-
‘వక్ఫ్’ ఫిర్యాదులపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదుల పరిశీలన నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కేంద్రం ఏక సభ్య కమిషన్ను నియమించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఇక్కడ జరిగిన ఆలిండియా వక్ఫ్ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలపై రాష్ట్రాలు కూడా ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాఫియా చెర నుంచి వక్ఫ్ భూములకు విముక్తి కల్పించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను, భూములను ముస్లింల సామాజిక, ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించాలని కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 4,49,314 రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్నాయని, వాటి వార్షిక ఆదాయం రూ.163 కోట్లు, స్థిరాస్తుల విలువ 1.2 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా ఏడాదికి 12 వేల కోట్ల ఆదాయం రాబట్టవచ్చని, వాటిని ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేస్తే వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు సంభవించే అవకాముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు మైనారిటీల పాఠశాలలు, కాలేజీలు, నైపుణ్య కేంద్రాలు, ఆస్పత్రుల నిర్మాణాలు చేపడితే కేంద్రం సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు. -
‘వక్ఫ్’ కమిటీకి రాజకీయ గ్రహణం
► కొత్త పాలకవర్గానికి ► ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరు ► ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ ఆస్తులు మహబూబ్నగర్ అర్బన్ : వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. వాటిని పరిరక్షించాల్సిన జిల్లా కమిటీకి రాజకీయ గ్రహణం పట్టుకుంది. అస్తిత్వం కోసం అధికార పార్టీ నాయకులు గత వక్ఫ్ కమిటీ పాలకవర్గాన్ని రద్దు చేయించి సుమారు ఏడాదిన్నర పూర్తవుతోంది. కాంగ్రెస్ హయాంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అధ్యక్షతన జిల్లా వక్ఫ్ కమిటీని వేయగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు పాలకవర్గాన్ని రద్దు చేయించారు. అనంతరం జిల్లా వక్ప్ బోర్డు సీనియర్ ఇన్స్పెక్టర్ మహ్మద్ గౌస్ను స్పెషల్ ఆఫీర్గా నియమించారు. కానీ నూతన కమిటీ వేయడంలో జాప్యం చేశారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యే మధ్య ఆదిపత్య పోరు నడుస్తుండటంతో ప్రక్రియ ముందుకు సాగడంలేదని మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెండు సార్లు చైర్మన్గా పనిచేసిన వ్యక్తినే తిరిగి ఆ పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ బడా నాయకుడు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కొంత మంది మైనార్టీ నాయకులు మంత్రులతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఇప్పటిదాకా వక్ఫ్ కమిటీ చెర్మైన్గా పని చేసిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని, ఎవరైనా ముందుకొస్తే తమకూ అదే పరిస్థితి ఉంటుందన్న భయంతో ఎవరూ ముందుకు రావడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సీఎం స్వయంగా కోరినా జిల్లా నాయకులు మిన్నకుండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగి స్తోంది. పాలకవర్గం లేక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ పరంపర కొనసాగుతూనే ఉంది. 1954లో దేవాదాయ శాఖ నుంచి వక్ఫ్ బోర్డు విడిపోయినప్పుడు జిల్లాలో 11,800 ఎకరాలున్న భూములు ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలకు చేరాయి. -
వక్ఫ్ భూములే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వక్ఫ్ ఆస్తులపై జిల్లా యంత్రాంగంలో కదలిక మొదలైంది. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ ఆస్తులను రీ సర్వే చేయడంతో పాటు ఆక్రమణదారుల పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నారు. వీరి పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసి.. వక్ఫ్ బోర్డు పేరిట ఆస్తులను బదలాయించాలని కూడా జిల్లా అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కల్లూరులోని 356 సర్వే నెంబరులోని 21 ఎకరాల 79 సెంట్ల స్థలంతో పాటు సర్వే నెంబరు 124లో ఉన్న భూమి కూడా వక్ఫ్బోర్డుదేనని జిల్లా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ మేరకు కలెక్టర్తో పాటు వక్ఫ్బోర్డు సీఈవోకు కర్నూలు జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ నివేదిక సమర్పించినట్టు సమాచారం. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. పాసు పుస్తకాలు రద్దు జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను వెంటనే సర్వే చేయించడంతో పాటు ఈ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నంద్యాలలోని నూనెపల్లిలో వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకున్న వారిపై కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా పై రెండు సర్వే నెంబర్లను మళ్లీ రీ-సర్వే చేయడంతో పాటు ఈ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నారు. వీరి పాసుపుస్తకాలను రద్దు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఆస్తులను వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకూ రంగం సిద్ధమైంది. మొత్తం మీద వక్ఫ్ఆస్తులు వక్ఫ్బోర్డుకే చెందేట్టుగా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్శాఖ అధికారులపైనా చర్యలు వాస్తవానికి కల్లూరులోని సర్వే నెంబరు 124 వక్ఫ్బోర్డు ఆస్తి అని.. ఈ ఆస్తిని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించవద్దని ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకు వక్ఫ్బోర్డు లేఖ రాసింది. అయినప్పటికీ ఈ లేఖను పక్కన పెడుతూ 2014 ఆగస్టులో రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది వివిధ వ్యక్తుల పేర్ల మీద ముక్కలు ముక్కలు చేసి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కదులుతోంది. అదేవిధంగా కర్నూలు గ్రామంలోని సర్వే నెంబరు 62లోని 5.32 ఎకరాల భూమి కూడా వక్ఫ్బోర్డుదేనని అధికారులు గుర్తించారు. అయితే, ఈ సర్వే నెంబరులో రీ-సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలని వక్ఫ్బోర్డు సీఈవోకు స్థానిక ఇన్స్పెక్టర్ లేఖ రాశారు. అదేవిధంగా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకట్టవేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని ఆయన ఈ లేఖలో కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేయాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశించాలని కూడా ఈ లేఖలో సీఈవోను ఆయన కోరినట్టు తెలిసింది. ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు వక్ఫ్బోర్డు ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఎవరైనా ఆక్రమించినా...పాసు పుస్తకాలు జారీ అయినా రద్దు చేస్తాం. అవసరమైతే పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వెంటనే వారిని ఖాళీ చేయిస్తాం. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. - సీహెచ్ విజయమోహన్, కలెక్టర్, కర్నూలు -
వక్ఫ్ ఆస్తుల బాధ్యత ప్రభుత్వానిదే: పల్లె
హైదరాబాద్: 'వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏ ఒక్కరికో చెందినవి కావు. ఇవన్నీ ముస్లిం కమ్యూనిటీవి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే౮ అని మైనార్టీ, వక్ఫ్ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం వక్ఫ్ శాఖాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లు విలువ చేసే వక్ఫ్ బోర్డ్ భూములను లీజుకి ఇవ్వడంతో పాటు, కమ్యూనిటీ కాంప్లెక్స్లను నిర్మించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనార్టీల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు. -
కబ్జా హఠావో.. వక్ఫ్ బచావో
ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరుతూ ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఉర్దూఘర్ షాదీఖానా నుంచి ఈ ప్రదర్శన బయల్దేరింది. నగరపాలక సంస్థ కార్యాలయం, బస్టాండ్, వైరారోడ్డు, జెడ్పీసెంటర్ మీదుగా హజ్రత్ తాలీమ్ మస్తాన్ దర్గా వరకు కొనసాగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.అసద్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష వైఖరి వల్లే జిల్లాలో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని విమర్శించారు. వక్ఫ్చట్టం 1995ను అనుసరించి ఆక్రమణదారులను సెక్షన్ 54(1), 54(3), 55 ప్రకారం తొలగించాల్సి ఉన్నా కలెక్టర్, ఆర్డీఓలు ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఖమ్మంలోని ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న తాలీమ్ మస్తాన్ దుర్గాకు చెందిన వక్ఫ్ భూమి (సర్వే నంబర్లు 264, 265)ని 132 మంది ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా భూమిని వదిలి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. తెలియక చేసిన తప్పు క్షమార్హమని, అదే తెలిసి చేస్తే సహించరానిదని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీ తలపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘వక్ఫ్ బచావో’ పేరుతో శాంతి ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాణోతు భద్రూనాయక్, ముస్లిం మైనారిటీ ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నజీరుద్దీన్, వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ సయ్యద్ షుజా, బీసీ సంఘం నాయకురాలు షేక్ సకీనా, కాంగ్రెస్ నాయకులు అక్బర్ , రజీ మ్, దర్గా కార్యదర్శి మధా ర్, ఇన్సాఫ్ కమిటీ నాయకులు యాఖూబ్, ముజావర్ అక్బర్, జాకీర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement