సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలు, ప్రతిభాపాటవాలను సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రస్థాయిలో విద్యార్థులందరి సామర్థ్యాలను సరైన రీతిలో అంచనా వేసేందుకు తరగతులు, సబ్జెక్టుల వారీగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన ప్రశ్నావళితో ఒకే రకమైన ప్రశ్నపత్రాలను వినియోగించి కొత్త విధానంలో సీబీఏ–2, ఫార్మేటివ్–3 పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలు మంగళవారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు.
మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షల షెడ్యూల్ను, పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలను రాష్ట్ర పాఠశాల విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ప్రయివేటు పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ జారీచేసే ప్రశ్నపత్రాలతో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (సీబీఏ)–2 పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతుల వారికి గతంలో మాదిరిగానే ఫార్మేటివ్–3 పరీక్షలు ఉంటాయి. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పరీక్షకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నపత్రంతోపాటు ఓఎమ్మార్ షీట్లు కూడా అందిస్తారు.
ప్రయివేటు యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నపత్రాలు మాత్రమే ఇస్తారు. ఓఎమ్మార్ షీట్లు అందించరని ఎస్సీఈఆర్టీ పేర్కొంది. సీబీఏ విధానంలోని పరీక్షలలో 0.25 (సూక్ష్మ) 0.5 (అతిస్వల్ప), 1 (స్వల్ప) ప్రశ్నలతోపాటు 2, 3, 4, 5, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఆయా సబ్జెక్టుల్లో గరిష్టంగా 20 మార్కులతో ఈ సీబీఏ పరీక్షలను గంట వ్యవధితో నిర్వహిస్తారు.
సరి చూసుకోవాలి
ఎస్సీఈఆర్టీ అందిస్తున్న ప్రశ్నపత్రాలను, విద్యార్థుల వారీగా చైల్డ్ ఐడీలు, పేర్లతో కూడిన ఓఎమ్మార్ పత్రాలను జిల్లాల ఉమ్మడి పరీక్ష విభాగాల నుంచి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు సరిచూసుకుని తీసుకువెళ్లి విద్యార్థులకు అందించనున్నారు. ఎవరికైనా ఓఎమ్మార్ పత్రం రాకపోతే వారికోసం బఫర్స్టాక్ నుంచి అందిస్తారు. పరీక్షల అనంతరం ఆయా ఓఎమ్మార్ పత్రాలను సమగ్ర మూల్యాంకనానికి వీలుగా జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగాలకు తరలిస్తారు. పరీక్ష సమయంలో ఓఎమ్మార్ పత్రాలపై చైల్డ్ ఐడీలు, పేర్లు సరిగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి.
సమగ్ర మూల్యాంకనంతో లోపాల సవరణకు వీలుగా చర్యలు
విద్యార్థుల సామర్థ్యాలను సమగ్రంగా విశ్లేషించేందుకు ఈ సీబీఏ పరీక్షలను శాస్త్రీయంగా రూపొందించిన ప్రశ్నలతో ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహిస్తున్నామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. ఈ ఓఎమ్మార్ పత్రాలను జిల్లా స్థాయిలో స్కాన్ చేయిస్తారని చెప్పారు. మార్కులను పాఠశాలలకు అందిచరని, కేవలం విద్యార్థుల స్థాయిని అంచనా వేసి భవిష్యత్లో టీచర్లకు, విద్యార్థులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు ఉపయోగిస్తామని వివరించారు.
సీబీఏ పరీక్షల అనంతరం తరగతుల వారీగా సబ్జెక్టులకు ‘కీ’ విడుదల చేస్తామని, దాని ప్రకారం టీచర్లు ప్రశ్నపత్రాలను దిద్దాల్సి ఉంటుందన్నారు. ఆ మార్కులను రిజిస్టర్లలో, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. విద్యార్థుల మార్కులను ప్రోగ్రెస్ కార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రులకు అందిస్తామని, తక్కువ ప్రతిభ చూపిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
విద్యార్థుల సామర్థ్యం స్పష్టంగా తెలిసేలా...
Published Tue, Feb 7 2023 4:52 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement