-
నేనున్నానంటూ భరోసా
ఆత్మకూరు/నెల్లూరు(దర్గామిట్టా)/కావలి/కోవూరు: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం నెల్లూరు జిల్లాలో తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘బాధపడకండమ్మా.. ఆదుకుంటానంటూ’ వారి కన్నీళ్లు తుడిచారు. అప్పటికప్పుడు తగిన సాయమందించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి.. అండగా నిలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడుకు చెందిన గడ్డం పెద సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎం జగన్ను కలిసి తన బాధను చెప్పుకునేందుకు శనివారం నెల్లూరు సింహపురి ఆస్పత్రి సెంటర్కు చేరుకున్నాడు. బస్సు యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న సీఎం జగన్ అంతమంది జనంలోనూ వీల్చైర్లో ఉన్న పెద సుబ్బయ్యను చూసి.. పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే సుబ్బయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నా బిడ్డను బతికించన్నా.. నెల్లూరు జిల్లా సింగపేటకు చెందిన వ్యవసాయ కూలీ రవిచంద్ర తన నాలుగేళ్ల కుమార్తె బ్లెస్సీతో కలిసి సీఎం జగన్ను కలిసేందుకు ఉలవపాళ్ల కూడలి వద్దకు వచ్చాడు. ‘నా కుమార్తె పుట్టినప్పటి నుంచే జన్యు సంబంధిత సమస్యలతో బధిరత్వం, ఫిట్స్తో బాధపడుతోంది. రెండేళ్ల కిందట నా భార్య కూడా చనిపోయింది. చికిత్స కోసం నా కుమార్తెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లా.. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు రాయవెల్లూర్లో చూపిస్తున్నా. నా బిడ్డను బతికించుకునేందుకు.. చికిత్సకు తగిన సాయం కోసం సీఎం జగన్ను కలిసేందుకు వచ్చా’అని రవిచంద్ర చెప్పాడు. వీరి పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. అవ్వా.. పింఛన్ వస్తోందా? బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ నెల్లూరు జిల్లా నార్త్రాజుపాలేనికి చెందిన పుల్లా లక్ష్మమ్మను ‘అవ్వా, పింఛన్ వస్తోందా’ అంటూ ఆరా తీశారు. ప్రతి నెలా ఒకటో∙తేదీనే వలంటీర్ తమ ఇంటికే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారని.. చంద్రబాబు నిర్వాకం వల్ల ఈనెల అష్టకష్టాలు పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘మళ్లీ నువ్వే రావాలి.. మాలాంటి వృద్ధులను కంటికి రెప్పలా కాపాడాలి’ అని సీఎం జగన్ను కోరింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘మరో రెండు నెలల్లో నీ మనవడి ప్రభుత్వం మళ్లీ రాబోతోంది. మీ సమస్యలు తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు. కాలు దెబ్బతిన్న బాధితుడికి అండ అల్లూరు మండలం తూర్పు గోగులపల్లికి చెందిన సత్యనారాయణకు 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బతింది. మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ సాయం కోరేందుకు నెల్లూరుకు వచ్చాడు. సత్యనారాయణను పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ దేవుడికి సమస్యలు చెప్పుకున్నాం.. బుజబుజనెల్లూరుకు చెందిన చల్లా కృష్ణ దంపతులు సీఎం జగన్ను కలిసేందుకు జాతీయ రహదారిపైకి వచ్చారు. వారిని చూసిన సీఎం జగన్ బస్సులో నుంచి దిగివచ్చి.. చల్లా కృష్ణ దంపతులతో మాట్లాడారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నామని.. తనకు రెండుసార్లు వైద్యులు ఆపరేషన్ చేశారని చల్లా కృష్ణ సీఎం జగన్కు తెలిపారు. తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని.. ముగ్గురు సంతానం ఉన్నారని వివరించారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ ‘బాధపడకండి.. ఆదుకుంటా’నంటూ భరోసా ఇచ్చారు. పేదల పాలిట దేవుడైన సీఎం జగన్కు తమ సమస్యలు చెప్పుకున్నామని మీడియాకు చల్లా కృష్ణ తెలిపారు. -
నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?
మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది. బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్లో నీటి కొరత ఉంది. అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది. -
మన పని ఈజీగా అయ్యేలా చేశారు!
మన పని ఈజీగా అయ్యేలా చేశారు! -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
ఎజెండాలో కపిరాజు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. జనావాసాలపై దాడులు.. అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క 20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది. కోతులు అడవులకు వెళ్లాలి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది. కనిపించని ఫుడ్కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. అసెంబ్లీలో సైతం చర్చ తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు. కోతులు బాధ భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. పరిహారం మాటేమిటి? కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్కు చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు. ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్లో ప్రత్యేక సెంటర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. -
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది. అలీగఢ్లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్కు నష్టం ఏమిటి? -
తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్యూటీఏ) 3వ కన్వెన్షన్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్లో ఘజియాబాద్కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్ను రూపొందించింది. హైదరాబాద్కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ఎన్సీపీకి షాక్ ఇచ్చిన శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన శరద్ పవార్.. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. కుటుంబంలో రాజకీయాల గురించి మాట్లాడబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాట నాయకుడు వై బీ చౌహాన్ స్మారకాన్ని దర్శించడానికి సతారాకు ఈ రోజు ఉదయమే శరద్ పవార్ వెళ్లారు. నిన్న నుంచి ఎవ్వరినీ తాను కలవలేదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయ పరమైన చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. అయితే.. ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం కలగదని శరద్ పవార్ చెప్పారు. బెంగళూరులో త్వరలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జులై 16-18 మధ్య ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపారు. ఈ మేరకు రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అజిత్ పవార్తో పాటు షరద్ పవార్కు నమ్మిన బంటు ఛగన్ భుజ్భల్, ప్రఫుల్ పటేల్లు కూడా ఉన్నారు. అయితే.. ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఏంపీలు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఇదీ చదవండి: ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం.. ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది.. -
ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా? భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది. గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది. గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం! -
ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు
కొందరికి జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవైనా విందులు, వినోదాలు ఉంటే చాలు ఫుల్లుగా లాగించేస్తుంటారు. అయితే అలా అప్పుడప్పుడు అతిగా తినడం వల్ల శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కానీ, తరచు అతిగా తింటూ ఉంటే మాత్రం, అది మీరు బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది, ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు మొదలుకొని రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడం, గుండె సంబంధ సమస్యలతో బాధపడవలసి వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కువగా తినేసి కడుపులో అసౌకర్యంగా భావించినపుడు ఈ చిట్కాలు పాటించండి చాలు... తక్షణ ఉపశమనం లభిస్తుంది. అమ్మమ్మల కాలం నుంచి నేటి వరకు అన్ని రకాల కడుపు సమస్యలకు ఏకైక పరిష్కారం ఏదైనా ఉంటే, అది వాము అని చెప్పవచ్చు. వాము నమలడం వల్ల కడుపులో అసౌకర్యం లేదా నొప్పి, గ్యాస్, వాంతులు, అజీర్ణం , ఆమ్లత్వం వంటి ఇతర సమస్యలను పరిష్కరించవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అలాగే మంచి విరేచన కారి కావడం వల్ల అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నవారు.. కొద్దిగా వాము, నల్ల ఉప్పు, అల్లం కలిపి చూర్ణం చేసి, భోజనం తర్వాత చప్పరించి గోరువెచ్చటి నీళ్లు తాగితే సరి! పుదీనా టీజీర్ణ సంబంధ సమస్యలను దూరం చేయడంలో పుదీనా టీ బాగా సహాయపడుతుంది, మిరియాలు, పుదీనా కలగలిసిన టీ మీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా అతిగా తినడం వల్ల కలిగే మలబద్ధకం, విరేచనాలు ఇతర కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. పెరుగు తినండి మీరు కడుపులో పట్టనంతగా నిండుగా తిన్ననప్పటికీ, ఆపైన కొంచెం పెరుగు తినడం ద్వారా మేలు కలుగుతుంది. పెరుగు అనేది ్ర΄ోబయోటిక్స్ కు మూలం కాబట్టి, ఎప్పుడైనా ఆహారం పెద్ద మొత్తంలో తిన్న తర్వాత పెరుగు తప్పకుండా తీసుకోండి. ఇది కడుపు ఉబ్బరం సహా ఇతర కడుపు బాధలను తగ్గించగలదు. తాజా సాదా పెరుగు ఎంచుకోండి. చల్లని పాలు తాగాలి చల్లటి పాలు తాగడం అసిడిటీని ఎదుర్కోవడానికి సులభమైన ఇంటి నివారణలలో ఒకటి. ΄ాలలోని కాల్షియం, కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాల అదనపు స్రావాన్ని నియంత్రిస్తుంది, తద్వారా కడుపులోని ఆమ్లాలను శోషిస్తుంది. చల్లని ΄ాలు అసిడిటీకి సరైన విరుగుడు, ఇది కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. తిన్న వెంటనే నిద్ర వద్దు బాగా తిన్న తర్వాత నేరుగా వెళ్లి హాయిగా నిద్ర΄ోతారు కొందరు. అయితే ఇది అసలు మంచిది కాదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ జరిగి, జీర్ణక్రియ ఆటంకాలకు కారణమవుతుంది. దాంతోబాటు మనం తిన్న ఆహారం మూలంగా వచ్చి చేరే కేలరీలు కరిగే అవకాశం ఉండక బరువు పెరుగటానికి దారితీస్తుంది. అరకిలోమీటరైనా నడవండి నడక మీ జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు, మీ రక్తంలో చక్కెర స్థాయులను సమం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకునే బదులు, కాస్త నడవండి, తేలికగా అనిపిస్తుంది. కేవలం 15 నిమిషాలు చిన్న నడకకు వెళ్లి వచ్చినా చాలు మంచి అనుభూతి చెందుతారు. అయితే పరుగు, జాగింగ్ లేదా వ్యాయామాలు వద్దు. తక్కువలో తక్కువగా రెండు వందలనుంచి ఐదువందల అడుగుల దూరం నడిస్తే చాలు. . కాబట్టి, అతిగా తిన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పై చిట్కాలను ప్రయత్నించండి. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
ఓవైపు కన్నడనాట హోరాహోరీ.. మరోవైపు కాంగ్రెస్లో ఇంటి పంచాయితీ!
రాజస్తాన్ కాంగ్రెస్లో సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఓ రేంజ్లో సచిన్ పైలట్.. సీఎంపై విమర్శల దాడి చేశారు. గెహ్లాట్ నాయకురాలు వసుంధర రాజేనని.. సోనియా గాంధీ కాదేమో! అని సెటైరికల్ కామెంట్ చేశారు. సచిన్ పైలట్ 2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి గెహ్లాట్ సర్కార్పై తిరుగుబాటుకి యత్నించారు. ఐతే ఆ సయమంలో తనని బీజేపీ నాయకురాలు వసుంధర రాజే తనని ఆదుకున్నారని ప్రభుత్వం పడిపోకుండా సాయం చేశారని ధోల్పూర్లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ ఆయనకు చురకలు అంటిస్తూ కామెంట్ చేశారు. ఆయన దృష్టి (గెహ్లాట్)లో వసుందర రాజే తనకు చీఫ్ అని సెటైర్ వేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరి సచిన్ పైలట్ అటు గెహ్లాట్ను, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. అంతేగాదు తాను పదేపదే అవినీతి గురించి అభ్యర్థనలు చేసినా.. ఆయన ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మెతకగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అర్థమైందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి, సీఎం మధ్య అవగాహన ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని తెలిసిందన్నారు. గత రెండున్నరేళ్లుగా గెహ్లాట్ తనపై ఎన్నోసార్లు మాటల దాడి చేసినా, దూషించినా, పార్టీని దెబ్బతీయకూడదనే మౌనంగా ఊరుకున్నాని చెప్పారు. నా యాత్ర సీఎం గెహ్లాట్ని లక్ష్యంగా చేసుకుని చేయడం లేదని కూడా పైలట్ స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అవినీతికి మాత్రమే తాను వ్యతిరేకినని ఆయన నొక్కి చెప్పారు. రాజస్తాన్లో కూడా ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారంటూ తాను గతంలో గెహ్లాట్పై చేసిన తిరుగుబాటుని సమర్థించుకునే యత్నం చేశారు పైలట్.అయితే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని వీడే యోచనలో పైలెట్ ఉన్నారని, ఈ క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, 2018లో రాజస్తాన్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ముఖ్యమంత్రి మంతి పదవిపై గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం రాజుకుంది. ఈ విషయమై 2020లో కొందరు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడమే గాక ఢిల్లీలో రోజుల తరబడి నిరసన చేశాడు పైలట్. ఐతే కాంగ్రెస్ అధినాయకత్వం అతని సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో సచిన్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న కాంగ్రెస్కు ఈ సమస్య మింగుడుపడని అంశంగా మారింది. (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
అఖిల్ ఏజెంట్ కి దెబ్బేస్తున్నారు..100 కోట్ల సినిమా పరిస్థితి ఏంటి ?
-
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
‘దున్నపోతు’ సమస్యకు పరిష్కారం.. ఏంటా కథ.. అసలేం జరిగింది?
కణేకల్లు(అనంతపురం జిల్లా): తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అందుబాటులో ఉన్న ఒకేఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సిద్ధమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగి 20 రోజులుగా ఉత్కంఠకు తెరలేపారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు నిశ్చయించిన నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు. ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ వాదనకు దిగారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది ఎటూ తేల్చని పంచాయితీ.. ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్కు సీఐ యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొ గ్రామం నుంచి 80 నుంచి 90 మంది ప్రజలు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ కిటకిటలాడింది. దున్నపోతును వదులుకునేది లేదంటూ అంబాపురం వాసులు వివరించారు. అయితే తమ గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తామూ వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ... మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది. సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో ఇరువైపులా ఐదుగురు చొప్పున గ్రామ పెద్దలను స్టేషన్ లోపలకు పిలుచుకెళ్లి సీఐ చర్చించారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం ఎవరికి వారు ఆ దున్నపోతు తమదంటే తమదంటూ దేవుడిపై ప్రమాణాలు చేశారు. చివరకు టాస్ వేసి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే టాస్ వేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఇరు గ్రామాల ప్రజల్లో తలెత్తి చివరకు ఈ అంశాన్ని కూడా విరమించుకున్నారు. సెంటిమెంట్తో రాజీ కుదిర్చిన సీఐ.. చివరగా సీఐ యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు. ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు. ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో ఏడు రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు. చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా? సీఐ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం రచ్చుమర్రి వాసులను ఆలోచనలో పడేసింది. చివరకు అంబాపురంలో దేవర ముగిసిన తర్వాత ఓ దున్నపోతును కొనిస్తామంటూ ఆ గ్రామస్తులు భరోసానివ్వడంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది. ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజి విద్యార్థుల సమస్యపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యపై విద్యాశాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 50 శాతం డిగ్రీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులపై డిగ్రీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్లో హీటెక్కిస్తున్న మోదీ టూర్ -
స్పైస్జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు బయలుదేరిన స్పైస్జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆకాశంలో ఆగిన విమాన ఇంజన్.. తప్పిన ముప్పు
ముంబై: విమాన ప్రయాణికులకు ఈ మధ్యకాలంలో వరుస ఝలక్లు తగులుతున్నాయి. తాజాగా గురువారం మరో ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి టేకాఫ్ అయిన అరగంటకే తిరిగి అదే ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-639 విమానం ఉదయం పది గంటల ప్రాంతంలో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే 27 నిమిషాల తర్వాత ఇంజన్లలో ఒకదానికి సమస్య తలెత్తింది. అధిక ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రతల కారణంగా.. ఇంజన్ షట్ డౌన్ అయ్యింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ముంబైలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ప్రయాణికులు అందోళనకు లోనయ్యారు. ఇంజన్పై పీడనం పెరగడంతో ఆగిపోయినట్లు పైలెట్ గుర్తించారని, వెంటనే తిరిగి ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరుకు చేర్చామని తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విచారణకు ఆదేశించింది. చదవండి: బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి.. -
20 రోజులుగా తాగునీళ్లు లేవు
బనశంకరి: బెంగళూరు దక్షిణ నియోజకవర్గపరిధిలోని ఉత్తరహళ్లి వార్డు (184) యాదాళం నగరలో గత 20 రోజులుగా తాగునీటిని సరఫరా కావడం లేదు. గుక్కెడు నీటికోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ప్రజలు వాపోయారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నేత ఆర్కే.రమేశ్, ఉత్తరహళ్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే.కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ పర్యటించారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప విఫలమయ్యారని కాంగ్రేస్నేతలు ఆరోపించారు. నేతలు బాలకృష్ణ, బైరప్ప, గుండుమణిశ్రీనివాస్, ఉమాదేవి పాల్గొన్నారు. ఉమ్మడిగా సంక్షేమ కార్యక్రమాలు బనశంకరి: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటరామరాజు గురువారం బెంగళూరు బనశంకరి గాయత్రిభవన్లో అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు అశోక్ హర్నహళ్లి, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్మూర్తిని కలిశారు. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం
ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ దాడి నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు మరో ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వంటనూనెల ధరలు పెరుగుతు న్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆహార ధరలు ఇప్పటికే అధికంగా ఉంటున్నాయి. ఇవి గత 40 సంవత్సరాల్లో ఎప్పూడూ లేనంత అధిక స్థాయిని తాకాయి. ఆహార సరఫరా మార్గాల కోసం ప్రపంచం ఇప్పుడు పడుతున్న పాట్లకు కారణం ఏమిటంటే– ఆహార స్వావలంబన నుంచి దూరం జరగాలని చాలా దేశాలపై ఒత్తిడి పెట్టడమే! పోటీకి వీలుకల్పించడం అనే సాకుతో ప్రపంచ ఆహార సరఫరా చెయిన్లను నిర్మిస్తూ పోవడమే! ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే– మార్కెట్లపై ఆధారపడటం తగ్గించి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడమే!! ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ దాడి నేపథ్యంలో ప్రపంచ ఆహార మార్కెట్లు మరోసారి అల్లకల్లోలాన్ని చవిచూస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడనుంది. ఉక్రెయిన్లో బుల్లెట్లు, బాంబులు ప్రపంచ క్షుద్బాధా సంక్షోభాన్ని మనం కనీవినీ ఎరుగని స్థాయికి తీసుకుపోనున్నాయని ప్రపంచ ఆహార పథకం కార్యనిర్వాహక అధికారి డేవిడ్ బీస్లే ఇటీవలే వ్యాఖ్యానించారు. 2007–08 సంవత్సరంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రపంచ ఆహార సంక్షోభం కారణంగా సరకుల ధరలు అదుపుతప్పి పోయాయని చెబుతుంటారు. పెరిగిన చమురు ధరలు, అధిక ఆహార ఉత్పత్తి, కమోడిటీ ఫ్యూచర్స్ ద్వారా కలిగిన అధిక ధరలు వంటి కారణాలన్నీ పరస్పరం కలసిపోయి ప్రపంచ ఆహార సరఫరాలను స్తంభింపజేయ డమే కాదు... ఆనాడు 37 దేశాల్లో ఆహార దాడులకు దారితీశాయి. అలనాటి సంక్షోభం పునరావృతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సరుకుల ధరలు ఉక్రెయిన్లో యుద్ధానికి ముందే పెరుగుతూ వచ్చాయి. 2021లో ఆహార ధరలు మునుపటి రికార్డులను బద్దలు గొట్టాయి. ఇతరేతర కారణాలు కూడా బలంగా తోడవడమే కాకుండా ప్రపంచ సరఫరాల్లో 30 శాతం గోదుమలను, 28 శాతం బార్లీని, 18 శాతం మొక్కజొన్నలను, 75 శాతం పొద్దుతిరుగుడు నూనె సరఫరాకు వీలుకలిగిస్తున్న నల్లసముద్ర రీజియన్లో ప్రస్తుతం సాగుతున్న ఘర్షణను గమినిస్తే ప్రపంచం మరోసారి తీవ్రమైన ఆహార సంక్షోభం వైపు పయనిస్తోంది. ఇది ఎంత తీవ్రమైన సంక్షోభం అనే అంశాన్ని భవిష్యత్తు మాత్రమే చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ఇరాక్, శ్రీలంక దేశాల్లో ఆహారం కోసం నిరసన ప్రదర్శ నలను ప్రపంచం చూస్తోంది. అనేక దేశాలు దేశీయ ఆహార సరఫరాకు దెబ్బ తగలకుండా ఉండటానికి స్వీయరక్షణ విధానాలకు మళ్లి పోయాయి. ముంచుకొస్తున్న సంక్షోభం వెనుక మరింత మంది దారి ద్య్రంలో కూరుకుపోనున్నారని బ్లూమ్బెర్గ్ సరిగ్గానే అంచనా వేసింది. ఇప్పటికే ప్రపంచమంతటా ఆహార ధరలు పెరిగాయి. సూపర్ మార్కెట్లకు వచ్చే సరఫరాలు కనుమరుగవుతున్నాయి. ఆహార భద్రత రోజురోజుకూ ప్రమాదపు అంచుల్లోకి వెళుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద నైట్రోజన్ ఎరువుల ఎగుమతిదారుగా ఉండటంతోపాటు ఈ ప్రాంతం మొత్తంగా ఫాస్పరస్, పొటాష్ ఆధారిత ఎరువుల ఉత్పత్తిదారుగా బలమైన స్థానంలో ఉంటోంది. యుద్ధం కారణంగా భారత్తో సహా పలు దేశాలకు చెందిన రైతుల ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోనున్నాయని చెబుతున్నారు. ఇది పంటల ఉత్పత్తిపై పడుతుంది. ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది. ఆహార కొరతలే కాదు... వాటి ధరవరలు కూడా ఆహార సంక్షోభం ఏ స్థాయిలో ఉండబోతోందన్న అంశాన్ని నిర్ణయిస్తాయి. ఈలోపు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా కొమ్ము అని పిలిచే ప్రాంతంతో సహా ఉత్తర ఆఫ్రికా, అఫ్గా్గనిస్తాన్ వంటి దేశాలు సైతం ఈ సంక్షోభం తాకిడికి మొట్టమొదటగా దెబ్బతింటాయి. అలాగే ఆఫ్రికాలోని ఈజిప్ట్, మడగాస్కర్, మొరాకో, ట్యునీషియా, యెమెన్, లెబనాన్... ఆసియాలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలతోపాటు టర్కీ, ఇరాన్, ఎరిత్రియా, ఇరాక్ కూడా ఈ సంక్షోభం బారిన పడనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి ఈ దేశాలన్నీ అధికంగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేవి. ఇక యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే పెరుగుతున్న దాణా ధరలు అక్కడి మాంస పరిశ్రమపై బలంగా వేటు వేయనున్నాయి. దీనివల్ల మాంసం ప్రాసెసింగ్ ధరలు పెరిగి పోతాయి. ఇప్పటికే స్పెయిన్లో సూపర్ మార్కెట్లలో వంటనూనెల కొనుగోళ్లపై రేషన్ విధించారు. యుద్ధం మరికొంత కాలం ఇలాగే కొనసాగితే, పెరిగే ఆహార పదార్థాల ధరల ప్రభావం నిస్సందేహంగా అన్ని దేశాలపై పడు తుంది. యుద్ధానికి ముందే గోదుమ ధరలు రికార్డు స్థాయిని అందుకు న్నాయి. నిజానికి అధికంగా అమ్ముడుపోయే సరుకుల ధరలు చాలా కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. 2021లో అమెరికా ఆహార, వ్యవ సాయ సంస్థ ప్రకారం, గోదుమ, బార్లీ ధరలు మునుపటి ఏడాదితో పోలిస్తే 31 శాతం వరకు పెరిగాయి. దీంతో మొక్కజొన్న ధరలు కూడా పుంజుకున్నాయి. వీటి ధరలు కూడా సంవత్సరం లోపే 44 శాతం పెరగడం విశేషం. 2021లో సన్ ఫ్లవర్ ఆయిల్ 63 శాతం పెరిగిన ధరతో రికార్డు సృష్టించింది. పైగా, ఈ సంవత్సరం మార్చి నెల తొలివారంలో గోదుమ ఫ్యూచర్ల ధర 2008 సంక్షోభం నాటి స్థాయికి పెరిగిపోయింది. వీటి ధరలు మరింతగా అంటే మరో 22 శాతం పెరిగి గత రికార్డులన్నింటినీ బద్దలు చేస్తాయని అంచనా. దీనివల్ల 2022–23 సంవత్సరంలో పోషకాహర లేమి బారిన పడుతున్న వారి జనాభాకు మరో 8 నుంచి 13 మిలియన్ల మంది చేరతారని చెబుతున్నారు. భారతదేశంలోని గోదుమ ఎగుమతిదారులు సరఫరాల్లోని ఖాళీలను పూరించడానికి తపన పడుతుండగా, ఈ సంవత్సరం గోదుమ ఎగుమతిదారులు తమ ఎగుమతులను మూడు రెట్లకు పెంచనున్నారని ఐటీసీ ఊహిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం అదనపు మిగులును పండిస్తున్న భారతీయ రైతులను విమర్శించడానికి అలవాటుపడిన వారు, ఇప్పుడు ప్రపంచ ఆహార ధాన్యాల సరఫరాలో ఏర్పడిన భారీ కొరతను పూరించడానికి మన రైతులు సిద్ధపడుతుండటం చూసి పొంగిపోతున్నారు. ముందే చెప్పినట్లుగా ఏ రకంగా చూసినా ప్రపంచం ఇప్పుడు మరో ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆహార ధరలు ఇప్పటికే అధికంగా ఉంటున్నాయి. ఇవి గత 40 సంవత్సరాల్లో ఎప్పూడూ లేనంత అధిక స్థాయిని తాకాయి. ఆహార పంటలు ఉపయోగించుకునే బయో ఇంధన ఉత్పత్తి పెరిగిపోయింది. ఉదాహ రణకు అమెరికాలో పండుతున్న మొక్క జొన్న పంటలో మూడోభాగం ఎథనాల్ ఉత్పత్తి కోసం వాడుతున్నారు. యూరోపియన్ యూని యన్లో పండే 90 మిలియన్ టన్నుల ఆహార పంటల్లో, 12 మిలియన్ టన్నుల గోదుమ, వరిని ఎథనాల్గా మార్చివేశారు. వీటన్నింటి మధ్యలోనే కొన్ని ఖండాంతర స్థాయి కంపెనీలను రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించేందుకు అమెరికా అనుమతించింది. కార్గిల్, నెస్లె, అర్చర్ డెనియల్స్ మిడ్ లాండ్, పెíప్సీకో, బేయర్ వంటి బడా వ్యవసాయ ఆధారిత కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, కీలకమైన సప్లయ్ లింకును మాత్రం ఇవి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆహార భద్రత సమస్యను కొన్ని బడా కంపెనీల చేతుల్లో ఎందుకు పెడుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడే 2007–08 సంవత్సరం నాటి ప్రపంచ ఆహార పెను సంక్షోభాన్ని పునరావృతం కానివ్వకూడదన్న ప్రిస్క్రిప్షన్ తప్పుదోవ పట్టిందని స్పష్టమవుతోంది. ఆహార సరఫరా మార్గాల కోసం ప్రపంచం ఇప్పుడు పడుతున్న పాట్లకు కారణం ఏమిటంటే, ఆహార స్వావలంబన నుంచి దూరం జరగాలని చాలా దేశాలపై ఒత్తిడి పెట్టడమే! పోటీకి వీలుకల్పించడం అనే సాకుతో ప్రపంచ ఆహార సరఫరా చెయిన్లను నిర్మిస్తూ పోవడమే ప్రస్తుత సంక్షోభానికి మూలం. ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మార్కెట్లపై ఆధారపడటం తగ్గించి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడమే! ఈ సందర్భంగా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్.స్వామినాథన్ చెప్పిన మాటలు మనం ఎన్నటికీ మరచిపోరాదు. ‘‘తుపాకులు కాకుండా ఆహార ధాన్యాలను కలిగిన దేశాలదే భవిష్యత్తు!’’ దేవీందర్ శర్మ , వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
జంట జలాశయాలకు గోదావరి జలాలు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి ఆనుకొని ఉన్న చారిత్రక జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపే ప్రతిపాదనలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ల నుంచి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు నీటిని తరలించేందుకు వీలుగా జలమండలి, ఇరిగేషన్ విభాగాలు వేర్వేరుగా రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మల్లన్నసాగర్ నుంచి ఈ జలాశయాలకు భారీ పైప్లైన్ ద్వారా వర్షాకాల సీజన్లో గోదావరి జలాలను తరలించాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే జలమండలి వర్గాలు మాత్రం శామీర్పేట్కు సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి ఈ జలాశయాలకు గోదావరి జలాలను పైప్లైన్ల ఏర్పాటు ద్వారా తరలించవచ్చని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రెండు ప్రతిపాదనల్లో ఒకదానికి త్వరలో మోక్షం లభించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం. సర్కారు యోచన ఇదీ... సుమారు తొమ్మిదిన్నర దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను గోదావరి జలాల తరలింపు ద్వారా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఇటీవల ఆదేశించారు. మూసీ సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల నీటిని మూసీలోకి వదలడం ద్వారా మూసీ మురికి వదలడంతోపాటు స్వచ్ఛమైన జలాలు నగరంలో పారే అవకాశం ఉంటుందని కేబినెట్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ.) మార్గంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటంతోపాటు పర్యావరణం మెరుగుపడనుందని సర్కారు యోచిస్తోంది. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు గృహ, పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయాల్లో చేరకుండా మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారా జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నిబంధనలను పొందుపరుస్తూ ఉత్తర్వులివ్వాలని కేబినేట్ నిర్ణయించింది. మూసీ, ఈసా నదుల్లో కాలుష్య జలాలు చేరడానికి వీల్లేకుండా నూతన జీవోను రూపొందించాలని, ఈ ఉత్తర్వుల అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఆమోదం తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. -
నగరంలో కుక్కల రచ్చ.. అసెంబ్లీలో స్ట్రాంగ్ చర్చ
శివాజీనగర(బెంగళూరు): బెంగళూరులో పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై విధానసభలో మంగళవారం ఘాటుగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు. నగరంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు తిరిగేందుకు భయపడుతున్నారని, ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు. మంత్రి జేసీ మాధుస్వామి మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు జనన నియంత్రణ శస్త్రచికిత్సల చేయడానికి టెండర్లను పిలిచినట్లు చెప్పారు. వాటికి వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయాలన్నారు. కుక్కలను చంపడానికి చట్టంలో అవకాశం లేదన్నారు. -
కాంగ్రెస్కు రాహులే పెద్ద సమస్య
పనాజీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తీరును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆయనే పెద్ద సమస్యగా మారారని చెప్పారు. రాహుల్ భావిస్తున్నట్లుగా అధికార బీజేపీకి, నరేంద్ర మోదీ పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చిచెప్పారు. గోవా రాజధాని పనాజీలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ వీడియో దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్కు, ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఈ వ్యాఖ్యలను బట్టి అవగతమవుతోంది. కాంగ్రెస్లో ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు సీనియర్లు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లపాటు కాంగ్రెస్ హవా చెలాయించినట్లుగా... బీజేపీ సైతం రాబోయే కొన్ని దశాబ్దాలపాటు దేశ రాజకీయ యవనికపై కచ్చితంగా కేంద్ర స్థానంలో కొనసాగుతుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయం రాహుల్ గాంధీకి మాత్రం అర్థం కావడం లేదని, అదే ఆయనతో సమస్య అని చెప్పారు. ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 30 శాతానికిపైగా ఓట్లు దక్కించుకునే పార్టీకి అప్పటికప్పుడు వచ్చే ప్రమాదమేదీ ఉండదని వివరించారు. అందుకే ప్రధాని మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఆయనకు పదవీ గండం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఒకవేళ ప్రజలు మోదీని పదవి నుంచి దించేసినా, బీజేపీ రాబోయే కొన్ని దశాబ్దాలపాటు అధికారం కోసం ఎన్నికల్లో పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ‘‘నరేంద్ర మోదీ బలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆయనను ఓడించడం సాధ్యం కాదు’’అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు. Eventually, Prashant Kishor acknowledged that BJP will continue to be a force to reckon with in Indian politics for decades to come. That's what @amitshai Ji declared way too earlier. pic.twitter.com/wqrqC3xzaZ — Ajay Sehrawat (@IamAjaySehrawat) October 28, 2021
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement