-
ఒక్కొక్కరూ, రెండు సీట్లు కొనుక్కోండి : ఎయిర్లైన్ సిబ్బంది అమానుషం
బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది. విమానం ఎక్కి, విమానం రన్వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్రెస్ట్ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు. -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్కి బయలుదేరిన నేపాల్ ఎయిర్లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
పుతిన్ ఒకప్పటి సన్నిహితుడు, రష్యాలో తిరుగుబాటు ఎగరేసిన కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసిన రెండు నెలల్లోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ నుంచి గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులందరూ తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడ్డారని, ఈ క్రమంలో కిటికీలకు దూరంగా ఉండాలనే స్థాయిలో సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ధైర్యంగా రష్యాలోనే తిరుగుతున్న ప్రిగోజిన్.. ఇంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు. 🚨#BREAKING: Wagner chief Prigozhin has died along with 10 other passengers on the jet that just crashed in Russia's Tver region pic.twitter.com/4kPLrsGANb — R A W S A L E R T S (@rawsalerts) August 23, 2023 30 సెకన్లలోనే.. ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాస్కోకు మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో జరిగింది. సవ్యంగా సాగుతున్న విమాన ప్రయాణం అప్పటివరకు బాగానే ఉన్నా.. కేవలం 30 సెకన్ల వ్యవదిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి విమానం పొగలు వెదజల్లుతూ కిందకు పడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అందులో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పుతిన్పై తిరుగుబాటు.. ఉక్రెయిన్పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్ను.. పుతిన్ షెఫ్గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్కు-ప్రిగోజిన్కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇదీ చదవండి: ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
చెన్నై విమానాశ్రయంలో శ్రీలంక మహిళ మృతి
అన్నానగర్: చైన్నె నుంచి శ్రీలంకలోని జాఫ్నాకు అలయనన్స్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం 10.05 గంటలకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు భద్రతా తనిఖీలు ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీలంకకు చెందిన శివకజన్ లిట్టి(43) తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఎయిర్పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చైన్నె ఎయిర్పోర్ట్ పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం చైన్నెలోని శ్రీలంక రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. -
శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్లిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. వైభవంగా అమావాస్య ఉత్సవం శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి,అమ్మవార్లను భక్తులు దర్శించి పరవశించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
విమానంలో ధూమపానం!
సాక్షి, చైన్నె: కువైట్ నుంచి చైన్నెకు వచ్చిన విమానంలో ఓ యువకుడు పొగతాగి అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని చైన్నెలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కువైట్ నుంచి ఆదివారం రాత్రి ఓ విమానం చైన్నెకు బయలు దేరింది. 184మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. 38 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా, ఇందులో ప్రయాణించిన ఓ యువకుడు సిగిరెట్ వెలిగించాడు.. దీనిని పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వ్యతిరేకించాడు. అతడు పట్టించుకోక పోవడంతో విమాన సిబ్బందికి తెలియజేశాడు. విమాన సిబ్బంది, ఫైలట్, ఇతర ప్రయాణికులు వారించినా అతడు ఖాతరు చేయలేదు. దీంతో అతడి చర్యలపై చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ విమానం చైన్నెలో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో తనకు సిగరేట్ తాగాలనిపించింది తాగాను..అంటూ అతడు ఇచ్చిన సమాచారం భద్రతా సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. దీంతో ఆయువకుడ్ని చైన్నె విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై లోని థానే ప్రాంతానికి చెందిన మహ్మద్ సదాం(32)గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK — Adit (@ABritishIndian) June 25, 2023 -
ధోనితో అట్లుంటది మరి..
-
అండమాన్ వెళ్లిన విమానం తిరిగి చైన్నెకి..
తిరువొత్తియూరు: అండమాన్లో సుడిగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో చైన్నె నుంచి 156 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం తిరిగి చైన్నెకి చేరుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానాశ్రయ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అండమాన్కు 150 మంది ప్రయాణికులు, ఆరుగురు వి మానాశ్రమాల ఉద్యోగులతో ఇండిగో విమాన ము బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. అండమాన్ సరిహద్దుకు వెళ్లిన సమయంలో అక్కడ తీవ్రమైన సుడిగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో విమానం అండమాన్ వద్ద ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. దీంతో వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పైలట్ చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూంను సంప్రదించారు. చైన్నె విమానా శ్రయ అధికారులు విమానాన్ని తిరిగి చైన్నెకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పైలట్ విమానా న్నిసాయంత్రం 5.10లకు చైన్నె ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. అండమాన్లో ప్రతికూల వాతావరణంతో విమానాన్ని రద్దు చేశారు. గురువారము ఉదయం చైన్నె నుంచి అండమాన్కు బయలుదేరు తుందని ప్రకటించారు. ప్రయాణికులు అందరూ అదే టికెట్తో విమానంలో ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయ ఉద్యోగులతో వాగ్వివాదానికి దిగారు. 150 మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకొని వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో అండమాన్ నుంచి విమానంలో చైన్నెకి రావడానికి 162 మంది ప్ర యాణికులు అండమాన్ విమానాశ్రయంలో వేచి ఉన్నట్లు తెలిసింది. -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
జార్ఖండ్: ధన్బాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్లైడర్ విమానం ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్వాడా ఎయిర్స్ట్రిప్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స్ట్రిప్ నుంచి చిన్న విమానం బయలుదేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టగా, అందులో ఉన్న పైలట్, బాలుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: అమృత్పాల్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె అరెస్ట్ -
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సరికొత్త ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒప్పందం ప్రతిష్టాత్మకం విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్పోర్టులోని ఎంఆర్ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది. ఎంఆర్ఓలదే భవితవ్యం ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాలింగ్(ఎంఆర్ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. -
విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..
మసాచుసెట్స్లోని లియోమిన్స్టర్కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి లాస్ ఏంజిల్స్ నుచి బోస్టన్కు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని బోస్టన్లో విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు యూఎస్ ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి టోర్రెస్ అనే వ్యక్తిగా గుర్తించారు. టోర్రెస్ లాస్ఏంజిల్స్ నుంచి బోస్టన్కు వెళ్తుండగా..విమానం ల్యాండింగ్ అవ్వడానికి దాదాపు 45 నిమిషాల ముందు ఎమర్జెన్సీ డోర్ అన్లాక్ చేసి కొంచెం దూరం వరకు ఓపెన్ చేశాడు. దీంతో సరిగ్గా అదే సమయంలో విమాన సిబ్బందికి కాక్పిట్లో అలారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది విమానం తనిఖీ చేయడం ప్రారంభించారు. వారంతా విచారిస్తుండగా..ఫస్ట్ క్లాస్ కోచ్ విభాగాల మధ్య ఉన్న స్టార్బోర్డ్ సైడ్ డోర్ అన్లాక్ అయ్యి కొద్ది దూరం జరిగినట్లు ఉంది. దీంతో వారు ఆ డోర్ని లాక్చేసి వచ్చి ఈ విషయాన్ని పైలెట్కి తెలిపారు. ఫ్లైట్ సిబ్బంది మేము ఆ డోర్ వద్ద టోర్రెస్ అనే వ్యక్తి ఉండటం గమనించామని చెప్పారు. అతను తాను చేసిన విషయాన్ని మరోకరికి చెప్పడం కూడా చూశామని చెప్పడంతో వారు టెర్రెస్ని ఈ విషయమై కొంచెం గట్టిగా అడిగారు. అంతే అతను కోపంతో విమానా సహాయకురాలిని మెటల్ చెంచాతో మెడపై మూడు సార్లు పొడిచాడు. దీంతో ప్రయాణికులు టోర్రెస్ని విమాన సిబ్బంది సాయంతో అడ్డుకుని అదుపుచేసి.. బోస్టన్లో విమానం దిగిన వెంటనే భద్రతా బలగాలు అతన్ని అప్పగించారు. ప్రమాదకరమైన ఆయుధంతో సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్పై దాడి చేసేందుకు యత్నించినందుకు అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 2 లక్షలు పైనే జరిమాన విధించే అవకాశం ఉందని సదరు ఎయిర్లైన్ డిపార్ట్మెంట్ పేర్కొంది. (చదవండి: సెల్ఫోన్లకు ఫ్రీ బీర్లు ఆఫర్.. ఎగబడ్డ జనం.. వ్యాపారి అరెస్ట్) -
వైరల్ వీడియో: విమానం ఎక్కుతూ కిందపడబోయిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ కింద పడబోయారు. ఉక్రెయిన్, పోలాండ్లను సందర్శించేందుకు వెళ్లిన బైడెన్ తన పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరుగపయనమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. విమానం మెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బైడెన్ జారిపడడం ఇది మూడోసారి. రష్యా మిలిటరీ ఆపరేషన్ కారణంగా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్లో ఉద్రిక్త వాతావారణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తన మద్దతును తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ కీవ్లో ఆకస్మికంగా పర్యటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన ఉక్రెయిన్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముందస్తు సమాచారం ప్రకారం బైడెన్ పోలాండ్లో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ప్రత్యక్షమై అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. బైడెన్ పర్యటన ముందు జనవరిలో యూఎస్ సెనేటర్ల బృందం ఒకటి కీవ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k — Liz Churchill (@liz_churchill8) February 22, 2023 చదవండి India Buying Russian Oil: భారత్ని నిందించలేం! అది మా పని కాదు! -
ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు
నేపాల్ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్, ప్రజ్వల్ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు. కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్ క్రాష్ అయినంత సౌండ్ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు. మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్బాక్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..) -
షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లినప్పటికీ ఎక్స్-రే మెచీన్ వద్ద దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు. ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది 'బోవా కన్స్ట్రిక్టర్' పామును. ఇది పిల్ల పాము. 4 అడుగులుంది. దీనికి ఎమోషనల్గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పింది. ఈ పాముకు 'బార్తోలోమ్యూ' అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. బోవా కన్స్ట్రిక్టర్ పాములు చూడటానికి కొండచిలువలా కన్పిస్తాయి. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ పాము విషపూరితం కానందు వల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు. చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం.. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..
పాట్నా: బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న గోఎయిర్ విమానాన్ని పాట్నా ఎయిర్పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగరు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు గోఎయిర్ తెలిపింది. ప్రయాణాన్ని రద్ధు చేసుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
Viral Video: విమానంని ఆకాశంలోకి లాకెళ్లిన గుర్రాలు
-
Viral Video: బీచ్ లో ల్యాండ్ అయిన విమానం
-
గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్..దెబ్బకు తలకిందులుగా..
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్లోని లాస్ ఏంజింల్స్లోని శాంటా మోనికా బీచ్లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్పోర్ట్కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Frank Deville (@fthemagician) -
విమానం మోత: న్యూఢిల్లీ టు హైదరాబాద్ రూ.27,302
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య విమాన చార్జీలు మోత మోగుతున్నాయి. కొద్ది రోజులుగా పెరిగిన ప్రయాణికుల రద్దీ, భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకల కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర శ్రేణులు పెద్ద ఎత్తున న్యూఢిల్లీకి తరలి వెళ్లడం వంటి పరిణామాల దృష్ట్యా ఒక్కసారిగా చార్జీలు పెరిగాయి. గురువారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కు విస్తారా విమానంలో చార్జీ రూ.26,373 వరకు ఉంది. ఎయిర్ ఏసియాలో రూ.28,841 వరకు పెరిగింది. పైగా చెన్నై, బెంగళూర్ కనెక్టింగ్ ఫ్లైట్లు కావడంతో ప్రయాణ సమయం కూడా ఎక్కువే కావడం గమనార్హం. వారణాసి మీదుగా నగరానికి చేరుకొనే ఇండిగో కనెక్టింగ్ ఫ్లైట్ చార్జీ రూ.22,177 కావడం గమనార్హం. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో చార్జీలకు రెక్కలొచ్చేశాయి. -
టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే కుప్పకూలిన విమానం ఆ తర్వాత...
మరణం అంచులదాక వెళ్లి అనూహ్యంగా బయటపెడితే ఎవరికైనా ఏడుపూ ఆనందం ఒకేసారి తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఔను! జీవితం మనకు మరో అవకాశం ఇచ్చిందనుకుంటాం. మళ్లీ సమర్ధవంతంగా జీవితాన్ని ఎలా పునర్నిర్మించాలో ఆలోచించుకుంటాం కదా. అచ్చం అలానే ఇక్కడొక జంట చచ్చపోతాం అనుకునేంత భయానక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే....పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో రన్వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక జంట వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదం తర్వాత కాసేపు భయాందోళనలకు లోనవ్వడం సహజం. కానీ జీవితం మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో తాము ఇలా సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నారు ఆ దంపతులు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ 320 సిస్టమ్స అనే ఫేస్బుక్లో 'సెల్ఫీ ఆఫ్ ద ఇయర్' అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్) -
ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష
విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement