-
ఇంగ్లండ్ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్ విండీస్దే..!
ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. గుడకేశ్ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్ (4-0-25-2), అకీల్ హొసేన్ (4-0-20-2),హోల్డర్ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిలిప్ సాల్ట్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. లివింగ్స్టోన్ (28), మొయిన్ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్ ఛార్లెస్ (27), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (30) సాయంతో షాయ్ హోప్ (43 నాటౌట్) విండీస్ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ వెనువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్ సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్.. వరుసగా రెండు సిరీస్లను కోల్పోయింది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్ను చేజార్చుకుంది. -
వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్లతో విధ్వంసం
ఐపీఎల్-2024 వేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆన్సోల్డ్గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రెండు రౌండ్లలో కూడా సాల్ట్ను సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయిన కోపాన్ని సాల్ట్ వెస్టిండీస్పై చూపించాడు. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో సాల్ట్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో కరేబియన్ బౌలర్లను సాల్ట్ ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 119 పరుగులు చేశాడు. సాల్ట్కు ఈ సిరీస్లో ఇది వరుసగా రెండో సెంచరీ. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా సాల్ట్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అలెక్స్ హేల్స్(116) పేరిట ఉండేది. ఈ మ్యాచ్తో హేల్స్ రికార్డును సాల్ట్ బ్రేక్ చేశాడు. ఇక సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్ను చూసిన నెటిజన్లు.. ఫ్రాంచైజీలు అతడిని తీసుకోక తప్పు చేశాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా 2022, 23 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు సాల్ట్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 సీజన్కు ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన సాల్ట్ ఆన్సోల్డ్గా మిగిలిపోయాడు. Stunning victory to level the series! 🦁 Scorecard: https://t.co/C5Ns5auLYY#EnglandCricket | 🏝️ #WIvENG 🏴 pic.twitter.com/OXkPqGoA9r — England Cricket (@englandcricket) December 19, 2023 చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? -
ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో 75 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 2-2 సమం చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వసంం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 267 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 119 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో సాల్ట్కు వరుసగా ఇది రెండో సెంచరీ. అతడితో పాటు కెప్టెన్ జోస్ బట్లర్(29 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్స్లు), లివింగ్ స్టోన్(21 బంతుల్లో 54) మెరుపు సెంచరీలతో చెలరేగారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోస్సేన్, రస్సెల్, హోల్డర్కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 15.10 ఓవర్లలో ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. పూరన్(39),రూథర్ ఫర్డ్(36) తమ వంతు ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లతో చెలరేగగా.. కుర్రాన్, రెహన్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు. వీరితో పాటు మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐసీసీ ఫుల్మెంబర్ జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. -
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్..
విధ్వసంకర ఆటగాడు షిమ్రాన్ హెట్మైర్కు వెస్టిండీస్ సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఇంగ్లండ్ సిరీస్లో మిగిలిన రెండు టీ20లకు ప్రధాన జట్టు నుంచి హెట్మైర్ను సెలక్టర్లు తప్పించారు. ఇంగ్లండ్తో తొలి రెండు మ్యాచ్లు ఆడిన హెట్మైర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హెట్మైర్పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో డేంజరస్ ఆటగాడు జాన్సెన్ చార్లెస్తో విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్లకు జోషఫ్ స్ధానంలో ఓషానే థామస్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐదు మ్యాచ్ల సిరీస్లో విండీస్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ట్రినిడాడ్ వేదికగా డిసెంబర్ 20న జరగనుంది. మిగిలిన రెండు టీ20లకు విండీస్ జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్ -
ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 7 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 31 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ విజయానికి ఆండ్రీ రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే పెద్దగా ఫామ్లో లేని బ్రూక్ స్ట్రైక్లో ఉండడంతో విండీస్ విజయం లాంఛనమే అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను బ్రూక్ తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్లు, ఓ ఫోర్ బాది ఇంగ్లండ్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రూక్తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఆర్హెచ్ తప్పు చేసింది..!? ఐపీఎల్-2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున హ్యారీ బ్రూక్ ఆడాడు. గత సీజన్ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ బ్రూక్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2024 సీజన్కు ముందు హ్యారీని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో విండీస్పై బ్రూక్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఎస్ఆర్హెచ్ అతడిని వదిలి తప్పు చేసింది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అతడికి మరోక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. 𝗧𝗵𝗲 𝗛𝗜𝗚𝗛𝗘𝗦𝗧 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹 𝗿𝘂𝗻 𝗰𝗵𝗮𝘀𝗲 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝘁𝗵𝗲 𝗪𝗲𝘀𝘁 𝗜𝗻𝗱𝗶𝗲𝘀! 🏏 Just watch this final over... Harry Brook take a bow! 👏#WIvENG pic.twitter.com/raErDRlvTZ — Cricket on TNT Sports (@cricketontnt) December 16, 2023 -
చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్
గ్రెనిడా వేదికగా వెస్టిండీస్తో ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ కెప్టెన్ పావెల్ బంతిని సీనియర్ ఆండ్రీ రస్సెల్ను బంతిని అందించాడు. అయితే స్ట్రైక్లో ఉన్న హ్యారీ బ్రూక్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అనంతరం రెండు, మూడు బంతులను సిక్స్లు బాది మ్యాచ్ను ఇంగ్లండ్ వైపు మలుపు తిప్పాడు. ఈ క్రమంలో చివరి మూడు బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. బ్రూక్ ఐదో బంతికి సిక్స్ బాది ఇంగ్లండ్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో పూరన్(82) పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 డిసెంబర్ 19న జరగనుంది. చదవండి: రింకూ సిక్సర్ సింగ్ -
ఇంగ్లండ్కు ఏమైంది..? విండీస్ చేతిలో మరో ఘోర పరభావం
వెస్టిండీస్ గడ్డపై ఇంగ్లండ్కు మరో పరాభావం ఎదురైంది. గ్రెనడా వేదికగా విండీస్తో జరిగిన రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో బట్లర్ సేన వెనకంజలో ఉంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లలో సామ్ కుర్రాన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 3వికెట్లతో అదరగొట్టగా.. అకేల్ హోసేన్ రెండు, హొల్డర్, మోటీ తలా వికెట్ పడగొట్టారు. బ్రాండెన్ కింగ్ విధ్వంసం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండెన్ కింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ పావెల్(28 బంతుల్లో 52) అద్భుత ఇన్నింగ్స్తో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, మిల్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్, కుర్రాన్, అహ్మద్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 16న గ్రెనిడా వేదికగానే జరగనుంది. అయితే టీ20ల్లో అద్బుత రికార్డు ఉన్న ఇంగ్లండ్ ఈ తరహా ప్రదర్శన కనబరుస్తుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం మూడో టీ20లో అయినా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే విండీస్తో వన్డే సిరీస్ను ఇంగ్లండ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
క్రికెట్లో కొత్త రూల్.. రేపటి నుంచే అమల్లోకి..!
పరిమిత ఓవర్ల క్రికెట్కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూనే ఈ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా అడుగులు వేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. డిసెంబర్ 12 నుంచి పొట్టి ఫార్మాట్లో కొత్త రూల్ను అమల్లోకి తేనుంది. విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి ఐసీసీ "స్టాప్ క్లాక్" అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్కు ఓవర్కు మధ్య అధిక సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ.. ఈ ఫార్మాట్లలో మరింత వేగం పెంచేందుకు ఓవర్కు ఓవర్కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్ను దించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
WI VS ENG 2nd ODI: అరుదైన క్లబ్లో చేరిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన క్లబ్లో చేరాడు. వెస్టిండీస్తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన రెండో వన్డేలో మెరుపు అర్ధసెంచరీ (45 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 3సిక్సర్లు) సాధించిన బట్లర్.. వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున 5000 పరుగుల మార్కును దాటిన ఐదో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్కు ముందు ఇయాన్ మోర్గన్ (6957), జో రూట్ (6522), ఇయాన్ బెల్ (5416), పాల్ కాలింగ్పుడ్ (5092), జోస్ బట్లర్ (5022) ఇంగ్లండ్ తరఫున ఐదు వేల పరుగుల మార్కును దాటారు. బట్లర్ మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ వెస్టిండీస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో విండీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
వెస్టిండీస్ టూర్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్గా జోస్ బట్లర్
వన్డే వరల్డ్కప్-2023లో దారుణ ప్రదర్శన ప్రదర్శనతో ఇంటుముఖం పట్టిన ఇంగ్లండ్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ కరేబియన్ టూర్లో భాగంగా ఆతిథ్య విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ సిరీస్ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్కు స్టార్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, రూట్, మొయిన్ అలీలకు ఇంగ్లండ్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ పేసర్లు జోస్ టాంగ్వే, జాన్ టర్నర్కు తొలిసారి ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో చోటు దక్కింది. అదే ఈ రెండు సిరీస్లలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా జోస్ బట్లర్ వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో విఫలమకావడంతో బట్లర్ను ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ మాత్రం యథావిధిగా జోస్నే తమ సారథిగా కొనసాగించింది. డిసెంబర్ 3న ఆంటిగ్వా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఇంగ్లండ్ జట్టు కరేబియన్ టూర్ ప్రారంభం కానుంది. విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జాక్ క్రాలే, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, ఆలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్. విండీస్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్, క్రిస్ వోక్స్ చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి? -
నువ్వొక చెత్త కెప్టెన్వి.. వేస్ట్.. ఇంకా ఎందుకు? దయచేసి దిగిపో!
West Indies Vs England Test Series- Fans Trolls Joe Root Captaincy: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాల్సిన సమయం వచ్చిందంటూ ఇంగ్లండ్ మాజీ సారథులు, అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు. ఇదేం కెప్టెన్సీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఘోర పరాభవం(4-0), ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఓటమి నేపథ్యంలో రూట్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ వెస్టిండీస్ టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టులు డ్రా కాగా... నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో స్ఫూర్తిదాయక ఆటతో ఆతిథ్య విండీస్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టి కరిపించి సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మరోసారి ఇంగ్లండ్కు చేదు అనుభవం మిగిలింది. ఇక యాషెస్ సహా గత ఐదు సిరీస్లలో ఇంగ్లండ్కు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆడిన 17 మ్యాచ్లతో కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జో రూట్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైఖేల్ వాన్ తదితరులు రూట్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ జట్టు అభిమానులు సైతం రూట్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వొక చెత్త కెప్టెన్వి. వేస్ట్.. చాలు ఇంక.. దయచేసి కెప్టెన్ పదవి నుంచి దిగిపో! మరీ ఇంత దారుణ ప్రదర్శనా!? అస్సలు ఊహించలేదు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్! మొదటి తప్పిదం కాబట్టి.. World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! #MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6 — Windies Cricket (@windiescricket) March 27, 2022 -
WI Vs Eng: 2019 తర్వాత సొంతగడ్డపై తొలిసారిగా విండీస్..
WI Vs Eng Test Series: మీడియం పేసర్ కైల్ మేయర్స్ (5/18) చెలరేగడంతో... ఇంగ్లండ్తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 1–0తో ఆతిథ్య జట్టు సొంతం చేసుకుంది. మేయర్స్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 64.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 28 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ క్రమంలో 2019 తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ను దక్కించుకుంది. ఇక వంద పరుగులతో అజేయంగా నిలిచిన జాషువా డ సిల్వా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. #MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6 — Windies Cricket (@windiescricket) March 27, 2022 ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా అత్యంత చిరాకు తెప్పించిన టెస్టు మ్యాచ్. తొలి ఇన్నింగ్స్లో మేము అద్భుతంగా ఆడాం. అప్పటికి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది చాలా చాలా విసుగు తెప్పించిన మ్యాచ్. ముఖ్యమైన సమయంలో సరిగ్గా రాణించలేకపోయాం. అయితే, కచ్చితంగా ఈ మ్యాచ్లో క్రెడిట్ వెస్టిండీస్కు ఇవ్వాల్సిందే. వాళ్లు బాగా ఆడారు. ఏదేమైనా మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 204 రెండో ఇన్నింగ్స్- 120 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్- 297 రెండో ఇన్నింగ్స్- 28/0 చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! -
WI VS Eng: బ్రాత్వైట్ అద్భుత ఇన్నింగ్స్.. రెండో టెస్టు కూడా..
వెస్టిండీస్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ మారథాన్ ఇన్నింగ్స్తో ఆతిథ్య జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. కాగా బ్రిడ్జ్టౌన్ వేదికగా మార్చి 16న ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జో రూట్, బెన్ స్టోక్స్ అద్భుత సెంచరీల నేపథ్యంలో 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్రాత్వైట్ మారథాన్ ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. 184 బంతులు ఎదుర్కొన్న అతడు 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 216 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సైతం డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు స్కోర్లు: ఇంగ్లండ్- 507/9 డిక్లేర్డ్ & 185/6 డిక్లేర్డ్ వెస్టిండీస్- 411 & 135/5 చదవండి: ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. Resilience and discipline! The WI Skipper takes the #MastercardPricelessMoment of the match! #WIvENG pic.twitter.com/YlNj8B43Il — Windies Cricket (@windiescricket) March 21, 2022 -
ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. సాహో విండీస్ కెప్టెన్
నాయకుడనే వాడు జట్టును నడిపించడమే కాదు.. అవసరమైనప్పుడు తన విలువేంటో చూపించాలి. అందరిలా ఉంటే అతన్ని ఎందుకు కెప్టెన్ చేస్తారు. మరి అలాంటి కెప్టెన్ అనే పదానికి సరైన అర్థం చెప్పాడు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్. సంప్రదాయ క్రికెట్పై మోజు తగ్గుతున్న వేళ తన మారథాన్ ఇన్నింగ్స్తో అందరిని ఆకట్టుకున్నాడు. 700 నిమిషాల(దాదాపు 12 గంటలు) పాటు క్రీజులో గడిపి 489 బంతులెదుర్కొని 17 ఫోర్ల సహాయంతో 160 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో బ్రాత్వైట్ విండీస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంతకముందు టెస్టు క్రికెట్లో విండీస్ తరపున మారథాన్ బ్యాటింగ్ చేసిన వాళ్లలో బ్రియాన్ లారా, రామ్నరేశ్ శర్వాన, వోరెల్లు ఉన్నారు. తాజాగా వీరి సరసన బ్రాత్వైట్ చోటు దక్కించుకున్నాడు. కాగా బ్రియాన్ లారా టెస్టుల్లో రెండుసార్లు మారథాన్ ఇన్నింగ్స్లతో మెరిశాడు. 1994లో ఇంగ్లండ్పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన లారా దాదాపు 766 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు. ఆ తర్వాత మళ్లీ 2004లో అదే ఇంగ్లండ్పై చారిత్రాత్మక 400 పరుగులు నాటౌట్ (క్వాడప్రుల్ సెంచరీ) సాధించాడు. ఈ సమయంలో లారా 778 నిమిషాల పాటు క్రీజులో ఉండి ప్రపంచరికార్డు సాధించాడు. ఇక రామ్నరేశ్ శర్వాన్ 2009లో ఇంగ్లండ్పై 698 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 291 పరుగులు సాధించాడు. 1960లో ఎఫ్ఎమ్ వోర్రెల్ బ్రిడ్జ్టౌన్ వేదికగా 682 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 197 పరుగులు నాటౌట్గా నిలిచాడు. తాజాగా క్రెయిగ్ బ్రాత్వైట్ 710 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 160 పరుగులు సాధించి ఆ జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించాడు. చేసింది తక్కువ స్కోరైనప్పటికి.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అతను ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. అందుకే బ్రాత్వైట్ ఆటకు యావత్ క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు.''సాహో బ్రాత్వైట్.. నీ ఇన్నింగ్స్కు.. ఓపికకు సలాం''..''టెస్టు క్రికెట్లో ఉండే మజాను రుచి చూపించావు''..''అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్ బ్లాక్బ్లాస్టర్ మార్కులు సాధించావు''అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 21, అలెక్స్ లీస్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్లో విండీస్ 411 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 136 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: ENG vs WI: డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్కు వింత పరిస్థితి 150* up for Captain @K_Brathwaite 👏🏾👏🏾. Bat on Skip! 🌴🏏#WIvENG #MenInMaroon pic.twitter.com/Zzr88snbwH — Windies Cricket (@windiescricket) March 19, 2022 Maneuvered for four more! #WIvENG pic.twitter.com/dSU0VPVMfQ — Windies Cricket (@windiescricket) March 19, 2022 -
డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్కు వింత పరిస్థితి
ఒక బౌలర్ తాను ఆడుతున్న తొలి మ్యాచ్లోనే వికెట్ తీసి అరంగేట్రంను గొప్పగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ప్రతీ బౌలర్ ఎదురుచూస్తుంటాడు. కొందరిని ఆ అదృష్టం వరిస్తుంది.. మరికొందరికి అవకాశం రాకపోవచ్చు. కానీ ఒక బౌలర్కు తన తొలి మ్యాచ్లోనే వికెట్ వచ్చినప్పటికి.. అది నోబాల్ అవడంతో వికెట్లెస్ బౌలర్గా మిగిలిపోవడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆ జాబితాలో చేరిపోయాడు ఇంగ్లండ్కు చెందిన సాకిబ్ మహమూద్. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ద్వారా సాకిబ్ మహమూద్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ 507 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన విండీస్ 3 వికెట్ల నష్టానికి 229 పరుగులతో ధీటుగానే బదులిస్తుంది. క్రీజులో కెప్టెన్ బ్రాత్వైట్తో పాటు జెర్మన్ బ్లాక్వుడ్ 65 పరుగులతో ఆడుతున్నాడు. అప్పటికే ఈ ఇద్దరి మధ్య 128 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. మహమూద్ అప్పటికే 14 ఓవర్లు వేసినప్పటికి ఒక్క వికెట్ దక్కలేదు. కాగా మరోసారి బౌలింగ్కు వచ్చిన మహమూద్ 136 కిమీవేగంతో పర్ఫెక్ట్ యార్కర్ను వదిలాడు. అంతే బంతి క్రీజులో ఉన్న బ్లాక్వుడ్ను దాటుకుంటూ మిడిల్స్టంప్ను పడగొట్టింది. ఇంకేముంది సాకిబ్ తొలి టెస్టు వికెట్ అందుకున్నాననే ఆనందంలో మునిగిపోయాడు. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో షాకవడం సాకిబ్ వంతైంది. అలా తాను ఆడుతున్న తొలి టెస్టులో వికెట్ సాధించే అవకాశం కోల్పోయాడు. బెన్ స్టోక్స్ కానీ సాకిబ్ మాత్రం ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. తొలి టెస్టు ఆడుతూ వికెట్ తీసినప్పటికి అది నోబాల్ అవడంతో ఆ అవకాశం కోల్పోయిన క్రికెటర్గా సాకిబ్ నిలిచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్( 2013లో బ్రాడ్ హడిన్), మార్క్ వుడ్(మార్టిన్ గప్టిల్, 2015లో), టామ్ కరన్( డేవిడ్ వార్నర్, 2017లో), మాసన్ క్రేన్( ఉస్మాన్ ఖవాజా, 2018లో).. ఇలాగే తమ తొలి టెస్టు వికెట్ను సాధించే ప్రయత్నంలో నోబాల్ వేసి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. తాజాగా వీరి సరసన సాకిబ్ మహమూద్ కూడా చేరిపోయాడు. మార్క్ వుడ్ కాగా తొలి వికెట్ నోబాల్గా తేలినప్పటికీ.. ఈ మ్యాచ్లో సాకిబ్ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. టామ్ కరన్ చదవండి: Yastika Bhatia: 'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా' PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా Mason Crane denied his maiden Test wicket by a no ball. ✅ Mark Wood denied his maiden Test wicket by a no ball. ✅ Ben Stokes denied his maiden Test wicket by a no ball. ✅ Tom Curran denied his maiden Test wicket by a no ball. ✅#Ashes pic.twitter.com/l3DZ5xD4fz — Seam Up Cricket (@SeamUp) January 6, 2018 -
WI Vs Eng 2nd Test: జో రూట్, స్టోక్స్ అద్భుత సెంచరీలు.. ఇంగ్లండ్దే పైచేయి
WI Vs Eng 2nd Test- బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ జో రూట్ (316 బంతుల్లో 153; 14 ఫోర్లు), బెన్ స్టోక్స్ (128 బంతుల్లో 120 బ్యాటింగ్; 11 ఫోర్లు, 6 సిక్స్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 129 పరుగులు జోడించారు. డాన్ లారెన్స్ (150 బంతుల్లో 91; 13 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో భారీ స్కోరు సాధించిన పర్యాటక ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రెత్వైట్ (28 పరుగులు), వన్డౌన్లో వచ్చిన బ్రూక్స్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా 128 బంతుల్లో 120 పరుగులు చేసిన బెన్ స్టోక్స్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అద్భుతమైన ఇన్నింగ్స్.. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ. పూర్తిస్థాయి ఆధిపత్యం. నువ్వు సూపర్ స్టోక్స్’’ అంటూ కొనియాడుతున్నారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. చదవండి: Ranji Trophy 2022: ధోని హోం టీమ్ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం Ben Stokes completing 5,000 Test runs landmark in style. pic.twitter.com/AuKZ72dCwU — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022 -
WI Vs Eng 2nd Test: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..
WI Vs Eng 2nd Test- Joe Root: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్తో బార్బడోస్లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రెగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహ్మద్ యూసఫ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు. వీరి కంటే రూట్ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కాగా విండీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వనౌడౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ రూట్ 246 బంతుల్లో 119 పరుగులు(నాటౌట్) సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఓపెనర్ అలెక్స్ లీస్ 30 పరుగులు చేసి నిష్క్రమించగా.. క్రీజులోకి వచ్చిన డానియెల్ లారెన్స్ 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. చదవండి: MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 -
7.5 కోట్లు కుమ్మరించిన ఆటగాడికి గాయం.. ఉలిక్కిపడిన కేఎల్ రాహుల్ టీమ్
Mark Wood: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు తలనొప్పులు మొదలయ్యాయి. వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న కీలక ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. ఊహించని ఈ పరిణామంతో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ఎల్ఎస్జీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలే నాణ్యమైన పేసర్ లేడని కుమిలిపోతున్న ఎల్ఎస్జీని మార్క్ వుడ్ గాయం మరింత కలవరపాటుకు గురి చేస్తుంది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో పోటీపడి మరీ సొంతం చేసుకున్న ఆటగాడు లీగ్కు ముందు గాయపడటంతో లక్నో శిబిరంలో ఆందోళన మొదలైంది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో బౌలింగ్ చేస్తుండగా మార్క్ వుడ్ మోచేతికి గాయమైంది. దీంతో మైదానం వీడిన అతను తిరిగి బౌలింగ్కు రాకపోగా, డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు. అతని గాయంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్న మార్క్ వుడ్ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఏడున్నర కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న వాంఖడే వేదికగా లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాయి. చదవండి: తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్ -
పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు
పదేళ్ల క్రితం జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. రెండు, మూడేళ్లలో సదరు క్రికెటర్కు గుర్తింపైనా వచ్చుండాలి.. లేదంటే జట్టులోకి వస్తూ.. పోవడం జరిగి ఉండాలి. మ్యాచ్లు ఎక్కువ ఆడితే సూపర్ స్టార్ అవడం.. లేదంటే కనుమరుగవడం జరుగుతుంది. కానీ పదేళ్ల క్రితమే జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ మధ్యలో ఒక్క మ్యాచ్ ఆడకుండా.. తాజా రీఎంట్రీలో సెంచరీతో మెరిసిన క్రికెటర్లు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందినవాడే వెస్టిండీస్ క్రికెటర్ న్క్రుమా బోనర్. బోనర్ వెస్టిండీస్ తరపున 2011లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్కు బోనర్ను బోర్డు ఎంపిక చేసింది. ఆ సిరీస్లో ఒక మ్యాచ్ ఆడిన బోనర్ మూడు పరుగులు మాత్రమే చేసి.. బౌలింగ్లోనూ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఆరు నెలలకు గాని మళ్లీ తలుపు తట్టలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్లో 30 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అంతే మళ్లీ అప్పటినుంచి పదేళ్ల పాటు విండీస్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పదేళ్ల గ్యాప్లో అతనికి బోర్డు నుంచి ఒక్కసారి పిలుపు రాలేదు. ఇక కెరీర్ ముగిసినట్లే అని భావిస్తున్న దశలో 2019లో జమైకా జట్టుకు ఎంపికయ్యాడు. బార్బడోస్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కరోనా గ్యాప్ వల్ల రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 2020లో బంగ్లాదేశ్తో సిరీస్కు బోనర్ను ఎంపిక చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన బోనర్.. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 395 పరుగులు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన విండీస్ను కైల్ మేయర్స్(245 నాటౌట్) సూపర్ డబుల్సెంచరీతో గెలిపించాడు. ఇదే మ్యాచ్లో బోనర్ 85 పరుగులతో మేయర్స్కు అండగా నిలబడ్డాడు. ఒక రకంగా బోనర్ కెరీర్కు ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఆగస్టులో పాకిస్తాన్తో జరిగిన ఒక టెస్టులో వెస్టిండీస్ ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్లోనూ బోనర్ కీలకపాత్ర పోషించాడు. తాజగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బోనర్ 123 పరుగులతో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. దాదాపు తొమ్మిది గంటలపాటు ఓపికగా ఆడిన బోనర్ 355 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 123 పరుగులు సాధించాడు. అతని కళాత్మక ఇన్నింగ్స్తో వెస్టిండీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలా పదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చి తాజాగా సెంచరీతో వెలుగులోకి వచ్చిన అరుదైన క్రికెటర్ల జాబితాలో బోనర్ చేరిపోయాడు.ఇక తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 157 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్లు తయారు చేయకండి' -
పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్లో.. లారెన్ విన్ఫీల్డ్ హిల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడింది. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న డాటిన్ జంప్ చేస్తూ సింగిల్ హ్యండ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్ఫీల్డ్ నిరాశతో పెవిలియన్కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విన్ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను విండీస్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31),హేలే మాథ్యూస్(45), కాంప్బెల్(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్(46), ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! Diving Deandra Dottin takes a screamer in West Indies' 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ — Duncan Huntsdale (@duncs_h) March 9, 2022 -
తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం కరీబియన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు నేపథ్యంలో ఆట రెండోరోజు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ మార్కవుడ్ తన చర్యలతో ఆకట్టుకోవడమేగాక అభిమానులను కట్టిపడేస్తోంది. విషయంలోకి వెళితే.. రెండోరోజు ఆటలో విండీస్ ఇన్నింగ్స్లో భాగంగా బ్రేక్ సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఒకదగ్గర చేరి గేమ్ స్టా్రటజీని చర్చించుకున్నారు. రూట్ ఆధ్వర్యంలోని జట్టు మొత్తం ఒక దగ్గర ఉంటే.. బౌలర్ మార్క్ వుడ్ మాత్రం ఫైన్లెగ్లో ఉన్నాడు. అతను వారి దగ్గరకు రాలేకపోయాడు. తన సహచరులంతా ఒకచోట చేరి వారి సలహాలను పేర్కొంటున్న సమయంలో మార్క్ వుడ్ ఉన్న స్థానంలో అలాగే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో తెలియదు కాని.. వెంటనే తన రెండు చేతులతో సహచరులతో కలిసి గేమ్ప్లాన్ చర్చలో పాల్గొన్నట్లు ఒక సిగ్నేచర్ ఇచ్చాడు. అది తాను ఉన్న స్థానం నుంచే.. ఇది చూసిన అభిమానులు నవ్వుకోవడమేగాక.. మార్క్ వుడ్ చర్యను అభినందిస్తూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 66.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ 43, క్రుమ్హా బొనర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు వద్ద ఆలౌటైంది. జానీ బెయిర్ స్టో 140 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రిస్ వోక్స్ 2, ఫోక్స్ 42 పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో జైడెన సీల్స్ 4, కీమర్ రోచ్, హోల్డర్, అల్జారీ జోసెఫ్ తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: ధోనికి అవమానం.. గరం అవుతున్న అభిమానులు! Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు Joe Root wanted a team huddle, but there was one player missing... Classic Mark Wood 😂#WIvENG pic.twitter.com/RRUlBwoOGW — Cricket on BT Sport (@btsportcricket) March 9, 2022 -
బంతి అంచనా వేసేలోపే క్లీన్బౌల్డ్.. షాక్ తిన్న ఇంగ్లండ్ కెప్టెన్
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తాను ఔటైన విధానంపై షాక్ తిన్నాడు. కీమర్ రోచ్ వేసిన బంతిని అంచనా వేసేలోపే రూట్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి తొలి బంతికే రూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకుతూ థర్డ్స్లిప్లో పడింది. అయితే ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో బౌండరీ వెళ్లింది. ఈ అవకాశాన్ని రూట్ సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఆరంభం నుంచే ఇబ్బందిగా గడిపిన రూట్ 13 పరుగులు చేసి తర్వాతి బంతికే బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 268 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ జానీ బెయిర్ స్టో(109 నాటౌట్) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా.. బెన్ ఫోక్స్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు ఓపెనర్లు అలెక్స్ లెస్ (4), క్రాలే (8), జో రూట్ (13), డాన్ లారెన్స్ (20), స్టోక్స్ (36) పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. Kemar Roach Clean Bowled England Captain Joe Root on just 13 runs.#WIvENG pic.twitter.com/bIk92mjA3X — Over Thinker Lawyer 🇵🇰 (@Muja_kyu_Nikala) March 8, 2022 -
ఇంగ్లండ్ హెడ్ కోచ్గా పాల్ కాలింగ్వుడ్..
ECB Named Collingwood As Interim Head Coach: విండీస్తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆల్రౌండర్ పాల్ కాలింగ్వుడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ప్రకటించింది. కాలింగ్వుడ్ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన జరిగినట్లు ఈసీబీ పేర్కొంది. తాజాగా విండీస్తో జరిగిన టీ20 సిరీస్ కోసం ఇంచార్జ్ కోచ్గా వ్యవహరించిన కాలింగ్వుడ్.. సెలవు నిమిత్తం కరీబియన్ దీవుల్లోనే ఉన్నాడని, ఫిబ్రవరి 25న ఇంగ్లండ్ జట్టు అక్కడి చేరుకోగానే అతను బాధ్యతలు చేపడతాడని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వెల్లడించాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఓ వార్మప్ మ్యాచ్తో పాటు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. మార్చ్ 1 నుంచి విండీస్ టూర్ ప్రారంభంకానుంది. కాగా, తాజాగా జరిగిన టీ20 సిరీస్లో కాలింగ్వుడ్ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ జట్టు విండీస్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2021-22లో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి(0-4) బాధ్యున్ని చేస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్వుడ్కు ఈసీబీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు ఖరారు..! -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో జేసన్ ఈ ఫీట్ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
Eng Vs WI T20 Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించిన ఇంగ్లండ్.. కొత్తగా
England Tour OF West Indies- T20 Series Squad: వచ్చే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో లెఫ్టార్మ్ సీమర్ డేవిడ్ పైన్, జార్జ్ గార్టన్లకు చోటు దక్కింది. విండీస్ టూర్ సందర్భంగా వీరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్కు పాల్ కోలింగ్వుడ్ తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. మార్కస్ ట్రెస్కోథిక్ అసిస్టెంట్ కోచ్గా విధులు నిర్వర్తించనున్నాడు. ఈ విషయం గురించి కోలింగ్వుడ్ మాట్లాడుతూ... ‘‘పటిష్టమైన జట్టును ఎంపిక చేశాం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆటగాళ్లను సెలక్ట్ చేశాం’’అని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో 11 మంది టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ డాసన్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్, టైమల్ మిల్స్, డేవిడ్ పైన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, జేమ్స్ విన్సే. ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- టీ20 సిరీస్- షెడ్యూల్: ►తొలి మ్యాచ్- జనవరి 22 ►రెండో మ్యాచ్- జనవరి 23 ►మూడో మ్యాచ్- జనవరి 26 ►నాలుగో మ్యాచ్- జనవరి 29 ►ఐదో మ్యాచ్- జనవరి 30. చదవండి: Kapil Dev: కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్కోచ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement