-
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్లో లక్నో సన్రైజర్స్తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్బోర్డ్, జూబ్లీ బస్స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్రైజర్స్ ఉప్పల్లోనూ ఆ సీన్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్లో సన్రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో నేత రాజీనామా
మేడ్చల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ పలువరు కీలక నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు కే. కేశవరావు, పట్నం మహేందర్రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నగేందర్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలపటం గమనార్హం. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో) -
CSK అభిమానికి చేదు అనుభవం.. HCAపై ఆగ్రహం! పోస్ట్ వైరల్
మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలాకు ఇదే చివరి సీజన్ అన్న నేపథ్యంలో గతేడాది అతడిని చూసేందుకు అభిమానులు మైదానాలకు పోటెత్తిన విషయం తెలిసిందే. స్టేడియం ఏదైనా.. తమ సొంత జట్టును కూడా కాదని ధోని బ్యాటింగ్ వచ్చిన మూమెంట్స్ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ధోని ఐపీఎల్-2024లోనూ ఆడుతుండటంతో అభిమానులకు రెట్టింపు సంతోషాన్నిస్తోంది. ఇక ఈసారి ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కాకున్నా ఆటగాడిగా మైదానంలో దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వీరాభిమాని అయిన జునైద్ అహ్మద్ అనే యువకుడు సన్రైజర్స్తో సీఎస్కే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 అయితే, శుక్రవారం ఉప్పల్ స్టేడియానికి వచ్చిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఏకంగా రూ. 4,500 పెట్టి ఖర్చు పెట్టి మ్యాచ్ కోసం వచ్చిన జునైద్ అహ్మద్ టికెట్లో.. అతడికి J-66 సీట్ నెంబర్ అలాట్ చేసినట్లు ఉంది. సంతోషంగా స్టేడియానికి వెళ్లగా.. ఆ నంబరుతో అసలు సీటే కనిపించలేదు. J-65 తర్వాత J-67 సీట్ ఉండటంతో అతడు షాకయ్యాడు. సిబ్బందికి విషయం చెప్పినా వారూ ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా జునైద్ అహ్మద్ మ్యాచ్ మొత్తం నిలబడే చూడాల్సి వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే తనకు ఈ దుస్థితి తలెత్తిందంటూ అతడు ఎక్స్ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. డబ్బులు పెట్టి టికెట్ కొంటే.. నాలుగు గంటలపాటు నిలబడి మ్యాచ్ చూడాల్సి వచ్చిందని వాపోయాడు. తనకు కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా తిరిగి డబ్బులు పొందగలనా? అంటూ బీసీసీఐతో పాటు హెచ్సీఏ అధ్యక్షుడిని కూడా జునైద్ ట్యాగ్ చేశాడు. అతడి ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్కు ముందు స్టేడియంలోకి అనుమతించే క్రమంలోనూ పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏదేమైనా హెచ్సీఏ తీరు మారకపోవడంతో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియానికి వెళ్తే ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటామని వాపోతున్నారు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంత మైదానంలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ Disappointed that I’ve booked a ticket and seat Number was J66 in Stand. Sorry state that seat doesn’t exist and had to stand and enjoy the game. Do I get a refund and compensation for this.#SRHvCSK #IPL2024 @JayShah @BCCI @IPL @JaganMohanRaoA @SunRisers pic.twitter.com/0fwFnjk641 — Junaid Ahmed (@junaid_csk_7) April 5, 2024 -
#Dhoni: కమిన్స్కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్ను చూసి సన్రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్లో వికెట్పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. వైజాగ్లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: వావ్.. గెలిచాం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి?
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన కమిన్స్ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్లో ముంబై ఇండియన్స్ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లిన సన్రైజర్స్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్ కోసం మళ్లీ ఉప్పల్కు విచ్చేసిన సన్రైజర్స్ హోం గ్రౌండ్లో తమకు తిరుగు లేదని నిరూపించింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్ ట్రాక్ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ‘‘అవును.. గెలిచాం.. వావ్’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్లో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ తల్లి, సోదరి వచ్చి అభిషేక్తో ఫొటోలు దిగారు. ఆ అమ్మాయి ఎవరంటే? ఇక అభిషేక్ శర్మ సోదరి.. విక్టరీ సింబల్ చూపిస్తూ కావ్యా మారన్తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు. స్టాండ్స్లో ఉండి సన్రైజర్స్ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్ప్రెషన్స్ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?! చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ -
మా బౌలర్ల తప్పు లేదు.. ఓటమికి కారణం అదే: పాండ్యా
IPL 2024: Hardik Pandya backs bowlers after SRH mauling: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఐపీఎల్-2024లో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా బౌలర్ల వైఫల్యం కారణంగా ప్రత్యర్థి జట్టు కేవలం మూడు వికెట్ల నష్టానికే 277 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా సన్రైజర్స్ ఐపీఎల్లో ఆల్టైమ్ రికార్డు సృష్టిస్తే.. ముంబై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఉప్పల్ వికెట్ బాగుందని.. ఓటమికి బౌలర్లను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఈ పిచ్పై ఇంత స్కోరు నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదన్నాడు. ‘‘ఈ వికెట్ చాలా బాగుంది. ఇక్కడ బౌలర్లు ఎంత మంచిగా బౌలింగ్ చేసినా.. ప్రత్యర్థి 277 పరుగులు స్కోరు చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయంలో క్రెడిట్ రైజర్స్ బ్యాటర్లకు కూడా ఇవ్వాలి. నిజానికి.. టాస్ సమయంలో.. ఎస్ఆర్హెచ్ ఇంత స్కోరు చేస్తుందని అనుకోలేదు. వాళ్లను కట్టడి చేయడానికి మా బౌలర్లు బాగానే ప్రయత్నం చేశారు. కానీ పిచ్ వారికి అనుకూలించలేదు. ఇక్కడ 500కు పైగా పరుగులు స్కోర్ అయ్యాయంటే.. వికెట్ బ్యాటర్లకు అనుకూలించిందనే అర్థం కదా! ఏదేమైనా ఇప్పుడు మా జట్టులో చాలా మంది యువ బౌలర్లే ఉన్నారు. ఈ మ్యాచ్ నుంచి వాళ్లు పాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు క్వెనా మఫాకా అద్భుతంగా ఆడాడు. తన తొలి మ్యాచ్లోనే ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. తనకిది మొదటి మ్యాచ్. ఇక్కడ కుదురుకోవడానికి తనకు ఇంకాస్త సమయం కావాలి. మా బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. కానీ.. సరైన సమయంలో రాణించలేకపోయారు’’ అని హార్దిక్ పాండ్యా తమ బౌలింగ్ విభాగాన్ని సమర్థించాడు. కాగా ఉప్పల్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 246 పరుగుల వద్దే నిలిచి.. తాజా ఎడిషన్లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో పాండ్యా నాలుగు ఓవర్ల బౌలింగ్లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల పేసర్ క్వెనా మఫాకా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
500 కోట్లు స్కాం బోర్డు తిప్పేసిన జేపీ బిల్డర్స్
-
ఎల్ఈడీ లైట్లే కొంప ముంచాయా?
ఉప్పల్: ఉప్పల్ సీఎంఆర్ వస్త్ర దుకాణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఎల్ఈడీ లైట్లే కారణమని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కారణంగా షార్ట్ సర్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై సీఎంఆర్ మేనేజర్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతులపై అన్నీ అనుమానాలే..? సీఎంఆర్ దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అయినా వస్త్ర దుకాణం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పని చేసే చోట భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఆక్యుపెన్సీ(ఓసి) లేకుండా అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకే వ్యాపార సంస్థకు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ట్రాఫిక్ విషయంలో సంబంధిత అధికారులు అనుమతి ఉందా? ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బుధవారం ఉదయం అనుమతులపై ఆరా తీశారు. నిర్వాహకులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తమే కానీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని టౌన్ప్లానింగ్ అధికారి స్వయంగా పేర్కొనడం గమనార్హం. -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
గద్వాలలో కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లో చేరిన డీసీసీ అధ్యక్షుడు
సాక్షి, జోగులాంబ గద్వాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే టికెట్కెట్ దక్కలేదన్న అసంతృప్తితో ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. అనంతరం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గద్వాల కాంగ్రెస్ టికెట్ను రేవంత్ కొత్తగా వలస వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ సరితకు అమ్ముకున్నారని విమర్శించారు. గద్వాలలో రేవంత్ రెడ్డి బ్యానర్ను ప్రభాకర్ రెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. ఇప్పటికే సరిత అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్ అసమ్మతి నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవం లేని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకన్న లక్ష్మారెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. సాయంత్రం ప్రగతి భవన్కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను కలువనున్నారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: మహబూబ్నగర్ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్ -
WC 2023: ‘పసికూన’పై కివీస్ ప్రతాపం.. వరుసగా న్యూజిలాండ్ రెండో విజయం
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్లో ‘పసికూన’ నెదర్లాండ్స్ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. హైదరాబాద్లోని ఉప్పల్ మ్యాచ్లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆశలు రేపాడు 69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్ స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్గా వెనుదిరిగాడు. చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్తో మ్యాచ్ నాటికి.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
Hyderabad: టీచర్ కర్కశత్వం.. పసి ప్రాణం బలి
ఉప్పల్(హైదరాబాద్): ఓ టీచర్ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వివేక్ నగర్లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిని టీచర్ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు -
ఉప్పల్లో పాక్-న్యూజిలాండ్ పోరు.. సర్వం సిద్దం
ప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్కు అంతా సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్నహాక మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్కు ప్రేక్షకులకు బీసీసీఐ అనుమతి నిరాకరిచింది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టు ఇప్పటికే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి. బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. అనంతరం గురువారం(సెప్టెంబర్28)న ఇరు జట్లు నెట్ప్రాక్టీస్లో కూడా పాల్గోనున్నాయి. కాగా ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, ఆగా సల్మాన్ మినహా మిగితా ఆటగాళ్లకు ఎవరికి భారత పిచ్లపై ఆడిన అనుభవం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేన్మామ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అదే విధంగా గాయంతో ఇంగ్లండ్ సిరీస్లో మధ్యలో ఇంటిముఖం పట్టిన స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఫిట్నెస్ సాధించాడు. ఈ మ్యాచ్లో అతడు కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పాక్ జట్టుకు ఘన స్వాగతం.. ఇక 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై పెట్టిన పాక్ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల ఆదరణకుపాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పాక్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలను తెలిపారు. హైదరాబాదీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మాకు హైదరబాదీల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. చాలా బాగుంది. భారత్లో గడిపే రానున్న నెలన్నర రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మరో పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఓ పోస్ట్ చేశాడు. -
NZ vs PAK: ప్రేక్షకులు లేకుండానే క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సన్నాహక మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈమేరకు రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ బీసీసీఐ, హెచ్సీఏ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఇరు జట్ల క్రీడాకారులతో పాటు బీసీసీఐ/ఐసీసీ అధికారులు తప్ప సాధారణ వీక్షకులకు ప్రవేశం లేదని చెప్పారు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రతిష్టాత్మకమైనవి కావున క్రీడాకారులకు ఎలాంటి శాంతిభద్రత సమస్యలు లేకుండా చూడా లని పోలీసుల సిబ్బందికి సూచించారు. సమావేశంలో రిటైర్డ్ డీజీపీ (సీఆర్పీఎఫ్) దుర్గాప్రసాద్, డీసీపీ అభిషేక్ మహంతి, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీబాల, ఏసీపీలు నరేష్ రెడ్డి, శ్రీనివాస్, బీసీసీఐ, హెచ్సీఏ అధికారులు పాల్గొన్నారు. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్గౌడ్, పిసరి మహిపాల్రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
కాంగ్రెసోళ్ల ఫొటో పెట్టుకునోడికి బీఆర్ఎస్ టికెట్టా?
‘‘ఉరి తీసేవాడ్ని కూడా ఆఖరి కోరిక అడుగుతరు. ఒక బలి ఇచ్చేటప్పుడు కూడా నోట్లో నీళ్లు పోస్తరు. అంతకన్నా దారుణంగా నన్ను ట్రీట్ చేసిండ్రు. టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. ఎమ్మెల్యే అయినాక ఆస్తులు అమ్ముకున్నా. పార్టీతో.. ఎమ్మెల్యే పదవితో లాభం పొందింది లేదు. పార్టీలో దందాలు, గుండాయిజాలు చేసినోళ్లు ఉన్నారు. నిజాయితీగా ఉన్న నాలాంటోడికేమో అన్యాయం జరుగుతోంది. టికెట్ రాకపోవడానికి.. నేనూ వాళ్లలా ఏదైనా తప్పు చేసి ఉండాలా? :::ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తనకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంపై వారం తర్వాత మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. మంగళవారం తన కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్లో ఉన్న ఒకేఒక్క ఉద్యమకారుడ్ని నేను. అలాంటిది నగరంలోని నా ఒక్క సీటే తొలగించడం బాధగా అనిపిస్తోంది. 2001 నుంచి పార్టీలో ఉన్నా. పద్మారావు గౌడ్ నా తర్వాత వచ్చి మంత్రి అయ్యారు. నేను మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ ఇలాగే ఉండిపోయా. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్లో పార్టీని కాపాడాను. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారు. నేను మాత్రం ఆస్తులు అమ్ముకున్నా. అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారు. అసలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి)కి టికెట్ ఎలా ఇస్తారు? ఆయన ఏ జెండా మోశాడు?. కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకున్నోడికి టికెట్ ఎలా ఇస్తారు?. కాంగ్రెస్ నేత అయిన తన అన్న ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటోళ్లకు టికెట్ ఇస్తారా?. అసలు టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. నేనేం తప్పు చేశా. నన్నెందుకు బలి చేశారు?. టికెట్ ఇవ్వనుందుకు నిరసనగా నా కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేద్దామంది. మా క్యాడర్ ఆందోళన చేస్తామంది. నేనే వద్దాన్నా. పార్టీలో ఉన్నాం.. అలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పా. వారం రోజులైనా ఇప్పటికీ నన్ను పిలిచి మాట్లాడలేదు. కనీసం ఏ నేత ద్వారా సంప్రదింపులు జరపలేదు. ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానం అందలేదు. మరో వారం వేచిచూసి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం ప్రకటిస్తా. పార్టీని నమ్ముకుని.. ఇంత మంది భవిష్యత్తును నమ్ముకుని పని చేశా అని సుభాష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉప్పల్ నుంచి నేనే పోటీలో ఉంటా
హైదరాబాద్: ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.. ఉప్పల్ నుంచి తిరిగి నేనే పోటీలో ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీ కోసం.. మీ ఎమ్మెల్యే పాదయాత్ర బుధవారం 27వ రోజు డాక్టర్ ఏఎస్రావునగర్ డివిజన్లో కొనసాగింది. డివిజన్ పరిధిలోని కమలానగర్, మహేశ్నగర్, పంచవటికాలనీ, శ్రీనివాసనగర్, అరూల్కాలనీ, ఏఎస్రావునగర్, అణుపురం కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. మూడు రోజుల పాటుగా సాగిన పాదయాత్రలో గుర్తించిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం అణుపురం కమ్యూనిటీహాల్లో విలేకరులతో మాట్లాడుతూ తిరిగి ఉప్పల్ నుంచి తానే బరిలో ఉండబోయేదని, అందులో సందేహం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షాలకు పిచ్చెక్కిపోతోందన్నారు. దిక్కుతోచని స్థితిలో రెండు లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్లు వంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ ఆ పథకాలన్నీ ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న వాస్తవాలను ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఉప్పల్లో కారిడార్ నిర్మాణం చేయకుండా చేతులెత్తేసిన పార్టీ నాయకులే పనులు నిలిచిపోయాయంటూ ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. జమ్మిగడ్డ శ్మశానవాటికకు సంబంధించి స్థల యజమానులతో మాట్లాడమని త్వరలోనే ఆ సమస్య కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీరెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, గుండారపు శ్రీనివాస్రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, సుడుగు మహేందర్రెడ్డి, డప్పు గిరిబాబు, బోదాసు రవి, మురళిపంతులు, సీతారాంరెడ్డి, మల్కా రమాదేవి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో.. -
Hyderabad: రూ.10 లక్షల మోసం.. ఉప్పల్లో నకిలీ జడ్జి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో నకిలీ జడ్జిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి అవతారమెత్తి వివాదాస్పద భూములను పరిష్కరిస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజిగిర ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప్పల్ పీఎస్లో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ డిగ్రీ చదవి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్లో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో గతంలో దొంగతనాలు, బైక్ చోరీలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. అతనిపై పోలీసులు పీడీ చట్టం కూడా ఉపయోగించారు. తరువాత హైకోర్టులో వివాదాస్పద భూముల కేసులు త్వరగా పరిష్కరిస్తామనిఫేస్బుక్లో ఓ పేజ్ రూపొందించాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి దగ్గర పదిలక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు.. నకిలీ జడ్జి నామాలా నరేందర్తోపాటు అతని వెంట గన్మెన్గా తిరుగుతూ నిందితుడికి సహకరిస్తున్న చిక్కం మధుసూదన రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నిందితుల వద్ద అనుమతి లేని ఓ పిస్టల్ , అయిదు రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు, ఫేక్ జడ్జి ఐడి కార్డు , రూ. 7500 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
కేంద్రం నిధులతోనే ఉప్పల్–వరంగల్ ‘కారిడార్’ నిర్మాణం
ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పనులు 28 నుంచి పునఃప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. ఉప్పల్ స్కై ఓవర్ నిర్మాణ పనులలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే జాప్యం జరుగుతుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తాను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యుద్ధ ప్రాతిపదిక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలని కోరామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జులై 24న అవసరమైన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశానారన్నారు. ఈ నెల 28 నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అదేశించారని ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ద్వారా రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు వేస్తామని ప్రకటన చేయించారని ఎద్దేవాచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని రోడ్డు వేయిస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ కోరారు. దాన్ని మేమే వేస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకానికి తెర తీసిందని ఆయన విమర్శించారు. -
ఉప్పల్ సరే.. మరి లష్కర్?
హైదరాబాద్: ఉప్పల్ చౌరస్తాలో నిర్మించిన స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. రక్షణ శాఖ స్థలాన్ని కేటాయిస్తే మెహిదీపట్నం వద్ద మరొకటి నిర్మిస్తామని హెచ్ఎండీఏ ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. 2011లో సర్వే చేసిన సికింద్రాబాద్ స్కైవాక్ ఊసే లేకుండాపోయింది. నగరంలోనే తొలి స్కైవాక్గా దీన్ని నిర్మించాలని అప్పట్లో భావించిన అధికారులు ఫీల్డ్ సర్వే కూడా చేశారు. ఇది జరిగి పుష్కర కాలమైనా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్ ► ఉమ్మడి రాష్ట్రంలో ఎన్.కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా హయాంలో హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేస్తానంటూ ‘ప్రాజెక్ట్ 100 రోజుల్లో’ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి విభాగాల వారీగా ప్రతిపాదనలు కూడా కోరారు. వీటిలో భాగంగా ట్రాఫిక్ విభాగం అధికారులు పంపిన ప్రపోజల్స్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో, బేగంపేట ప్రాంతంలో ప్రయాణికులకు ఉన్న ఇక్కట్లు తొలగించడానికి పెద్దపీట వేశారు. వివిధ రకాలైన అంశాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని ప్రతిపాదించారు. ► వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఫీల్డ్ విజిట్ను ఆదేశించింది. అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్లతో సహా వివిధ శాఖలతో కలిపి ఏర్పాటు చేసి కో–ఆర్డినేషన్ కమిటీకి ఈ బాధ్యతల్ని అప్పగించింది. 2011 ఫిబ్రవరి 10న ఫీల్డ్ సర్వే చేసిన ఈ కమిటీ స్కైవాక్తో పాటు బేగంపేట రహదారిలో ఉన్న ట్రాఫిక్ అడ్డంకులను తొలగింపు పైనా దృష్టి పెట్టి నివేదిక రూపొందించింది. ► నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో పాదచారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు స్టేషన్ నుంచి ఇటు రేతిఫైల్, అటు 31 బస్టాప్ల మధ్య చిరు వ్యాపారుల కారణంగా మరిన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. వీటికి తోడు వాహనాల రద్దీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. వెరసీ.. ఈ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తూ ఉంటుంది. వీటిని పరిష్కరించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులకు స్కైవాక్ నిర్మించాలని కో–ఆర్డినేషన్ కమిటీ సూచించింది. కాగితాలకే పరిమితం.. ► పాదచారులు నడవటానికి ఉపకరించే ఈ స్కైవాక్లు అప్పటికి బయటి రాష్ట్రాల్లోనే వినియోగంలో ఉన్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జి మాదిరి ఉండే ఈ వంతెనల్ని అంత ఎత్తులో కాకుండా నిర్మించాలని ప్రతిపాదించారు. రోడ్డు పక్కగా 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండాలని, పాదచారులు వీటిపై నడిచి నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకునేలా డిజైన్ చేయాలని భావించారు. వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని ప్రతిపాదించారు. ► ప్రయాణాల నేపథ్యంలో రేతిఫైల్ బస్టాప్ నుంచి రైల్వేస్టేషన్ వరకు, అక్కడ నుంచి ‘31 బస్టాప్’ వరకు ఉన్న ప్రాంతంలో పాదచారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు తొలివిడతగా ఈ మూడు ప్రాంతాల మధ్య స్కైవాక్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే ఉండిపోయాయి. వివిధ ప్రాంతాల్లో స్కైవాక్లపై చర్చ జరుగుతున్నా అటు జీహెచ్ఎంసీ, ఇటు హెచ్ఎండీఏ ఎవరూ లష్కర్ స్కైవాక్ విషయం పట్టించుకోవట్లేదు. -
వారెవ్వా అద్భుతంగా ఉప్పల్ స్కైవాక్.. (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement