సాక్షి, అమరావతి/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు.
దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతిపెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహమన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమెస్కో అధ్యక్షుడు విజయ్కుమార్, పుస్తక మహోత్సవ కో–ఆర్డినేటర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుక
ఏపీ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్ రూపొందించిన 2022 క్యాలండర్ను ప్రత్యేక ప్రధాన కా>ర్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో వచ్చి గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు.
దేవదాయ శాఖ కార్యదర్శి వాణీమోహన్ నేతృత్వంలో టీటీడీ పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, డీజీపీ డి.గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్య సమాచార కమిషనర్ రమేష్కుమార్, కమిషనర్లు రవికుమార్, రమణకుమార్, జనార్ధనరావు, ఐలాపురం రాజా, శ్రీనివాసరావు, హరిప్రసాదరెడ్డి, చెన్నారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జునరావు తదితరులు గవర్నర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
Breadcrumb
పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడు
Published Sun, Jan 2 2022 4:40 AM
Related news
-
బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్నగర్ పార్టీ ఆఫీస్ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.‘‘గతంలో వైఎస్సార్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
ప్రచారం లో దూసుకుపోతున్న కేశినేని నాని కూతురు
ప్రచారం లో దూసుకుపోతున్న కేశినేని నాని కూతురు -
‘చదువరి చెంతకు పుస్తకం’.. ప్రారంభం కానున్న జాతియ పుస్తక ప్రదర్శన!
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. కోల్కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటల్ మీడియా వెల్లువలోనూ.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. పిల్లలకు ప్రత్యేక పోటీలు.. బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్షాపు, గ్రూప్డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. -
హైదరాబాద్ రాజ్ భవన్ లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం
హైదరాబాద్ రాజ్ భవన్ లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం -
సందడిగా రాజ్భవన్లో ‘ఎట్ హోమ్’
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుడియా ఠాకూర్ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
Related News by category
-
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
వారందరివీ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు.. ఒక్క రోజు పనిలోకి వెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి.. వారికి తెలిసిన విద్య చేపల వేట మాత్రమే.. వివిధ కారణాల వల్ల స్థానికంగా చేపలు లభించని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి.. సముద్రంలోకి వేటకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువు.. వేట నిషేధం సమయంలో అయితే కటిక దరిద్రం తప్పదు.. ఇదంతా ఐదేళ్ల క్రితం.. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.. అన్ని విధాలా మత్స్యకారులకు అండగా నిలిచి భరోసా కల్పిస్తోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు..ఎగుమతులు మత్స్య ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74 లక్షల టన్నులు ఉంటే.. ఈ 5 ఏళ్లలో 7.47 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యల దిగుబడులు 10.04 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యల దిగుబడులు 7.06 లక్షల టన్నులకు చేరాయి. జాతీయ స్థాయిలో 77.55 శాతం ఏపీలోనే ఉత్పత్తి అవుతోంది. గ్రోత్ రేట్ జాతీయ స్థాయిలో 19.37శాతం ఉంటే, ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. 2018–19లో రూ. 16,825 కోట్ల విలువైన 3.13 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయితే, 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.29 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. చినలక్ష్మి సంతోషం ఈమె పేరు కారే చినలక్ష్మి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన ఈమె కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. వేట నిషేధ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2 వేలు మాత్రమే భృతిగా ఇచ్చేవారు. 2019లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. బోటులో ఆయిల్ నింపే ప్రతిసారీ సబ్సిడీ వస్తోంది. ఆమె కుమార్తెకు నాలుగేళ్లపాటు అమ్మఒడి అందింది. ఈ ఏడాది డిగ్రీలో చేరడంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు దరఖాస్తు చేసింది. చేయూత కింద రూ.18,750, ఆసరా కింద రూ.10 వేలు చినలక్ష్మికి జమ అవుతోంది. భర్తకు మత్స్యకార పింఛన్ మంజూరైంది. పొన్నాడ జగనన్న లేఅవుట్లో సెంటున్నర స్థలమూ ఇచ్చారు. అక్కడ సెంటు రూ. 2 లక్షలకు పైగా పలుకుతోంది. ఇంటి నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఇలా గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లబ్ధి పొందలేదని.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే తమకు మేలు జరిగిందని చినలక్ష్మి సంతోషంతో చెబుతోంది. కాకినాడ హార్బర్ ఓ ఉదాహరణ కాకినాడ ఫిషింగ్ హార్బర్లో 2018–19లో మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు 503 ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 578కు చేరింది. మెకనైజ్డ్ బోట్లు 398 నుంచి ఏకంగా 451కి పెరిగాయి. 2018–19 నాటికి వేటకు వెళ్లే వారి సంఖ్య 4,149 ఉంటే ప్రస్తుతం 4,763కు పెరిగింది. మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే వారి సంఖ్య 3,582 నుంచి 4,059 మందికి చేరింది. గతంలో బోట్లపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య 11,971 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 14,541 మందికి పెరిగింది. మత్స్య దిగుబడులు 2018–19లో రూ.677 కోట్ల విలువైన 22,592 టన్నులు వస్తే 2023–24లో రూ.890.12 కోట్ల విలువైన 25,153 టన్నులు వచ్చాయి. ఆక్వా రంగానికి జవసత్వాలు ఆక్వా రంగం నిలదొక్కుకోవడానికి సీఎం వైఎస్ జగన్ చొరవ, కృషి ఎంతగానో ఉపయోగపడింది. ధరలు పతనమైన సమయంలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రాసెసింగ్ సంస్థలు 3 సార్లు పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఉపసంహరించేలా చేయగలిగాం. ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధరకే రొయ్యల కొనుగోలు చేయించగలిగాం. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింప చేసాం. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంగపుత్రుల జాతకాలు మారిపోయాయి. గత ప్రభుత్వ కాలంలో వారు పడిన కష్టాలు తొలగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో వారింట అన్నీ మీన రాశులే. వ్యయాలన్నీ ఆదాయాలుగా మారాయి. అవమానాల స్థానంలో రాజపూజ్యాలు ఎదురయ్యాయి. ఆక్వా రైతుల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆటుపోట్లు ఎదుర్కొన్న మత్స్యకారులు, సంక్షోభంలో చిక్కుకున్న ఆక్వా రైతులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. (పంపాన వరప్రసాద రావు, సాక్షి ప్రతినిధి, అమరావతి)ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4913 కోట్ల లబ్ధి చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.17.50 కోట్ల పరిహారాన్ని ఈ ప్రభుత్వం అందజేసింది. చంద్రబాబు పాలనలో 300 మందికి అందిన సాయం కేవలం రూ.11.43 కోట్లు మాత్రమే. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది. వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.4913 కోట్ల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించింది. అప్సడా చట్టాలతో ఆక్వా రైతుకు రక్షణ ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020, ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020(అప్సడా)లను అమలులోకి తీసుకొచ్చింది. ఇవి నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. తీర ప్రాంత జిల్లాల్లో 35 ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తీర గ్రామాల్లోని ఆర్బీకేల్లో 732 ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆక్వా రైతులకు బీమా సౌకర్యం కలి్పంచింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. ఆక్వా రైతుకు రెట్టింపు ఆనందం ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. బాబు హయాంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పరిధి నోటిఫై చేయడంలో జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి రీ సర్వే చేయించింది. దీంతో 3,56,278 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 54072కు చేరింది. జోన్ పరిధిలోకి వచ్చిన 10 ఎకరాలలోపు సాగుదారులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించడంతో మెజార్టీ ఆక్వా రైతులకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలు రూ.340 కోట్లు సహా ఈ ఐదేళ్లలో రూ.3497 కోట్ల సబ్సిడీ అందుకున్నారు. దేశానికే ఆదర్శంగా ఫిష్ ఆంధ్ర స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్తో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో 40–60 శాతం సబ్సిడీతో జిల్లా స్థాయిలో ఆక్వా హబ్లు(రూ.కోటి), వాటికి అనుబంధంగా మినీ రిటైల్ అవుట్లెట్స్ (రూ.3లక్షలు), డెయి లీ (రూ.10లక్షలు), సూపర్(రూ. 20లక్షలు), లాంజ్ (రూ.50 లక్షలు) యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప టికే జిల్లా స్థాయిలో 2 ఆక్వా హబ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,630 మినీ, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్ వీలర్ యూనిట్లు మంజూరయ్యా యి. ప్రత్యక్షంగా 6941 మందికి, పరోక్షంగా 13,146 మందికి ఉపాధి లభిస్తోంది. నర్సాపురం వద్ద దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ నర్సాపురం సమీపంలో రూ.332 కోట్లతో 40 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మలీ్టపర్పస్ బిల్డింగ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. యూనివర్సిటీ కోసం 140 పోస్టులు మంజూరు చేశారు. కార్యకలాపాలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా బీఎఫ్ఎస్సీ కోర్సుతో 60 సీట్లతో కొత్తగా నర్సాపురం ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేశారు. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటవద్ద రూ.36.55 కోట్ల అంచనాతో 30 ఎకరాల్లో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూ ఎఫ్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహించే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. సిబాతో పాటు మరికొన్ని కేంద్ర కార్యాలయాలను కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. -
ప్రజల మనిషి జగన్
‘రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే జగన్మోహన్రెడ్డి లక్ష్యం. నిరంతరం ప్రజల మనిషిగా నిలిచిపోవాలన్నదే ఆయన ఆకాంక్ష. గత ఎన్నికల సమయంలోనే ఆయనలో ఉన్న గొప్ప ప్రజాసేవకుడిని గుర్తించాను. ఆయన తన ఆకాంక్షలు అంచనాలకు మించి జగన్ పనిచేస్తున్నారు’ అని ప్రముఖ చలన చిత్ర నటుడు భానుచందర్ అన్నారు. జగన్ పాలనా దక్షతపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... నిస్సందేహంగా జగన్ ఒక బ్రిలియంట్ గై. ఆయన ఏది చేసినా ప్రజల గురించి చేస్తున్నారు. ఆయనో అసలు సిసలు యువ నేత. ఆయనది నవ యువ భావజాలం. ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రతీ నిమిషం ఆలోచన చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎలాగైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారో... అలాగే జగన్ బాబు కూడా అదే ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మేలు కోరి చేసే ఆయన ఆలోచనలు, ప్రణాళికలు... అన్నీ సాకారం కావాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్సార్లాగా కాదు... అంతకు మించి ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కారు. బతికినంత కాలం మనం నలుగురికి ఏం మంచి చేశామనేదే ముఖ్యం. కొన్ని తరాల పాటు మన పేరు ప్రజలకు గుర్తుండిపోవాలి. దివంగత వైఎస్సార్ విషయంలో అదే జరిగింది కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక్క పథకం వల్ల వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా బతికున్నారు. అలాగే జగన్బాబు కూడా అంతకు మించి అనేక మంచి పనుల ద్వారా ప్రజలకు గుర్తుండిపోవాలి అని ఆశపడుతున్నారు. నిజంగా యుక్త వయసులోనే ఇలాంటి ఆలోచనా ధోరణి రావడం చాలా గొప్ప విషయం. అది సాధించే శక్తి కూడా ఆయనకు ఉంది. –సాక్షి, అమరావతి మంచికే మద్దతు పలకాలి మోదీ నుంచి జగన్ బాబు దాకా ప్రజలకు మంచి చేసే వారికి మద్దతివ్వాలి అనేది నా మనస్తత్వం. విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మన దేశంలో గాం«దీజీ మీద కూడా విమర్శలు చేస్తారు. ఎవరి విమర్శల వెనక ఏముందో ప్రజలకు బాగా తెలుసు. అయితే అవన్నీ పక్కనబెట్టి మనం ప్రజలకు ఏం చేస్తున్నాం? మన వల్ల ప్రజలకు కలుగుతున్న లాభమేమిటి? అనేది జగన్ బాబుకు ముఖ్యం. తను నమ్ముకున్న అదే పంథాలో ఆయన వెళుతున్నారు.కచ్చితంగా ఆయనకు అంతా శుభమే జరగాలి. జరుగుతుంది కూడా. నేను గత ఎన్నికల ముందు కూడా జగన్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఆయన గొప్ప పాలన అందిస్తారని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా జగన్ను నేను కలవలేదు. అయితే అది ముఖ్యం కాదు. ఆయన ప్రజలకు మంచి చేయడం నాకు ముఖ్యం. అలాంటి ముఖ్యమంత్రికి నాలా ప్రజల మంచి కోరుకునే ప్రతీ ఒక్కరూ మద్దతివ్వాలి. ఇస్తారనే నేను నమ్ముతున్నాను. తమకెవరు మంచి చేశారనేది ప్రజల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తమ గురించి నిరంతరం ఆలోచించే మంచి చేసిన వారినే జనం గెలిపిస్తారు. జనం గురించి ఎప్పుడూ ఆలోచించే నాయకుడు జగన్. నా ఉద్దేశం ప్రకారం మళ్లీ జగన్ గెలవడం... ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయం. -
సంక్షేమ సిరిమల్లిక
మదనపల్లె పట్టణం సుభాష్రోడ్డు వీధికి చెందిన రాజేంద్రప్రసాద్, నాగమల్లిక భార్యభర్తలు. చిన్నపాటి వ్యాపారం ద్వారా వచ్చే చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని గడపాల్సి వచ్చేంది. వీరికి అమృత, వర్షిత ఇద్దరు కుమార్తెలు. పిల్లలను చదివించేందుకు ఆరి్థకంగా ఇబ్బందులు పడేవారు. రేషన్కార్డు తప్ప ఎటువంటి పథకాలు అందేవి కావు. నాగమల్లిక తెలిసిన వారి దగ్గర అప్పు చేసి సుభాష్రోడ్డులోనే చిరుతిళ్ల దుకాణం ప్రారంభించారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. దీనికి తోడు పిల్లల్ని గొప్పగా చదివించాలన్న కోరిక తీరేనా? అన్న బెంగ వెంటాడేది. ఇదంతా 2019కి ముందు పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలలతో ఆ కుటుంబానికి భరోసా కలిగింది. వైఎస్సార్ ఆసరా, ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వస్తోంది. రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అమృత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. చిన్న కుమార్తె హర్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.గతంలో కష్టాలు పడిన నాగమల్లిక కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా సుభాష్రోడ్డులోనే ఓ షాపు పెట్టి అందులో చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. నిప్పట్లు, చెక్కిలాలు, అత్తిరాసలు, మిక్చర్ వంటివి తయారు చేస్తూ హోల్సేల్గా అమ్ముతున్నారు. చిరుతిళ్ల తయారీలో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీటిని తయారు చేసి షాపులో రిటైల్ అమ్మకాలతో పాటు పరిసర ప్రాంతాలకు హోల్సేల్ ధరకు సరఫరా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబం ఆరి్థకంగా నిలదొక్కుకుంది. –మదనపల్లె జీవన ప్రమాణాలు పెరిగాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో చాలా మందిలో జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు అందిస్తున్న నిధులతో వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇది చాలా శుభపరిణామం. – జీఆర్ రుక్మిణి, పూర్వ ప్రిన్సిపాల్, మహిళా డీగ్రీ కళాశాల, మదనపల్లెవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన లబ్ధివైఎస్సార్ ఆసరా రూ.32,328 జగనన్న వసతి దీవెన రూ.23,350 జగనన్న విద్యాదీవెన రూ.41,201 సున్నా వడ్డీ రూ.2,850 అమ్మ ఒడి రూ.45,000 ఇంటి స్థలం రూ.6,00,000 -
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
మంచి ప్రభుత్వం అధికారం చేపడితే... మనసున్న నేత ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కుటుంబాలు దశ ఏ విధంగా తిరగనుందోననడానికి ఉదాహరణ కొవ్వూరు మండలం వేములూరుకి చెందిన మారిశెట్టి సత్యనారాయణ బతుకు చిత్రం. పూరిపాకలోనే తుదివరకూ జీవితం కొడిగట్టిపోవల్సిందేమోననే వేదనతో ఆ కుటుంబం విచారవదనంతో ఉండేది. కానీ ఆ పాకలో క్రమేపీ వెలుతుర్లు విరజిమ్మాయి. ఆ మోములో చిరునవ్వులు చిందాయి. దీనికంతటికీ కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవ వసంతాలు పూయించాయి. అదెలానో చూద్దాం. – కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లామూడు దశాబ్ధాలకు పైగా రోడ్డు మార్జిన్లో పూరిపాకలోనే సత్యనారాయణ కుటుంబ నివాసం. సొంత ఇల్లంటూ వీరికి లేదు. ఓ గూడు కల్పించాలంటూ ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొంతింటి కల సాకారమైంది. ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారు. ఆ వెంటే ఇంటి స్ధలం మంజూరైంది.ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందించారు. జీవితంలో సొంతంటి కల నెరవేరుతుందా అనుకున్న వారి బతుకుల్లోకి ముప్పై ఏళ్ల తర్వాత ఓ పొదిరిల్లు పలకరించింది. గీత కార్మిక వృత్తి చేసుకున్న ఆ ఇంటి యజమానికి రూ.3 వేలు గీత కార్మిక పింఛన్ మంజూరైంది. వయస్సు మీద పడిన సమయంలో ఆ సొమ్ము వారి కుటుంబానికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పటి వరకూ రూ.1,40,750 అందుకున్నారు.సత్యనారాయణ భార్య గన్నెమ్మకి చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.56.250 అందాయి. ఇంటి స్ధలం, ఇంటి రుణం అన్నీ కలిపి రూ.5.77 లక్షల లబ్ధి చేకూరింది. వారి మనవరాలికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. జగన్మోహన్రెడ్డి మేలు ఎప్పటికీ మరిచిపోలేమని వారు సంతోషంగా చెబుతున్నారు.చేయూత అందించారు ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళలకు అందించే చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 అందిస్తున్నారు. ఈ సొమ్ము నా కుటుంబానికి ఎంతో ఉపకరిస్తుంది. నా భర్త గీత కార్మికుడు. వయస్సు మీదపడడంతో పనులకు వెళ్లలేకపోతున్నాం. ఈ సొమ్ముతో ఏటా అందించడంతో మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదల బతుకుల్లో భరోసా కల్పించారు. – మారిశెట్టి గన్నెమ్మ, వేములూరు, జగనన్న కాలనీ, కొవ్వూరు మండలంవైఎస్సార్సీపీ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి వైఎస్సార్ పింఛన్ కానుక రూ.1,40,750. వైఎస్సార్ చేయూత రూ.56,250 ఇంటి స్థలం విలువ రూ.2,00,000 ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం రూ.1,80,000 మొత్తం లబ్ధి రూ.5,77,000
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement