-
థాయ్ ప్రధాని తీరు చూస్తే అవాక్కే!
బ్యాంకాక్ : దేశాధ్యక్షులకు లేదా దేశ ప్రధాన మంత్రులకు మీడియాను చూస్తే చిర్రెత్తుకొస్తుందో ఏమో! వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటేనే చికాకు పడతారేమో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నలడిగిన జర్నలిస్టుల వైపు గుర్రుగా చూస్తారు. ‘అసలు నీవు రాసే వార్తలన్నీ నకిలీ వార్తలంటూ’ కొట్టి పారేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వారు అసలు మీడియానే దగ్గరికి రానీవ్వరు. వారు ప్రశ్నలడిగే అవకాశమే ఉండదు కనుక. థాయ్లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్–ఓచా వీరికి భిన్నంగా ఆలోచించారు. మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కొత్త రకం వ్యూహం పన్నారు. ఇటీవల ఓ ముఖ్యమైన మీడియా సమావేశంలో మైకు ముందు క్లుప్తంగా మాట్లాడారు. ప్రశ్నలడిగితే ‘ఇదిగో వీడిని అడగండీ!’ అంటూ తన నిలువెత్తు కటౌట్ను పక్కనే పెట్టించి చేతులూపుతూ వెళ్లిపోయారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఎన్నికలు, ఆందోళనకారుల అరెస్టులు....ఇలా ఎన్నో అంశాల గురించి ప్రశ్నలు అడుగుదామనుకొని వచ్చిన ప్రయూత్ ప్రవర్తనకు నోరెల్లబెట్టి తెల్లబోయారు. ఇక చేసేదేమీలేక ప్రధాని కటౌట్ ముందు సరదాగా వివిధ భంగిమల్లో ఫొటోలు, సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. -
గద్దె దిగను: థాయ్ ప్రధాని
బ్యాంకాక్: రెండో రోజుల్లోగా పదవి నుంచి తప్పుకోవాలన్న విపక్ష డిమాండ్ను థాయ్లాండ్ ప్రధాని యింగ్లుక్ షినవత్రా తోసిపుచ్చారు. ఆ డిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. దేశంలో తిరిగి శాంతి నెలకొనేందుకు రాజ్యాంగానికి లోబడి తాను చేయగలింది ఏమైనా ఉంటే చేయడానికి సిద్ధమని సోమవారం విలేకర్లతో అన్నారు. ప్రజలు ఎన్నుకోని ప్రజామండలికి అధికారం కట్టబెట్టాలన్న విపక్ష నేత సుథెప్ థాగ్స్బాన్ డిమాండ్ రాజ్యాంగం ప్రకారం ఆచరణ సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. మరోపక్క.. బ్యాంకాక్లో సోమవారం కూడా విపక్ష మద్దతుదారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రభుత్వ భవనం, మెట్రోపాలిటన్ పోలీస్ సంస్థల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వందలాది ఆందోళనకారులపై పోలీసులు రబ్బరు తూటాలు, బాష్పవాయివు ప్రయోగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement