-
బాల్యానికి సంకెళ్లు
పొద్దు పోయే వేళకు సీతాకోక చిలుకల్లా రివ్వున వీధిలో దూసుకుపోతూ వెళ్లే చిన్నారులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? రాత్రి పూట చందమామను, నక్షత్రాలను అంతులేని ఆశ్చర్యంతో చూసే బాలలు ఎక్కడున్నారు? ఇంటిలోని పూజలు, పండుగల సమయంలో అమ్మానాన్నల వెంటే ఉంటూ వారికి సాయం చేసే కుర్రాళ్లు అరుదైపోయారు కదా..! హోం వర్కులు, క్లాస్వర్కులు, ట్యూషన్లు, కోచింగ్లు, క్రికెట్, టీవీ, సినిమాలు, మొబైల్ ఫోన్ల మధ్య అందమైన బాల్యం కనుమరుగైపోతోంది. రాయలేనంత హోం వర్కులు చేయమంటూ, మోయలేనన్ని పుస్తకాలను మోయండంటూ బాల్యాన్ని ఇంటివారే చిదిమేస్తున్నారని చాలా మంది నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం అంతమైపోతున్నా పట్టించుకోకుండా ఫోన్లో గేములాడే యువత.. అలా మారడానికి కారణం తల్లిదండ్రులు, విద్యా సంస్థలేనని వారి నిశ్చిత అభిప్రాయం. అందమైన బాల్యాన్ని ప్రైవేటు విద్యాసంస్థకు తాకట్టు పెట్టి, చదువు పేరుతో మెదడు నిండా ఒత్తిడి నింపుతున్న వైనంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - పాలకొండ పాలకొండకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన కొడుకుని పదో తరగతి పరీక్షలు పూర్తి కాగానే విశాఖలోని ఫలితాలు కూడా రాకుండా ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన నెల రోజుల్లో ఆ కుర్రాడు రెండు సార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. అప్పటికి ఇంకా పది ఫలితాలు విడుదల కాకపోవడం విశేషం. నేటి తరం విద్యార్థులు ఎంతగా ఒత్తిడికి గురవుతున్నారో చె ప్పడానికి ఈ ఉదాహరణ చాలదా. తల్లిదండ్రుల కోణంలో వారు చేస్తున్నది మంచిగానే తోస్తున్నా... విద్యార్థుల కోణంలో మాత్రం అది భరించలేనంత బాధ. ఏటా జిల్లాలో పెరుగుతున్న యువకుల ఆత్మహత్యలే ఈ బాధకు ఉదాహరణలు. రెండేళ్లుగా అయితే ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఓ అధికారిక నమోదు వివరాల ప్రకారం గత విద్యా సంవత్సరంలో 53 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అందరూ కార్పొరేట్ కాలేజీ వారే కావడం విశేషం. సర్కారు బడైతే అవమానమా..? ‘పిల్లాడిని పెద్ద స్కూలులో చదివించాలి. ఫీజు ఎంతైనా ప ర్లేదు. అందరూ గొప్పగా మాట్లాడాలి...’ చాలా మంది తల్లిదండ్రుల తీరు ఇలాగే ఉంది. బడాయికి పోయి పిల్లాడిని ఏదో ఒక ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి అప్పగిస్తున్నారు. ఆ బడి బాధలు తట్టుకోలేక పిల్లలు నరకం చూస్తున్నారు. స్కూలు చదువుతున్న పిల్లల నోటి వెంట కూడా ఆత్మహత్య వంటి పదాలు వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాబి రామ్ మాటల్లో చెప్పాలంటే... తల్లిదండ్రులు తాము పనిలో ఉండి పిల్లల్ని ఆశ్రద్ధ చేస్తున్నామేమో అనుకుంటూ చదువు చదువు ఉంటూ అధిక ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలకు టెన్షన్ కలిగిస్తున్నారు. కొంచెం చదువుకున్న తల్లిదండ్రులైతే అది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన సర్వేలు పరిశీలిస్తే మంచి ర్యాంకులు సాధించిన పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం గమనార్హం. కూలీలు నయం కదా.. ఒకప్పుడు బాల్యం అంటే అదో మధుర జ్ఞాపకం. ఇప్పుడు బాల్యం ఒత్తిడితో సతమతమవుతోంది. ఉదయం 7 గం టలకు మోయలేనంత బ్యాగ్ను వీపు మీద వేసుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి చేరడం నిత్యకృత్యమైంది. పిల్లలకు రెండేళ్లు దాటిన మరుక్షణమే బల వంతంగానైనా పాఠశాలలో చేర్పించటం అలవాటుగా మారింది. ఇది మొదలు జీవితంలో స్థిరపడినంత వరకు తీవ్రమైన ఒత్తిడిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ధోరణే విపత్కర పరిణామాలకు దారి తీస్తోంది. నాలుగైదేళ్ల కిందటి వరకు మార్కుల పేరుతో ఒత్తిడికి గురి చేసే వారు. ఇప్పుడు గ్రేడింగ్లు వచ్చినా తల్లిదండ్రుల తీరు మాత్రం మారడం లేదు. డిప్రెషన్లో కనిపిస్తున్నారు... ప్రస్తుతం పిల్లలు అనారోగ్యంతో వస్తున్నారు. వీరిని పరి శీలిస్తే డిప్రెషన్లో ఉన్నట్టు ఇ ట్టే అర్థమవుతుంది. దీనికి కార ణం ఒత్తిడే. చదువులో ముం దంజలో ఉండడం కోసం విపరీతమైన ఒత్తిడిని పిల్లలపై తీసుకొస్తున్నారు. వంద మంది పిల్లలను పరిశీలిస్తే 80 శాతం పిల్లలు డిప్రెషన్లో కనిపిస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే అనర్థాలకు దారితీస్తుంది. చదువును మార్కులతో జత చేయకుండా విజ్ఞానం కోసం ఉపయోగించేలా మార్చాల్సి ఉంది. - జె.రవీంద్ర కుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి.. విద్యా సంస్థల్లో పిల్లలను చే ర్పించిన తల్లిదండ్రులు మా ర్కులు కోసం తీవ్రంగా ఒత్తి డి తీసుకొస్తున్నారు. పిల్లల కంటే ముందు వారి మా ర్కులను తెలుసుకొనేది తల్లిదండ్రులే. తమ పిల్లాడికి పక్క అబ్బాయి కంటే ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయని నిల దీస్తున్నారు. మార్కులు ఎప్పటికప్పుడు తెలియజేయకపోతే ఇతర పాఠశాలలకు మార్చేస్తున్నారు. దీంతో పిల్లలపై సహజంగా ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. - టి.జగన్నాధంనాయుడు, కరస్పాండెంట్, నవోదయ ప్రైవేట్ పాఠశాల అధిక సిలబస్తోనే... సాధారణంగా విద్యాసంవత్సరానికి విద్యార్థులు స్థాయికి సరిపోయిన స్థాయిలో ప్రభుత్వం సిలబస్ను త యారు చేస్తుంది. ఇది చాలదని విద్యా సంస్థల్లో అదనపు సిలబస్ను రుద్దుతున్నారు. అలా అదనపు సిలబస్ ఉన్న పాఠశాలలకే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లాడి జ్ఞాపిక శక్తి కంటే అదనపు సమాచారాన్ని వారికిస్తున్నారు. దీంతో పిల్లలు తీ వ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అదనపు సిలబస్ బోధనను నిరోధించాలి. - ఐ.వెంకటరావు, ఉపవిద్యాశాఖాధికారి. -
బ్యాగు..భారం
అమ్మా...భుజం, వెన్ను నొప్పి వేస్తోంది..కాళ్లు గుంజుతున్నాయి. అంటు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వికాస్ బ్యాగు టేబుల్ పై పెట్టి విశ్రాంతికి ఉపక్రమిస్తున్నాడు. ఇంటికి రాగానే నీరసం. ఏమి తినలేడు. తాగలేడు. అసహనానికి గురవుతాడు..ఇదీ విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ ఇంట్లో పిల్లలు పలికే అవస్థల పలుకులు. ఎందుకంటే వారి వయస్సుకు మించిన పుస్తకాల బరువు మోస్తున్నారు మరీ..! ఈ వ్యవస్థ మారేదెప్పుడో?..పిల్లల కష్టాలు తీరేదెప్పుడో?. - స్థాయికి మించిన పుస్తకాల మోత - విద్యార్థుల్లో పెరుగుతున్న అసహనం - అమలు కాని యశ్పాల్ కమిటీ సిఫార్సులు - వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు - మానసికగ్రస్తులుగా మారుతున్నారని తల్లిదండ్రుల ఆందోళన మంచిర్యాల అర్బన్ : నర్సరీ నుంచి పదో తరగతి వరకు పిల్లలను విద్య పేరిట పుస్తకాల బరువులు మోయిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, కంపాక్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా వయస్సుకు మించిన అధిక భారం మోస్తున్నారు. చదువు చారెడు..పుస్తకాలు బోలెడు అన్న చందంగా ఉంది విద్యార్థుల దుస్థితి. బరువు భారం పెరిగే కొద్దీ విద్యార్థుల్లో వెన్నుపూస నొప్పి వస్తోంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు భవనాల్లో ఉండడంతో మూడు, నాలుగు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి ఉంటోంది. రోడ్డుపై నడవడం గగనం కాగా నాలుగు అంతస్తుల భవనం మెట్లెక్కడం ఎంత కష్టమో తల్లిదండ్రులు, యాజమాన్యాలు గమనించడం లేదు. పిల్లలు కాన్వెంట్ చదువులతో ఉన్నత స్థితికి చేరాలని ఆరాటపడుతారే కానీ వారి బరువు భారం గురించి వీసమెతై ్తన యోచించడం లేదు. యశ్పాల్ కమిటీ చేసిన సిఫార్సులు కూడా అమలు కావడం లేదు. ఏటా విద్యా సంస్థల ఆరంభంలో పుస్తకాల బరువుపై చర్చ జరుగుతోంది. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం షరా మామూలే. అయితే విద్యాశాఖ అధికారులు చిత్తశుద్ధితో సిఫార్సులు అమలు చేస్తే విద్యార్థులకు పుస్తకాల బరువుతోపాటు వారిలో మానసిక ఆందోళన తగ్గుతుంది. తల్లిదండ్రులు ఏమి చేయాలి? విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సూచనలు పాటిస్తే మంచిది. పిల్లలు ఎన్ని పుస్తకాలు తీసుకువెళ్లాలి. బ్యాగ్ బరువు ఎంత వరకు ఉండాలో స్వయంగా చూడాలి. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులు బ్యాగ్ బరువు 2 నుంచి 5 కేజీల వరకు ఉండేలా చూడాలి. ఐదు నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల బ్యాగు బరువు ఏడు కేజీలలోపు ఉండాలి. సాధ్యమైంత వరకు పుస్తకాల బరువు ఎక్కువగా ఉండకుండా చూడాలి. బ్యాగులు కూడా తక్కువ బరువు ఉన్నవి కొనుగోలు చేయడం వల్ల బరువును తగ్గించవచ్చు. నిబంధనలు బేఖాతర్ విద్యార్థుల పుస్తకాల బరువు ఎంత ఉండాలి.. ఎలాంటి విద్యను అందించాలి, విద్యా విధానం విలువల గురించి ఓ కమిటీ చేసిన సిఫార్సులు బుట్టదాఖలు అవుతున్నాయి. ఏ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న పాపానపోవడం లేదు. విద్యా శాఖ అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు శాపంగా మారారనే ఆరోపణలున్నాయి. దేశంలోని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1992లో యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్ నేతత్వాన సిఫార్సు కమిటీని నియమించారు. వారు దేశంలోని విద్యావ్యవస్థలను అధ్యయనం చేసి కేంద్రానికి పలు సిఫార్సులు చేశారు. వాటిని కేంద్రం ఆమోదిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 2005 నుంచి విద్యాహక్కు చట్టంలో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు రెండు నుంచి మూడు కిలోల బరువు, ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు 5 నుంచి 6 కిలోల పుస్తకాల బరువు మోయరాదని సూచించింది. విద్యార్థులను యంత్రాలుగా చూడరాదని స్పష్టంగా హెచ్చరించింది. అయినా ఏ ప్రభుత్వం కూడా ఆచరణలో అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఇవీ అనర్థాలు - విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. - నడుం, వెన్ను నొప్పి, కండరాల నొప్పి వస్తుంది - మానసిక ఆందోళన పెరుగుతుంది. చదువుపై మనసు లగ్నం చేయలేరు - త్వరగా నీరస పడుతారు. ఆటలు ఆడలేరు. బాగా చదవలేరు - జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆకలి వేయదు - పుస్తకాలను చూడగానే ఆందోళనకు గురవుతారు - పాఠశాలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అసహనానికి గురవుతారు. చీటికి మాటికి ఏడ్వడం, మంకుపట్టు పడతారు
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement