-
తెలంగాణలో ఉజ్జీవన్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా తెలంగాణకు కార్యకలాపాలు విస్తరిస్తోంది. తొలుత అయిదు శాఖలను ప్రారంభించనుంది. వీటిలో నాలుగు వచ్చే వారంలోనూ, మరొకటి వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఇతిరా డేవిస్ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వచ్చే ఏడాది వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు, అలాగే తమ టాప్ 10 మార్కెట్లలో తెలంగాణ కూడా ఒకటిగా నిలవగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు డేవిస్ తెలిపారు. ప్రస్తుతం 71 లక్షలకు పైగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తున్నామని, కొత్త వాటితో కలిపి ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 598 శాఖలు ఉంటాయని వివరించారు. పసిడి, ట్రాక్టర్ లోన్స్పై దృష్టి.. బంగారం రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, ట్రాక్టర్ లోన్స్పైనా దృష్టి పెడుతున్నట్లు డేవిస్ చెప్పారు. ప్రస్తుతం తమ పోర్ట్ఫోలియోలో సూక్ష్మ రుణాల విభాగం 71 శాతంగా ఉండగా మిగతాది అఫోర్డబుల్ హౌసింగ్ మొదలైన విభాగాల్లో ఉంటోందని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో సూక్ష్మ రుణాల పోర్ట్ఫోలియోను 50 శాతానికి తగ్గించుకోవడం ద్వారా సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతౌల్యం సాధించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి శాఖల సంఖ్యను 625కి పెంచుకోనున్నామని డేవిస్ చెప్పారు. తెలంగాణ శాఖల్లో తొలుత 30 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరోవైపు, మాతృ సంస్థను విలీనం చేసుకునే రివర్స్ మెర్జర్ ప్రక్రియ జూన్–సెప్టెంబర్ మధ్యలో పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. -
రికార్డ్ లాభాలను సాధించిన ఉజ్జీవన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో రూ. 294 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఒక క్వార్టర్కు బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 274 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 63 శాతం జంప్చేసి రూ. 1,140 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం సైతం 54 శాతం ఎగసి రూ. 993 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 8.1 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 11.8 శాతం నుంచి 5.06 శాతానికి, నికర ఎన్పీఏలు 3.29 శాతం నుంచి 0.04 శాతానికి దిగివచ్చాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో క్విప్ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. -
అలోక్కు ఆర్ఐఎల్ దన్ను- ఉజ్జీవన్ భళా
ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేశాక పునర్వ్యస్థీకరణ పూర్తిచేసుకున్న అలోక్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి లిస్టయ్యింది. తదుపరి మార్కెట్లతోపాటే భారీ హెచ్చుతగ్గులను చవిచూస్తోంది. ఇక మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం.. అలోక్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ రంగంలో సమీకృత కార్యకలాపాలు కలిగినప్పటికీ భారీ రుణాలు, నష్టాలతో దివాళా బాట పట్టిన అలోక్ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల వెలుగులో నిలుస్తోంది. జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్ణన్ కంపెనీతో కలసి డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాదిలో అలోక్ను కొనుగోలు చేసింది. ఈ సంస్థలు సంయుక్తంగా వేసిన రూ. 5050 కోట్ల బిడ్ను 2019 మార్చిలో ఎన్సీఎల్టీ అనుమతించింది. ఈ నేపథ్యంలో పునర్వ్యస్థీకరణ పూర్తిచేసుకున్న అలోక్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 27న రూ. 14 వద్ద తిరిగి లిస్టయ్యింది. తదుపరి మార్చి 31కల్లా ఈ షేరు రూ. 3.92కు పతనమైంది. తదుపరి మార్కెట్లతోపాటు జోరందుకుంది. వరుసగా 17 రోజులపాటు అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. తాజాగా ఎన్ఎసఈలో మరోసారి 5 శాతం ఎగసి రూ. 16.85 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి మార్చి 31 కనిష్టం నుంచి 330 శాతం ర్యాలీ చేసింది. ఈ మార్చికల్లా అలోక్ ఇండస్ట్రీస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 37.7 శాతం వాటాను కలిగి ఉంది. సంపన్నవర్గాలు, రిటైలర్లు 45.67 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఉజ్జీవన్ ఫైనాన్స్ ఎన్బీఎఫ్సీ.. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 77 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 80 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 590 కోట్ల నుంచి రూ. 805 కోట్లకు ఎగసింది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలో అనుబంధ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రభావితంకానున్నట్లు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. దీంతో భవిష్యత్లో పనితీరుపట్ల ప్రస్తుతం అంచనాలను వెల్లడించలేమని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ షేరు 9.5 శాతం జంప్చేసి రూ. 171 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 176ను సైతం అధిగమించింది. కాగా ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 415 నుంచి ఈ కౌంటర్ 50 శాతం పతనంకావడం గమనార్హం! -
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్
సాక్షి,ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్ను నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను మించి లిస్టింగ్లో దూసుకు పోయింది. స్టాక్మార్కెట్లలో గురువారం లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు ఏకంగా 60 శాతం ప్రీమియంతో రూ. 62 వద్ద లిస్ట్ అయింది. గత వారం తన 750 కోట్ల ఐపీవోలో 165 రెట్లు సబ్స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37 కాగా ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దీంతో గ్రే మార్కెట్లో ఈ స్టాక్పై అంచనాలు అధికమయ్యాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టింగ్ జరగవచ్చని నిపుణలు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను మించి ఇష్యూ ధర కంటే 60 శాతం అధికం కావడం విశేషం. అలాగే పేరెంట్ కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.4,300 కోట్ల కన్నా ఎక్కువ. -
‘ఉజ్జీవన్’ ఐపీఓ... అదుర్స్
న్యూఢిల్లీ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 114 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 486 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 50 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రైబయ్యా యి. మొత్తం మీద ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఏడాదిలో ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక స్పందన వచ్చిన ఇష్యూ ఇదే. ఈ ఐపీఓకు ప్రైస్బ్యాండ్గా రూ.36–37ను కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. అప్పర్ ప్రైస్బ్యాండ్(రూ.37) ధరకు దాదాపు రెట్టింపు ధరకు ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని అంచనా.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement