Sakshi News home page

పవన్‌.. నీకంటే ఊసరవెల్లి నయం 

Published Fri, Oct 20 2023 5:09 AM

Narayana Swamy Fires On Pawan Kalyan - Sakshi

శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా): ‘పవన్‌కళ్యాణ్‌.. నీకంటే ఊసరవెల్లి నయం’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మండలంలోని ములురు గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లా­డుతూ ఊసరవెల్లి తన స్వభావంతో ఆత్మరక్షణ కోసం రంగు మార్చుకుంటుందని తెలిపారు.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాత్రం టీడీపీ ఎంత ఎక్కువ ప్యాకేజీ ఇస్తుందో.. అంత ఎక్కువగా రంగులు మారుస్తాడని విమ­ర్శించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో లాయర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు.. అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు.     

Advertisement

What’s your opinion

Advertisement