-
ఎన్నికల ప్రారంభం ప్రక్రియల్లో నీలం సాహ్ని
-
నేడు ఏ పీ ఎస్ ఈ సి గా భాద్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని
-
ఏ పీ ఎన్నికల కమీషనర్ గా నీలం సాహ్ని నియామకం
-
ఏపీ ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. -
ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయని సమాచారం. కాగా ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా.. ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఆస్పత్రికి సీఎస్ నీలం సాహ్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చేరుకునున్నారు. ఆసుపత్రిలోని భాదితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎస్ సమీక్షించనున్నారు. వింత వ్యాధితో చనిపోలేదు ఇతర ఆరోగ్య సమస్యలతో ఏలూరు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారిలో ఇద్దరు మృతి చెందారు. అప్పారావు అనే వ్యక్తి కోవిడ్తో, సుబ్బరావమ్మ అనే మహిళ టీబీతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి సుపరిండిండెంట్ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. ఏలూరు నుంచి వింత జబ్బుతో వచ్చిన వారు ఎవరూ విజయవాడలో చికిత్స పొందుతూ చనిపోలేదని స్పష్టం చేశారు. ఏలూరు నుంచి వింత జబ్బుతో 25 మంది పేషేంట్లు చేరారని, ఇందులో ఇద్దరని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. మిగిలిన 23 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఏలూరు నుంచి వేరే కారణాలతో ప్రతీ రోజూ రెగ్యులర్గా కేసులు వస్తుంటాయని.. అలా వచ్చిన వారిలో ఇద్దరు పేషెంట్లు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. వీరికి ఏలూరు వింతజబ్బుతో వచ్చిన పేషేంట్లకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వదంతులు నమ్మవద్దు గురువారం జిల్లా ఆసుపత్రి ఏవీఆర్ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 మంది బాదితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారన్నారు. డిశ్చార్జి అయిన వారిని ఎప్పటికప్పుడు గ్రామసచివాలయ సిబ్బంది, డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అన్ని విధాలుగా ఈ కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వదంతులు నమ్మదని కోరారు. ఎన్ సిడిసి,ఎన్ఐఎన్ అన్ని కోణలో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మనుషులతో పాటు జంతువల సాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. ఏలూరు చుట్టుపక్కల గ్రామాలలోను సాంపిల్స్ సేకరిస్తున్నారని. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల సాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. మూడో రోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ వైద్య నిపుణుల బృందం పర్యటించిందని, చికిత్స పొందుతున్న భాదితతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు. సచివాలయాల్లో మెడికల్ క్యాంపులు.. ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివా లయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనా రోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందిం చి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర బృందాలు ఏలూరులోనే.. కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే మకాం వేసి అంతు చిక్కని వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తు న్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్సీఐ బృందాలు ప్రస్తుతం ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగ తులను తెలుసుకుంటున్నాయి. ఈ బృందాలు ఏలూరులో పరిశీలిస్తున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. -
వారికి ఇకపై సంవత్సరం పాటు వారానికి 5 రోజులే పనిదినాలు!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. వచ్చే ఏడాది వరకు దీనిని పొడిగిస్తూ సీఎస్ నీల్నం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఉద్యోగులు, అన్నిశాఖల హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు వర్తించనుంది. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ‘ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారు . ఉద్యోగులకు మేలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. ఉద్యోగులు మరింత బాగా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరం’ అని ఆనందం వ్యక్తం చేశారు. (సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎస్పీవీ) -
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
ఆర్జీయూకేటీ వ్యవహారంపై కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) వ్యవహారాలపై మూడు కమిటీలను నియమించారు. ఆర్జీయూకేటీ పాలక మండలి సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు వికాస్రాజ్, నీలం సహానీ ఇతర అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పీవోకే భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement