-
వెంకూర్లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్..!!
ఆదిలాబాద్: మండలంలోని పాత వెంకూర్ శివారులోని వాగు సమీపంలో మంగళవారం యువకుడినూ, ఎద్దుపై దాడి చేసింది. స్థానికుల వివరాల మేరకు... వెంకూర్ గ్రామానికి చెందిన రేకుల బద్రి, అతడి బావమర్ది శివతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని పశువులను మేపుతున్నాడు. ఒకసారిగా తోడేలు బద్రిపై దాడిచేసింది. దీంతో అతడు చేతులతో పక్కకు పడేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో బద్రి, శివ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బద్రిని స్థానిక వైద్యశాలకు తరలించగా.. అవసరమైన మందులు లేకపోవడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్వో రేష్మ, ఎఫ్బీవో స్రవంతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోడేలు పాదముద్రలుగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
ప్రభుదేవా కోసం విజయ్ సేతుపతి పాట
సినిమాల్లో ఇప్పుడు హీరోలు పాడటం సర్వసాధారణం అయ్యింది. నటుడు విజయ్, ధనుష్, శింబు ఇలా చాలా మంది నటనతో పాటు పాటలను కూడా పాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి నటుడు విజయ్సేతుపతి చేరారు. ఈయన నటుడిగా తమిళం దాటి తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. పాత్రలో వైవిధ్యం ఉందనుకుంటే హీరో, విలన్ అంటూ చూడకుండా నటించేస్తున్నారు. ఇకపోతే నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉల్ఫ్. ఇది ఈయన నటిస్తున్న 60వ చిత్రం. ఇందులో నటి అంజు కురియన్ నాయకిగా నటిస్తుండగా పుష్ప చిత్రం ఫేమ్ అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మీ, శ్రీగోపిక, రమేశ్ తిలక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుళ్విన్సెంట్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైకిలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రానికి సిండ్రిల్లా చిత్రం ఫేమ్ వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం నటుడు విజయ్ సేతుపతి ఒక పాట పాడటం విశేషం. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో జంతువులను రక్షించిన ఘటనలు చూసి ఉంటాం. కొన్ని క్రూరమృగాలు అనుకోకుండా ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే.. రక్షించేందుకు అంతతేలికగా ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే వాటిని రక్షించేలోపే మనకు హాని చేసే అవకాశం లేకపోదు కాబట్టి. ఐతే ఇక్కడొక వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఓ తోడేలు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ రక్షించేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చోట తోడేలు కాలుకి ఏదో రాడ్లాంటి దానిలో రెండు కాళ్లు ఇరుకుపోయాయి. పాపం అది కదిలేందుకు లేక అలా ఉండిపోయింది. సడెన్ ఓ వ్యక్తి వచ్చి దాన్ని చాలా తెలిగా చిన్న కర్రతో ట్రాప్ చేస్తూ.. ఓ పక్క నుంచి దాన్ని కాపాడే యత్నం చేశాడు. ఆ తర్వాత అది బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు అతను చాలా ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Brave Man Rescues Wolf from Trap with the Help of a Stick pic.twitter.com/ZqSGJqJxXi — Terrifying Nature (@TerrifyingNatur) May 8, 2023 (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
ఇదేం ఖర్మ.. ఆ తిక్కకు ఓ లెక్కంటూ లేదా?
వైరల్: పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. వెరైటీ పేరిట చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విపరీతమైన ఆదరణ తెచ్చిపెడుతుంటాయి. కానీ, ఆ ప్రయత్నం అతిగా ముందుకెళ్తే? మనిషికి తిక్క ఉండొచ్చు. కానీ, దానికి ఓ లెక్కంటూ లేకపోతేనే సమస్య మొదలయ్యేది.. ఈ తిక్కకు ఓ లెక్కంటూ లేదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. జపాన్లో ఆ మధ్య ఒకడు కుక్కలా బతకాలని ఉందంటూ లక్షలు పోసి.. కుక్క కాస్టూమ్ను తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రే వైరల్ అయిపోయాడు. అయితే.. ఈ మధ్య ఓ బ్రిటన్ టాబ్లాయిడ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఆ వ్యక్తి.. కుక్కలా బతకడం వల్ల ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఏం అనుకుంటారో అని తెగ ఫీలైపోతున్నాడు. త్వరలోనే ఆ వేషానికి ముగింపు వేయాలని అనుకుంటున్నాడట. ఈ వ్యవహారం మరిచిపోక ముందే.. #WATCH: Ever wanted to know what it would be like to live life as a dog? One #Japanese man actually has an answer to this question. Toco spent a whopping two million Yen on a realistic #Collie breed costume. @zeppetJP (🎥 via @toco_eevee)https://t.co/025Pbky6qZ pic.twitter.com/e5WCMNmJkd — Arab News Japan (@ArabNewsjp) May 27, 2022 అదే జపాన్లో మరొకడు తోడేలులా కనిపించేందుకు డబ్బు కుమ్మరించాడు. ఈసారి ఇంకా ఎక్కువే ఖర్చు చేశాడు. మన కరెన్సీలో ఆ విలువ రూ. 19 లక్షల దాకా ఉంటుంది. కుక్క కోసం టోకో ఆశ్రయించిన జెప్పెట్ కంపెనీనే.. ఇతని కోసం సూట్ తయారు చేసింది. అయితే నిజమైన తోడేలులాగా నడిచేందుకు అతనికి కాస్త కష్టంగా ఉందంట. అందుకే రెండు కాళ్లతో నడుస్తూ.. తన తోడేలు కల నెరవేరిందని సంతోషిస్తున్నాడు. ఇది చూసి నెటిజన్స్.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు. View this post on Instagram A post shared by 特殊造型ゼペット (@zeppet_jp) -
రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్!
17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్హోల్గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది. -
ఇంతకీ ఈ వింత జంతువు పేరేంటి!
అవును.. ఇదేంటి? ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు.. చూడ్డానికి నక్కలా ఉందని కొందరు.. కుక్కలా ఉందని మరికొందరు.. ఇవన్నీ కాదహే.. అని ఇంకొందరు.. ఇది తిమింగళం అని మేమంటాం? మీరేమంటారు? ఎర్రగడ్డ నుంచి డిశ్చార్జి అయి ఎన్ని రోజులైంది అని అనేగా.. అచ్చంగా ఇది తిమింగళమే.. అవును.. అవి ఒకప్పుడు నాలుగు కాళ్లపై నడిచేవట. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు.. ఒక్కో జంతువు.. ఒక్కో జంతువు నుంచి పరిణామం చెందాయనేది కూడా తెలిసిందే. తాజాగా వేల్స్ విషయం చూసుకుంటే.. అవి ఎలా పరిణామం చెందాయనే దానిపై పరిశోధనలు జరిగాయి. ఈ జలచరాలు.. జింకల మాదిరిగా చెంగుచెంగున భూమిపై గంతులు వేసేవనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని నార్త్ ఒహియో మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లిటిల్ డీర్స్ అనే ఇండోహయస్ జంతువుల నుంచి ఈ వేల్స్ పరిణామం చెందాయని వివరించారు. సీటేషియన్స్ జాతికి చెందిన జంతువుల (హిప్పోపోటమస్, వేల్స్ వంటివి) జీవ పరిణామం గురించి అధ్యయనం చేస్తుండగా, పాకిస్తాన్లో 4.7 కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్ డీర్కు సంబంధించిన శిలాజం లభించింది. ఇది ఓ నక్క పరిమాణంలో ఉండి, పొడవాటి శరీరం, తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ జీవిలోని పలు ఎముకల నిర్మాణం వేల్స్ ఎముకలతో పోలి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ.. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు సముద్రం దగ్గరికి వెళ్లి దాచుకునేవని, అలా కాలక్రమేణా నీటిలో జీవించే జీవనాన్ని అలవరుచుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇండోహయస్, వేల్స్ రెండింటి కపాలం, చెవుల నిర్మాణాలు ఒకేలా ఉన్నాయని తెలిసింది. మొసళ్ల మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురుచూసేవని, చివరికి ఆ నీళ్లలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు. -
వైరల్: తోడేలేంటి కుక్కలా ఉంది?..
బీజింగ్ : వయో భారం కారణంగా మృతి చెందిన తోడేలు స్థానంలో కాపలా కుక్కను ఉంచి జనాలను మోసం చేయటానికి చూసిందో జూ యజమాన్యం. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చైనా, హ్యూబే ప్రావిన్స్కు చెందిన క్సూ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం గ్జియాన్నింగ్లో ఉన్న గ్జియాంగ్వుషాన్ జూకి వెళ్లాడు. అక్కడి జంతువులను ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత తోడేలు అని రాసి ఉన్న చోట ఆగి ఎన్క్లోజర్లోకి చూశాడు. అయితే ఆ తోడేలు వీధి కుక్కలా ఉండటంతో మరింత పరీక్షగా చూసి, అది కుక్కేనని ధ్రువీకరించుకున్నాడు. ఈ విషయమై జూ సిబ్బందిని నిలదీయగా.. ఒకప్పుడు ఆ ఎన్క్లోజర్లో తోడేలు ఉండేదని, వయో భారం కారణంగా అది మృతి చెందిందని తెలిపారు. ఎన్క్లోజర్ను ఖాళీగా ఉంచటం బాగోదని కొద్ది రోజుల పాటు కాపలా కుక్కను ఉంచుతున్నామని చెప్పారు. జూను సరిగా నడపటానికి కావాల్సినంత నిధులు రావటంలేదని, జనాలు కూడా తక్కువగా వస్తున్నారని అన్నారు. ఎన్క్లోజర్లో కుక్క ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ తోడేలేంటి వీధి కుక్కలా ఉంది?’’.. ‘‘ హ.హ..హ.. నువ్వు తోడేలువువా?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : ఆ కొండంతా బంగారం.. ఎగబడ్డ జనం -
40 వేల ఏళ్లనాటి ఓ రాకాసి తల..
సైబీరియా : 40 వేల ఏళ్ల నాటి ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుతో సహా రాకాసి తోడేలు తలలోని ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రాకాసి తోడేలు తల పరిమాణము ప్రస్తుత మున్న తోడేళ్ల తల కంటే పెద్దదిగా ఉంది. మామూలు తోడేళ్ల తల 9 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది. సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో దీని కనుగొన్నారు. రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ మాట్లాడుతూ.. ‘’ఇదో ప్రత్యేకమైన ఆవిష్కరణ. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసార’’ని అన్నారు. టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన ప్రొఫెసర్ నావోకీ సుజుకి మాట్లాడుతూ.. ఆ రాకాసి తోడేలు తలలోని కండరాళ్లు, వివిధ భాగాలు, మెదడు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తోడేళ్ల జాతితో, సింహాలతో రాకాసి తోడేళ్లను పోల్చిచూసి వాటి శక్తి సామర్థ్యాలను బేరీజువేస్తామ’’ని చెప్పారు. -
మిమ్మల్నే మహారాజా!
మృగరాజు ముసలిదైపోయింది. చూపు తగ్గింది. వేటాడే ఓపిక సన్నగిల్లింది. దాంతో ఓ ఉపాయం ఆలోచించింది. తోడేలును పిలిచి, ‘‘నేను పెద్దవాడినయి పోయాను. వేటాడలేక పోతున్నాను. కాబట్టి ఏదో ఒక జంతువును నా దగ్గరకు తీసుకొస్తుండు. నీకూ వాటా ఇస్తాను. అన్నట్లు ఇప్పుడు నాకు దుప్పి మాంసం తినాలనుంది. బాగా బలిసిన దుప్పినొకదాన్ని తీసుకురా’’ అని ఆజ్ఞాపించింది. తోడేలు అందుకు ఒప్పుకుంది. వెంటనే బయల్దేరి ఒక దుప్పి దగ్గరకెళ్లి వినయంగా నమస్కరించి, ‘‘మహారాజా! కులాసానా?’’ అంటూ పలకరించింది. తనను కాదనుకుని అటూ ఇటూ చూడసాగింది దుప్పి. ఈ సారి ఇంకాస్త వినయంగా ‘‘మిమ్మల్నే మహారాజా’’ అంది నక్క. దాంతో అది పిలుస్తున్నది తననే అని నిర్ధారించుకుని, ‘‘ఊ! మేము బాగానే ఉన్నాం. ఏమిటి సంగతి?’’ అనడిగింది దుప్పి అప్పటికే తాను మహారాజయిపోయినట్లు! ‘‘మీకు తెలియందేముంది రాజా! మన మృగరాజుగారు పెద్దవారయ్యారు కదా. తన స్థానంలో మిమ్మల్ని రాజును చెయ్యాలని తీర్మానించుకున్నారు. మిమ్మల్ని సగౌరవంగా పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆయన మనసు మార్చుకోకముందే బయల్దేరండి’’ అంటూ తొందర చేసింది. దుప్పికి తన బలంమీద, తెలివి తేటలమీద బాగా నమ్మకం. తోడేలు మాటలు నిజమేనని నమ్మింది. ముందు వెనకలు ఆలోచించకుండా కొమ్ములు దువ్వుకుంటూ వెంటనే బయల్దేరింది. తోడేలు దాన్ని సింహం ఉన్న గుహదాకా తీసుకొచ్చింది. తటపటాయిస్తున్న దుప్పితో, ‘‘మృగరాజు దగ్గరకు వెళ్లండి. మీకు కిరీటం తొడిగి, మీరు ఏమేం పనులు చేయాలో చెబుతారు’’ అంది తోడేలు. దుప్పి సింహం దగ్గరకు వెళ్లి తలవంచి నిలబడింది. సింహం ఒక్కసారిగా తన పంజా విసిరి దాని మెడ చీల్చి చంపేసింది. అది తినగా మిగిలిన మాంసంతో తోడేలు విందు చేసుకుంది. నక్క వినయాలు నిజమేననుకోవడం, అవతలివారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరం. –డి.వి.ఆర్. -
మూడు పంది పిల్లలు – తోడేలు
అనగనగా ఒక అడవి. అడవి ప్రక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో మూడు పంది పిల్లలు వాళ్ళ అమ్మనాన్నలతో హాయిగా జీవించేవి. అవి పెద్దవయ్యాక వాళ్ళ ఇల్లు సరిపోకపోవడంతో తల్లిదండ్రులు వాటిని వేరేగా మంచి ఇల్లు కట్టుకుని ఉండమన్నాయి. అప్పుడవి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. ఒక రావి చెట్టు దగ్గర మంచి ప్రదేశం చూసుకున్నాయి. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలా అనుకుంటుండగా ఆ దారినే పోతున్న ఒక ఒంటె ఈ పంది పిల్లలని చూసి సంగతేంటని అడిగింది. ‘‘మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియడంలేదు’’ అన్నాయవి. అప్పుడా ఒంటె ‘‘ఏమీ దిగులు పడకండి. నాకు ఇటుకల బట్టీ ఉంది. బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను. వాటితో కట్టుకోండి’’ అంది. అవి ఒంటెకి ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకుని, ఇల్లు కట్టుకుని అక్కడ ఉండసాగాయి. ఒకరోజు ఈ మూడు పందులని గమనించిన ఒక తోడేలు ఎలాగైనా వాటిని పట్టి తినాలనుకుంది. అది పందులున్న ఇంటి దగ్గరకొచ్చి ‘‘ఏయ్, మురికి పందులూ, నన్ను లోపలకి రానివ్వండి’’ అంది. ‘‘నిన్ను మేము రానివ్వం. రానిస్తే మమ్మల్ని తింటావని మాకు తెలుసు’’ అన్నాయి పందులు. ‘‘మీరు రానివ్వకపోతే మీ ఇల్లు ఊదేస్తాను, ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’‘ అని అరిచాయి లోపల నుండి పందులు. తోడేలు ‘హఫ్, హుఫ్, హఫ్, హుఫ్’ అని ఊదింది. ఇటుకలని పీకడానికి ప్రయత్నించింది. ‘‘అబ్బ! ఈ ఇల్లుగట్టిగా ఉందే’’ అని, ‘‘సరే ఇçప్పుడు చీకటి పడింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం సుత్తితో వస్తాను. తలుపు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంటూ వెళ్ళిపోయింది. ‘‘వద్దు, వద్దు. మా ఇంటినేం చేయొద్దు’’ అరిచాయి పందులు. తెల్లవారింది. మూడు పందులకి ఏం చేయాలో పాలుపోక ఏడుçస్తూ కూర్చున్నాయి. అప్పుడు ఆ దారిలో పోతున్న నిప్పు కోడి విషయం తెలుసుకుని.. ‘‘ఏడవకండి, నా దగ్గర పట్టుకుంటే షాక్కొట్టే తాళాలు ఉన్నాయి. వాటిని బిగించండి. ఆ తోడేలు వచ్చినప్పుడు స్విచ్ వేయండి. పట్టుకుంటే షాక్కొట్టి అల్లంత దూరాన పడుతుంది. ఇక మీ జోలికిరాదు’’ అంది. మూడు పందులూ నిప్పుకోడికి కృతజ్ఞతలు చెప్పుకుని కరెంటు తాళాలు తెచ్చి తలుపులకు బిగించాయి. సాయంత్రమైంది. సుత్తితో తోడేలు వచ్చింది. ‘‘ఏయ్, మురికి పందులూ.. మీ తాళాన్ని పీకేస్తాను, తలుపులని పగలగొట్టి, లోపలకొచ్చి మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’’ అని అరిచి గబగబా స్విచ్చి వేశాయి. స్విచ్చి వేయగానే తాళాలన్నీ ఎర్రగా మండసాగాయి. తోడేలు సుత్తి తీసుకుని తాళం పగలగొట్టబోయింది. షాక్కొట్టి ఎగిరి అవతలపడింది. ‘‘ఓ, కరెంటు తాళాలు వేశారా, సరే రేపు వస్తాను, డ్రిల్లింగ్ మిషిన్ తెస్తాను, తాళాలు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంది కోపంగా. ‘‘వద్దు, వద్దు.’’ అరిచాయి పందులు. తెల్లవారింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాయి పందులు. అప్పుడా దారిలో పోతున్న సీతాకోకచిలుకల గుంపు ఈ పందుల దగ్గర వాలి ‘‘ఎందుకేడుస్తున్నారు?’’ అని అడిగాయి. విషయం చెప్పగానే ‘‘మేము చెప్పినట్లు చేయండి. ముందుగా అదిగో ఆ ప్రక్కనున్న చెరువులో స్నానం చేసిరండి’’ అంది ఒక తెల్లని సీతాకోకచిలుక. అవి స్నానం చేసి వచ్చాయి. ‘‘ఇంటి ముందు పూల చెట్లతో అలంకరించండి’’ అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. మూడు పందులూ గబగబా రకరకాల రంగుల పూల చెట్లను తెచ్చి నాటాయి. ‘‘ఇంటిపైకి పాకేలా పూల తీగలని నాటండి’’ అన్నాయి పసుపు సీతాకోక చిలుకలు. పందులు పూల తీగలను తెచ్చి ఇంటి పైకి పాకించాయి. ఇల్లు అందంగా తయారయింది. ‘‘ఆహా! మీ ఇల్లు ఎంత బాగుంది?’’ అంటూ సీతాకోక చిలుకలన్నీ ఇంటి ముందు పుప్పొడితో రంగవల్లులు వేసి వెళ్ళిపోయాయి. పందులు సీతాకోక చిలుకలకి వీడ్కోలు పలికాయి. ‘‘ఆహా! మన ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకున్నాయవి. అలిసిపోయిన అవి హాయిగా పడుకుని నిద్రపోయాయి. సాయంత్రమయింది. తోడేలు డ్రిల్లింగ్ మిషెన్తో వచ్చింది. ‘‘పందులుండే ఇల్లు ఇది కాదే, దారితప్పానా?’’ అనుకుంది. సరిగ్గా చూసింది. ‘‘ఆహా! ఇదే కాని ఈ ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకుంటూ వచ్చి ‘‘పందులూ, శుభ్రంగా ఉన్న పందులూ మీ ఇల్లు ఎంత బాగుంది, ఎంత సువాసనగా ఉంది? నన్ను లోపలకి రానివ్వండి’’ అని చిన్నగా అడిగింది. ‘‘రానిస్తాం, కాని నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావ్? మా దగ్గర బోలెడన్ని దుంపలు, తేనె ఉంది. నీకు అవి ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే నీకు చాలా ఆటలు కూడా నేర్పుతాం!’’ అన్నాయవి. ‘‘ఓ! అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను. మీరు పెట్టినవే తింటాను, మీతో ఆటలాడతాను, లోపలకి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు క్షమించండి’’ అంది తోడేలు. ‘‘ఇప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము’’ అంటూ పందులు తలుపు తీశాయి. తోడేలు లోపలకి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందులనీ, ఇంటినీ చూసి చాలా ఆనందపడింది. అన్నీ చక్కగా చేతులు కడుక్కుని దుంపలుతిని, తేనెని తాగాయి.ఇంటి వెనుకనున్న తోటలో అవన్నీ కలసిమెలసి సంతోషంగా ఆటలాడుకున్నాయి. రావిచెట్టు మీద వాలి ఇదంతా చూస్తున్న సీతాకోక చిలుకలు కిలకిలా నవ్వాయి. – రాధ మండువ -
నక్క బావ కథ కంచికేనా!
అంతరిస్తున్న నక్క, తోడేలు, మచ్చల జింక ► ప్రమాదంలో 150 వృక్ష, జంతుజాతుల మనుగడ ► 95 జాతుల జాబితాను రూపొందించిన జీవ వైవిధ్య బోర్డు ► మచ్చల కందుల జాడ లేదు.. పేలాల జొన్నల ఊసు లేదు.. ► పులి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటు, రాబందులకూ పొంచి ఉన్న ప్రమాదం.. కళ్లు తెరవకుంటే కనుమరుగే సాక్షి, హైదరాబాద్: ‘అనగనగా ఓ తోడేలు.. ఓ అడవిలో నక్క ఉండేది..’ చిన్నతనంలో బామ్మ చెప్పిన కథలన్నీ ఇలాగే మొదలయ్యేవి! చందమామ, బాలమిత్ర పుస్తకాల కథల్లోనూ చాలావరకు ఇవే కనిపించేవి. కానీ పరిస్థితులు చూస్తుంటే మున్ముందు ఈ జంతువుల ఉనికి ఇక కథలకే పరిమితమయ్యేలా ఉంది. భావి తరాలు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వీటితోపాటు అనేక జంతు, వృక్ష, పక్షి, ఉభయచర, సరీసృపాల జాతుల మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అవన్నీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ జాబితాలో సుమారు 150 జాతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు గుర్తించింది. ప్రస్తుతానికి 95 జాతుల జాబితాను రూపొందించింది. మరో 55 జాతుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. అరుదైన వృక్ష, జంతు జాతులను పరిరక్షించుకోకుంటే భావి తరాలకు ఇవన్నీ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబంధులు.. మచ్చల కందులేవీ? వినువీధిలో రాబంధుల రెక్కల చప్పుడు క్రమేణా కనుమరుగవుతోంది. తెలంగాణ సంప్రదాయ పంట మచ్చల కందులు మాయమౌతున్నాయి. రాష్ట్రానికే తలమానికమైన అరుదైన వృక్ష, జంతుజాతులు మాయమై జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన పంటలు కూడా అంతరించిపోతున్నాయి. తాతలనాటి నుంచి వంశపారంపర్యంగా> వస్తున్న ఎర్రమచ్చల కందులు.. పేలాల జొన్నలు, వాయునౌక జొన్నలు వంటి పంటలు అంతర్ధానమవుతున్నాయి. అడవుల నరికివేత, వేటలతో మన్ననూరు గేదె వంటి అరుదైన జంతు జాతులూ అంతరించిపోయే జాబితాలో చేరాయి. అంతరించిపోతున్న వృక్ష, జంతుజాతులివే.. పర్యావరణపరంగా అరుదు(రేర్), ఎన్డేంజర్డ్ (అంతరించిపోతున్న దశ), థ్రెటన్డ్(అంతిమ దశ) అన్న విభాగాల్లో సుమారు 150 వృక్ష, జంతు జాతులున్నట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గుర్తించింది. వాటి వివరాలివీ.. వృక్ష జాతులు(25): ఎర్రమచ్చల కందులు, పేలాల జొన్నలు, వాయునౌక జొన్న తదితరాలు జంతువులు(23): నక్క, తోడేలు, మన్ననూర్ గేదె, అడవి కుక్క, చిరుత, హైనా, మచ్చల జింక, బురద మచ్చల పిల్లి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటి, పులి వంటివి.. పక్షులు(27): తెల్ల రాబంధు, పొడవు ముక్క రాబంధు, ఎర్రతల రాబంధు, ఈజిప్షియన్ రాబందు, పెద్దమచ్చల గద్ద, కొంగ(బ్లాక్నెక్డ్ స్టార్క్) తదితరాలు సరీసృపాలు(9): మగ్గర్ మొసలి, కొండచిలువ వంటివి.. చేపలు(10): క్లైంబింగ్ పెర్క్, దక్కన్ వైట్ కార్ప్, దక్కన్ నంగ్రా వంటివి.. అరుదైన పంటలు ఎందుకు కనుమరుగవుతున్నాయంటే.. – వాతావరణ మార్పులు – సంప్రదాయ వంగడాలను పరిరక్షించుకునే దిశగా రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోవడం – రైతులు వాణిజ్య పంటలకే మొగుచూపడం. విత్తనాలు విరివిగా లభించకపోవడం – మార్కెటింగ్ వసతులు లేకపోవడం, నిల్వచేసేందుకు స్టోరేజీ సదుపాయాలు లేకపోవడం – విత్తనాల లభ్యత లేకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం – సాగు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడం – నీటి సౌకర్యం లేకపోవడం – చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందులు భారమవడం జంతుజాతుల ఎందుకు ప్రమాదంలో పడుతున్నాయి? – వన్య మృగాల వేట – అడవుల నరికివేత. వాస్తవానికి రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులుండాలి. కానీ మన రాష్ట్రంలో 23 శాతమే ఉన్నాయి – అటవీ ప్రాంతాల్లో మైనింగ్, వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలు – అడవుల్లో సహజసిద్ధ వాతావరణం కనుమరుగుకావడం – జంతు జాతుల సంతానోత్పత్తి దిశగా ప్రయోగాలు చేయకపోవడం పరిష్కారం ఏంటి? – అంతరించిపోతున్న జీవజాలం వీర్యం, అండాలను సేకరించి ప్రయోగశాలల్లో కృత్రిమ ఫలదీకరణ చేయడం ద్వారా ఆయా జాతులను పరిరక్షించవచ్చు – అరుదైన పంటలు, వృక్షజాతుల విత్తనాలు సేకరించి, మరింత అభివృద్ధిపరచి రైతులకు అందజేయడం అవగాహన కల్పిస్తున్నాం: డాక్టర్ సి.సువర్ణ, సభ్య కార్యదర్శి, రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు అరుదైన వృక్ష, జంతుజాలం పరిరక్షణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అరుదైన పంటల పరిరక్షణ ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయవచ్చని అందరూ గుర్తించాలి. సంప్రదాయ పంటల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. ఈ పంటలతో అధిక దిగుబడులు సాధించే దిశగా పరిశోధనలు జరగాల్సి ఉంది. అంతరించిపోతున్న జంతు జాతులపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటి పరిరక్షణకు అందరూ చర్యలు తీసుకోవాలి. -
ముగ్గురమ్మాయిలతో..
కంటికి కనపడేదంతా నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు అబద్ధం నిజంలా రంగుపూసుకుని, నిజానికన్నా మరింత అద్భుతంలా కనిపించవచ్చు. అప్పుడు కూడా మనం అందులోని అబద్ధాన్ని కనిపెట్టేప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మాత్రం అబద్ధమే బాగుందనుకుంటాం. ఈ తోడేలు బొమ్మ(నిజానికి దీన్ని తోడేలు ఫొటో అనాలి) అలాంటి ఓ నిజమైన అబద్ధమే. ఇందులో ఏం ఉంది? అని గట్టిగా అడిగితే ముగ్గురు యువతులు నగ్నంగా ఉన్నారని చెప్పక తప్పదు మరి! ఇటలీకి చెందిన యువ బాడీపెయింటర్ జొహానెస్ స్కాటర్ తపనకు రూపమే ఈ అద్భుతమైన తోడేలు రూపం. నూలుపోగైనా ధరించని ముగ్గురు మహిళల ఒంటిపై పెయింటింగ్ వేసి, వాళ్లను తోడేలు ఆకారంలో కదలకుండా కూర్చోబెట్టి తీసిన ఫొటో ఇది. ఈ ఒక్క ఫొటో తీయడానికి స్కాటర్ కు దాదాపు ఎనిమిది గంటలు పట్టింది. ఆరు గంటలు బాడీ పెయింటింగ్ కు పోగా, రెండు గంటలకు వాళ్లను సరైన పొజిషన్ లో కూర్చోబెట్టడానికి పట్టిందట. 2012 నుంచి ఈ రూపం కోసం ఎన్నెన్నో స్కెచ్ లు గీసుకుని, చివరికి విజయం సాధించాడు. ఈ ఫొటో విడుదలైనప్పటి నుంచి స్కాటర్ కు ప్రశంసలే ప్రశంసలు. అన్ని గంటలు శ్రమకోర్చి ఒంటిపై పెయింటింగ్ వేయించుకుని, అచ్చం తోడేలులా పోజుపెట్టిన ఆ ముగ్గురు వైల్డ్ ఉమన్ కు కూడా లక్షల సంఖ్యలో గ్రీటింగ్స్ అదుతున్నాయి. -
మానవ తోడేలు వ్యాధి!
మెడిక్షనరీ ఈ వ్యాధి ఉన్నవారిలో తోడేలు రోమాల్లా అనిపించే కేశాలు ముఖం నిండా లేదా ఒంటి నిండా పెరుగుతాయి. గ్రీకు జానపదగాథల్లో ‘మానవ తోడేలు’ అని పిలిచే ఒక ఊహా జంతువు ఉంది దాని పేరే ‘వెరెవూల్ఫ్’. దాని పేరు మీద ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. హిమాలయాల్లో నరవానరం (బిగ్ఫుట్) అని పిలిచే నరవానరం ఉందని మన దేశంలో కొందరు నమ్మినట్లే, యూరోపియన్ దేశాల్లో వెరెవూల్ఫ్ అని పిలిచే మానవతోడేలు ఉందని మరికొందరు నమ్ముతారు. వీళ్లలో కోరలు ఉంటాయనీ... ప్రతి పున్నమి రోజున ఈ మానవతోడేళ్లు పూర్తిగా ‘వెరెవూల్వ్స్’గా మారిపోతాయని పాశ్చాత్యదేశాల్లో కొందరి నమ్మకం. కోరలు తప్ప ముఖం నిండా రోమాలు మొలిచే ఈ వ్యాధి ఉండే కండిషన్ను ‘హ్యూమన్ వెరెవూల్ఫ్ సిండ్రోమ్’ అని అంటారు. దీన్నే వైద్యపరిభాషలో హైపర్ట్రైకోసిస్ అని అంటారు. కొందరికి ఈ జబ్బు పుట్టుకతోనే (కంజెనిటల్గా) ఉండవచ్చు. ఆ తర్వాతి దశలోనూ (అక్వైర్డ్) కొందరికి రావచ్చు. అవాంఛిత రోమాలకు చికిత్స చేసినట్లే చర్మవ్యాధి నిపుణులు ఈ వ్యాధికీ ట్రీట్మెంట్ అందిస్తారు. -
తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి
అనంతపురం (రాయదుర్గం) : రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో 8 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ.70 వేలు నష్టం వాటిలినట్లు గొర్రెల యజమాని మారెక్క తెలిపారు. అటవీశాఖాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొర్రెలను పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టారు. -
బొమ్మ అంటే బొమ్మా కాదు!
మాంచెస్టర్: లండన్ పోలీసులకు ఇటీవల చిత్రమైన ఫిర్యాదు ఎదురైంది. తన ఇంట్లో తోడేలు బొమ్మ పోయిందంటూ ఓ విలాసవంతమైన ఫ్లాట్లో నివాసముంటున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు ఉదయం తన స్నేహితుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తన ఇంటికి వచ్చారనీ, ఆ తరువాతే బొమ్మ కనిపించడం లేదని పిర్యాధులో పేర్కొన్నాడు. అది సాధారణ బొమ్మ కాదనీ, దాని విలువ 32 వేల పౌండ్లని తెలిపాడు. అచ్చం సజీవమైన తోడేలులా కనిపించేందుకు తోడేలు చర్మంతో దాన్ని రూపొందించారు. 6 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తుతో పసుపు పచ్చని కళ్లు, తెల్ల బొచ్చుతో జీవకళ ఉట్టిపడేలా తయారు చేశారు. అరుదైన వస్తువులు విక్రయించే చోట దాన్ని ఖరీదు చేశానని ఆయన వెల్లడించాడు. ఈ ఘటనపై ఆగస్టు 3న ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు వేట మొదలెట్టారు. -
భీమసేనుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 12 భీమసేనుడు పాండవుల్లో మధ్యవాడు. భీముడంటే భయంకరుడు; ‘సేనుడ’ంటే ప్రభువుతో కూడినవాడు. శారీరక బలం దృష్ట్యా ఇతను పదివేల ఏనుగుల బలమున్నవాడు: వాయునందనుడిగా పాండవ మధ్యముడైన భీముడు పసివాడిగా ఉన్నప్పుడు కుంతి ఒడిలోంచి జారి, ఒక రాతిమీద పడ్డాడు. ఆ రాయి వక్కలై పోయింది గానీ ఇతని శరీరం మాత్రం చెక్కుచెదరలేదు. తోడేలు పొట్టలాటి పొట్ట ఉన్న భీమసేనుడు తోడేలు తిన్నట్టే ఎక్కువగా తింటాడు. అలాగే హరాయించుకొంటాడు కూడాను. అందుకే ఇతనికి వృకోదరుడనే పేరు కూడా ఉంది. తల్లి కుంతీదేవి రోజూ వండిన దాంట్లో సగం ఇతనికే కేటాయించేది; తతిమ్మా సగం తతిమ్మా నలుగురికీ తనకూ ఉపయోగించేది. భీముణ్ని చూస్తే, దుర్యోధనుడికీ అతని కన్నా, అతన్ని కన్న ధృతరాష్ట్రుడికీ ఇద్దరికీ గుండెల్లో గుబులే. చిన్నప్పుడు పరుగుపందేల్లోనూ తిండి తినడంలోనూ ఒకళ్లొకళ్ల మీద ఇసుకా దుమ్మూ విసురుకోవడంలోనూ భీముడు, దుర్యోధనాదులనందర్నీ మించిపోయి వాళ్లను ఏడిపించేవాడు. పండ్లను కోసుకోడానికి చెట్టుపైకి కౌరవులు ఎక్కినప్పుడు, వాళ్లతో సహా ఆ చెట్టును ఊపి ఊపి పండ్లతో సహా వాళ్లను కూడా కిందపడేసేవాడు. ఇదంతా అతను పిల్లతనం కొద్దీ చేసేవాడు గానీ ద్రోహబుద్ధితో మాత్రంగాదు. దుర్యోధనుడు మాత్రం ఇతని బలాన్ని చూసి అసూయపడుతూ, మోసంతో పట్టి చంపేద్దామని దుష్టబుద్ధిని చూపించేవాడు. ఒకరోజున, గుండెలో కత్తులు నూరుతూ, పైకి మాత్రం తియతియ్యగా మాట్టాడుతూ, అతి ప్రేమతో సొంత అన్నదమ్ముడిలాగ ‘తిను తిన’మంటూ విషంతో కలిపిన తినుబండారాల్ని భీముడికి కడుపునిండా తినిపించాడు. తరవాత ప్రమాణ కోటిఘాట్లో నీళ్లలో ఆడుకొని, అక్కడి గట్టుమీదున్న విడిదిగదిలో విషం మత్తు బాగా ఎక్కడంతో నిద్రపోయాడు భీముడు. చచ్చినట్టు పడున్న అతన్ని దుర్యోధనుడు లతలతోనూ తాళ్లతోనూ కట్టి ఎత్తుమీంచి గంగలో విసిరేసి వెళ్లిపోయాడు. పీడ విరగడైందనుకొన్నాడు గానీ అతను నాగలోకానికి పోయి, అక్కడ వాళ్లిచ్చిన సిద్ధరసాన్ని తాగి, పదివేల ఏనుగుల బలంతో తిరిగివచ్చాడు. వారణావతంలోని లక్కింట్లో విదురుడు పంపిన పనివాడి చేత చడీ చప్పుడూ గాకుండా సొరంగాన్నొకదాన్ని తవ్వించుకొన్నారు పాండవులు. ఒక ఏడాది పాటు ఆనుపానుల్ని చూసుకుంటూ చివరికి భీముడు, పురోచనుడున్న గదినీ ఆ చుట్టూరాను అంటించి, తల్లినీ నకుల సహదేవుల్నీ ఎత్తుకొని, యుధిష్ఠిరుడూ అర్జునుడూ వెనక నడుస్తూండగా ఆ సొరంగం గుండా త్వరత్వరగా బయటికి నడిచి ఎవరికీ తెలియకుండా అడవిలోకి తీసుకొనిపోయాడు. ఇది పాండవుల తొలి అజ్ఞాతవాసం. లక్కింట్లో పాండవులు చనిపోయారనే అబద్ధాన్ని కొనసాగించడానికీ దుర్యోధనుడు వీళ్లకోసం వెదికి చంపించడానికి ప్రయత్నించ కుండా ఉండడానికీ ఈ అజ్ఞాతవాసం పనికి వచ్చింది. తప్పించుకొని వచ్చి అడవిలో వాళ్లందరూ అలసిపోయి పడుకుంటే, భీముడొక్కడూ నిద్రపోకుండా వాళ్లకు కాపలా కాస్తూ నిలుచున్నాడు. భీముడు వారిని కళ్లల్లో వత్తులేసుకొని కాపాడుతూ ఉండగా, వాళ్లందర్నీ చంపి తీసుకొని రమ్మనమని హిడింబుడు పంపగా హిడింబి అక్కడికి వచ్చింది. అయితే హిడింబి భీముడి కండలు చూసి మోహంలో పడింది. అన్నమాట మరిచిపోయింది. చెల్లెలింకా రాలేదని చిరాకుపడుతూ హిడింబుడు రానే వచ్చాడు. అన్నదమ్ముళ్లకీ అమ్మకీ నిద్రాభంగం గాకూడదని, వాణ్ని దూరంగా తీసుకొనిపోయి నలిపి ముద్దచేశాడు భీముడు. హిడింబి కుంతితో మాట్లాడి భీముణ్ని పెళ్లిచేసుకొంది. పిల్లాడు పుట్టేదాకా భీముడు పగటిపూట ఆవిడతో ఉంటూ రాత్రిపూట అన్నదమ్ములతో ఉంటూ గడిపాడు. కుంతికి మొట్టమొదటి మనవడు హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు. ‘ఎప్పుడు పనిపడితే అప్పుడు నేను వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అతను తల్లితో సహా వెళ్లిపోయాడు. ఏకచక్రపురంలో పాండవులు చేరిన బ్రాహ్మణుడి ఇంట్లో వచ్చిన సంకటాన్ని భీముడే తీర్చాడు. బకాసురుడికి తీసుకెళ్లే బండెడాహారాన్నీ తానే తిని, ఆ రాక్షసుణ్ని మట్టిబెడ్డలాగ నలిపేశాడు భీముడు. రాజసూయయాగం చేయడానికి దిక్కులన్నీ జయించాలి. భీముడు తూర్పువైపు రాజుల్ని జయించుకొని వచ్చాడు. దానికి ముందు, జరాసంధుణ్ని సంహరించడం అవసరమని శ్రీకృష్ణుడూ అర్జునుడూ భీముడూ యాచకుల వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ భీముడు జరాసంధుణ్ని గదాయుద్ధంతోనూ చివరికి కుస్తీతోనూ చంపాడు. మయసభలో నేలనుకొని నీళ్లలో చతికిలబడ్డ దుర్యోధనుణ్ని చూసి భీముడు నవ్వేసరికి దుర్యోధనుడి గుండె మండిపోయింది. శకుని పాచికల బలాన్ని చూసుకొని, తండ్రి ధృతరాష్ట్రుణ్ని ఒప్పించి, పాండవుల్ని జూదమాడడానికి పిలిపించాడు. తొలిజూదంలో అందరూ దాసులైపోయారు. భీముడు, తమను ఓడినందుక్కాదు గానీ ద్రౌపదిని పణంగా పెట్టడాన్ని చూసి అన్నగార్ని తప్పుపట్టాడు. ఆ కోపంతో సహదేవుడితో ‘తమ్ముడూ! నిప్పు పట్టుకొనిరా! ఈ ధర్మరాజు చేతుల్ని కాల్చేస్తాను’ అంటూ మండిపడ్డాడు. కొప్పుపట్టుకొని ద్రౌపదిని దుశ్శాసనుడు జూదసభలోకి ఈడ్చుకొని రావడాన్ని చూసి భీముడు ‘ఈ పాపిష్ఠి దుశ్శాసనుడి రొమ్మును బలవంతంగా చీల్చి వాడి వేడి వేడి రక్తాన్ని తాగుతాను’ అంటూ కోపంతో ఊగిపోయాడు. భీముడి భయంకరమైన ఈ మాటలు విన్నతరవాత కూడా కర్ణుడు ఉసిగొల్పడంతో, ద్రౌపదిని ఉద్దేశిస్తూ దుర్యోధనుడు తన ఎడమ తొడను చూపించాడు. అది చూసి భీముడు అతికోపంతో సభలో అందరిమధ్యా ‘వీడి సిగ్గూ ఎగ్గూ లేని ఈ తొడను మహాయుద్ధంలో గదతో పగలగొడతాను’ అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రెండోసారి జూదంలో వనవాసానికి వెళ్లవలసివచ్చినప్పుడు, తన మహాబాహువుల బలానికి దీటుగా పరాక్రమాన్ని చూపిస్తానన్నట్టుగా భీముడు తన విశాల బాహువుల్ని చూసుకుంటూ ముందుకు నడిచాడు. కామ్యకవనంలో చొరబడుతూనే దుర్యోధనుడి మీద ఉన్న కోపాన్ని మొత్తమూ కిర్మీరుడనే రాక్షసుణ్ని చంపడంలో చూపించాడు. కిర్మీరుడు బకాసురుడి సోదరుడూ హిడింబుడి నేస్తమూను. అర్జునుడు అస్త్రాలను సంపాయించడానికి వెళ్లినప్పుడు, ద్రౌపదితో సహా ఆ నలుగురు పాండవులూ లోమశమహర్షి బృందంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి, అక్కడ గంధమాదన పర్వతం మీద భీముడితో ద్రౌపది విహరిస్తూన్నప్పుడు, సౌగంధిక పుష్పం ఒకటి గాలికి ఎగిరి వచ్చింది. దాన్ని చూసి ద్రౌపది ముచ్చటపడింది. భీముడు ఆ ముచ్చటను తీర్చడానికి ఆ పువ్వుల కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లాడు. పొగరుగా భీముడు ఈ దారిని వెళ్తే, దేవతలు శాపం పెట్టవచ్చునని, స్వర్గానికి వెళ్లేదారికి అడ్డంగా హనుమ పడుకొన్నాడు. భీముడు హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. ‘దారికి అడ్డం తొలగవయ్యా ముసలాయనా’ అన్నాడు. ‘నేను ముసలివాణ్ని గదా. నువ్వే ఈ తోకను పక్కకు పెట్టి వెళ్లు’. అన్నాడు ఆంజనేయుడు. అంతేగదా అని ఎడమచేత్తో తీయబోయాడు. చేతగాలేదు. రెండు చేతులూ ఉపయోగించాడు. శాయశక్తులా ప్రయత్నించాడు. హతాశుడయ్యాడు. దానితో అతని గర్వం కాస్తా దిగింది. అప్పుడు హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకొన్నాడు. తమ్ముడడిగితే, తన రూపాన్ని చూపించి, ‘అదుగో అటువైపు ఉంది సౌగంధిక పుష్పాలున్న నది. ఏం గొడవ చేయకుండా తీసుకొని వెళ్లు’ అని సలహా చెప్పి వెళ్లిపోయాడు. భీముడు అక్కడి రక్షకులను తరిమికొట్టి పువ్వుల్ని తీసుకొని వెనక్కు బయలు దేరాడు. అక్కణ్నించి ద్వైతవనానికి వచ్చాడు. ద్వైతవనంలో ఉన్నప్పుడే పాండవుల్ని అవమాన పరుద్దామని దుర్యోధనుడు సేనలతో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ గంధర్వులతో గిల్లికజ్జా పెట్టుకొని వాళ్ల చేతిలో ఓడిపోయాడు. ధర్మరాజు ఆజ్ఞమేరకు భీముడూ అర్జునుడూ వెళ్లి అతన్ని విడిపించారు. అక్కణ్నించి కామ్యకవనం వచ్చిన తరవాత ఓ రోజు ద్రౌపదిని, దుశ్శల భర్త జయద్రథుడు అపహరించబోగా భీమార్జునులు వాడి వెంటబడి బంధించి తెచ్చారు. విరాటనగరంలో అజ్ఞాతవాసం చేసేటప్పుడు భీముడు వలలుడనే వంటవాడయ్యాడు. సైరంధ్రి అయిన ద్రౌపది, రాజుగారి బావమరిది కీచకుడి కంటబడింది. ఆ కాముకుడు ఆమె వెంటపడగా, రాత్రిపూట నాట్యశాలకు రమ్మనమని కీచకుడికి ద్రౌపదిచే చెప్పించి, అతను అక్కడికి రాగానే, రహస్యంగా అక్కడికి చేరిన భీముడు అతగాణ్ని మల్లయుద్ధంలో నుగ్గునుగ్గు చేశాడు. ఆ మీద కీచకుడి శవంతో సహా ద్రౌపదిని శ్మశానానికి తీసుకొని వెళ్తూన్నప్పుడు కీచకుడి తమ్ముళ్లనందర్నీ మూకుమ్మడిని చంపేశాడు భీముడు. అర్జునుడు సంశప్తకులతో యుద్ధానికి దూరంగా వెళ్లినప్పుడు, అభిమన్యుడు ద్రోణుడు వేసిన పద్మవ్యూహంలో ప్రవేశించాడు. అభిమన్యుడికి సాయంగా వెళ్లడానికి ప్రయత్నించిన పాండవుల్ని సైంధవుడు శివుడి వరం వల్ల అడ్డుకోగా ఒంటరిగా ఉన్న అభిమన్యుణ్ని ఆరుగురు ఒక్కసారిగా ముట్టడించి చంపేశారు. ఆ కారణంగానే సైంధవుణ్ని మర్నాటి సాయంత్రం లోపులో చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. యుధిష్ఠిరుడు భీముణ్ని వాళ్లకు సాయంగా వెళ్లమన్నాడు. భీముణ్ని ద్రోణుడు అడ్డుకొన్నాడు. భీముడు ద్రోణుడు వేసే బాణాల వానను ఓర్చుకుంటూ అతని రథాన్ని విసిరిపారేశాడు. మళ్లీ ఇంకో రథమెక్కి వస్తే దాన్నీ అలాగే ఎత్తి విసిరేశాడు. ఇలా ఎనిమిది రథాల్ని విసిరి పారేసి అదను దొరికినప్పుడల్లా విరోధులను చంపుతూ దుశ్శాసనుణ్ని పట్టుకొని వాడి వక్షస్సును చీల్చి కసిగా రక్తాన్ని తాగాడు. చివర్లో దుర్యోధనుడు భయపడి మడుగులో దాక్కొన్నాడు. పాండవులు అవమానపరుస్తూ మాట్లాడటంతో బయటికి వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు అతని తొడను విరగ్గొట్టి పడగొట్టాడు. భీష్ముడన్నా భీముడన్నా భయంకరుడనే అర్థం. కానీ వీళ్లు పెట్టే భయంలో తేడా ఉంది. భీష్ముడు అంపశయ్య మీద పడుకొన్నాడు; భీముడు తన అతిపరాక్రమంతో ధార్తరాష్ట్రులందర్నీ నేలకొరిగేలాగ చేశాడు. -డాక్టర్ ముంజులూరి నరసింహారావు
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement