-
మనుషుల్లాగా మాకు గంజాయి తాగే అలవాటు లేద్సార్!
మనుషుల్లాగా మాకు గంజాయి తాగే అలవాటు లేద్సార్! -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
'నాకు పెళ్లి కావాలి'.. పిల్ల దొరికేసిందిగా..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కైరానాకు చెందిన అజీమ్ మన్సూరి.. వయసు 26. పెళ్లీడొచ్చిన అతడికి పిల్ల దొరకడం లేదట. కారణం అతడు 30 ఇంచుల పొడవు మాత్రమే ఉండటం. దీంతో కాబోయే భార్య కోసం ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలిసిపోయాడు. ఇలా కాదని గత నెలలో ఏకంగా పోలీసులనే సాయం కోరాడు. తనకో మంచి వధువును వెతికిపెట్టమని అభ్యర్థించాడు. ఇంకేముందీ.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతడికిప్పుడు రెండు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఒకటి ఘజియాబాద్కు చెందిన రెహనా అన్సారిది. అతడి హైటే ఉన్న ఈ యువతి అజీమ్ను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానంటోంది. అంతేకాదు, తనను అర్ధాంగిగా స్వీకరిస్తే.. చేదోడువాదోడుగా ఉంటానంటోంది. ఆమె తండ్రి కూడా ఎలాగైనా ఈ పెళ్లి ఖాయమయ్యేందుకు అబ్బాయి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నాడు. ఈ వివాహానికి అబ్బాయి తరపువాళ్లు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాడు. ఇక ఢిల్లీకి చెందిన మరో మహిళ అజీమ్తో జీవించేందుకు తహతహలాడుతోంది. "నేను అతడితో ఓ మాట చెప్పాలనుకుంటున్నా. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ నేనూ ఒంటరిదాన్నే. నేను అతడిని పెళ్లాడాలనుకుంటున్నాను" అని ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అజీమ్ వరకు చేరింది. తనకు రెండు సంబంధాలు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన అజీమ్ ఈ ప్రపంచంలో తనకంటూ ఒకరున్నారని ఆ దేవుడు రుజువు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మాత్రమే కాదు పలు చోట్ల నుంచి కూడా అమ్మాయి ఉంది చేసుకుంటారా? అంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయట. అయితే అజీమ్ ఫ్యామిలీ మాత్రం హాపూర్కు చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా చేయనున్నారట. ఈ లెక్కన వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లోనో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనో జరిగే అవకాశాలున్నాయి. చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం! జనం పరుగో పరుగు.. ఇండియన్ ఏనుగు అంతే! -
కారుపైన యువకుడి పుషప్స్.. ఊహించని ట్విస్ట్
‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు... కానీ ఎంత మూల్యానికి’ అని థియేటర్లలో, టీవీలలో కనిపించే ప్రకటన గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ సంఘటనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రన్నింగ్ కారు పైకి ఎక్కి పుషప్స్ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విట్స్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉజ్వల యాదవ్ అనే కుర్రాడు సోలోగా కారు డ్రైవింగ్ చేస్తూ షికారు కెళ్లాడు. రహదారిపైకి రాగానే స్టన్నింగ్ స్టంట్స్ చేద్దామని భావించి డ్రైవ్ చేస్తున్న స్టీరింగ్ వదిలేసి కారు పైకి ఎక్కాడు.. రన్నింగ్లో ఉన్న కారుమీదనే పుషప్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 61 వేల మంది వీక్షించడంతోపాటు వందలాది మంది కామెంట్ చేశారు. నెట్టింటా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా చివరికి ఉత్తర ప్రదేశ్లో పోలీసుల కంటికి చిక్కింది. ఇంకేముంది ఉజ్వల్ చేసిన ఘనకార్యానికి పోలీసులు తగిన మూల్యం విధించారు. ‘కొన్ని పుషప్స్ మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయి. ఎంతో కష్టపడ్డావ్ కదా. నీ కష్టానికి ఇదిగో బహుమతి’ అంటూ అతనికి భారీగానే చలాన్ విధించారు. డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడం నేరమని. ఇది మీతోపాటు ఇతరులకు హానీ కలిగించవచ్చు అని యూపీ పోలీసులు తమ ట్విటర్లో పేర్కొన్నారు. అలాగే ఇలా ఎవరైన చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్ అధికారి అజయ్ కమార్ హెచ్చరించారు. దీంతో పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక స్టంట్స్తో హీరో అవుదామనుకున్న ఉజ్వల్కు చివరికి పోలీసులు షాక్ ఇవ్వడంతో ఖంగుతిన్నాడు. అయితే అలా చేసినందుకు క్షమాపణలు కోరుతూ.. మరోసారి రిపీట్ చేయనంటూ చెప్పడం కొసమెరుపు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..! -
‘తాండవ్’ రూపకర్తలపై క్రిమినల్ కేసు
ముంబై: వెబ్సిరీస్ ‘తాండవ్’ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వెబ్సిరీస్లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్సిరీస్లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్లో ప్రీమియర్ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్సిరీస్లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం.. మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్’ వెబ్సిరీస్ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement