న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు కంపెనీలు అమితాసక్తి చూపిస్తున్నాయి. రూ.37 లక్షల కోట్ల ఆస్తులతో కూడిన ఈ పరిశ్రమ ఫిన్టెక్ కంపెనీలకు ఆకర్షిస్తోంది. తాజాగా రెండు సంస్థలు.. ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (కెన్నెత్ ఆండ్రడేకు చెందిన), ఏంజెల్ వన్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ లైసెన్స్ల కోసం దరఖాస్తులను సెబీ వద్ద దాఖలు చేశాయి. ‘‘మా తదుపరి విస్తరణ క్రమంలో భాగంగా ఏఎంసీ సేవల్లోకి ప్రవేశిస్తున్నాం. మా క్లయింట్ల కోసం ప్యాసివ్ పెట్టుబడి ఉత్పత్తులను తీసుకురావాలన్నది ప్రణాళిక. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ సాయంతో ప్యాసివ్ ఉత్పత్తులను రూపొందిస్తాం. యాక్టివ్ ఫండ్స్తో పోలిస్తే ప్యాసివ్ ఉత్పత్తులు మంచి పనితీరు చూపిస్తాయని నమ్ముతున్నాం. పైగా ఇవి చౌక చార్జీలకే లభిస్తాయి’’ అని ఏంజెల్వన్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ప్రభాకర్ తివారి తెలిపారు.
క్యూలో చాలా సంస్థలు..
గడిచిన కొన్ని నెలల్లో.. మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ల కోసం చాలా దరఖాస్తులు వచ్చాయి. సమీర్ అరోరా ఆధ్వర్యంలోని హీలియోస్ క్యాపిటల్, హిరేన్వేద్, రాకేశ్ జున్జున్వాలా సహ వ్యవస్థాపకులుగా ఉన్న ఆల్కెమీ క్యాపిటల్, యూనిఫి క్యాపిటల్, వైజ్మార్కెట్స్ అనలైటిక్స్ లైసెన్స్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాయి. మొత్తం మీద ఏడు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. సెబీ ఇప్పటికే బజాజ్ ఫిన్సర్వ్, జెరోదాలకు గడిచిన మూడు నెలల్లో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్లను జారీ చేసింది. ఎన్జే ఇండియా, శామ్కో సెక్యూరిటీస్ కూడా ఫండ్స్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నాయి. సుమారు 44 ఫండ్స్ సంస్థలు ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. కొత్త సంస్థల రాకతో ఈ పోటీ మరింత పెరగనుంది.
మ్యూచువల్ ఫండ్స్లో మరింత పోటీ!
Published Wed, Nov 17 2021 8:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement