Sakshi News home page

పత్రిక ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

Published Tue, Nov 28 2023 2:00 AM

-

హన్మకొండ అర్బన్‌: ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29, 30న ప్రతికల్లో ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్‌ పీరియడ్‌లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల సర్వే వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం నిషేధమని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement