-
ఎంత విషాదం.. వీధి కుక్కల దాడి.. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి
గత కొన్ని రోజులుగా వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. విచక్షణ రహితంగా పిల్లలను కరిచి, గాయపరచడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్నాయి. తాజాగా వీధికుక్కల దాడికి మరో బాలుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అయితే రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం. వివరాలు.. వసంత్ కుంజ్ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు. రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి పంపారు. అయితే ఈ విషాదం జరిగిన రెండు రోజుల్లోనే మరో ఘోరం చోటుచేసుకుంది. ఆనంద్ తమ్ముడు ఆదిత్య, అతని బంధువులు కొందరు ఆదివారం వారి ఇంటి నుంచి కొంచెం బయటకు వెళ్లారు. ఆదిత్య దగ్గరి నుంచి కొంచెం దూరంగా వెళ్లిన బంధువు చందన్ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆదిత్యను వీధికుక్కలు కరవడం చూశాడు. భయంతో చందన్ గట్టిగా అరవడంతో.. అక్కడే ఉన్న ఆనంద్ మరణంపై దర్యాప్తు చేస్తున్నఓ పోలీసు అధికారి చందన్ అరుపులు విని ఆదిత్యను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు
ఢిల్లీలోని వసంతకుంజ్ లో ఓ కారు పెట్రోల్ బంక్ లో పెట్రోలు నింపుకుని వెళ్తున్న ఓ కారు పొరబాటుగా పెట్రోల్ పోసే పైప్ ను కూడా లాగేయడంతో మొత్తం పెట్రోల్ పోసే మెషీన్ కూడా ఊడి వచ్చేసింది. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన శనివారం జరిగింది. దీంతో పెట్రోల్ మొత్తం బంక్ అంతా పాకి ఉన్నట్టుండి భగ్గుమంది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి గాయపడ్డాడు. మిగిలిన వారు మాత్రం ఎలాంటి ప్రమాదమూ లేకుండా బయటపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో మంటలు విస్తరించలేదు. ఒక వేళ పెట్రోలు నిలువ ఉంచే ట్యాంకు వరకూ మంటలు వ్యాపించి ఉంటే ఎన్నో ప్రాణాలు ఆవిరైపోయి ఉండేవి. నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి తాలూకు చిత్రాలు, కారు నంబరు బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని సిబ్బంది చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఆ కారు యజమాని కోసం వెతుకుతున్నారు. -
రోడ్డున పడ్డ వందమందికి పైగా అభాగ్యులు
న్యూఢిల్లీ: ఆమెకు 32 ఏళ్లు.. మతిస్థిమితం లేదు.. బాహ్య ప్రపంచంతో ఎటువంటి నిమిత్తం లేకుండా వ్యవహరిస్తుంది.. ఆమె బాగోగులు ఎవరో ఒకరు చూడాల్సిందే.. అటువంటి ఆమెను మంగళవారం ఉదయం ఎవరు మాట్లాడించినా ‘మా ఇల్లు పోయింది..’ అనే మాట తప్ప ఇంకేం మాట్లాడటంలేదు. ఆమే కాదు వందకు పైగా ఉన్న వివిధ రుగ్మతలతో బాధపడుతున్న ఆ అభాగ్యులకు ఐదేళ్ల నుంచి నీడనిచ్చిన స్థలం, భవనాలను వారు విడిచి పెట్టాల్సి వచ్చింది. దాంతో వారిని తెల్లారేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పక్కన టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్లతో వేసిన గుడారాల్లోకి మార్చారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని వసంత్కుంజ్లో ఒక ఎకరం స్థలంలో కొందరు వ్యక్తులు ఆశ్రమం ఏర్పాటుచేశారు. అందులో వయోవృద్ధులు, అనాథ బాలలు, మహిళలు, ఎయిడ్స్ బాధితులు, అత్యాచార బాధితులు తదితరులు వందమందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్ పేరిట కొందరు ఔత్సాహికులు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘దీని కోసం ఐదేళ్లకు ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద ఎకరం స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. సదరు లీజు సోమవారంతో ముగిసింది. దాంతో అతడు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అప్పటికప్పుడు వందమందికి పైగా అభాగ్యులను ఎక్కడికి తరలించాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపక్కన గుడారాలను ఏర్పాటుచేసి వారికి ఆశ్రయం కల్పించాం..’ అని ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన రవి కర్లా తెలిపారు. ‘వసంత్కుంజ్లోని నెల్సన్ మండేలా రోడ్డుకు అభిముఖంగా ప్రస్తుతం ఆశ్రమం ఉన్న స్థలానికి సమీపంలో అంతే విస్తీర్ణం ఉన్న స్థలం లీజుకు లభించలేదు. లీజు ముగుస్తుందన్న సమయంలో నేను ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ను, లెఫ్టినెంట్ గవర్నర్ తేజీంద్ర ఖన్నాను, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసి విన్నవించుకున్నాను. వారందరూ నా కృషిని అభినందించారు. మా ఆశ్రమానికి ఒక ఎకరం స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి, గవర్నర్ కొన్ని నెలల క్రితమే హామీ ఇచ్చారు. కాని ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ కోసం స్థలాన్ని విరాళంగా ఇవ్వమని తానేమీ ప్రభుత్వాన్ని కోరడంలేదని, ఈ అభాగ్యులకు నీడనివ్వడానికి ఎక్కడైనా స్థలం చూపిస్తే అద్దె చెల్లించడానికి తాము సిద్ధమని’ కర్లా స్పష్టం చేశారు. ‘వీరి గురించే మాకు చాలా బెంగగా ఉంది. నడిరోడ్డున పడ్డాం.. ప్రస్తుతం నగరంలో డెంగీ ప్రబలి ఉన్న నేపథ్యంలో వీరిలో ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి?’అని గత రెండేళ్లుగా ఈ సంస్థలో వలంటీర్గా పనిచేస్తున్న సుల్తాన్ సింగ్ ప్రశ్నించారు. ‘నేను ఇక్కడ పిల్లలకు చదువు చెబుతుంటాను.. నిన్న సాయంత్రం వారికి చదువు చెప్పాను.. ఉదయానికి వారు రోడ్డు మీద ఉన్నారన్న వార్త తెలిసి నిర్ఘాంతపోయాను.. వస్తూ వస్తూ వారి కోసం కొన్ని ఆహార పదార్థాలను తీసుకువచ్చాను..’ అని ఢిల్లీ ఐఐటీలో లైబ్రేరియన్గా పనిచేసి రిటైరైన తరునా సాహా అన్నారు. ఆమె నాలుగేళ్లుగా ఈ సంస్థలో వలంటీర్గా సేవలందిస్తున్నారు. -
ఎమిటీ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఎమిటీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నోయిడా పోలీసులు శనివారం తెలిపారు. వసంత్కుంజ్ ప్రాంతంలోని ఘిటోర్నీ గ్రామంలోని తన ఇంట్లోనే అరుణ్కుమార్ లోహియా ఉదయం ఆరింటికి ఉరి వేసుకున్నాడని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించ ాల్సిందిగా ఘటనాస్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement