-
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
న్యూఢిల్లీ: టాటా పవర్ చివరి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం 11% పుంజుకుని రూ. 1,046 కోట్ల ను తాకింది. మొత్తం ఆదాయం రూ. 13,325 కోట్ల నుంచి రూ. 16,464 కోట్లకు జంప్చేసింది. షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.ఇందుకు జులై 4 రికార్డ్ డేట్. పూర్తి ఏడాదికి టాటా పవర్ నికర లాభం రూ. 3,810 కోట్ల నుంచి రూ. 4,280 కోట్లకు బలపడింది. ఆదాయం సైతం రూ. 56,547 కోట్ల నుంచి రూ. 63,272 కోట్లకు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 61,542 కోట్ల అత్యధిక ఆదాయాన్ని, రూ. 12,701 కోట్ల ఎబిటాను సాధించింది. -
యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ల తయారి కంపెనీ పెగట్రాన్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ల తయారీ కోసం బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్ను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్.. తాజా పెగట్రాన్తో సంప్రదింపులు జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే టాటా ఎలక్ట్రానిక్ పెగట్రాన్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని, ఇందుకోసం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, దీనిపై పెగట్రాన్ గానీ, టాటా ఎలక్ట్రానిక్స్ గానీ స్పందించేందుకు నిరాకరించాయి. -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్కి అనుగుణంగా కొత్త మోడల్స్పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లు.. శంకుస్థాపన చేయనున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇండియాస్ టేకేడ్ : చిప్స్ ఫర్ విక్షిత్ భారత్’లో భాగంగా దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ‘సెమీ కండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధితో భారత్ను గ్లోబల్హబ్గా నిలబెట్టడం, దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విజన్తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ భారీ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టారు. రెండు గుజరాత్, ఒకటి అస్సాంలో ప్రధాని శంకుస్థాపన చేయనున్న సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లు గుజరాత్లోని ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (డీఎస్ఐఆర్)లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం, గుజరాత్లోని సనంద్లో అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ ,టెస్ట్ ఏర్పాటు చేయనుంది. అస్సాంలోని మోరిగావ్లో అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ యూనిట్లను నెలకొల్పనుంది. India is set to become a prominent semiconductor manufacturing hub. The three facilities will drive economic growth and foster innovation.https://t.co/4c9zV3G9HL — Narendra Modi (@narendramodi) March 13, 2024 100 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ జిల్లా ధొలేరా ప్రాంతంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంల స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా తీర్చిదిద్దేలా నడుంభింగింది. ఈ 100 ఎకరాల్లో ఆయా సంస్థ సెమీ కండర్టర్ యూనిట్లను ఏర్పాటు చేయొచ్చు. తద్వారా యువతకు విస్త్రృత ఉపాధి అవకాశాలు, ఎకనమిక్ గ్రోత్ సాధించొచ్చుని కేంద్రం భావిస్తోంది. రూ91వేల కోట్లతో టాటా ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ ప్రాంతంలో దేశంలోనే తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) సెంటర్ను ఏర్పాటు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్) సిద్ధమైంది. రూ.91వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.ఈ సౌకర్యాలు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భారత్ సైతం సెమీ కండర్టర్ విభాగంలో రాణించడమే కాదు..వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి.ఎలక్ట్రానిక్స్, టెలికాం మొదలైన సంబంధిత రంగాలలో ఉపాధి కలగనుంది. -
ఈ ఏడాదే చిప్ ప్లాంటు నిర్మాణం షురూ
న్యూఢిల్లీ: పీఎస్ఎంసీ భాగస్వామ్యంతో గుజరాత్లోని ధోలెరాలో తలపెట్టిన రూ. 91,000 కోట్ల సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మెగా యూనిట్ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీనితో ఆ ప్రాంతంలో 20,000 పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ విభాగంలో భారత్ ఎంట్రీకి సారథ్యం వహించగలగడం తమకెంతో గర్వకారణమని టాటా ఎల్రక్టానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెమీకండక్టర్ల ప్లాంటులో పవర్ మేనేజ్మెంట్ ఐసీలు, డిస్ప్లే డ్రైవర్లు, మైక్రోకంట్రోలర్లు మొదలైన వాటికి అవసరమైన చిప్స్ తయారు చేయనున్నారు. నెలకు సుమారు 50,000 వేఫర్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. -
భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్ తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్కే పెద్దపీట వేస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, వేదాంతా, టాటా పవర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. 1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం.. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా. -
రాష్ట్రంలో ఆదిత్య బిర్లా భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు అనగానే గుర్తుకు వచ్చేది టాటా–బిర్లా గ్రూపులు. ఈ గ్రూపు గడచిన అయిదేళ్లలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహంతో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లా స్వయంగా వచ్చి పెట్టుబడుల కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ రాష్ట్రంపై ప్రత్యేక ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఆదిత్య బిర్లా గ్రూపు మూడు భారీ ప్రాజెక్టులకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. విశాఖలో గతేడాది మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో రూ.9,300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో ఇప్పటికే రూ.4,510 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్ల పెట్టుబడితో ఏటా రూ.1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేస్తే క్లోర్ ఆల్కాలి యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ను గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2022 ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మందికి ఉద్యోగ అవకాశాలు రాగా పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య 2,400కు చేరుతుంది. ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా క్లోర్ ఆల్కాలికి సంబంధించి ఏడు యూనిట్లు ఉండగా, తూర్పు తీర ప్రాంతంలో తొలి యూనిట్ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ లాక్డౌన్లో కూడా పనులు వేగంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇవ్వడంతో రికార్డు సమయంలోనే ఈ యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించింది. పులివెందుల్లో గార్మెంట్స్ యూనిట్ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో రెడిమేడ్ దుస్తుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. 2021 డిసెంబర్ 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ యూనిట్ రెండేళ్లల్లోనే అందుబాటులోకి వచ్చింది. రూ.110.38 కోట్ల వ్యయంతో 2112 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ యూనిట్ ఏర్పాటైంది. మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఉత్పతైన దుస్తులు ఆదిత్య బిర్లా రిటైల్ షోరూంలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గతేడాది నవంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా ఈ యూనిట్ను పరిశీలించి అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు. త్వరలోనే పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువవుతున్న యూనిట్లో ప్రస్తుతం 500 మందికి పైగా పనిచేస్తున్నారు. నాయుడుపేటలో కార్బన్ బ్లాక్ ఆదిత్య బిర్లా గ్రూపు చిత్తూరు జిల్లా నాయుడు పేటలో రంగులు, ఇంకు, టోనర్లు వంటి వాటిలో కీలకంగా వినియోగించే కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ నెల 14న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 24 నెలల్లో అందుబాటులోకి రానుంది. పదివేల మందికి ఉపాధి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భారీ పెట్టుబడులను ఆహా్వనిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి బలభద్రపురంలో కాస్టిక్సోడా యూనిట్ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైనది. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. బలభద్రపురంలో 21–04–22న క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంబోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
టాటా షేర్స్ పై కన్నేసిన అంబానీ
-
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే.. 2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్.. ఎన్ని వేల కోట్లంటే?
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 133 శాతం దూసుకెళ్లి రూ. 7,100 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 3,043 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 25 శాతం ఎగసి రూ. 1,10,600 కోట్లకు చేరింది. ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్లూ సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, మెరుగైన సరఫరాలు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. వాణిజ్య వాహన(సీవీ) ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 20,100 కోట్లను తాకింది. దేశీ సీవీ విక్రయాలు 1 శాతం వృద్ధితో 91,900 యూనిట్లకు చేరగా.. ఎగుమతులు 14 శాతం ఎగసి 4,800 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రయాణికుల వాహన అమ్మకాలు 5 శాతం పుంజుకుని 1,38,600 యూనిట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం అధికమై రూ. 12,900 కోట్లను తాకింది. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ ఆదాయం 22 శాతం జంప్చేసి 7.4 బిలియన్ పౌండ్లకు చేరింది. తగ్గిన రుణ భారం ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ నికర రుణ భారాన్ని రూ. 9,500 కోట్లమేర తగ్గించుకోవడంతో రూ. 29,200 కోట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్లు రెట్టింపునకుపైగా బలపడి 8.8 శాతాన్ని తాకినట్లు వెల్లడించింది. ప్రణాళికలకు అనుగుణంగా రుణ తగ్గింపు లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. విభిన్న వ్యూహాల ఆధారంగా చేపడుతున్న బిజినెస్ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను చూపుతున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిని పటిష్ట పనితీరుతో ముగించనున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న త్రైమాసికాలలోనూ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. మెరుగైన ఫలితాలను కొనసాగించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 879 వద్దే ముగిసింది. -
భారత్లో ఫ్రాన్స్ ప్రధాని..టాటా - ఎయిర్ బస్ల మధ్య కీలక ఒప్పందం
దేశంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం హాజరయ్యారు. ఈ తరుణంలో భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి. దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా - ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ల మధ్యం ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో హెచ్ 125 హెలికాప్టర్లను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకు సంబంధించిన ఒప్పందాలు సైతం చివరి దశకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏ320, ఏ350 వంటి కమర్షియల్ జెట్ల కోసం ఎయిర్బస్కు విడిభాగాలను తయారు చేయడానికి, సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. అదనంగా భారత వైమానిక దళం కోసం టాటా, ఎయిర్బస్లు సీ295 సైనిక రవాణా విమానాన్ని తయారు చేయనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
మూడు రోజులకు ఒక టాటా స్టార్బక్స్
ముంబై: టాటా కన్జ్యూమర్, స్టార్బక్స్ జాయింట్ వెంచర్ కంపెనీ టాటా స్టార్బక్స్ (కాఫీ ఔట్లెట్స్) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2028 నాటికి దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని స్టోర్లను 1,000కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాగస్వాములకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించడం, కొత్త స్టోర్ల ప్రారంభంతో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా స్టార్బక్స్ కస్టమర్లు భారత కాఫీ రుచులను ఆస్వాదించేలా ప్రోత్సహించడం తమ విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. ఇరు సంస్థలు 2012లో చెరో సగం వాటాతో కూడిన జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 పట్టణాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తూ, 4,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2028 నాటికి వెయ్యి స్టోర్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తామని, ఎయిర్పోర్టుల్లోనూ స్టోర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగుల సంఖ్యను 8,600కు పెంచుకుంటామని ప్రకటించింది. మహిళలకు శిక్షణ ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ) పరిశ్రమలో కెరీర్ కోరుకునే మహిళలకు వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నట్టు టాటా స్టార్బక్స్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో స్టోర్లలో పనిచేస్తూనే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఎఫ్అండ్బీ కంపెనీ తమదేనని పేర్కొంది. -
పెట్టుబడి దారులకు శుభవార్త!. టాటా గ్రూప్ నుంచి ఐపీఓకి మరో సంస్థ
పెట్టుబడి దారులకు శుభవార్త. ప్రముఖ దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ నుంచి మరో సంస్థ ఐపీఓకి రానుంది. ఇటీవల టాటాగ్రూప్ 20 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓకి వచ్చింది. దాదాపు 2 దశాబ్ధాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ రావడంపై మదుపర్లు ఆసక్తి చూపించారు. ఇప్పుడు వారి ఆసక్తిని మరింత రెట్టింపు చేసేలా టాటా గ్రూప్లో భాగమైన టాటా ఆటోక్యాప్ సిస్టమ్ (టీఏసీఓ) ఐపీఓకి తెచ్చేలా టాటా గ్రూప్ ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టాటా ఆటోక్యాప్ సిస్టమ్ సంస్థ వాహనాల తయారీకి కావాల్సిన విడి భాగాల్ని తయారు చేస్తుంది. ఈ సంస్థను ఐపీఓ తెచ్చే యోచనలో ట్రాప్ గ్రూప్ ఉంది. ప్రస్తుతం అవి ప్రారంభ దశలో ఉన్నాయి. 1995లో టీఏసీఓని టాటా గ్రూప్ నిర్మించింది. ఇందులో టాటా సన్స్ 21 శాతం వాటా ఉండగా.. మిగిలిన మొత్తం టాటా ఇండస్ట్రీస్కి ఉంది. -
‘ఇవేం ఎలక్ట్రిక్ కార్లు’..దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీపై వాహనదారుల ఆగ్రహం!
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న టాటా గ్రూప్ తన వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల మన్నిక విషయంలో లోపాలు తలెత్తడమే ఇందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాటా మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో మూడు ఈవీ కార్లను పరిచయం చేసింది. అందులో నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీ, టైగోర్.ఈవీ ఉండగా.. భారత్లో ఎక్కువగా అమ్ముడు పోతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో తొలిస్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా టాటా మోటార్స్ ఈవీ కార్లును తయారు చేస్తుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఆ కార్లను కొనుగోలు దారులకు అందిస్తుంది. అదే సమయంలో కార్ల తయారీ, మన్నిక విషయంలో ఆ సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంటుందంటూ టాటా ఈవీ కొనుగోలు దారులు వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం నేను టాటా షోరూంలో టాటా నెక్సాన్ కారును కొనుగోలు చేశాను. ఆ కారులో అన్నీ లోపాలేనంటూ బెంగళూరు వాసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఘటన మరిచిపోక ముందే వెస్ట్ బెంగాల్కు చెందిన మరో వాహన దారుడు టాటా టియాగో (Tata Tiago EV XZ Plus Tech LUX ) కొనుగోలుతో ఊహించని పరిణామం ఎదురైంది. కారులు లోపాలు ఇలా ఉంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సంబంధిత కారు ఫోటోల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్.కామ్లో ఆ కార్ల ఫోటోల్ని షేర్ చేశాడు. A gift from Tata Motors. A underprepared Tiago EV XZPLUS TECHLUX car from Tata Motors. Paid twelve lac rupees to get this luxury car but got a faulty one with major manufacturing defects. Service center spot welded to stop the cranking noise from the car. But all in vein. pic.twitter.com/TwFHttAQEz — Chitrabhanu Pathak (@ChitrabhanuPath) December 20, 2023 రూ.12 లక్షలు ఖర్చు చేస్తే ఇలాంటి కారును అందిస్తారా? అని ప్రశ్నించాడు. టాటా మోటార్స్ బహుమతి ఇదే. కారు తయారీ నాసిరకంగా ఉంది. ఈ కారును రూ.12లక్షలు పెట్టి కొనుగోలు చేశా. కానీ ఆ కారులో లోపాలున్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో శబ్ధాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్ధం రాకుండా ఉండేలా కారు మొత్తాన్ని పార్ట్ పార్ట్లుగా విడదీసి ఇదిగో ఇలా వెల్డింగ్ చేస్తున్నానంటూ పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను షాక్కు గురిచేస్తున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు టాటా మోటార్స్ కార్ల కొనుగోలుతో తమకు ఎదురైన ఇబ్బందుల్ని పంచుకుంటున్నారు. -
సెమీ కండక్టర్ తయారీలో టాటా గ్రూప్.. 40వేల కోట్ల పెట్టుబడులతో
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా అస్సాంలో దాదాపు రూ. 40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇది మాకు శుభపరిణామం. టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాగీరోడ్లో ఎలక్ట్రానిక్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తును సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది ఆమోదం కోసం కేంద్రాన్ని సంప్రదించాం. త్వరలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని శర్మ చెప్పారు. ‘‘టాటా కంపెనీ అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సుమారు రూ.40 వేల కోట్లతో చిప్ కంపెనీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనను పంపించింది.సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంట్పై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు జరిపిందని, ఇక్కడ చర్చల అనంతరం కేంద్రాన్ని సంప్రదించాం. అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వచ్చేలా చూస్తామని, పారిశ్రామికీకరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఒకట్రెండు నెలల్లో తుది ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. -
‘చైనాకి యాపిల్ మరో భారీ షాక్!’
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీపై ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేని యాపిల్ భారత్లో మరో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను టాటా గ్రూప్ నెలకొల్పనుంది. ఈ ఏడాది అక్టోబర్లో కర్ణాటక కేంద్రంగా భారత్లో ఐఫోన్లను తయారు చేసే విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను టాటా గ్రూప్ 125 మిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తమిళనాడు హోసుర్ కేంద్రంగా టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా రెండో ఐఫోన్ తయారీ యూనిట్ను ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలిపింది. ఈ ఫ్యాక్టరీలో టాటా గ్రూప్ కనీసం 20 లైన్లో ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుందని బ్లూంబెర్గ్ నివేదికలో పేర్కొంది. ఇక ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ 12 నెలల నుంచి 18 నెలల లోపల అందుబాటులోకి రానుందని అంచనా. చైనాకు భారీ షాక్ టెక్ దిగ్గజం యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా చైనా కాకుండా మిగిలిన దేశాలైన భారత్, థాయిలాండ్, మలేషియాలలో ఐఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత్కు చెందిన టాటా కంపెనీ ఐఫోన్లు తయారు చేసుకునేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే భారత్లోని కర్ణాటక కేంద్రంగా ఐఫోన్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తున్న విస్ట్రాన్ కార్పొరేషన్ను టాటా కొనుగోలు చేసేలా పావులు కదిపింది. ఈ తరుణంలో విస్ట్రాన్ కాకుండా.. టాటానే సొంతంగా ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేలా యాపిల్.. టాటా గ్రూప్ను ప్రొత్సహించింది. ఆ చర్చలు చివరి దశకు రావడం.. దేశీయంగా టాటా మరో ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని బ్లూమ్బర్గ్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం! -
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
టాటా టెక్నాలజీ ఐపీఓ : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్యగమనిక!
ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో రెండో రోజు గురువారానికల్లా 15 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. అయితే దాదాపు 67 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. దీంతో నేడు(24న) ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 8.5 రెట్లు బిడ్స్ లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 31 రెట్లు, రిటైలర్ల నుంచి 11 రెట్లు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఫెడ్ఫినా స్పందన.. అంతంతే! రెండో రోజుకల్లా 90 శాతం బిడ్స్ : దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, ఇరెడా పబ్లిక్ ఇష్యూలు భారీస్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఫెడ్ఫినా) ఐపీవోకు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఇష్యూ రెండో రోజు గురువారానికల్లా 90 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా 5.59 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 5.03 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 56 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 52 శాతం చొప్పున బిడ్స్ లభించగా.. రిటైలర్లు 1.25 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 133–140 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 1,093 కోట్లు సమీకరించా లని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 601 కో ట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 3,51,61,723 షేర్ల(రూ. 492 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదా రులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా మంగళవారం(21న) రూ. 325 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
రతన్ టాటా తర్వాత గ్రూప్ సారథులు వీరే..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతోంది. అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పుతున్నట్లు జీక్యూ ఇండియా ప్రచురించింది. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది. లేహ్ టాటా నోయెల్ టాటా పెద్ద కుమార్తె. మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాయా టాటా లేహ్ టాటా సోదరి మాయా టాటా. మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన కెరియర్కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్ఫోలియో మేనేజర్గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్గా పని చేశారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు. నెవిల్లీ టాటా నోయెల్ టాటా చిన్న కుమారుడు. నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. ఇదీ చదవండి: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్! టాటా గ్రూప్ సంస్థల స్వరూపం టాటా గ్రూప్ సంస్థలను 1868లో జెమ్షేడ్జీ టాటా స్థాపించారు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 30 కంపెనీలు ఉన్నాయి. ఆరు ఖండాల్లోని 100 కంటే ఎక్కువ దేశాలలో సేవలందిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ, డిజిటల్ వ్యాపార సేవలందిస్తోంది. టాటా స్టీల్ సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, బస్సులు, ట్రక్కులు, డిఫెన్స్ వాహనాలను తయారుచేస్తోంది. టాటా కెమికల్స్ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేస్తోంది. టాటా పవర్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ. ఇండియన్ హోటల్స్ టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సేవలందిస్తోంది. టైటాన్ కంపెనీ ద్వారా ఆభరణాలు, కళ్లద్దాలు తయారుచేస్తున్నారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్లు దాటింది. టాటా ఎలెక్సీ ఇంజినీరింగ్ డిజైన్, సాంకేతిక సేవలు అందిస్తోంది. టాటా డిజిటల్ ద్వారా వినియోగదారుల అవసరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,71,467 కోట్లుగా ఉంది. -
బంపరాఫర్, ఐపీఓకి టాటా టెక్నాలజీ.. ఒక్కోషేర్ ధర ఎంతంటే?
మదుపర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనుంది. ఇందుకు వీలుగా ఈ నెల 13న ఆర్వోసీ మహారాష్ట్రకు ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానమైన 6.08 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను ఆఫర్ చేయనుండగా.. పీఈ సంస్థ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం వాటాను విక్రయించనుంది. ఇక టాటా క్యాపిటల్ సైతం 1.2 శాతం వాటాను ఆఫర్ చేస్తోంది. తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. కాగా.. టాటా టెక్నాలజీస్లో టీపీజీ రైజ్ క్లయిమేట్కు 9.9 శాతం వాటాను విక్రయించేందుకు గత నెలలో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,614 కోట్ల డీల్ను కుదుర్చుకుంది. -
టాటా చేతికి విస్ట్రన్.. ఇక ‘ఐఫోన్ మేడిన్ టాటా’
భారత్లో యాపిల్ ఐఫోన్లను సరఫరా చేసే విస్ట్రన్ కంపెనీని ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి దేశీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది. టాటా గ్రూప్ ఇప్పటికే తమిళనాడు కేంద్రంగా విడి భాగాలను తయారు చేసి వాటిని యాపిల్కు అందిస్తుంది. అయితే ఇప్పుడు విస్ట్రన్ టేకోవర్తో పాక్స్కాన్, పెగాట్రాన్ తరహాలో టాటా సంస్థ ఐఫోన్లను తయారు చేస్తుంది. విస్ట్రన్ ఇండియాలో 100 శాతం షేర్ల కొనుగోలు ఒప్పందంపై టాటా గ్రూప్ సంతకం చేసినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. భారత్లో యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్ కాంట్రాక్ట్ పొందేందుకు విస్ట్రన్ ఇండియాకు సుమారు రూ.1040 కోట్లు టాటా గ్రూప్ చెల్లించనున్నది. -
అంతర్జాతీయ విస్తరణలో ఎయిర్ ఇండియా.. అమెరికన్ ఎయిర్లైన్స్తో ఒప్పందం
దేశీయ దిగ్గజం 'టాటా' యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) 'అలాస్కా ఎయిర్లైన్స్'తో ఇంటర్లైన్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ ఇండియా న్యూయార్క్ JFK, నెవార్క్-న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాంకోవర్ గేట్వేల నుంచి అమెరికా, మెక్సికో, కెనడాలోని 32 గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ద్వైపాక్షిక ఇంటర్లైనింగ్ ద్వారా రెండు విమానయాన సంస్థలు ఒక నెట్వర్క్లో టిక్కెట్లను విక్రయించనున్నాయి. అంతే కాకుండా రెండు ఎయిర్లైన్స్ స్పెషల్ ప్రోరేట్ ఒప్పందాన్ని కూడా నమోదు చేసుకోవడం వల్ల అలస్కా ఎయిర్లైన్స్ కవర్ చేసే మార్గాలలో ఎయిర్ ఇండియాను అనుమతిస్తుందని ఎయిర్లైన్ ప్రతినిధి వెల్లడించారు. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ 'నిపున్ అగర్వాల్' మాట్లాడుతూ.. అలాస్కా ఎయిర్తో ఏర్పరచుకున్న ఒప్పందం అమెరికా, కెనడాలో విస్తృత సేవలను అందించడానికి మాత్రమే కాకుండా.. నెట్వర్క్ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement