-
శ్రీశైల దేవస్థానం సీఎస్వోపై వేటు
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో)గా విధులు నిర్వర్తి స్తున్న కె. నాగేశ్వరరావుపై వేటు పడింది. గిరిజన యువకుడు అంకన్నను చితకబాదిన సంఘటనను సీరియస్గా తీసుకున్న ఈవో భరత్గుప్త.. సీఎస్వోను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా రిటైరైన నాగేశ్వరరావు ఐదు నెలల క్రితం తిరిగి సీఎస్వోగా చేరారు. కాగా, ఆలయ ప్రాంగణంలో భక్తులు పడేసే చిల్లరను ఏరుకుంటున్నాడంటూ సోమవారం మధ్యాహ్నం గిరిజన యువకుడు బయల అంకన్న (17)ను సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్లో లాఠీతో నాగేశ్వరరావు చితకబాదారు. ఈ దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో అదే రోజు రాత్రి ఆయనను వి«ధుల నుంచి తప్పిస్తూ ఈవో ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. సీఎస్వో తనను కులం పేరుతో దూషిస్తూ లాఠీతో దాడి చేశారంటూ బాధితుడు అంకన్న మంగళ వారం వన్టౌన్ ఎస్ఐ వరప్రసాద్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నేత బలమురి పరమేశ్వర్, కొమురం భీం సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఆశీర్వాదం దేవస్థానం ఈవోకు, వన్టౌన్ ఎస్ఐకు వినతిపత్రం అందజేశారు. -
యువకుడి దారుణ హత్య
సీతంపేట: సామరెల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మీనక శరత్కుమార్(20) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. భూతగాదాల నేపథ్యంలో బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. హత్యకు గురైన యువకుడి తల్లి కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సామరెల్లి గ్రామానికి చెందిన వెంకటేష్కు ఇద్దరు భార్యలు శాంతమ్మ, పూర్ణమ్మ ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితం వెంకటేశ్ చనిపోవడంతో ఇద్దరి భార్యల మధ్య భూమి విషయమై తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పూర్ణమ్మ కుమారుడైన శరత్కుమార్ ఈనెల 28న అచ్చిబలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో తల్లి పూర్ణమ్మ కుమారుడి ఆచూకీ కోసం గాలించింది. ఈలోగా అచ్చిబ నుంచి అంటికొండకు వెళ్లే దారి పక్కన శరత్ మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. వెళ్లి చూడగా తల, శరీరంపై తీవ్రగాయాలుండడంతో హత్యకు గురైనట్టు నిర్థారణకు వచ్చింది. ఈ దారుణానికి వెంకటేశ్ భార్య శాంతమ్మ కుమారుడు కొండలరావు, ఆయన బావ సుందరరావు పాల్పడి ఉంటారని అనుమానిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, కొత్తూరు సీఐ అశోక్కుమార్, ఎస్ఐ శ్రీనివాసరావులు శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement