-
సహోద్యోగి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి వర్షిత నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే హాస్పిటల్లో పని చేస్తున్న మధు అనే వ్యక్తి డబ్బుల కోసం వేధించడంతో హాస్టల్లో అధికంగా స్టెరాయిడ్లు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: (తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని టెన్త్ విద్యార్థిని దారుణం..) -
నమ్మదగని రోజులు
‘‘అమ్మా! భవ్య వాళ్లింట్లో ఆడుకుంటా’’ అని పాపాయి అడిగిన వెంటనే తల్లి ‘‘అలాగే వెళ్లిరా! గోడలెక్కకు, చెట్ల కొమ్మలు పట్టుకుని వేళ్లాడకు. బొమ్మలతో ఆడుకుని వచ్చెయ్యి’’ అని జాగ్రత్తలు చెప్పి పంపించే రోజులు కావివి. పాపాయి వెళ్లే ఇంట్లో ఎవరెవరుంటారు? వాళ్ల ప్రవర్తన ఎలాంటిది? పాపాయిని ఒంటరిగా పంపించడం శ్రేయస్కరమేనా అని ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాల్సిన రోజులు దాపురించాయి. ఇందుకు వర్షిత, ద్వారక తాజా ఉదాహరణలు. వర్షిత ఐదేళ్ల పాపాయి. చిత్తూరు జిల్లాలో ఓ గ్రామం. అమ్మానాన్నలతో పెళ్లికి వెళ్లింది. పెళ్లిలో ఒక వ్యక్తి పాపాయిని దగ్గరకు తీశాడు. చిన్న పిల్లలంటే ఇష్టం కాబోలనే అనుకున్నారు చూసినవాళ్లు. పాపాయితో సెల్ఫీలు తీసి, ఆ ఫొటోలను వర్షితకు చూపిస్తూ మాలిమి చేసుకున్నాడు. అతడి చేష్టలను ఏ మాత్రం అనుమానించకపోవడం వల్ల పాపాయి తల్లి కూడా కొద్దిసేపు దృష్టి మరల్చింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి రెప్పపాటు కాలం సమాజాన్ని నమ్మడమే ఒక అఘాయిత్యానికి దారి తీసింది. వర్షిత కనిపించడం లేదని గ్రహించి వెతికేటప్పటికే ఆమె విగతజీవిగా మారింది. అంతకంటే ముందు అత్యాచారానికి గురైంది. సమాజంలో నశించిపోయిన సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ కన్ను వేస్తే సరిపోదు సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘పోక్సో’ చట్టాన్ని పరిహసిస్తూ పసిపిల్లల మీద లైంగిక నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నారని తెలిస్తే ‘హమ్మయ్య! ఓ గంట సేపు అల్లరిని భరించే కష్టం తప్పిపోతుంది’ అనుకుంటే అంతకంటే అవివేకం మరోటి ఉండదంటున్నారు ఆక్టోపస్ ఎస్పీ రాధిక. ‘‘ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకువస్తుందో ఊహించలేం. పిల్లలు మనింట్లో ఆడుకుంటున్నప్పుడు వాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచితే సరిపోతుంది. బయట వేరే ఇళ్లలో ఆడుకోవడానికి వెళ్తే రెండు కళ్లూ వాళ్ల మీదనే ఉండాలి. ఆ వెళ్లే ఇంటి గురించి, ఆ ఇంటి మనుషుల గురించి తెలియకపోతే పిల్లల్ని ఒంటరిగా పంపించనేకూడదు. ఇలాంటి ప్రమాదాలు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ తప్పడం లేదు’’ అన్నారు రాధిక. ఎటు నుంచి అయినా! వాచ్మన్ దగ్గర నుంచి డ్రైవర్, ఇంట్లో పనివాళ్లు, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు ఇళ్లవాళ్లు, ట్యూషన్మాస్టర్, సహోద్యోగులు.. ఎవరినీ గుడ్డిగా నమ్మి పిల్లల్ని వాళ్ల చేతిలో పెట్టే పరిస్థితి నేడు లేదు. వీధి చివర ఉండే కిరాణా కొట్టులో పని చేసే కుర్రాళ్ల నుంచి ప్రమాదాలు ఎదురైన సంఘటనలూ ఉన్నాయి. ఇంట్లో పని వాళ్ల నుంచి అపార్ట్మెంట్ పనుల వరకు ఒక కొత్త వ్యక్తిని పనిలో పెట్టుకునేటప్పుడు వారి పూర్వాపరాలను విచారించుకోవాలి. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు సెక్యూరిటీ గార్డు నుంచి, బస్ క్లీనర్ నియామకం వరకు ఆచితూచి చూడాలి. నేరచరిత్ర ఉన్నవారిని, తాగుబోతులను ఇలాంటి ఉద్యోగాల్లో అస్సలే పెట్టుకోకూడదు. ప్రతిఘటించడానికి శక్తి లేని, ఏం జరిగిందో చెప్పలేని పసిపిల్లలనే కామాంధులు టార్గెట్ చేస్తున్నారు. విజయవాడలో ద్వారక అనే ఎనిమిదేళ్ల చిన్నారిని ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తే చంపేసిన ఘటనను.. పిల్లల విషయంలో ఎంత తెలిసిన వాళ్లనైనా నమ్మకూడదు అనే హెచ్చరికగా పరిగణించాలి. వాకా మంజులారెడ్డి అంతకన్నా నేరం ఉండదు ‘‘చాలా మంది లైంగిక నేరగాళ్లు పిల్లలతో ముందుగా ఇలాంటి చనువు ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల్ని ఆడుకోవడానికి పంపించి పేరెంట్స్ టీవీ సీరియళ్లకు అతుక్కుపోతుంటే అంతకంటే పెద్ద నేరం మరొకటి ఉండదనే చెబుతాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలను వేరెవరి మీదనైనా వదలాల్సి వచ్చినప్పుడు కూడా సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడుతూ వాళ్లు ఆటల్లో ఎవరెవరితో కలుస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసం భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడిపోతున్నారు. పిల్లలకు అందమైన బాల్యాన్ని పదిలంగా పరిరక్షించగలిగితే అంతకు మించిన సంపద మరొకటి ఉండదు. రాధిక జి.ఆర్. ఎస్.పి. ఆక్టోపస్, ఏపీ -
నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి
నాగారం మండలం ఈటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ నీళ్ల బకెట్లో పడి వర్షిత(2) అనే చిన్నారి మృతిచెందింది. చేతులు కడుక్కోవడానికి చిన్నారి తల్లి బయటకు వెళ్లినపుడు ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement