బాధితులను కే ముత్తుకుమార్(39), ఎస్ భూపాలన్(4), బి జ్యోతి బాబుఉ(17)గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TamilNadu | 4 people died & 9 others were injured after a #cranecollapsed during a temple festival event in #Keelveethi in #Arakkonam. #BREAKING #craneaccident #arakkonam #Accident #Temple #Death #India | #Crane | #Accident | #Dead | #Injury | #TN | #TempleFestival | pic.twitter.com/iKCjaw7OFV — Harish Deshmukh (@DeshmukhHarish9) January 23, 2023 -
ప్రాణం తీసిన కాసులు
ఆలయ ఉత్సవాల్లో ‘కాసుల’ కోసం ఎగబడ్డ భక్తులపై మృత్యువు పంజా విసిరింది. తొక్కిసలాటలో గాయాలతో, ఊపిరాడక ఏడుగురు మృతిచెందారు. మరో పదిహేను మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తిరుచ్చి తురయూరు వండితురై కరుప్పుస్వామి ఆలయ పరిసరాలు శోకసంద్రంలో మునిగాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు.. సాక్షి, చెన్నై: తిరుచ్చి జిల్లా తురయూరు సమీపంలోని ముత్తయం పాళయంలో వండితురై కరుప్పుస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా చిత్తిరై, చిత్రా పౌర్ణమి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడ ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను చాటే రీతిలో ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున భక్తులకు పిడి కాసుల్ని ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటే మహలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే. సిరి సంపదలు పెరుగుతాయన్నది భక్తులకు నమ్మకం. అలాగే, ఇక్కడ చెప్పే సోది తప్పకుండా ఫలిస్తుందని భక్తులు చెబుతుంటారు. అందుకే ఇక్కడి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలిరావడం జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా శనివారం సోది చెప్పే కార్యక్రమం జరిగింది. ఆదివారం పిడికాసుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కాసుల్ని వరంగా, కానుకగా తీసుకునేందుకు వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. పదిహేను జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివచ్చారు. కరుప్పుస్వామికి పూజల అనంతరం భక్తులకు పిడి కాసులు(పిడికిలి నిండా చిల్లర)పంపిణీకి పూజారి ధనపాల్ సిద్ధం అయ్యారు. తొలుత భక్తులు అందరూ బారులు తీరి మరీ కాసుల్ని అందుకుంటూ వచ్చారు. హఠాత్తుగా తొక్కిసలాట .. సజావుగా పంపిణీ సాగుతున్న సమయంలో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. కాసు ల పంపిణి ముగియనున్నట్టుగా ప్రచారం సాగడంతో, ఉన్న కాసుల్ని దక్కించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో తొపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని రక్షించే ప్రయత్నం కూడా చేయకుండా, వెనుక ఉన్న వాళ్లు తొక్కుకుంటూ ముందుకు సాగారు. క్రమంగా తొక్కిసలాట పెరగడంతో ఆ పరిసరాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కింద పడ్డ భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమై కాసుల పంపిణీ నిలుపుదల చేయించారు. భక్తుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. బలవంతంగా అక్కడున్న వాళ్లందర్నీ బయటకు పంపించారు. అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏడుగురు బలి తొక్కిసలాటలో ఏడుగురు సంఘటన స్థలంలోనే మరణించడం విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న బలగాలు, అంబులెన్స్లు, వైద్య బృందాలు పరుగులు తీశాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన తురయూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఐజీ వరదరాజులు, కలెక్టర్ సెల్వరాజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతులందర్నీ ఆసుపత్రికి తరలించినానంతరం, మృతుల వివరాలను సేకరించారు. మృతుల్లో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38). పెరంబలూరు జిల్లా వెప్పన్ తడైకు పిన్నకులంకు చెందిన రామర్(52), నామక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్ జిల్లా నన్నియూర్కు చెందిన లక్ష్మి కాంతన్(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్(52)గా గుర్తించారు. పదిహేను మంది గాయపడ్డట్టు తేల్చారు. ఆ ఏడుగురు తొక్కిసలాటలో గాయపడి, ఊపిరి ఆడక మరణించినట్టు విచారణలో తేలింది. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా, తమ వాళ్లు మరణించిన సమాచారంతో ఆప్తులు, బంధువులు ఆలయం వద్దకు తరలి రావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి. ఆలయ నిర్వాహకుడు, పూజారి ధనపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించడమే కాదు, పెద్ద ఎత్తున కానుకలు, విరాళాల్ని నిర్వాహకుడు స్వీకరిస్తూ వచ్చినట్టు విచారణలో తేలింది. మృతులకు సీఎం సాయం..... తిరుచ్చి తురయూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబానికి సీఎం పళనిస్వామి సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబా లకు సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష చొప్పున ప్రకటించారు. అలాగే, గాయపడ్డ వారిలో 12 మందికి తలా రూ. 50 వేలు సాయం ప్రకటించారు. కేంద్రప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ప్రకటించింది. -
మేం ఇస్లాంలోకి మారే పరిస్థితి రావొచ్చు!
కరూర్ (తమిళనాడు): వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వాపస్ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే.. అందుకు నిరసనగా తాము ఇస్లాం మతంలోకి మారుతామని వారు హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన గీత మాట్లాడుతూ తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై ఇలాగే వివక్ష కొనసాగిస్తే.. తాము బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే పరిస్థితి రావొచ్చునని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement