Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. తొలి భారత క్రికెటర్‌గా

Published Fri, Dec 1 2023 9:54 PM

Ruturaj Gaikwad Tops KL Rahul For Huge T20 Record - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 4,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా రుతురాజ్‌ నిలిచాడు. రాయ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో 32 పరుగులు చేసిన రుతురాజ్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

రుతు ఈ ఫీట్‌ను కేవలం 116 ఇన్నింగ్స్‌లలోను అందుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ పేరిట ఉండేది. రాహుల్‌ ఈ మైలు రాయిని 117 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రాహుల్‌ రికార్డును రుత్‌రాజ్‌ బ్రేక్‌ చేశాడు. కాగా ఈ సిరీస్‌లో రుతురాజ్‌ దుమ్మురేపుతున్నాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో రుతురాజ్‌ విధ్వంసకర శతకం(123 నాటౌట్‌)తో చెలరేగాడు.
చదవండి: Ind vs Aus: నువ్వంటే.. నువ్వు! రూ. 3.16 కోట్ల కరెంట్‌ బిల్లు బకాయి! ఇప్పటికీ..

Advertisement

What’s your opinion

Advertisement