Sakshi News home page

పార్టీ అభ్యర్థినే గెలిపించాలి

Published Tue, Dec 5 2023 5:06 AM

మాట్లాడుతున్న మంత్రి భైరతి సురేష్‌   - Sakshi

కోలారు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైకమాండ్‌ సూచించిన అభ్యర్థిని అందరూ కలిసి భారీ మెజాక్టీతో గెలిపించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి భైరతి సురేష్‌ సూచించారు. సోమవారం తాలూకాలోని రామసంద్ర వద్ద ఉన్న ప్రైవేటు హోటల్‌లో కోలారు లోక్‌సభ అభ్యర్థి ఎంపిక విషయంపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోలారులో సమర్థుడైన అభ్యర్థిని ఎంచుకుని హైకమాండ్‌ సిఫార్సుకు పంపించామన్నారు. ఇందుకు పలువురు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎవరూ గందరగోళం సృష్టించవద్దన్నారు. హైకమాండ్‌ సూచించిన అభ్యర్థి విజయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ మాట్లాడుతూ హైకమాండ్‌ సూచించిన వ్యక్తికి మద్దతు తెలపాలని సూచిస్తే ఇక ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? అందరి అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. మంజునాథ్‌ అభిప్రాయంతో కొందరు ఏకీభవించారు. సమావేశంలో మంత్రి రామలింగారెడ్డి, కెహెచ్‌ మునియప్ప, ఎమ్మెల్యేలు ఎస్‌ ఎన్‌ నారాయణస్వామి, కె వై నంజేగౌడ, మంత్రి సుధాకర్‌, ఎమ్మెల్సీ ఎంఎల్‌ అనిల్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement