-
TS Crime News: నిందితులను గుర్తిస్తే.. వెంటనే ఈ నంబర్కి..! : మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్
వరంగల్: వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం జరిగిన విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగి నాముతాబాజీ రాంచందర్(65) హత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ టి. నరేష్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే కరీమాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై ప్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు నిందితులు బైక్పై పరారీ అవుతున్నట్లు కనిపించింది. నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి.. రాంచందర్ను హత్య చేసిన నిందితులు బైక్పై పరారవుతున్న ఫొటోలను విడుదల చేశామని, ఎవరైనా నిందితులను గుర్తించినా, వారి ఆచూకీ తెలిసినా వెంటనే తమకు సమాచారం అందించాలని మిల్స్కానీ ఇన్స్పెక్టర్ టీ. సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు నిందితులు హీరో ఫ్యాషన్ బైక్పై పరారవుతున్న ఫొటోలను శుక్రవారం విడుదల చేశారు. నిందితులను గుర్తించిన వారు వెంటనే మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712685119, ఐటీ సెల్ వరంగల్ ఇన్స్పెక్టర్ 8712685159, టాస్క్ఫోర్స్ వరంగల్ ఇన్స్పెక్టర్ 8712685150, మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ నంబర్ 8712685006 సమాచారం అందజేయాలని కోరారు. -
లాహోర్లో ఖలిస్తానీ ఉగ్రవాది కాల్చివేత
లాహోర్: వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్(63) పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో హతమయ్యాడు. పంజాబ్ ప్రావిన్స్ లాహోర్లోని తన నివాసానికి సమీపంలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన అతడిపై గుర్తు తెలియని దుండగులు దగ్గర్నుంచి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అతడితోపాటు గార్డు కూడా చనిపోయాడు. ఖలిస్తానీ కమాండో ఫోర్స్–పంజ్వార్ గ్రూపునకు ఇతడే నాయకుడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–2020 ప్రకారం భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజ్వార్ హత్యాఘటనపై వ్యాఖ్యానించేందుకు లాహోర్ పోలీసులు నిరాకరించారు. 1986లో ఖలిస్తానీ కమాండో ఫోర్స్లో చేరిన పంజ్వార్ అనంతరం సొంత కుంపటి పెట్టుకుని పాక్కు పరారయ్యాడు. పంజాబ్, హరియాణా, చండీగఢ్ల్లో జరిగిన పలు పేలుడు ఘటనలకు ఇతడి ప్రమేయం ఉంది. -
మహేశ్బాబుతో సినిమా చేస్తున్న రోజులవి.. నమ్మినవాడే మోసం చేశాడు
అమృతరావు.. తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. అదీ సూపర్ స్టార్ మహేశ్బాబుతో.. అతిథి సినిమాలో మహేశ్తో జోడీ కట్టిందీ హీరోయిన్. దానికి ముందు, తర్వాత హిందీ సినిమాలే చేస్తూ బాలీవుడ్లో స్థిరపడిపోయింది. అమృత తన జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనలను కపుల్ ఆఫ్ థింగ్స్ అనే పుస్తకంలో రాసుకొచ్చింది. అందులో తన మేనేజర్ చేసిన మోసాన్ని ప్రస్తావించింది. "అప్పుడు నేను మహేశ్బాబుతో సినిమా చేస్తున్నాను. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్లో ఉన్నాను. ఒకరోజు సాయంత్రం తాజ్ బంజారా హోటల్లో బోనీ కపూర్తో పనిచేసిన వ్యక్తిని చూశాను. అతడు నన్ను చూడగానే హాయ్ అమృతా అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు. ఎలా ఉన్నావు అంటూ బాగోగులు అడిగి, నీకు డేట్స్ సర్దుబాటు అయ్యుంటే మాతో పాటు సల్మాన్ ఖాన్ వాంటెడ్ షూటింగ్లో ఉండేదానివి అన్నాడు. ఆ మాటకు నేను బ్లాంక్ అయ్యాను. అసలు వాంటెడ్ కోసం నన్నెప్పుడు అడిగారని తిరిగి ప్రశ్నించాను. దానికతడు 'అలా అంటావేంటి? వాంటెడ్ కోసం నిన్నే సంప్రదించాం. నీ మేనేజర్కు ఫోన్ చేశాం. కానీ ఆయన నీ డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని చెప్పాడు' అని తెలిపాడు. ఆ మాట విని నా గుండె ముక్కలైంది. అంత పెద్ద ఆఫర్ వచ్చిందన్న విషయం మేనేజర్ నాకు చెప్పనేలేదు. నన్ను మోసం చేశాడు. అంత మంచి ఆఫర్ నాదాకా వస్తే నేనెందుకు మిస్ చేసుకుంటాను. కచ్చితంగా డేట్స్ ఇచ్చేదాన్ని. పొమ్మనలేక పొగ బెట్టినట్లు.. తను స్వతాహాగా నా దగ్గర ఉద్యోగం మానేయడానికి బదులు నేనే అతడిని వెళ్లగొట్టేలా చేశాడు. కానీ ఇలా వాంటెడ్ ఛాన్స్ మిస్ చేసి.. మర్చిపోలేని బాధను గిఫ్ట్ ఇచ్చాడు" అని రాసుకొచ్చింది అమృత. 2006లో వచ్చిన పోకిరి సినిమాకు రీమేక్గా వాంటెడ్ తెరకెక్కింది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, ఆయేషా టకియా, వినోద్ ఖన్నా, ప్రకాశ్ రాజ్, ఇందర్ కుమార్, మహేశ్ మంజ్రేకర్ తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సెన్సేషన్ సృష్టించింది. 2009లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. -
ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!
గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్గా పని చేసే జగన్.. పార్ట్ టైంలో డిజైనర్గా కూడా పని చేస్తున్నాడు. నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం.. ఎన్నో పోస్టర్లు డిజైన్ చేశా. నా కోసం ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు. ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. నైంటీస్లో పుట్టిన తనకు ఇదొక టఫ్ టైం అంటున్నాడు ఎమ్మెఎస్ జగన్. ఇంటర్నెట్లో మీమ్స్తో పాటు కొంతమంది ఫోన్ కాల్స్ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్ తయారు చేస్తాడంట. -
లష్కరే టాప్ ఉగ్రవాది సలీం పర్రే హతం
జమ్మూ/శ్రీనగర్: శ్రీనగర్ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement