-
మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ భారత్కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది. "భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్లను భారత్కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్ బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్ను భారత్లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్ వంటి పానీయాల బ్రాండ్లను కలిగి ఉంది. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
అదానీ గ్రీన్కు టోటల్ ‘ఎనర్జీ’
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్కు ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది. టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్మన్ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్తో ఆల్ట్మన్ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
అమెజాన్ ద్వారా కారు కొనేయొచ్చు - పూర్తి వివరాలు
ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చే ఫ్లాట్ఫామ్ అమెజాన్. ఇప్పటి వరకు ఫ్యాషన్, హోమ్ యుటిలిటీ, మొబైల్స్, టీవీలు వంటి వస్తువులను విక్రయించిన ఈ సంస్థ త్వరలో కార్లను కూడా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు వర్చువల్ షోరూం ఎక్స్పీరియన్స్ అందించడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్ల ధరలు, ఫీచర్ల వంటి వాటిని గురించి తెలియజేయడానికి హ్యుందాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ద్వారా కారు భాగాలను, ఇతర యాక్ససరీస్ కూడా కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కొనుగోలుదారులు మరింత సులభమైన షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ అవకాశం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేత కంపెనీ అధికారిక డీలర్ ఉంటారు. అంటే డీలర్షిప్కి.. కస్టమర్కి మధ్య వారధిలా పనిచేస్తుంది. అయితే దీని ద్వారా వినియోగదారుడు కొన్ని అదనపు సౌకర్యాలను పొందవచ్చు. -
బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్మిన్ - ఎందుకో తెలుసా?
దక్షిణ అమెరికాలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి యాక్టివ్ మెటీరియల్స్ కోసం పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బొలీవియన్ స్టేట్ కంపెనీ 'యాసిమియంటోస్ డి లిటియో బొలీవియానోస్' (YLB)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ బేస్డ్ బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ ఆల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ముడి పదార్థాల సరఫరాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. లిథియం అయాన్ బ్యాటరీల కోసం కాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (CAMs) ఉత్పత్తి కోసం ఈ ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. స్వదేశీ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో పురోగతి కోసం ఏర్పడిన ఈ సహకారం మొదటిది. ఇది మొత్తం సరఫరా గొలుసును సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం లిథియం కోసం పరిశోధన, అభివృద్ధి, పైలటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడం.. ద్వైపాక్షిక ముడి పదార్థాల సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో YLB నుంచి కొంత మంది నిపుణుల బృందం హైదరాబాద్లోని ఆల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్ సందర్శించింది. ఆ తరువాత బొలీవియన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఈ ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, 'ఆల్ట్మిన్'ను బొలీవియాకు ఆహ్వానించింది. ఈ ఒప్పందం ఏర్పర్చుకున్న సందర్భంగా YLB ప్రెసిడెంట్ 'కార్లా కాల్డెరాన్' మాట్లాడుతూ.. ఈ సమావేశం లిథియం అయాన్ బ్యాటరీల క్రియాశీల పదార్థాల సాంకేతిక అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది, పోటోసిలో పైలట్ ప్లాంట్ను అమలు చేయడం ద్వారా, పైలట్ ప్లాంట్ ఈ సంవత్సరం 3 గిగావాట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఆల్ట్మిన్ వ్యవస్థాపకుడు,ఎండీ 'మౌర్య సుంకవల్లి' మాట్లాడుతూ.. YLBతో చేతులు కలపడంతో ప్రపంచ బ్యాటరీ మార్కెట్లో కంపెనీ గొప్ప స్థానం పొందుతుందని భవిస్తున్నాము. 2030 నాటికి ఆల్ట్మిన్ 10 GWh LFPని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడిస్తూ.. ఖనిజ విభాగంలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. -
భారత్లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, కాగ్నిజెంట్ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్ఫారమ్లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి. -
‘ఇండియా’ కూటమిలోనే ఉంటాం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి తాము బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ తేలి్చచెప్పారు. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉంటామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యరి్థగా మీ పేరును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించగా... తామే ప్రధానమంత్రి అని దేశంలోని 140 మంది భారతీయులు భావించేలా ఒక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ బదులిచ్చారు. కేవలం ఒక వ్యక్తిని కాదని, పౌరులందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు. -
జూమ్కార్, టాటా పవర్ ఈవీ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ తాజాగా కార్ షేరింగ్ కంపెనీ జూమ్కార్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జూమ్కార్ ప్రస్తుత, కొత్త ఈవీ కస్టమర్లు టాటా పవర్ ఈజీ చార్జ్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 25,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని టాటా పవర్ లక్ష్యంగా చేసుకుంది. భారత్, ఇండోనేíÙయా, ఈజిప్ట్లో జూమ్కార్కు 20,000 పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. -
200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్.. ఎక్కడ?
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలకు చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ఎలక్ట్రిక్ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ప్రకృతి ఈ–మొబిలిటీ (ఎవెరా)తో చేతులు కలిపినట్లు అదానీ టోటల్ఎనర్జీస్ ఈ–మొబిలిటీ (ఏటీఈఎల్) తెలిపింది. దీనితో ఢిల్లీలో 200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్ను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరించనున్నట్లు ఏటీఈఎల్ వివరించింది. అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్ అనేది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్కు చెందిన విభాగం. ఇది భారతదేశంలో ఛార్జ్ పాయింట్లను నిర్వహిస్తోంది. -
స్కూఈవీతో జత కట్టిన క్వాంటమ్ ఎనర్జీ - కారణం ఇదేనా!
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన క్వాంటమ్ ఎనర్జీ.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రెంటల్ కంపెనీ (అద్దెకు ఇచ్చే) అయిన స్కూఈవీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్వాంటమ్ ఎనర్జీ 1,000 యూనిట్ల ‘బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను సమకూర్చనుంది. ఈ భాగస్వామ్యంపై క్వాంటమ్ ఎనర్జీ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ.. ఈ కామర్స్ విభాగంలో పెరుగుతున్న డెలివరీ అవసరాలకు మెరుగైన పరిష్కారాలను అందించాలన్న ప్రయత్నమే స్కూఈవీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంలో ఉద్దేశ్యమని చెప్పారు. లాస్ట్మైల్ డెలివరీని ఎలక్ట్రిక్గా మార్చడమే తమ సంయుక్త కృషి అని, ఇది బీటూబీ విభాగం మరింత బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. బీటూబీ అవసరాలకు వీలుగా అత్యంత సమర్థతతో కూడిన, మన్నికైన ఈ–బైక్లను అందించడంలో క్వాంటమ్ ఎనర్జీ తమకు కీలక భాగస్వామి అని స్కూఈవీ రెంటల్స్ సీఈవో అమిత్ పేర్కొన్నారు. -
హౌసింగ్ డాట్ కామ్ ద్వారా వ్యక్తిగత రుణాలు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ సంస్థ ‘హౌసింగ్ డాట్ కామ్’ ఫిన్బాక్స్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రూ.10 లక్షల వరకు రుణాలను తక్షణమే జారీ చేయనున్నట్టు తెలిపింది. రెంటల్ సెక్యూరిటీ డిపాజిట్, ఇంటి నవీకరణ, ఫరి్నచర్ కొనుగోలు అవసరాలను తీర్చేందుకు గాను కస్టమర్లకు రుణ సాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరింత సౌకర్యవంతంగా డిజిటల్ రూపంలో రుణాల మంజూరుకు గాను ఈ సేవను తన యాప్, వెబ్సైట్తో అనుసంధానించనున్నట్టు ప్రకటించింది. హౌసింగ్ ఎడ్జ్ ద్వారా కస్టమర్లు ఈ సేవను పొందొచ్చని తెలిపింది. సంక్లిష్టమైన రుణ దరఖాస్తులకు కాలం చెల్లిపోయిందని, మొత్తం రుణ దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లోనే 3 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసినట్టు హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటల్లోనే రుణాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇళ్లకు సంబంధించి అన్ని అవసరాలను అందించే ఏకీకృత వేదికగా అవతరించడమే తమ లక్ష్యమని తెలిపారు. -
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
బ్యాటింగ్లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్లో ఇదే తొలిసారి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటర్లు పరుగులు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటలోనే అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. ఓవర్నైట్ స్కోరు 255/4తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఖవాజా 129, గ్రీన్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 126 పరుగులు అజేయంగా జోడించారు. ఈ సిరీస్లో ఈ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఇంతకముందు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్లు అశ్విన్, అక్షర్లు కలిసి ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించడం బెస్ట్గా ఉంది. తాజాగా ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్లు దానిని బ్రేక్ చేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత భారత్, ఆసీస్ నాలుగో టెస్టు.. రెండో రోజు లైవ్ అప్డేట్స్ -
స్టార్టప్లతో జత కలవండి, లేదంటే మీరు ఉన్న చోటే ..ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్టార్టప్లతో జత కలసి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటి సొల్యూషన్లు వినియోగించుకోవాలని దేశీ పరిశ్రమలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పారిశ్రామిక వేదిక-సీఐఐ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. పెట్టుబడుల ఇతోధికానికి వీలుగా సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ‘‘స్టార్టప్లు వాటి సొల్యూషన్ల వేగాన్ని గమనిస్తే.. నిజానికి అవి మీ కోసమే. వారు సొల్యూషన్లను ఆవిష్కరించినంత వేగంగా మీరు కూడా ముందుకు కదలాలి. లేదంటే మీరు ఉన్న చోటే ఉంటారు. అప్పుడు అవి నూతన ఇండస్ట్రీ లేదా వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళతాయి. అందుకే ఉత్పత్తులు లేదా టెక్నాలజీ అవసరాల కోసం స్టార్టప్లతో కలసి పనిచేయాలి’’ అని ఆమె సూచించారు. ఉదయించే కొత్త రంగాలకు పీఎల్ఐ పథకం మంచి ప్రోత్సాహకంగా పేర్కొన్నారు. పీఎల్ఐ బయట ఏదైనా మంచి ఉత్ప్రేరకం ఉంటే సూచించాలని కోరారు. మూలధన వ్యయాన్ని తగ్గించే బడ్జెట్: అరవింద్ విర్మాణి ఇదిలావుండగా, 2023-24 బడ్జెట్లో ద్రవ్య స్థిరీకరణ చర్యలు తీసుకోవడం హర్షణీయ అంశమని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. భారతీయ కంపెనీలకు మూలధన వ్యయాన్ని తగ్గించడంలో బడ్జెట్ ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.4శాతానికి కట్టడి చేస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింతగా 5.9 శాతానికి తగ్గించాలని బడ్జెట్లో నిర్దేశించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు మౌలిక రంగం పురోగతి లక్ష్యంగా మూలధన వ్యయాలను 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేరడం దేశ పురోభివృద్ధికి దోహదపడే అంశమని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానానికి మళ్లుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది సరికాదని అన్నారు. కొత్త పెన్షన్ విధానం ఒక గొప్ప సంస్కరణ అని ఆయన అన్నారు. గత నెల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2022–23 జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరిగి దీనిని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ తిరిగి ఎగువముఖంగా సవరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. -
డిస్నీ ప్లస్ హాట్స్టార్తో చేతులు కలిపిన తనిష్క్
హైదరాబాద్: ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్తో రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్ ఇండియన్ బ్రైడ్’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్ కో-బ్రాండ్ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్లైన్తో కంటెంట్ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేశామని టైటాన్ మార్కెటింగ్ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్ వంటి సుప్రసిద్ధ బ్రాండ్తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) -
చార్జింగ్ స్టేషన్లు: ఎంఅండ్ఎం, చార్జ్ప్లస్జోన్ జట్టు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ప్రవేశపెట్టబోతున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తమ వాహనాలకు చార్జింగ్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ మౌలిక సదుపాయాల సంస్థ చార్జ్+జోన్తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం కింద వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల కోసం వేగవంతమైన డీసీ చార్జర్ల ఏర్పాటు, నిర్వహణ అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. మహీంద్రా అనుబంధ సంస్థలు, గ్రూప్ సంస్థలకు చెందిన సొంత స్థలాలు, అద్దె స్థలాలు, కార్యాలయాలు, లేక ఇతరత్రా మహీంద్రా ఎంపిక చేసుకున్న స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎంఅండ్ఎం యూజర్లతో పాటు ఇతరత్రా వాహనదారులు కూడా ఉపయోగించుకునేలా ఉంటాయి. ఎంఅండ్ఎం కొత్తగా అయిదు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఈ-ఎస్యూవీ) ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024-2026 మధ్య తొలి నాలుగు మార్కెట్లోకి రానున్నాయి. చార్జ్+జోన్ దేశవ్యాప్తంగా 1,450 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. రోజూ సుమారు 5,000 ఈవీలకు సర్వీసులు అందిస్తోంది. ఈ-ఎస్యూవీల కోసం దేశవ్యాప్తంగా ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ను అందుబాటులోకి తేవడంతో పాటు దేశీయంగా విద్యుత్ వాహనాల వ్యవస్థ మరింతగా వృద్ధి చెందేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని చార్జ్+జోన్ వ్యవస్థాపకుడు, సీఈవో కార్తికేయ్ హరియాణి తెలిపారు. తమ కంపెనీ కస్టమర్లందరికీ భారీ స్థాయిలో ఈవీ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) విజయ్ నాక్రా పేర్కొన్నారు. -
ఫిలిప్పైన్స్లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫిలిప్పైన్స్లో ఎంట్రీ ఇస్తోంది. వాహనాల అసెంబ్లింగ్, పంపిణీ కోసం టెరాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లగూనా నగరంలోని తయారీ ప్లాంటులో ప్రత్యేకంగా 29,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అసెంబ్లింగ్ కేంద్రాన్ని టెరాఫిర్మా నెలకొల్పనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఈ యూనిట్లో కార్యకలాపాలు మొద లు కానున్నాయి. 43 దేశాల్లో విస్తరించిన హీరో మోటాకార్ప్నకు భారత్లో ఆరు, కొలంబియా, బంగ్లాదేశ్లో ఒక్కొక్క తయారీ కేంద్రం ఉంది. -
వెహికల్ లోన్ కోసం చూస్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే!
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇకపై మహీంద్రా కస్టమర్లకు లోన్లు ఈజీగా అందుబాటులో రానున్నాయి. వీరివురు భాగస్వామ్యంతో ఇకపై.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్లకు పోస్టాఫీసులలో నగదు ఈఎంఐ( EMI )డిపాజిట్ సౌకర్యాన్ని కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్లలో అందించనున్నారు. రాబోయే నాలుగు-ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో, పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
విలీనానికి పీవీఆర్ వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ సేవల్లోని ఐనాక్స్ లీజర్తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీవీఆర్ ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పీవీఆర్ మంగళవారం తన వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ఆమోదాన్ని కోరింది. 99 శాతం విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్టు పీవీఆర్ బుధవారం ప్రకటించింది. విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అనుమతులను పీవీఆర్–ఐనాక్స్ లీజర్ జూన్లోనే పొందాయి. ఈ ఏడాది మార్చి 27న ఈ సంస్థలు తమ విలీన ఒప్పందాన్ని ప్రకటించాయి. తద్వారా 1,500 స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద ఆపరేటర్గా అవతరించనున్నట్టు తెలిపాయి. -
హెచ్డీఎఫ్సీ ఎర్గోతో నర్చర్ ఒప్పందం
అగ్రిటెక్ స్టార్టప్ ‘నర్చర్డాట్ఫార్మ్’ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన ప్లాట్ఫామ్ పరిధిలోని 23 లక్షల మంది రైతులకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. ‘‘పంటల సాగు కాలంలో రైతులు ఎన్నో రిస్క్లు ఎదుర్కొంటుంటారు. వాతావరణంలో అనూహ్య మార్పులు పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి. రైతుల సహజ పనితీరు దృష్ట్యా వారి ఆరోగ్యానికి రిస్క్ ఉంటుంది. పంట ఉత్పత్తుల ధరలు కూడా అస్థిరతలకు గురవుతుంటాయి. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అయినా కానీ, ఖరీదైన ప్రీమియంను చూసి ఎక్కువ మంది రైతులు బీమాను ఎంపిక చేసుకోరు. వారికి మా ప్లాట్ఫామ్ ద్వారా బీమా పరిష్కారాలను అందించనున్నాం’’అని నూర్చర్ తెలిపింది. చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
పీటీఐతో సోనీ ఇండియా జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర న్యూస్ ఏజెన్సీ అయిన పీటీఐకి ప్రత్యేకంగా డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ అందించేలా సోనీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులకు సోనీ ఇండియా ఎక్స్క్లూజివ్ డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ సరఫరాదారుగా ఉంటుంది. ఆయా ఉత్పత్తులను వాడటంలో వారికి శిక్షణ కూడా ఇస్తుంది. పీటీఐ వంటి విశ్వసనీయ న్యూస్ ఏజెన్సీతో జట్టు కట్టడం తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. మరోవైపు వీడియో జర్నలిజంలోకి అడుగుపెడుతున్న తమకు.. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ముందుండే సోనీతో భాగస్వామ్యం ఎంతగానో ప్రయోజనకరమని పీటీఐ సీఈవో విజయ్ జోషి చెప్పారు. పీటీఐ ప్రతి రోజూ 2,000 పైచిలుకు స్టోరీలు, 200 పైగా ఫొటోగ్రాఫ్లను సుమారు 500పైగా భారతీయ వార్తాపత్రికలకు అందిస్తోంది. చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! -
స్టార్టప్లకు ఫండమెంటమ్ నిధులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోచైర్మన్ నందన్ నీలేకని సహవ్యవస్థాపకుడిగా ఏర్పాటైన ఫండమెంటమ్ పార్టనర్షిప్ దేశీయంగా తొలి దశ స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు వీలుగా 22.7 కోట్ల డాలర్లు(రూ. 1,793 కోట్లు) సమీకరించినట్లు వెల్లడించింది. తద్వారా ప్రాథమికస్థాయి వృద్ధిలోగల స్టార్టప్లకు నిధులు అందించనున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో సిరీస్–బి రౌండ్ ద్వారా స్టార్టప్లకు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు ఫండమెంటమ్ సహవ్యవస్థాపకుడు, జనరల్ పార్టనర్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. ఏదైనా ఒక స్టార్టప్ కొన్ని మైలురాళ్లకు చేరడం, వృద్ధి బాట పట్టడం వంటి పరిస్థితుల్లో రెండో రౌండ్ ద్వారా నిధులను అందించే సంగతి తెలిసిందే. ఇది రెండో ఫండ్ అని పేర్కొన్న ఆశిష్ ఏడాదికి 4–5 స్టార్టప్లకు 2.5–4 కోట్ల డాలర్ల మధ్య పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వివరించారు. 10 కోట్ల డాలర్లతో తొలి ఫండ్ను నిర్వహించిన ఫండమెంటమ్.. ప్రస్తుతం యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్ఈజీ, స్పిన్నీ తదితరాలకు నిధులు అందించిన విషయం విదితమే. -
ఎగ్జాన్మొబిల్తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్మొబిల్తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్మొబిల్తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement