Sakshi News home page

సౌత్‌ జోన్‌ టోర్నమెంట్‌కు కేయూ జట్టు

Published Sat, Nov 11 2023 1:36 AM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేరళలో ఈనెల 13 నుంచి 18 వరకు ని ర్వహించనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ పోటీలకు కేయూ బాస్కెట్‌బాల్‌ పురుషుల కేయూ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డ్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు శుక్రవారం తెలిపారు. ఈజట్టులో యశ్వంత్‌ (విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల), ఎం.తరుణ్‌, టి.కన్నారావు, ఎస్‌.సందీప్‌, కె.సాయితేజ (మహబూబాబాద్‌ ఎస్‌ఆర్‌ కళాశాల), ఎం.దిలీప్‌, టి.విశ్వనాఽథ్‌, (వరంగల్‌ ఎల్‌బీ కళాశాల) ఉన్నారు. ఈజట్టుకు బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.దేవేందర్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారని శ్రీనివాస్‌రావు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement