Sakshi News home page

‘నేను భారత్‌లో ఎప్పటికీ నెం.1 కాలేను’.. ఆనంద్‌ మహీంద్రా రిప్లైకి నెటిజన్లు ఫిదా!

Published Tue, Dec 13 2022 7:55 PM

Anand Mahindra Wins Hearts Again, Tweet Over When He Will Become India Richest Man - Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన ట్విటర్‌లో యాక్టివ్‌గా పలు అంశాలపై స్పందిస్తూ వాటిని షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అసలు ఆ ట్వీట్‌లో ఏముందంటే!
 
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో 10 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయిని సాధించిన సందర్భంగా తన ట్విట్టర్‌లో ఈ అంశంపై నవంబర్ 10న ఒక ట్వీట్‌ చేశారు. అందులో.. తనకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితో  ఓ నెటిజన్‌ మాత్రం మహీంద్రాను ఓ ప్రశ్న అడిగాడు. అందులో.. "భారత్‌లో ప్రస్తుతం అత్యంత ధనవంతుల్లో మీరు 73వ స్థానంలో ఉన్నారు. మరి మీరు ఎప్పుడు మొదటి స్థానానికి(నెం.1) చేరుకుంటారు (ఏక్ కబ్ ఆవోగే?) అని ట్వీట్‌ చేశాడు.

దీనికి ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. “నిజం ఏమిటంటే నేను భారత్‌లో ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదని బదలిచ్చాడు. దీంతో ఇక నెటిజన్లు మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్‌ 25 వేల కంటే ఎక్కువ లైక్‌లతో పాటు, వెయ్యికి పైగా రీట్వీట్లు అందుకుంది. 

చదవండి  టోల్‌ప్లాజా, ఫాస్టాగ్‌ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

Advertisement

What’s your opinion

Advertisement