Sakshi News home page

Video: లంచం తీసుకుంటూ పట్టుబడి.. కరెన్సీని కసాబిసా నమిలి మింగేశాడు

Published Tue, Jul 25 2023 8:38 AM

Madhya Pradesh Officer Swallows Bribe Currency After Spotting Cops - Sakshi

జబల్‌పూర్‌: అవినీతికి పాల్పడడంలో ఏమాత్రం జంకని అధికారులు.. పైఅధికారుల చర్యలకు ఎందుకనో వణికిపోతుంటారు. అయితే ఇక్కడో అధికారి భయపడలేదు.. ఏకంగా బెదిరిపోయాడు. ఆ కంగారులో కరెన్సీ నోట్లను  మింగేశాడు. 

మధ్యప్రదేశ్‌ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి)  గజేంద్ర సింగ్‌ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్‌ చేశాడట. దీంతో బాధితుడు  లోకాయుక్తకు చెందిన స్పెషల్‌ పోలీస్‌​ ఎస్టాబ్లిష్‌మెంట్‌(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్‌పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు. 

వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

What’s your opinion

Advertisement