Sakshi News home page

20న కుల గణనపై సదస్సు

Published Sun, Nov 19 2023 1:50 AM

-

మహారాణిపేట: వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఈ నెల 20న కుల గణనపై ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన స్టేక్‌ హోల్డర్లతో ఈ సమావేశం జరగనుంది. కులాల వారీగా జనాభా, వారి సామాజిక, విద్య, ఆర్థిక పురోభివృద్ధి తెలుసుకోవడానికి, సముచిత విధాన నిర్ణయాలు చేపట్టడానికి ఈ నెల 27న రారష్ట్‌ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. సచివాలయ స్థాయిలో మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుసుకోవడానికి జిల్లా, ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 20న విశాఖలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement